ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. పోలీసులకు చుక్కెదురు! | Court Twist In Telangana Phone Tapping Case, More Details Inside | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. పోలీసులకు చుక్కెదురు!

Jun 25 2024 1:06 PM | Updated on Jun 25 2024 3:20 PM

Court Twist In Telangana Phone Tapping Case

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసుల ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు వెనక్కి పంపించింది. 

ఈ సందర్భంగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మెటీరియల్‌ ఎవిడెన్స్ సబ్మిట్‌ చేయకపోవడంతో ఛార్జ్‌షీట్‌ను కోర్టు వెనక్కి పంపించింది. మరోవైపు, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భుజంగ రావ్‌, తిరుపతన్నలు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి 90 రోజులు గడిచినా ఛార్జ్‌షీట్‌ వేయలేదు కాబట్టి తప్పనిసరిగా బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక, వీరిద్దరి బెయిల్‌ పిటిషన్లపై నేడు కోర్టులో విచారణ జరుగనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement