
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుపై భైంసా పోలీస్స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. సీఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మున్నూరుకాపు సంఘ భవనంలో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో వివిధ వర్గాల వారిని రెచ్చగొట్టేలా ఎంపీ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ఈ మేరకు సుమోటోగా తీసుకుని ఆయనపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
చదవండి: లాక్డౌన్లోనూ అద్భుత ప్రగతి సాధించాం