
గీవెన్స్ డేకు 563 వినతులు
తిరువళ్లూరు: కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్డేకు 563 వినతులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం పది గంటల నుంచి 2 గంటల వరకు గ్రీవెన్స్డేను నిర్వహించారు. సమావేశానికి అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వేర్వేరు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ ప్రతాప్కు వినతి పత్రాలు సమర్పించారు. ఇంటి పట్టాల కోసం 163 వినతులు, సాంఘిక సంక్షేమ శాఖకు 110 వినతులు, మౌలిక వసతులు కల్పించాలని 59, ఉపాధి కల్పించాలని 147 వినతులతో సహా మొత్తం 563 వినతులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ వివరించారు. వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు కలెక్టర్ బదిలీ చేశారు. తక్షణం వాటిని పరిష్కరించాలని, లేకుంటే అందుకు ఉన్న కారణాలను వారికి వివరించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్డేకు హాజరయ్యారు. వారి నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రాజ్కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్ పాల్గొన్నారు.