శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో 22 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 23,487 మంది స్వామిని దర్శించుకున్నారు. 23,909 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.75 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన వారు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని బుధవారం ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు లడ్డు ప్రసాదాలతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment