phone tapping case
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్రావు ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్లో నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలిచ్చేవరుకూ అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది.తన ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్టర్ చక్రధర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధా కిషన్ రావుకు కూడా ఊరట లభించింది. -
ఫోన్ టాపింగ్ కేసులో ట్విస్ట్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్..హరీష్ రావు పీఏ అరెస్ట్!
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు పీఏ వంశీకృష్ణతో సహా ముగ్గురు అరెస్ట్ అయ్యారు.సిద్ధిపేట్ జిల్లా, నియోజకవర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫోన్ను ట్యాపింగ్ చేసి బెదిరింపులు, వేధింపులకు గురిచేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో పంజాగుట్ట పోలీసులు వేగం పెంచారు. ఓ రైతుకు తెలీకుండా అతని డాక్యుమెంట్స్తో హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సిమ్కార్డు కొనుగోలు చేశారు. ఆ సిమ్ను వినియోగించి చక్రధర్ గౌడ్కు బెదిరింపు కాల్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్, బెదిరింపులపై చక్రధర్ గౌడ్ గతేడాది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు నిందితుల్ని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 28వరకు ముగ్గురికి రిమాండ్ విధించారు. కాగా, ఇదే కేసులో ఏ-1గా హరీష్ రావు,ఏ-2గా రాధాకిషన్ రావులు ఉన్నారు. -
భుజంగరావు, రాధాకిషన్రావుకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితులు మాజీ అడిషనల్ ఎస్పీ నాయిని భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్రావులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో తాజాగా సుప్రీంకోర్టు మరో నిందితుడికి ఇచ్చిన బెయిల్ను, నిందితులు సుదీర్ఘ కాలం జైలులో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులిస్తున్నట్లు పేర్కొంది. అయితే, కోర్టు నిందితులకు పలు షరతులు విధించింది. రూ.లక్ష చొప్పున సొంత పూచీకత్తు, 2 ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. 8 వారాలపాటు ప్రతీ సోమవారం ఉదయం 11 గంటలకు ఎస్హెచ్ఓ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత కూడా అవసరమై విచారణాధికారి కోరితే హాజరుకావాలని తెలిపింది. నిందితులు తమ పాస్పోర్టులను వెంటనే ట్రయల్కోర్టుకు సమర్పించాలని చెప్పింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, సాకు‡్ష్యలను బెదిరించడం, కలవడం, దర్యాప్తును ప్రభావితం చేయడం లాంటివి చేయవద్దని, మీడియాతో కేసు గురించి మాట్లాడవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ షరతులు ఉల్లంఘిస్తే తదుపరి చర్యలు తీసుకునే స్వేచ్ఛను పోలీసులకు ఇచ్చింది. ఫోన్ట్యాపింగ్ కేసుకు సంబంధించి 2024, మార్చిలో భుజంగరావు, రాధాకిషన్రావులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల నిమిత్తం భుజంగరావుకు నాంపల్లి కోర్టు గత ఆగస్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి న్యాయస్థానాలు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఉండటంతో ఆయన బయటే ఉన్నారు.ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, చంచల్గూడ జైలులో ఉన్న రాధాకిషన్రావు కూడా బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇద్దరి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన గురువారం తీర్పు వెలువరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు పరిగణనలోకి.. ఇదే కేసులో మరో నిందితుడు తిరుపతన్నకు సుప్రీంకోర్టు తాజాగా బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వుల కాపీని పిటిషనర్ల న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలను, నిందితులు సుదీర్ఘకాలం జైలులో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని షరతులతో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. మరో నిందితుడు ఎ.శ్రవణ్కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్ కు బెయిల్
-
చంచల్గూడ జైలు నుంచి తిరుపతన్న విడుదల
సాక్షి,హైదారబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం మాజీ అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న తిరుపతన్నకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో పదినెలల తర్వాత తిరుపతన్న బెయిల్పై విడుదలయ్యారు. బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందించిన అనంతరం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిల్
-
ఫోన్ట్యాపింగ్ కేసులో ఫస్ట్ బెయిల్..తెలంగాణ సర్కారుకు ‘సుప్రీం’ షాక్
సాక్షి,న్యూఢిల్లీ : సంచలనం సృష్టించిన ఫోన్ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తొలిసారి తెలంగాణ సర్కారుకు గట్టి షాక్ తగిలింది. కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరికి మొదటిసారి బెయిల్ లభించింది. కేసులో కీలక నిందితుల్లో ఒకరిగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరుపతన్న బెయిల్ పిటిషన్ను జస్టిస్ బివి నాగరత్న,జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం(జనవరి27) విచారించింది. బెయిల్పై విడుదలైన తర్వాత కేసు విచారణకు సహకరించాలని బెయిల్ ఇచ్చిన సందర్భంగా తిరుపతన్నను సుప్రీంకోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని,అవసరం అయితే ట్రయల్ కోర్టు బెయిల్పై మరిన్ని షరతులు విధించాలని సూచించింది. కాగా, తిరుపతన్న బెయిల్ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది.ఈ కేసులో ఇంకా సాక్షులను విచారించాలని,దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక నిందితుల్లో ఒకరైన తిరుపతన్నకు బెయిల్ ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టును కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పది నెలలుగా జైలులో ఉన్నారు. ఫోన్ట్యాపింగ్ కేసులో మరో ప్రధాన నిందితుడు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్కు నేతృత్వం వహించారని ఆరోపణలున్న టాస్క్ఫోర్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయనను రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటర్పోల్ ద్వారా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. -
తెలంగాణలో మరో సంచలనం.. ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు గుర్తించారు. 2023లో ఇంద్రసేనారెడ్డి ఫోన్ను ట్యాప్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఈ క్రమంలో ఇంద్రసేనారెడ్డి పీఏను పోలీసులు విచారించారు. దీంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే కీలక విషయాలు వెల్లడి కాగా.. తాజాగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు గుర్తించారు. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్య ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిసింది. 2023 అక్టోబర్ 26న ఆయన గవర్నర్గా నియామకం అయ్యారు. ఈ క్రమంలో ఇంద్రసేనారెడ్డి పీఏను పోలీసులు విచారించారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్ఐబీ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్కులను డీఎస్సీ ప్రణీత్ రావు బృందం ధ్వంసం చేయడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న ఏ4 నిందితుడిగా ఉన్నారు. గత ఎనిమిది నెలలుగా ఆయన జైలులోనే ఉన్నారు. ఈ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, మరో కీలక వ్యక్తి శ్రవణ్ కుమార్ అమెరికాలో ఉండటంతో విచారణ కొనసాగుతోంది.ఇదిలా ఉండగా.. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసుపై పోలీసులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుతో పాటు మరో ముఖ్య నిందితుడు అరువుల శ్రవణ్ రావును పట్టుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాల్లో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఎక్స్ట్రడిషన్(నేరస్థుల అప్పగింత) అస్త్రం ప్రయోగిస్తున్నారు. అమెరికాలో తలదాచుకున్న ఆ ఇద్దర్నీ అప్పగించాలంటూ ఆ దేశానికి సమాచారమిచ్చే ప్రక్రియను ప్రారంభించారు.కాగా, కరడుగట్టిన నేరస్థులను అప్పగించే విషయంలో అమెరికాతో భారత్కు ఒప్పందం ఉన్న నేపథ్యంలో తాజా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సీఐడీ ద్వారా కేంద్ర హోంశాఖకు నివేదిక పంపించారు. అక్కడి నుంచి విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఆ నివేదిక వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం దానిని పరిగణనలోకి తీసుకుంటే నిందితులిద్దరిని భారత్కు అప్పగించే అవకాశముంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టనున్నా.. నిందితులను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు గల ఏ అవకాశాన్నీ వదులుకోవద్దనే ఉద్దేశంతో పోలీసులు ఈ దిశగా కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
-
హరీష్రావు క్వాష్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు క్వాష్ పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హరీష్ రావు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్పై నేడు విచారణ చేపట్టనున్నారు.కాగా, తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రాధర్ గౌడ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేసి హరీశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హరీష్రావు.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.పలుకుబడి ఉన్న నేత కావడంతో హరీశ్ రావు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టులో అభిప్రాయపడ్డారు. ఆయనను అదుపులోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసుల కౌంటర్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనకు సంబంధించి హైకోర్టు కీలకమైన తీర్పు ఇవ్వనుంది. అవన్నీ అబద్ధారోపణలని, తనకు రాజకీయంగా నష్టం కలిగించేందుకే ఈ కేసు చేశారని హరీశ్ రావు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణల వల్ల తన వ్యక్తిత్వానికి, ప్రజా సేవకు మచ్చ తగలకుండా కోర్టు న్యాయం చేయాలని కోరారు. తన ఫోన్ ట్యాపింగ్కు ఎలాంటి ఆధారాలు లేవని, కేసును కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.ఇక, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావును అరెస్ట్ చేయవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని కోర్టును కోరారు. దీంతో, నేడు మరోసారి క్వాష్ పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైకోర్టులో జరగనున్న విచారణపై రాష్ట్ర రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ కేసులో హైకోర్టు తీసుకునే నిర్ణయం హరీష్ రావు రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. -
దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ కేసులో తిరుపతన్న గతేడాది అక్టోబర్లో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై గురువారం జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్సింగ్ ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న ప్రధాన నిందితుడని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.ఫోన్ ట్యాపింగ్తో పాటు ఆధారాలు చెరిపివేయడంలోనూ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని.. 2023 డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలు ధ్వంసం చే శారని లూథ్రా తెలిపారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు పలువురి ఫోన్లను ట్యాప్ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని వివరించారు. మరోవైపు తిరుపతన్న 9 నెలలుగా జైలులో ఉన్నారని.. ఆయన పాత్రపై ఇప్పటికే చార్జిïÙట్ దాఖలైందని తిరుపతన్న తరఫు న్యాయవాది సిద్ధార్థ దవే వాదించారు. బెయిల్ పొందడం హక్కు అని.. తప్పనిసరైతేనే జైలులో ఉంచాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పులిచి్చందని దవే ప్రస్తావించారు. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదన్న ధర్మాసనం... విచారణను ఎప్పటికి పూర్తిచేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.అంతేగాక దర్యాప్తు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేరని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు పూర్తికి ఇంకా ఎంత సమయం పడుతుందో రాతపూర్వకంగా తమకు ఇవ్వాలని ఆదేశించింది. అయితే విచారణ పూర్తయ్యేందుకు మరో 4 నెలలు సమయం పడుతుందని, అఫిడవిట్ దాఖలుకు సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను జస్టిస్ నాగరత్న ధర్మాసనం జనవరి 27కు వాయిదా వేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీం సీరియస్
-
హరీశ్రావు అరెస్టు..10 గంటల హైడ్రామా
గచ్చిబౌలి/ బంజారాహిల్స్/ సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అరెస్టుతో గచ్చిబౌలి ఠాణా అట్టు డికింది. పార్టీ మరో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిని అరెస్టు చేస్తారనే సమా చారంతో గురువారం ఉదయం కొండాపూర్లోని ఆయన ఇంటికి వెళ్లిన హరీశ్ను గచ్చిబౌలి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం కౌశిక్రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు బంజారాహిల్స్ స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం కౌశిక్రెడ్డి ఇంటికి వచ్చిన మాజీమంత్రి జగదీశ్రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకుని రాయదుర్గం పీఎస్కు తీసుకెళ్లారు. అయితే హరీశ్రావు అరెస్టుతో గచ్చిబౌలి పోలీస్స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించారు. మరోవైపు హరీశ్రావును పరామర్శించేందుకు ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ముఖ్య నేతలు, పార్టీ శ్రేణుల తరలిరావడం, భారీయెత్తున బలగాల మోహరింపుతో గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్రెడ్డి, పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడంతో 50 మందికి పైగా నాయకులను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.కాగా హరీశ్రావును ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8.30 వరకు పీఎస్లోనే ఉంచిన పోలీసులు ఆ తర్వాత విడుదల చేశారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తదితరులు పోలీస్స్టేషన్లో హరీశ్రావును పరామర్శించారు.ఇందిరమ్మ రాజ్యం కాదు పోలీస్ రాజ్యం హరీశ్రావు, జగదీశ్వర్రెడ్డి, కౌశిక్రెడ్డిలను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కాదు..ఎమర్జెన్సీని తలపించేలా పోలీస్ రాజ్యం నడుస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఫిర్యాదును తీసుకోని ప్రభుత్వం కేసులు పెట్టడం అన్యాయం అని అన్నారు. తెలంగాణ సమాజం అణచివేతను సహించదని, తమ గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు.ప్రజల పక్షాన ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, నిర్బంధించడం ప్రభుత్వానికి తగదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. హమీలు అమలు చేయడం చేతగాని సీఎం రేవంత్రెడ్డి, అక్రమ అరెస్టులతో గొంతులు మూయాలని ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. సీఐని బెదిరించారనే ఆరోపణలపై కౌశిక్రెడ్డి అరెస్టు పోలీసు విధులను అడ్డుకోవడమే కాకుండా అంతు చూస్తానంటూ బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రను బెదిరించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. కొండాపూర్లోని కోలా లగ్జారియా విల్లాస్లో ఉంటున్న ఆయన్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సీఎం రేవంత్రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డిలపై ఫిర్యాదు చేసేందుకు బుధవారం బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు వచ్చిన కౌశిక్రెడ్డి..తనతో వాగ్వివాదానికి దిగడమే కాకుండా పోలీసు వాహనానికి తన కారును అడ్డుగా పెట్టి విధులకు ఆటంకం కలిగించారని ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు.దీంతో బీఎన్ఎస్ సెక్షన్లు 57, 126 (2), 127 (2), 132, 224, 333, 451 (3), 191 (2) రెడ్విత్ 190, 3(5) కింద కౌశిక్రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అరెస్టు చేశారు. ఉదయం ఇంట్లో ఉన్న కౌశిక్రెడ్డి బయటకు రాకపోవడంతో, తమకు సహకరించాలని లేనిపక్షంలో తామే బలవంతంగా లోపలికి రావాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఆయన తలుపులు తీశారు. అప్పటికే లోపల ఉన్న హరీశ్రావును తొలుత అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం కౌశిక్రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన కానును సీజ్ చేశారు.పోలీస్స్టేషన్లో ఉన్న కౌశిక్రెడ్డిని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు వివేక్గౌడ్, సంజయ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తదితరులు పరామర్శించారు. కౌశిక్రెడ్డి అరెస్టు విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మాజీమంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, రాకేష్రెడ్డి తదితరులను అరెస్టు చేసిన పోలీసులు రాయదుర్గం, నార్సింగి పీఎస్లకు తరలించారు. -
ఫోన్ట్యాపింగ్ కేసులో అనూహ్య మలుపు.. ప్రభాకర్రావు మరో పిటిషన్
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన పాస్పోర్టు రద్దు చేయడాన్ని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావు విదేశాంగ శాఖ వద్ద సవాల్ చేశారు. విదేశాంగశాఖ ద్వారానే ప్రభాకర్ రావును రప్పించే పనిలో పోలీసులు ఇప్పటికే నిమగ్నమయ్యారు.ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్పోర్టును పోలీసులు రద్దు చేయించారు. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్రావుకు రెడ్కార్నర్ నోటీసు ఇప్పించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. మరోవైపు రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్రావు పిటిషన్ పెట్టుకున్నారు. కాగా,ఇదే కేసులోమరో నిందితుడు శ్రవణ్రావు చికాగోలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. అమెరికాలో ప్రభాకర్రావు పిటిషన్
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావు తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చారు. ప్రస్తుతం ప్రభాకర్రావు అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు తాజాగా పిటిషన్ పెట్టుకున్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోందని పిటిషన్లో ప్రభాకర్రావు పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక స్థానంలో పనిచేశానని తెలిపారు. రాజకీయంగా తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నానని ప్రభాకర్రావు పేర్కొన్నారు.ప్రస్తుతం తాను ఫ్లోరిడాలోని కుమారుని వద్ద ఉంటున్నానని తెలిపారు.కాగా,మరో వైపు అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్రావును ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.ఈ కేసులో మరో నిందితుడు, టీవీఛానల్ ఎండి శ్రవణ్ రావు అమెరికాలోని చికాగోలో ఉంటున్నట్లు పోలీసులు కనిపెట్టారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్పై నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలను పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది.తెలంగాణ జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్ రావు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఇటీవలే నాంపల్లిలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, వీరికి మధ్యంతర బెయిల్ పొడిగించలేమని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. దీంతో, భుజంగరావు.. హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్పై పిటిషన్లు దాఖలు చేయడంతో నేడు విచారణ జరుగనుంది. -
పోలీస్ వర్సెస్ ప్రభాకర్రావు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావును అమెరికా నుంచి రప్పించడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని తిప్పికొట్టడానికి ప్రభాకర్రావు కూడా అక్కడి నుంచే పావులు కదుపుతున్నారు. దీనితో పోలీసులు వెర్సస్ ప్రభాకర్రావు అన్నట్టుగా మారింది. పరిణామాలను గమనించి అమెరికా వెళ్లిపోయి.. ఎస్ఐబీకి సుదీర్ఘకాలం నేతృత్వం వహించిన టి.ప్రభాకర్రావు గత ఏడాది డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన వెంటనే రాజీనామా చేశారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు, తర్వాతి పరిణామాలను గమనించిన ఆయన... ఈ ఏడాది మార్చిలో తిరుపతి వెళ్లి, అటు నుంచే చెన్నై మీదుగా అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడి టెక్సాస్లో ఉండి, వైద్యం చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది.ప్రభాకర్రావు తనపై అరెస్టు వారెంట్ జారీ చేయవద్దంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలో... తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, షెడ్యూల్ ప్రకారం జూన్ 26న తిరిగి వస్తానని వివరణ ఇచ్చారు. జూలైలో ఈ–మెయిల్ ద్వారా దర్యాప్తు అధికారికి లేఖ రాసిన ఆయన... తనపై తప్పుడు కేసు, నిరాధార ఆరోపణలతో ఏర్పడిన మానసిక వేదన కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఇప్పట్లో తిరిగి రాలేనని స్పష్టం చేశారు. అప్పటి నుంచి పోలీసులు ఆయనపై రెడ్ కార్నర్ నోటీసుల జారీ కోసం ప్రయత్నాలు చేస్తూనే.. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖతోనూ (ఎంఈఏ) సంప్రదింపులు జరుపుతున్నారు. తొలుత పాస్పోర్ట్ ఇంపౌండ్ చేయించి... రాష్ట్ర పోలీసులు తొలుత రీజనల్ పాస్పోర్టు కార్యాలయం (ఆర్పీఓ) ద్వారా ప్రభాకర్రావు, మరో నిందితుడు శ్రవణ్రావుల పాస్పోర్టులను ఇంపౌండ్ (సస్పెన్షన్) చేయించారు. ఆపై ప్రభాకర్రావు పాస్పోర్టును పూర్తిగా రద్దు చేయాలంటూ మరో ప్రతిపాదన పంపారు. ప్రస్తుతం ఆ ఫైల్ విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) వద్ద పెండింగ్లో ఉంది. ప్రభాకర్రావు తన న్యాయవాదుల ద్వారా పాస్పోర్టు ఇంపౌండ్ చేయడాన్ని ఎంఈఏ జాయింట్ సెక్రటరీ వద్ద సవాల్ చేశారు. ఈ వివాదం పరిష్కారమైతే తప్ప పాస్పోర్టు రద్దుపై నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం లేదు. అయితే ఎవరైనా వ్యక్తిపై చార్జ్షీట్ దాఖలు కావడం, న్యాయస్థానం తగిన ఆదేశాలు జారీ చేయడం, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం జరిగితే.. పాస్పోర్టు ఇంపౌండ్, రద్దుకు అవకాశం ఉంటుంది. ప్రభాకర్రావు విషయంలో ఈ మూడూ జరిగిన నేపథ్యంలో.. ఆయన పాస్పోర్టు త్వరలోనే రద్దవుతుందని పోలీసులు భావిస్తున్నారు. రద్దయినా ఇప్పట్లో రావడం కష్టమే! ప్రభాకర్రావు పాస్పోర్టు రద్దు అయినా ఆ సమాచారం ఎంఈఏ, ఇమిగ్రేషన్ అధికారుల వద్ద మాత్రమే ఉంటుంది. ఆయన అమెరికా నుంచి మరో దేశానికి రాకపోకలు సాగించినా దీని ద్వారా గుర్తించలేరు. కేవలం పాస్పోర్టు పేజీలు అయిపోవడం, గడువు తీరిపోవడం, పోగొట్టుకోవడం వంటివి జరిగి.. ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి వెళ్లినప్పుడు మాత్రమే అధికారులు దాన్ని స్వా«దీనం చేసుకుంటారు. ఎమర్జెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడం ద్వారా బలవంతంగా భారత్కు పంపుతారు. అలా కాకుండా ప్రభాకర్రావు తనంతట తానుగా తిరిగి వస్తే.. విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారు. ప్రభాకర్రావును అమెరికా ప్రభుత్వమే తిప్పిపంపాలంటే మాత్రం పాస్పోర్టు రద్దు తర్వాత కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) ద్వారా అమెరికా దేశ ఏజెన్సీలను సంప్రదించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. వీసాలో గడువులో మతలబులు ఎన్నో... కొన్నేళ్లుగా తరచూ అమెరికాకు వెళ్లి వస్తున్న, కుటుంబీకులు అక్కడే ఉంటున్న ప్రభాకర్రావు వంటి వారికి సాధారణంగా 10 నుంచి 15 ఏళ్ల గడువుతో కూడిన వీసాలు లభిస్తుంటాయి. అయితే ఒకసారి ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత గరిష్టంగా 180 రోజులలోపు తిరిగి వెళ్లాలనే నిబంధన ఉంది. దీనితో ప్రస్తుతం ఆయన 179 రోజులు అక్కడ ఉండి.. సమీపంలోని కెనడా, లేదా మరో దేశానికి కొన్ని రోజులు వెళ్లి రావొచ్చు. అలా మరో 179 రోజులు అమెరికాలో ఉండొచ్చు. అయితే ప్రభాకర్రావు వైద్యం చేయించుకుంటున్న నేపథ్యంలో వీసా గడువు తేలిగ్గా పొడిగించుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో జైపాల్ యాదవ్ విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను విచారించిన పోలీసులు.. శనివారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ను ప్రశ్నించారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న ఫోన్లో జైపాల్ యాదవ్కు సంబంధించిన లింకు దొరికిన నేపథ్యంలో.. ఆ ఆధారాలను జైపాల్ ముందుపెట్టి విచారించినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించి, వాంగ్మూలం నమోదు చేసుకున్నట్టు సమాచారం. రెండు ఫోన్ నంబర్ల విషయంలో.. ప్రధానంగా తిరుపతన్నకు జైపాల్యాదవ్ ఇచ్చిన రెండు ఫోన్ నంబర్లపై విచారణ సాగినట్టు తెలిసింది. తమ కుటుంబానికి, మరో కుటుంబంతో వివాదాల నేపథ్యంలో అదనపు ఎస్పీ తిరుపతన్నను కలిశానని.. తిరుపతన్న తమ సామాజికవర్గం వ్యక్తికావడంతో వివాదం పరిష్కరించాలని కోరా నని జైపాల్యాదవ్ వెల్లడించినట్టు సమాచారం. తాను ఇచ్చిన రెండు ఫోన్ నంబర్లను తిరుపతన్న ట్యాప్ చేశారని.. అంతేతప్ప వారికి రాజకీయాలకు సంబంధం లేదని వివరించినట్టు తెలిసింది. ఫోన్ల నుంచి రికవరీ చేసిన డేటా ఆధారంగా.. ఫోన్ ట్యాపింగ్పై కేసు నమోదుకు, పోలీసు అధికారుల అరెస్టుకు మధ్య కొంత సమయం వచ్చింది. ఆ సమయంలో తిరుపతన్న, మరికొందరు అధికారులు, మాజీ అధికారులు తమ ఫోన్లను ఫార్మాట్ చేయడం చేశారు. అయితే ప్రణీత్రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్రావుల అరెస్టు తర్వాత పోలీసులు వారి ఫోన్లు స్వాదీనం చేసుకుని.. చెరిపేసిన డేటాను వెలికితీయడానికి (రిట్రీవ్) వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. నిపుణులు డేటాను వెలికితీసి పోలీసులకు అందించారు. అందులో తిరుపతన్న ఫోన్ నుంచి రిట్రీవ్ చేసిన డేటాను విశ్లేషించిన నేపథ్యంలో.. ఆయనతో చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ సంప్రదింపులు జరిపినట్టు వెల్లడైంది. దీంతో పోలీసులు వారిని విచారణకు పిలిచి ప్రశ్నించారు. -
ఆ రెండు నంబర్ల కేంద్రంగానే విచారణ!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడిని విచారించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గురువారం దాదా పు 2 గంటలపాటు ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్ని కల నేపథ్యంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కు సహకరించారా? ఆ రెండు ఫోన్ నంబర్లు ఎందుకు పంపారనే కోణంలోనే లింగయ్య విచారణ సాగింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) కేంద్రంగా సాగిన ఈ నిఘా కేవలం ప్రతిపక్షాలకే పరిమితం కాలేదు. అప్పటి అధికార బీఆర్ఎస్కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న వివిధ నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులపై ఆరా తీశాడు. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. లింగయ్యను సంప్రదించిన తిరుపతన్న బీఆర్ఎస్లో ఉంటూ ఆ పారీ్టకి వ్యతిరేకంగా పని చేస్తున్న, అసమ్మతితో ఉన్న నాయకులతోపాటు వారి అనుచరుల ఫోన్ నంబర్లను సేకరించిన ఎస్ఐబీ అధికారులు వాటిని నాటి డీఎస్పీ ప్రణీత్రావుకు ఇచ్చి ట్యాపింగ్ చేయించారు. ఇందులో భాగంగా నకిరేకల్కు చెందిన వేముల వీరేశం (అప్పట్లో బీఆర్ఎస్ అసమ్మతి నేత)తోపాటు ఆయన అనుచరులపై నిఘా ఉంచాలని అందిన ఆదేశాల మేరకు ఆ వివరాలు సేకరించే బా«ధ్యతను తిరుపతన్నకు అప్పగించారు. వీరేశంతో సన్నిహితంగా ఉంటున్న పెదకాపర్తికి చెందిన రాజ్కుమార్, నకిరేకల్కు చెందిన మదన్రెడ్డి ఫోన్లు ట్యాప్ చేయాలని భావించారు. ఆ ఇద్దరి ఫోన్ నంబర్ల కోసం తిరుపతన్న అప్పటి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను సంప్రదించారు. గతంలో నల్లగొండ జిల్లాలో పనిచేసి ఉండటంతో తిరుపతన్నకు లింగయ్యతో పరిచయం ఉంది. తొలుత రెండు–మూడుసార్లు ఫోన్లో సంప్రదించిన తిరుపతన్న ఆపై ఆ ఇద్దరి ఫోన్ నంబర్లు కావాలని కోరారు. దీంతో తనకున్న పరిచయాలతో మదన్రెడ్డి, రాజ్కుమార్ నంబర్లు తీసుకున్న లింగయ్య వాటిని తిరుపతన్నకు పంపారు. ట్యాపింగ్ కేసులో తిరుపతన్న అరెస్టుకు ముందే తన ఫోన్ను ఫార్మాట్ చేశారు. దీంతో డిలీట్ అయిన డేటాను రిట్రీవ్ చేయడానికి ఆ ఫోన్ను దర్యాప్తు అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఇటీవల ల్యాబ్ నుంచి ఆ నివేదిక పోలీసులకు అందింది. ఇందులో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తిరుపతన్న–లింగయ్య మధ్యఫోన్ కాల్స్, ఆపై లింగయ్యనుంచి తిరుపతన్నకు మదన్రెడ్డి, రాజ్కుమార్ల ఫోన్ నంబర్లు వచ్చినట్లు తేలింది. దీని ఆధారంగా నోటీసులిచ్చి పోలీసులు లింగయ్యను విచారించారు. ఫోన్లో తిరుపతన్న ఏం అడిగారు? ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉందా? ఆ ఇద్దరి నంబర్లు ఎందుకు పంపారు? అనే వివరాలు ఆరా తీసి లింగయ్య వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. అన్ని ప్రశ్నలకూ జవాబు చెప్పా..ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా. చాలా కాలంగా పరిచయం ఉన్న అధికారి కాబట్టే తిరుపతన్నతో మాట్లాడాను. మదన్రెడ్డి, రాజ్ కుమార్ల ఫోన్ నంబర్లు అడిగితే నా అనుచరుల నుంచి తీసుకుని ఇచ్చా. అప్పట్లోనూ ఆ నంబర్లు ఎందుకని ప్రశ్నించా. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతోందని, ఆ వివరాలు తెలుసుకోవడానికే వారి నంబర్లు తీసుకున్నట్లు చెప్పారు. వేముల వీరేశం అనుచరుల ఫోన్ ట్యాప్ చేశాననేది అవాస్తవం. కేవలం మీడియాలో ప్రాచుర్యం పొందాలనే నాపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తా. – మీడియాతో చిరుమర్తి లింగయ్య -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు చిరుమర్తి లింగయ్య
-
ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన భుజంగరావు
Updates..ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన భుజంగరావుమధ్యంతర బెయిల్ పొడిగించాలని కోరిన భుజంగరావుఇదివరకు భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టుఈరోజు సాయంత్రంతో ముగిసిన మద్యంతర బెయిల్ గడువుదీంతో హైకోర్టును ఆశ్రయించిన అదనపు ఎస్పీ భుజంగరావుసోమవారం సాయంత్రం వరకు మధ్యంతర బెయిలు గడువును పొడిగించిన హైకోర్టువిచారణ సోమవారానికి వాయిదాహైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా టాస్క్ఫోర్స్ మాజీ డిసిపి రాధా కిషన్ రావుతదుపరి విచారణ సోమవారానికి వాయిదాఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే లింగయ్య ముగిసిన విచారణఅడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన కాల్స్పైన విచారణ చేసిన పోలీసులుచినమర్ధి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే :-పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానుతనకు తెలిసిన అధికారి కాబట్టి నేను గతంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న తో మాట్లాడనుమదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నంబర్లు తిరుపతన్న అడిగాడువారి ఇద్దరు ఫోన్ నంబర్స్ మా అనుచరు తో తీసుకొని అడిషనల్ ఎస్పీ తిరుపత కి ఇచ్చానుఈ నంబర్స్ ఎందుకు ఆడిగావ్ అని తిరుపతన్నను ప్రశ్నించాను.మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం ఎలా జరుగుతుందని నన్ను తిరుపతన్న అడిగాడు.ప్రచారం బాగా జరుగుతుందని నేను ఫోన్లో మాట్లాడానువేముల వీరేశం అనుచరులు ఫోన్ టాప్ చేశాననేది అవాస్తవంమీడియాలో ఎక్స్పోజ్ అవ్వాలని ఉద్దేశంతో కొంతమంది నా పైన కామెంట్స్ చేస్తున్నారుఈ కేసులో ఎప్పుడు విచారానికి పిలిచినా నేను పోలీసులకు సహకరిస్తానుఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు.తిరుపతన్నతో మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగానే నన్ను ప్రశ్నించారు.పోలీసుల దగ్గర ఏదో ఆధారం ఉంది కాబట్టే నన్ను విచారించారని నేను భావిస్తున్నా.నా స్టేట్మెంట్ ను వీడియో రికార్డ్ చేశారు.ఎప్పుడు విచారణకు పిలిచిన వస్తాను. పోలీసులకు సహకరిస్తాను 👉 జూబ్లీహిల్స్ పీఎస్కు చిరుమర్తి లింగయ్య చేరుకున్నారు. 👉ఫోన్ ట్యాపింగ్ కేసులో లింగయ్య విచారణకు హాజరయ్యారు. 👉జూబ్లీహిల్స్ పీఎస్లో మిర్యాలగూడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు. 👉ఈ సందర్బంగా భాస్కర్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్కు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నా పర్సనల్ పని మీద వచ్చానని చెప్పారు. అనంతరం, పీఎస్ నుంచి వెళ్లిపోయారు.👉ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారిగా ఓ రాజకీయ నేత విచారణకు హాజరు కావడం ఇదే ప్రథమం. 👉చిరుమర్తి లింగయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నాకు నోటీసులు ఇచ్చారు. ఈనెల తొమ్మిదో తేదీన నాకు నోటీసులు అందాయి. నేడు విచారణకు హాజరవుతున్నాను. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడటానికి నేనేమీ అధికారిని కాదు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందుకు నాకు నోటీసులు ఇచ్చారు. విచారణ అధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. 👉తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి పోలీసుల ద్వారా డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.👉ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ లింక్లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు పోలీసు విచారణకు హాజరుకానున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఉప ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి.. పోలీసులతో డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బుల తరలింపులో కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.👉ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్కు చెందిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు.. వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతకు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దమైనట్టు సమాచారం. అయితే, తిరుపతన్న ఫోన్ డేటా రిట్రీవ్తో కీలక ఆధారాలు లభించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఫోన్ సీడీఆర్ ఆధారంగా చేసుకునే బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.👉ఇక, అంతకుముందు.. చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు అందిన విషయం తెలిసిందే. నవంబర్11న జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఆదేశించారు. అయితే.. ఆ సమయంలో అనారోగ్య కారణంగా విచారణకు రాలేనని పోలీసులకు తెలిపారు. నేడు (నవంబర్ 14) విచారణకు హాజరవుతాని చిరుమర్తి లింగయ్య కోరాడు. ఈమేరకు గురువారం ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే విచారణకు హాజరు కానున్నారు. ఇది కూడా చదవండి: డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కిన ఏసీపీ.. పోలీసులతో వాగ్వాదం! -
ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బిగ్ షాక్
హైదరాబాద్, సాక్షి: ఫోన్ట్యాపింగ్ కేసులో పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు వెళ్తున్న వేళ.. ఈ కేసులో నిందితుడు భుజంగరావుకు పెద్ద షాక్ తగిలింది. ఆయన బెయిల్ను రద్దు చేస్తూ బుధవారం నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. మధ్యంతర బెయిల్ను రద్దు చేసిన కోర్టు.. రేపు(గురువారం) సాయంత్రం. 4గం. లోపు జైలుకు వెళ్లాలని భుజంగరావును ఆదేశించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు ఏ2 నిందితుడు. అనారోగ్య కారణాల రిత్యా ఈ ఏడాది ఆగష్టు 19వ తేదీన ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దానిని పొడగిస్తూ వచ్చింది. అయితే కిందటి నెలలో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు దానిని తిరస్కరించింది. అదే టైంలో మధ్యంతర బెయిల్ విషయంలో మరికొంత ఊరట ఇచ్చింది.ఫోన్ టాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును మార్చి 23వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి మిగతా నిందితులతో పాటు ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ కేసులో మొదట అరెస్ట్ అయ్యింది మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే పంజాగుట్ట పోలీసులు అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావుల్ని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన సూత్రధారి, ఏ1 ప్రభాకర్రావు అమెరికాలో ఉండగా.. ఆయన కోసం ఈ మధ్యే రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారు. -
మరో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఉమ్మడి నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. కాగా, నిన్న (సోమవారం) నాడు నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అదే పార్టీకి చెందిన మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రాష్ట్రానికి రప్పించి విచారణ జరపాలన్న పోలీసుల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డు రావడంతో తెలంగాణకు రప్పించి విచారణ జరిపే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాజకీయ మలుపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు రాజకీయ నాయకుల వైపు మలుపు తిరిగింది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరుకావాలని వారు కోరగా... మూడు రోజులు గడువు ఇవ్వాలంటూ దర్యాప్తు అధికారికి లింగయ్య సమాచారం పంపారు. దీంతో గురువారం (14వ తేదీ) హాజరుకావడానికి అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న కీలక నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న తరచూ లింగయ్యతో సంప్రదింపులు జరిపినట్టు తేలడంతో.. అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటివరకు పోలీసు అధికారుల చుట్టూనే.. ఈ ఏడాది మార్చిలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనప్పటి నుంచీ మొత్తం పోలీసు అధికారుల చుట్టూనే తిరిగింది. డీఎస్పీ ప్రణీత్రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావు అరెస్టు అయ్యారు. కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావుతోపాటు ఓ మీడియా చానల్ అధినేత శ్రవణ్కుమార్ అమెరికాలో ఉన్నారు. నిజానికి ఈ కేసులలో కొందరు రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావనకు వచ్చినా.. ఇప్పటివరకు ఎవరికీ నోటీసులిచ్చి విచారించలేదు. గతంలో ఓ ఎమ్మెల్సీపై లుకౌట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ అయింది. అయితే తొలిసారిగా మాజీ ఎమ్మెల్యేను దర్యాప్తు అధికారులు విచారణకు పిలిచారు. నకిరేకల్ ఎమ్మెల్యేగా వ్యవహరించిన చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పారీ్టకి చెందినవారు కావడం గమనార్హం. ఫోన్ల నుంచి డేటాను వెలికితీసి.. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు తర్వాత కొన్ని రోజులకు పోలీసు అధికారుల అరెస్టులు జరిగాయి. ఈ క్రమంలో నిందితులు తిరుపతన్న, మరికొందరు అధికారులు, మాజీ అధికారులు తమ ఫోన్లను మార్చేయడం, ఫార్మాట్ చేయడం వంటి చేశారు. అయితే పోలీసులు ప్రణీత్రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్రావుల అరెస్టు తర్వాత వారి నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని.. ఫార్మాట్ చేసిన, డిలీట్ చేసిన డేటాను వెలికితీయడానికి (రిట్రీవ్) ఆ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఇటీవలే ల్యాబ్ నుంచి నివేదికలు వచ్చాయి. నిందితుల ఫోన్ల నుంచి వెలికితీసిన డేటాను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతన్న ఫోన్ డేటాను విశ్లేషించగా.. ఆయనతో చిరుమర్తి లింగయ్య చేసిన సంప్రదింపులు బయటపడ్డాయి. 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికతోపాటు గతేడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో.. వీరి మధ్య కీలక అంశాలకు సంబంధించి సమాచార మార్పిడి జరిగినట్లుగా గుర్తించినట్టు తెలిసింది. దీనితో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తూ లింగయ్యకు నోటీసులు జారీ చేశారు. అనారోగ్య కారణాల నేపథ్యంలో విచారణకు హాజరుకావడానికి మూడు రోజుల సమయం ఇవ్వాలని లింగయ్య కోరగా.. గురువారం విచారణ రావాలని అధికారులు తెలిపారు. మరి కొందరు రాజకీయ నాయకులకూ..నిందితుల ఫోన్ల నుంచి వెలికితీసిన డేటా ఆధారంగా మరికొందరు రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో లింకు ఉందని దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆ డేటా ఆధారంగా లింగయ్యను విచారించిన తర్వాత మరికొందరు నేతలకు నోటీసులు జారీ చేసి, విచారించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్, రాజకీయ పారీ్టకి చెందిన నగదు రవాణా అంశాలపైనే రాజకీయ నేతల్ని దర్యాప్తు అధికారులు ప్రశ్నించనున్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: విచారణకు బీఆర్ఎస్ నేత గైర్హాజరు
హైదరాబాద్,సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. మొదటిసారిగా ఓ రాజకీయ నాయకుడిని పోలీసులు విచారణకు పిలిచారు. తమ ఎదుట హాజరుకావాలంటూ బీఆర్ఎస్ పార్టీ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేశారు. అయితే సోమవారం(నవంబర్ 11) లింగయ్య ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన రాలేదు. అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయానని పోలీసులకు కబురందించారు. ఈ నెల 14వ తేదీన విచారణకు హాజరవుతానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న బృందం.. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం కేంద్రంగా తమ విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేసింది. ఇప్పటిదాకా కేవలం పోలీస్ అధికారులు(మాజీ)లనే విచారణ జరిపిన దర్యాప్తు బృందం.. తొలిసారి ఓ రాజకీయ నేతను ప్రశ్నిస్తుండడం గమనార్హం. లింగయ్యనే కాకుండా పలువురు ఇతర నేతలను కూడా ఈకేసులో విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. -
Phone Tapping Case: ప్రభాకర్రావు , శ్రావణ్ రావుల పాసుపోర్టు రద్దు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో సూపర్ ట్విస్ట్.. ప్రభాకర్, శ్రవణ్ రావుకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్పోర్టును పాస్పోర్టు అథారిటీ రద్దు చేసింది. దీంతో, వారిద్దరూ దేశంలో ఏ విమానాశ్రయంలో దిగినా హైదరాబాద్ పోలీసులకు సమాచారం రానుంది.తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్పోర్టులను పాస్పోర్టు అథారిటీ రద్దు చేసింది. కాగా, అమెరికాలో తలదాచుకున్నారంటూ వీరిద్దరి పాస్ పోర్ట్ రద్దు చేయాలని పోలీసులు.. పాస్పోర్టు అథారిటీకి లేఖ రాశారు. దీంతో, పోలీసుల నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్పోర్టులను అధికారులు రద్దు చేశారు. ఇదే సమయంలో నిందితుల పాస్పోర్టు రద్దు నివేదికను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించారు సిటీ పోలీసులు. మరోవైపు.. అమెరికా పోలీసులకు సమాచారం అందిన వెంటనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను డిపోర్ట్ చేసే అవకాశం ఉంది. పాస్పార్ట్ రద్దు, రెడ్ కార్నర్(ఇంటర్పోల్) నోటీసులు కీలకంగా మారనున్నాయి. ఇక, ఇప్పటికే ఇద్దరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరు దేశంలో ఏ విమానాశ్రయంలో దిగినా హైదరాబాద్ పోలీసులకు సమాచారం రానుంది. ఇదిలా ఉండగా, అంతకుముందు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-1 నిందితుడు ప్రభాకర్ రావు హైదరాబాద్లో ఉన్నాడన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామన్నారు. ఏ విమానాశ్రయంలో ప్రభాకర్ రావు అడుగు పెట్టగానే ముందుగా మాకు సమాచారం ఇస్తారని చెప్పుకొచ్చారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు. -
ఫోన్ట్యాపింగ్ కేసు: సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్(సీపీ) సీవీ ఆనంద్ తొలిసారిగా స్పందించారు. ఈ కేసు దర్యాప్తుపై శుక్రవారం(అక్టోబర్ 25) మీడియాతో మాట్లాడుతూ సీపీ కీలక వ్యాఖ్యలు చేశారు.‘ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కేసులో కీలక నిందితుడు టాస్క్ఫోర్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చాడన్న ప్రచారంలో వాస్తవం లేదు.ఇప్పటికే ప్రభాకర్రావుపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశాం.ప్రభాకర్రావు దేశంలో ఎక్కడ ఏ ఎయిర్పోర్టులో దిగినా మాకు సమాచారం వస్తుంది. ఆయనను భారత్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’ అని సీవీ ఆనంద్ చెప్పారు.కాగా, ఫోన్ట్యాపింగ్ కేసులో పలువురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి విచారించగా ప్రభాకర్రావు మాత్రం విదేశాల్లో ఉండిపోయారు. ఆయన ఈ కేసులో ఇంకా విచారణకు హాజరు కాలేదు. టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్రావు ఈ కేసులో ఏప్రిల్ నుంచి జైలులోనే ఉన్నారు. ఆయన ఇటీవలే బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి: మాజీ ఈఎన్సీకి కాళేశ్వరం కమిషన్ కీలక ఆదేశాలు -
ఆయన చేసిన నేరం ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రిమాండ్లో ఉన్న ఏఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను గురువారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున మోహిత్ రావు వాదనలు వినిపిస్తూ... ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న, భూపాలపల్లి ఏఎస్పీ భుజంగరావులు గత మార్చి 23న అరెస్టు అయ్యారని చెప్పారు. తిరుపతన్న 211 రోజులుగా జైల్లోనే ఉన్నారని తెలిపారు. చార్జ్ïÙట్ను దాఖలు చేశారని, ఇది దాఖలు చేసి కూడా మూడు నెలలవుతోందని వివరించారు. ట్రయల్ కోర్టు, హైకోర్టులను ఆశ్రయించగా... బెయిల్ పిటిషన్లను కొట్టివేసినట్లు చెప్పారు.ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకొని... 211 రోజులుగా నిందితుడు జైల్లో ఎందుకున్నారని, ఆయన చేసిన నేరం ఏంటని న్యాయవాదిని ప్రశ్నించింది. ఇందుకు మోహిత్ రావు సమాధానమిస్తూ.... ‘ఎస్ఐబీ వింగ్ అనేది నా కంట్రోల్లో నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేయడం, ప్రొఫైల్ తయారు చేయడం, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం అధికారిగా నా విధి’అని తెలిపారు. రాష్ట్ర శాంతిభద్రతలను కాపాడేందుకు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేశారని, చట్టవిరుద్ధంగా చేయలేదని విన్నవించారు. ఈ వాదనలపై మరోసారి న్యాయస్థానం జోక్యం చేసుకొని... ‘‘ఇందులో నేరం ఏంటో మాకు అర్థం కావడం లేదు’అని అభిప్రాయపడింది. అయితే ప్రభుత్వ వాదనలు సైతం వినాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అనంతరం కౌంటర్ దాఖలుచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు తిరుపతన్న
న్యూఢిల్లీ: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్యాపింగ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. బెయిల్ ఇవ్వకపోవడానికి గల కారణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాది అయిన తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసిందికాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన తిరుపతన్నకు ఈనెల ప్రారంభంలో హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న ధర్మాసనం.. ఈ దశలో బెయిల్ మంజూరు చేయలేమని తెలిపింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక ప్రకారం దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన సమయంలో ఎస్ఐబీ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్క్లను డీఎస్పీ ప్రణీత్రావు, తదితరులు ధ్వంసం చేయడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న ఏ4 నిందితుడిగా ఉన్నారు. గత ఏడు నెలలుగా ఈయన జైలులోనే ఉన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్ఐబీ ఓఎస్డీ ప్రభాాకర్ రావు నేృతృత్వంలో పలువురు ప్రముఖులు, వ్యాపార వేత్తలు, రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడగా... ఈ కేసులో అప్పటి ఎస్ఐబీ అధికారులు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్రావులను అరెస్టు చేశారు. ప్రాథమిక చార్జిషీట్ సైతం దాఖలుచేశారు. అయితే, కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, మరో కీలక నిందితుడు శ్రవణ్కుమార్ అమెరికాలో ఉండటంతో విచారణ మందగించింది. ప్రభాకర్రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని దర్యాప్తు అధికారులు సీబీఐ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై సీట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. -
రెడ్ కార్నర్ నోటీస్ జారీ సులువు కాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు రెడ్కార్నర్ నోటీసు జారీ ప్రక్రియ సీబీఐ వద్ద ప్రాసెస్లో ఉందని డీజీపీ జితేందర్ చెప్పారు. రెడ్ కార్నర్ నోటీసు జారీకి సమయం పట్టొచ్చన్నారు. ‘రెడ్ కార్నర్ నోటీస్ జారీ అనేది చాలా పెద్ద ప్రాసెస్. అందులో అంతర్జాతీయ మార్గదర్శకాలు, ఇంటర్పోల్ గైడ్లైన్స్ పాటించాలి. దేశాల మధ్య ఒప్పందాలనూ పరిశీలించాలి. ఇలా ఎన్నో స్థాయిల్లో ప్రొటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. స్థానికంగా ఒక పోలీస్స్టేషన్ నుంచి నోటీసులు ఇచ్చినట్టుగా రెడ్కార్నర్ నోటీసులు జారీ చేయలేం. ఈ ప్రక్రియకు సమయం పడుతుంది’అని జితేందర్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును హైదరాబాద్ సీపీ, వెస్ట్జోన్ డీసీపీల పర్యవేక్షణలో స్పెషల్ టీం దర్యాప్తు చేస్తోందని, కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఇంతకుమించి మాట్లాడలేనన్నారు. ఇటీవల గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై జితేందర్ మంగళవారం డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డీజేల వాడకాన్ని తగ్గిస్తున్నాం..: ‘ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కదలికలు ఇంకా ఉన్నాయి. తెలంగాణలో మావోయి స్టుల ప్రభావం లేదు. పోలీసుల పట్టు కొనసాగుతోంది. తమ ఉనికి చాటుకునేందుకు కొన్నిసార్లు తెలంగాణ ప్రాంతంలోకి వచి్చనా.. పోలీసు బలగాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి. రాష్ట్రంలో ఉగ్ర కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా కొనసాగుతోంది’అని డీజీపీ చెప్పారు. జైనూర్లో ఇటీవల ఓ గిరిజన మహిళపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరమని, తదనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు బాధ్యులైన 38 మందిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పండుగలు, ఉత్సవాల్లో డీజేల ను వాడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని, వీలైనంత వరకు డీజేల వాడకాన్ని తగ్గిస్తూ వస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎమ్మెల్యే అరికెపూడి గాందీ.. కౌశిక్రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. సివిల్ తగాదాల్లో ఉన్నట్టుగా చిక్కడపల్లి ఏసీపీపై వచి్చన ఆరోపణలపై హైదరాబాద్ సీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు, నిమజ్జనాలు, మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను విజయవంతంగా పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, ఐజీలు రమేశ్, సత్యనారాయణ, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
ట్యాపింగ్ కేసు: ప్రభాకర్రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అమెరికాలో ఉన్న ఆయన్ని భారత్కు రప్పించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఇంటర్పోల్కు సీబీఐ లేఖ రాసింది.తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ప్రభాకర్రావు ఉన్న సంగతి తెలిసిందే. ఎస్ఐబీ మాజీ చీఫ్ అయిన ప్రభాకర్రావు.. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన టైంలోనే విదేశాలకు వెళ్లిపోయారు. విచారణ నిమిత్తం రావాలన్నా.. సహకరించడం లేద దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతి ఇచ్చింది. తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, విచారణ నుంచి తనకు ఊరట కావాలని ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ.. నాంపల్లి కోర్టు అందుకు అనుమతించలేదు. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సిట్, తెలంగాణ సీఐడీ సాయంతో సీబీఐని ఆశ్రయించింది. దీంతో.. జాతీయ దర్యాప్తు సంస్థ రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతించింది. ప్రభాకర్రావుతో పాటు ఐన్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్పైనా రెడ్ కార్నర్ నోటీసులకు అనుమతి జారీ చేసింది. త్వరలో ఇంటర్పోల్ వీళ్లిద్దరినీ రెడ్కార్నర్ నోటీసులు జారీ చేయనుంది. అదే జరిగితే.. వాళ్లను భారత్కు రప్పించడం సులువు అవుతుంది. -
‘ట్యాపింగ్’ కేసులో ఎమ్మెల్సీపై ఎల్ఓసీ
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు పోలీసులు, మీడియా సంస్థకు చెందిన వారి చుట్టూనే దీని దర్యాప్తు తిరుగుతుండగా.. తాజాగా రాజకీయ నాయకులకు ఆ మకిలి అంటింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నవీన్రావు పాత్రను ఈ వ్యవహారంలో రూఢీ చేసిన హైదరాబాద్ పోలీసులు ఆయనపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న నవీన్రావు దేశంలోకి అడుగు పెట్టిన వెంటనే అదుపులోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విదేశాల్లో తలదాచుకున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్రావులపై ఎల్ఓసీ ఉంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ వెస్ట్జోన్ పోలీసులు ఈ ఏడాది జూన్ 29న హైకోర్టుకు ఓ నివేదిక సమరి్పంచారు.అందులో మూడు చోట్ల ఎమ్మెల్సీ పేరు ప్రస్తావించడంతో తొలిసారిగా నవీన్రావు పేరు వెలుగులోకి వచి్చంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్కు కర్త, కర్మ, క్రియగా ఉన్న ప్రభాకర్రావుతోపాటు శ్రవణ్రావుతో కూడా కలసి నవీన్రావు పని చేశారన్నది ప్రధాన ఆరోపణ. అప్పటి అధికార పారీ్టకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు వీళ్లు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు. దీనికోసం ఎస్ఐబీలో ప్రత్యేకంగా ఓ బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు. నాటి ప్రతిపక్షంతో పాటు వివిధ విభాగాలకు చెందిన పలువురి ఫోన్ నంబర్లను ట్యాప్ చేయడంతో పాటు సున్నితమైన డేటాను అక్రమంగా సంగ్రహించారు. వివిధ రంగాలకు చెందిన వారిని బెదిరించడం ద్వారా ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేసేలా ఒత్తిడి చేశారని పోలీసులు చెపుతున్నారు. హార్డ్ డిస్్కల ధ్వంసంలోనూ పాత్ర గత ఏడాది డిసెంబర్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అదే సందర్భంలో ఎస్ఐబీ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్్కలను డీఎస్పీ ప్రణీత్రావు తదితరులు ధ్వంసం చేశారు. ఈ వ్యవహారం వెనుకా ప్రభాకర్రావుతో పాటు నవీన్రావు ఉన్నారని ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. సంధ్య కన్వెన్షన్స్ అధినేత ఎస్.శ్రీధర్రావును బెదిరించడం, ఆయన ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేయించడంలోనూ నవీన్రావు పాత్రను దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నవీన్రావును విచారించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కొంత కాలం కిందట ఆయనకు నోటీసులు జారీ చేయడానికి ఓ ప్రత్యేక బృందం ముమ్మరంగా ప్రయతి్నంచింది.వాటి ఆధారంగా ఆయనను పిలిచి విచారించాలని భావించింది. నోటీసులతో అధికారులు నవీన్రావు ఇల్లు, కార్యాలయాల వద్ద కాపుకాసినా ఆయనను కలవలేక పోయారు. ఈ లోపు పోలీసుల కదలికలు తెలుసుకున్న నవీన్రావు దుబాయ్ వెళ్లిపోయారని తెలిసింది. ఆయన విదేశాలకు వెళ్లిపోయారనే సమాచారం ఆధారంగా హైదరాబాద్ పోలీసులు ఎల్ఓసీ జారీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాల్లో రాష్ట్రానికి సంబంధించిన నోడల్ ఏజెన్సీగా ఉన్న సీఐడీ ద్వారా ఎల్ఓసీని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులతో పాటు సరిహద్దుల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టులకు పంపారు. ఎల్ఓసీలో నవీన్రావు పాస్పోర్టు నంబర్, ఇతర వివరాలు పొందుపరిచారు. దీని ఆధారంగా ఆయన దేశంలో అడుగుపెట్టగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. అనంతరం ఆయనను హైదరాబాద్ పోలీసులకు అప్పగిస్తారని సమాచారం. -
నెమ్మదించిన కీలక కేసుల దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాలంలో ఎంతో సంచలనంగా మారి.. నిత్యం వార్తల్లో నిలిచిన కొన్ని ముఖ్యమైన కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఒక్కో కేసులో ఒక్కో అంశం కారణంగా దర్యాప్తు నెమ్మదించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు వరుస అరెస్టులతో మొదట్లో హడావుడిగా నడిచింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో అప్పటి ఎస్ఐబీ అధికారులు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్రావులను అరెస్టు చేశారు. ప్రాథమిక చార్జిïÙట్ సైతం దాఖలుచేశారు. ఇక్కడి వరకు దర్యాప్తు ఫుల్స్పీడ్లో కొనసాగింది.అయితే, కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, మరో కీలక నిందితుడు శ్రవణ్కుమార్ అమెరికాలో ఉండటంతో వారిని అరెస్టు చేసి, తమ కస్టడీలోకి తీసుకుంటే తప్ప దర్యాప్తులో ముందుకుసాగని పరిస్థితి. ప్రభాకర్రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని దర్యాప్తు అధికారులు సీబీఐ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. గొర్రెల కేసులో... ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత విచారణకు ఆదేశించిన మరో కీలక కేసు గొర్రెల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలకు సంబంధించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన గొర్రెల కొనుగోళ్లలో రూ.700 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. అయితే, ఈ కేసు దర్యాప్తు అధికారి మారడంతో మళ్లీ కేసును మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కీలక అరెస్టులు జరిగినా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలతో ఈ కేసు ముడిపడి ఉండడం.. ఏసీబీలో సరిపడా సిబ్బంది లేకపోవడం సైతం క్షేత్రస్థాయిలో దర్యాప్తు జాప్యానికి కారణం అవుతోంది. రూ.1,000 కోట్ల జీఎస్టీ కేసులో.. అత్యంత సంచలనంగా మారిన మూడో కేసు.. వాణిజ్యపన్నుల శాఖలో రూ.1000 కోట్ల జీఎస్టీ కుంభకోణం. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను నిందితుడిగా చేర్చడంతో ఈ కేసుపైనా తీవ్ర చర్చ జరిగింది. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. అయితే, తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చి నా.. ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలు సరిగా లేవని అంటున్నారు. ప్రాథమిక ఆధారాలు లేనిదే నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం సాధ్యం కాకపోవడంతో సీఐడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసులో అవసరమైన సమాచారం కోసం ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖకు లేఖలు రాశారు. ఆ సమాచారం వస్తే తప్ప దర్యాప్తులో ముందడుగు పడని పరిస్థితి. -
అదనపు ఎస్పీ భుజంగరావుపై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ నాయిని భుజంగరావుపై మరో కేసు నమోదైంది. కూకట్పల్లి ఏసీపీగా పనిచేసిన రోజుల్లో అక్కడ 340 ఎకరాల భూకబ్జాకు సహకరించారన్నది ప్రధాన ఆరోపణ. ఇన్నాళ్లు భయంతో మిన్నకుండిపోయి న బాధితుడు మీర్ అబ్బాస్ అలీఖాన్ ధైర్యం చేసి సైబరాబాద్ పోలీస్కమిషనర్ అవినాష్ మహంతికి తాజాగా ఫిర్యాదు చేశారు. కూకట్పల్లిలోని సర్వే నంబరు 1007లో ఉన్న 340 ఎకరాల భూమి అబ్బాస్అలీఖాన్ తండ్రి నవాబ్ మీర్ హషిమ్ అలీఖాన్కు వారసత్వంగా వచి్చంది.దీనిపై కొందరు కుటుంబీకుల మధ్య సివిల్ సూట్ నడుస్తోంది. కోర్టు వ్యవహారాలు, చట్టపరమైన అంశాల్లో పట్టులేని హషిమ్ వీటి కోసం ఎస్ఎస్.మొయినుద్దీన్, యాసీన్ షేక్ సహకారం తీసుకున్నాడు. దీనిని వారు తమకు అనుకూలంగా మార్చుకొని, ఆ భూమిపై నకిలీ పత్రాలు సృష్టించారు. ఇది తెలిసీ హషిమ్.. వీరిద్దరిపై కేపీహెచ్బీ ఠాణాలో 2014 మేలో ఫిర్యాదు చేశారు. దీంతో యాసీన్ కూకట్పల్లి ఏసీపీగా ఉన్న నాయిని భుజంగరావును సంప్రదించి భారీ మొత్తం ఆఫర్ చేశాడు. దీంతో కేసు విత్డ్రా చేసుకోవాలంటూ హషిమ్అలీని భుజంగరావు వేధించడంతో పాటు తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేయించారు.ఈ క్రమంలోనే గ్రీన్కో కంపెనీ నిర్వాహకులు సీహెచ్.అనిల్, శ్రీనివాసరావు.. యాసీన్, మొయినుద్దీన్తో కలిసి ఆ భూమి కాజేయడానికి ముందుకొచ్చారు. భుజంగరావు సలహా మేరకు వీరంతా గూండాలను పంపి హషిమ్ను కిడ్నాప్ చేసి నిర్బంధించి, భూమికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. మరోపక్క ఈ కేసులో అభియోగపత్రాలు దాఖలు చేయనివ్వకుండా భుజంగరావు దర్యాప్తు అధికారిపై ఒత్తిడి తెచ్చారు. ఈ పరిణామాలు, వేధింపులు భరించలేకపోయిన హషిమ్ తీవ్ర అనారోగ్యానికి గురై 2020 జూన్ 30న కన్నుమూశారు. ఫోన్ట్యాపింగ్ కేసులో భుజంగరావు అరెస్టు కావడంతో ధైర్యంచేసి బయటికొచి్చన అబ్బాస్ అలీఖాన్ ఆయనపై ఫిర్యాదు చేశాడు. దీంతో శనివారం కేసు నమోదు చేసుకున్న ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు మధ్యంతర బెయిల్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో A2 భుజంగరావుకు ఊరట
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ2 నిందితుడు భుజంగరావుకు ఊరట లభించింది. అనారోగ్య కారణాల రిత్యా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి క్రిమినల్ కోర్టు.ఫోన్ టాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును మార్చి 23వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి మిగతా నిందితులతో పాటు ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో.. గుండె సంబంధిత చికిత్స నేపథ్యంలో 15 రోజులపాటు బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లకూడదనే షరతు విధించింది. ఈ కేసులో మొదట అరెస్ట్ అయ్యింది మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే పంజాగుట్ట పోలీసులు అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావుల్ని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన సూత్రధారి, ఏ1 ప్రభాకర్రావు అమెరికాలో ఉండగా.. ఆయన కోసం ఈ మధ్యే రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. అరెస్ట్ కు రంగం సిద్ధం
-
ఫోన్ ట్యాపింగ్ లో కీలక మలుపు నిందితులకు రెడ్ కార్నర్..
-
ప్రభాకర్రావును రప్పించేందుకు రెడ్కార్నర్ నోటీసులు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న మాజీ ఐపీఎస్లు ప్రభాకర్రావు, శ్రవణ్ రావుల మీద రెడ్కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. సీబీఐ సాయంతో తెలంగాణ సీఐడీ ఈ నోటీసుల్ని జారీ చేయించింది. తద్వారా ఇంటర్పోల్ ద్వారా వాళ్లను స్వదేశానికి రప్పించాలని చూస్తోంది.ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్రావు అరెస్ట్ అయిన వెంటనే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావు విదేశాలకు వెళ్లిపోయారు. ఈ కేసును విచారించిన ప్రత్యేక బృందం(సిట్).. ప్రణీత్రావు వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్రావు కనుసైగల్లోనే ట్యాపింగ్ వ్యవహారమంతా జరిగిందని నిర్ధారించుకుంది. ఏ1గా ప్రభాకర్రావు పేరును చేర్చింది. అటుపై ఆయన అమెరికాలో ఉన్నట్లు గుర్తించింది. అయితే..ఈలోపు ప్రభాకర్రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్లు, లుక్ అవుట నోటీసులు జారీ అయ్యాయి. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని, ఇప్పట్లో హైదరాబాద్ రాలేనని ప్రభాకర్రావు బదులు పంపించారు. కావాలంటే వర్చువల్గా విచారణకు హాజరవుతానని తెలియజేశారు. ప్రభాకర్రావు పంపిన లేఖను పోలీసులు నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఆ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభాకర్రావుతో పాటు ఈ కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ కుమార్ను కూడా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే శ్రవణ్ ఆచూకీని గుర్తించలేకపోయామని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. దీంతో ఏపీ సీఐడీ సాయంతో సీబీఐ ద్వారా ప్రభాకర్రావు, శ్రవణ్ మీద రెడ్కార్నర్ నోటీసులు జారీ చేయించింది సిట్. ఏ1గా ఉన్న ప్రభాకర్రావును విచారిస్తే కీలక విషయాలు బయటకు వస్తాయని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఎలాగైనా ఆయన్ని భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇంటర్పోల్ సాయం కోరే ప్రయత్నాల్లో ఉంది. త్వరలో ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం అమెరికాకు వెళ్లే అవకాశం కూడా ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే.. గతంలోనే ప్రభాకర్రావు మీద రెడ్కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆ టైంలో అధికారులు అదంతా ఉత్తదేనని తేల్చారు.రెడ్ కార్నర్ నోటీసులు.. ఇతర దేశాలకు పరారైన నిందితుల్ని కోర్టు విచారణ కోసం రప్పించేందుకు లేదంటే దోషుల శిక్ష అమలు కోసం రప్పించేందుకు జారీ చేసే నోటీసులు రెడ్ కార్నర్ నోటీసులు. ప్రపంచంలో ఉన్న 195 దేశాల జాతీయ దర్యాప్తు సంస్థల ఒప్పందం మేరకే ఈ వ్యవహారం నడుస్తుంది. ఇందుకోసం ఇంటర్పోల్ మధ్యవర్తితత్వం వహిస్తుంది. భారత్లో సీబీఐ సంస్థ రెడ్ కార్నర్ నోటీసుల జారీ, నిర్వహణను చూసుకుంటుంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ1 ప్రభాకర్రావు, ఏ6 శ్రవణ్ రావును హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఎస్ఐటీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుపైన నాన్ బెయిల్ వారెంట్లు జారీ చేసిన కోర్టు.. ప్రభాకర్రావు విజ్ఞప్తిని తిరస్కరించింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.అమెరికాలో ప్రభాకర్రావు ఉన్నట్లు సిట్ బృందం గుర్తించింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు , శ్రవణ్ రావులను ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, శ్రవణ్రావు ఆచూకీని దర్యాప్తు బృందం కనిపెట్టలేకపోయింది. శ్రావణరావు ఆచూకీ కోసం విదేశాలకు వెళ్లే యోచనలో దర్యాప్తు బృందం ఉన్నట్లు సమాచారం.కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని.. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు తేల్చారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్రావు అమెరికాకు వెళ్లిపోయారు. -
ఫోన్ ట్యాపింగ్ నిందితులకు మరో ఎదురుదెబ్బ
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు మరోసారి చుక్కెదురైంది. బెయిల్ కోసం చేసిన అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు.. A3 తిరుపతన్న, A4 భుజంగరావు, A5 రాధాకిషన్ రావులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తమను అరెస్ట్ చేసి వంద రోజులు దాటిందని, పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో మాండేటరీ బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ను నాలుగుసార్లు వెనక్కి పంపింది కోర్టు. దీంతో మూడున్నర నెలలు గడుస్తున్న పోలీసులు సక్రమంగా ఛార్జిషీటు వేయలేకపోయారని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. అయితే కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావితం అవుతుందని పోలీసులు వాదించారు. దీంతో.. పోలీసు వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక తీర్పు
-
నేను ఇల్లీగల్ పనులు చేయలేదు.. అమెరికా నుంచి ప్రభాకర్ లేఖ
-
జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే భారత్కు వస్తానన్న ప్రభాకర్రావు.. గత నెలలోనే భారత్ రావాల్సి ఉన్నా వాయిదా వేసుకోక తప్పలేదని లేఖలో పేర్కొన్నారు. క్యాన్సర్తో పాటు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానని పేర్కొన్నారు.కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారనే అభియోగాలు ప్రభాకర్రావుపై నమోదు అయ్యాయి. ఈ కేసులో తొలి అరెస్ట్ ప్రణీత్రావును చేయగా.. అంతకు ముందే అలర్ట్ అయిన ప్రభాకర్రావు దేశం విడిచి వెళ్లిపోయారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. మీడియాకు హైకోర్టు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా సంయమనం పాటించాలని, ట్యాపింగ్కు గురైన జడ్జిల వివరాలను వెల్లడి చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్కు గురైన జడ్జీల పేర్లు ఎక్కడ వాడొద్దు. వారి ఫోన్ నెంబర్స్, కుటుంబ సభ్యుల పేర్లు, ఫోటోలు బహిర్గతం చేయొద్దు. వాళ్ల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు అని మీడియా సంస్థలను హైకోర్టు ఆదేశించింది. అనంతరం.. ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు జూలై 23కి వాయిదా వేసింది. తెలంగాణ పలు రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు వచ్చాయి. వాటిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల్ని విచారించిన అధికారులు కీలక విషయాలను రాబట్టారు. అందులో భాగంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని నిందితులు విచారణలో చెప్పడం గమనార్హం. -
ఫోన్ ట్యాపరింగ్ కేసుపై హైకోర్టులో విచారణ
-
ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు హైకోర్టులో విచారణ
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న ఫోన్ ట్యాపింగ్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలంగాణ పోలీసులు ఇప్పటికే పలు కీలకమైన అంశాలతో కౌంటర్ దాఖలు చేశారు.దీంతో పాటు తెలంగాణ పలు రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు వచ్చాయి. వాటిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ చేపట్టనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల్ని విచారించిన అధికారులు నిందితుల నుంచి కీలక విషయాలను రాబట్టారు. అందులో భాగంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని ఫోన్ ట్యాపింగ్ నిందితులు విచారణలో తెలిపారు.అయితే ఈ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి.. ఇదే అంశంపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులను జారీ చేసింది. ఈ నోటీసులకు గత నెల 29న హైదరాబాద్ సీపీ బదులిస్తూ.. అఫిడవిట్ దాఖలు చేశారు. -
"నేను రాలేను.." ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. పోలీసులకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనారోగ్యం కారణాలతో ఇప్పట్లో తాను రాష్ట్రానికి రాలేనని కీలక నిందితుడు ప్రభాకర్ రావు తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది.అయితే, ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో విచారణను హాజరవుతానని అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ, ఇప్పుడు మాత్రం యూ టర్న్ తీసుకున్నారు. మరో వైపు.. ప్రభాకర్ రావుకు సీబీఐ బ్లూ కార్నర్ నోటీసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇక, ఈ వ్యవహారంపై ఇంటర్పోల్ను ఆశ్రయించాలంటే ఆయన పరారీలో ఉన్నట్టు చూపాలి. కానీ, కేసు విచారణకు ముందే ప్రభాకర్ రావు చికిత్స కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో, ఇంటర్పోల్ను ఆశ్రయించే అవకాశం లేదు.ఈ నేపథ్యంలో కేసు విషయమై ప్రభాకర్ రావును రప్పించేందుకు ప్రత్యామ్నాయం కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్ధు కోరుతూ రీజనల్ పాస్పోర్ట్ అధికారికి కూడా పోలీసులు లేఖ రాశారు. అయితే, ప్రభాకర్ రావు పరారీలో లేనని సమాచారం ఇస్తుండటంతో విదేశీ వ్యవహారాల శాఖ పాస్పోర్టు రద్ధు అంగీకారం అనుమానంగానే మారింది. ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నిందితుడు శ్రావణ్ రావు సైతం విదేశాల్లోనే మకాం వేశారు. దీంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ డోలాయమానంలో పడిపోయింది. విదేశాల నుంచి ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు ఇండియాకు వస్తే తప్ప కేసు విచారణ ముందుకు సాగే అవకాశం లేదు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. టీవీ5 సాంబకు రూ.2 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. టీవీ5 సాంబశివరావుకు రూ.2 కోట్లు అందాయని ఇంటెలిజెన్స్ ఎస్పీ భుజంగరావు స్టేట్మెంట్లో పేర్కొన్నాడని హైకోర్టుకు దాఖలు చేసిన కౌంటర్లో పోలీసులు తెలిపారు. సంధ్యశ్రీధర్రావుపై కేసులు లేకుండా చేసేందుకు రూ.15 కోట్ల డీల్ను సాంబశివరావు కుదిర్చాడు. కమీషన్ కింద రూ.2 కోట్లు సాంబశివరావు తీసుకున్నాడు. పార్టీఫండ్గా బీఆర్ఎస్కు రూ.13 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చెల్లించినట్లు పోలీసులు కౌంటర్లో పేర్కొన్నారు. అఫిడవిట్ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.కాగా, ‘ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందల మంది జడ్జీలు, మాజీ మంత్రులు, జర్నలిస్టులు, న్యాయవాదులు.. ఇలా ఎంతో మంది ఫోన్ నంబర్లు, అడ్రస్లు, కాల్ రికార్డుల జాబితా అంతా సేకరించారు. వారి ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఓ వ్యక్తిపై కేసులు లేకుండా చేసేందుకు టీవీ 5 సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారు’ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది.సంధ్య కన్వెన్షన్ శ్రీధర్రావు, టీవీ 5 సాంబశివరావులకు సంబంధించిన హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్ వివాదం ఉంది. ఈ పంచాయతీని సాంబశివరావు భుజంగరావు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్రావుపై చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయని, వాటి నుంచి బయటపడాలంటే రూ.15 కోట్లు బీఆర్ఎస్కు పార్టీ ఫండ్గా ఇవ్వాలని భుజంగరావు ఒత్తిడి తెచ్చారు.శ్రీధర్రావు రూ.13 కోట్లు విలువైన బీఆర్ఎస్ బాండ్లు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారని భుజంగరావు వాంగ్మూలంలో పేర్కొన్నారు..’’ అని ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు చుక్కెదురు
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు వచ్చేదెప్పుడు?
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు తెలంగాణ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేది ఎప్పుడు?. దీనిపై దర్యాప్తు అధికారులు స్పందించారు. నేటితో ఆయన వీసా ముగియనుందట. ఈ నేపథ్యంలో ఈ నెలాఖారున ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టత ఇచ్చారు. అయితే.. అనారోగ్యాన్ని కారణంగా చూపిస్తూ తన వీసా గడువును పెంచుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదని సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారనే అభియోగాలు ప్రభాకర్రావుపై నమోదు అయ్యాయి. ఈ కేసులో తొలి అరెస్ట్ ప్రణీత్రావును చేయగా.. అంతకు ముందే అలర్ట్ అయిన ప్రభాకర్రావు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రభాకర్రావును ప్రశ్నిస్తేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అంటోంది. ఈ లెక్కన.. ఆయన దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాకర్రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. నిందితులపై బెయిల్పై.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు. తిరుపతన్న, భుజంగ రావ్ బెయిల్ పిటిషన్ లపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. నిర్ణీత గడువు 90 రోజుల్లోగా ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి మాండేటరీ బెయిల్ కోసం ఈ ఇద్దరు కోర్టును అభ్యర్థించారు. ఇక.. ఇప్పటికే ఈ కేసులో రెండుసార్లు పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ను కోర్టు వెనక్కి తతిప్పి పంపింది. అయితే.. ఎవిడెన్స్ మెటీరియల్గా స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్డ్రైవ్లను పోలీసులు కోర్టుకు సమర్పించారు. వీటితో మూడోసారి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఆధారలను నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టును కోరారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులకు చుక్కెదురు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల ఛార్జ్షీట్ను నాంపల్లి కోర్టు వెనక్కి పంపించింది. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మెటీరియల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయకపోవడంతో ఛార్జ్షీట్ను కోర్టు వెనక్కి పంపించింది. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగ రావ్, తిరుపతన్నలు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి 90 రోజులు గడిచినా ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి తప్పనిసరిగా బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇక, వీరిద్దరి బెయిల్ పిటిషన్లపై నేడు కోర్టులో విచారణ జరుగనుంది. -
రాధాకిషన్ రావును కరిచిన ‘పిల్లి’.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై.. చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలంగాణ మాజీ టాస్కో ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును ‘పిల్లి’కరిచింది. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్త్రావమైంది. సమాచారం అందుకున్న జైలు అధికారులు అత్యవసర చికిత్స కోసం రాధాకిషన్ రావును నారాయణ గూడ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్
-
ఫోన్ ట్యాపింగ్ కేసు: నాంపల్లి కోర్టులో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో హైడ్రామా నడిచింది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ను కోర్టు వెనక్కి పంపగా.. ఇదే అదనుగా ఈ కేసులో నిందితుడు ప్రణీత్రావు బెయిల్ కోసం ప్రయత్నించాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్టు చోటు చేసుకుంది.ఛార్జ్షీట్లో కొన్ని తప్పిదాలను గుర్తించిన నాంపల్లి కోర్టు.. దానిని పోలీసులకు తిప్పి పంపించింది. అయితే ఈ గ్యాప్లో ప్రణీత్ రావు కోర్టును ఆశ్రయించాడు. తొంభై రోజుల్లో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించాడు. అయితే ఈలోపే తప్పులు కరెక్ట్ చేసిన పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అంతేకాదు.. బెయిల్ ఇస్తే ప్రణీత్రావు సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని వాదించారు. కొత్త ఛార్జ్షీట్ పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా.. పోలీసుల వాదనతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఫలితంగా.. ప్రణీత్రావు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. -
హార్డ్ డిస్క్లు స్వాధీనం!
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. రవికుమార్ దాచిన హార్డ్ డిస్క్లు స్వాధీనం!
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీకి టెక్నికల్ సపోర్ట్ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్, ఆ సంస్థ చైర్మన్ రవికుమార్ ఇంటి నుంచి హార్డ్ డిస్క్లను సిట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ చైర్మన్ రవికుమార్కు చెందిన బెంగళూరు, హైదరాబాద్ ఇళ్లలో.. ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇన్నోవేషన్ ల్యాబ్ ఆఫీసుల నుంచి మూడు సర్వర్లు, ఐదు మినీ డివైజ్లు, హార్డ్ డిస్క్లను తమ వెంట తీసుకెళ్లారు. ఆ సమయంలో ల్యాబ్ ప్రతినిధుల స్టేట్మెంట్లను సైతం సిట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రవికుమార్ ఇంట్లో దాచిన హార్డ్ డిస్క్లను సైతం సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. ఇక.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడు ప్రణీత్ రావు ఈ ల్యాబ్ సహకారమే తీసుకున్నట్లు ఇదివరకే నిర్ధారణ అయ్యింది. అంతేకాదు.. ప్రతిపక్ష నేతల ఇళ్లతో పాటు మూడు జిల్లాల్లో ల్యాబ్ మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటులో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు సిట్ నిర్ధారించుకుంది. ఈ క్రమంలో తాజాగా సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణ దర్యాప్తును మలుపు తిప్పుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రవికుమార్ను విచారణ చేపడతారా? నోటీసులు ఏమైనా జారీ చేశారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు వేగం పెంచారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఓనర్ను త్వరలోనే అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఈ కేసులో కీలకమైన టెక్నికల్ ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. కొండాపూర్లో కన్వర్జేన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్లో సోదాలు చేశారు. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్లో 3 సర్వర్లు, హార్డ్ డిస్క్లతో పాటు 5 మాక్ మినీ డివైజ్లు సిట్ సీజ్ చేసింది. ఆ సంస్థ డైరెక్టర్ పాల్ రవికుమార్కు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. ఫోన్ టాపింగ్కు సంబంధించిన టెక్నికల్ ఆధారాలను పాల్ రవికుమార్ నుంచి పోలీసులు సేకరించినట్లు సిట్ వెల్లడించింది.. .. అదే సంస్థలో పనిచేసే సీనియర్ మేనేజర్ రాగి అనంత చారి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారాం శ్రీనివాస్లను స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. పాల్ రవికుమార్ 160 సీఆర్పీసీ నోటీస్ జారీ చేసి స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తప్పదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నూతనకల్ (సూర్యాపేట)/శాలిగౌరారం(నల్లగొండ): బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీన ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఎప్పుడైనా విలీనంకాక తప్పదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో పదవులు అనుభవించిన వారంతా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారన్నారు.చత్తీస్గఢ్ నుంచి విద్యు త్ కొనుగోలులో, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సారథ్యంలో రూ.10వేల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు తమ అవినీతి, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీలో బీజేపీ నాయకులతో అంటకాగుతూ చర్చలు జరుపుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ మెడకు ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్.. నేడు ఆ పార్టీ మెడకే చుట్టుకుందని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. అంతకుముందు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామంలో ప్రభుత్వ మోడల్ స్కూల్లో శనివారం విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, నోటుబుక్స్ పంపిణీ చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టేసింది.రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తేగా.. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లపై మంగళవారం వాదనలు పూర్తి కాగా.. ఈరోజు(బుధవారం) ఈ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో భుజంగరావు తిరుపతన్న ఉన్నారు. -
ఫోన్ ట్యాపింగ్పై నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్అరాధే ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది. గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజాశరత్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటూ ఓ పత్రికలో వచి్చన వార్తను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ, సీఎస్, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ, హైదరాబాద్ సీపీలను ప్రతివాదులుగా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ‘ఫోన్ ట్యాపింగ్, జీపీఎస్ లొకేషన్ నుంచి వివరాలు తెలుసుకొని రేవంత్రెడ్డి స్నేహితుడు గాలి అనిల్కుమార్ నుంచి రూ.90 లక్షలు, వినయ్రెడ్డి నుంచి రూ.1.95 కోట్లు, కోమటిరెడ్డి రాజ గోపాల్రెడ్డి స్నేహితుడు వేణు నుంచి రూ.3 కోట్లు్ల, జి.వినోద్ నుంచి రూ.50 లక్షలు, ఉత్తమ్ మిత్రుల నుంచి రూ.50 లక్షలు.. ఇలా పలువురి నుంచి ఎన్నికల సమ యంలో నగదు స్వాదీనం చేసుకున్నట్టు ఏఎస్పీ తిరుపతన్న తన వాంగ్మూలంలో చెప్పారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ కాజా ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాన్ని అంగీకరిస్తూ ఇచి్చన వాంగ్మూలంలో పేర్కొన్నారు.’అంటూ వచి్చన కథనాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. -
ఫోన్ ట్యాపింగ్ పై కోమటి రెడ్డి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం
-
ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్. కవాడిగూడ: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని, ఈ కేసులో కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ తాత్సారం చేస్తోందని ఆరోపించింది. ఈ కుంభకోణంలో దోషులకు శిక్ష పడేవరకు బీజేపీ పోరాటం చేస్తుందని, ఇందుకోసం న్యాయ పోరాటానికి సైతం సిద్ధంగా ఉందని ప్రకటించింది.కేసులో సూత్రధారులు, పాత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... తెలంగాణ చరిత్రలో సీఎం రేవంత్రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని చెప్పుకున్న రేవంత్ ఇప్పుడెందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు.కేసీఆర్తో లోపాయికారీ ఒప్పందం ఉందా?ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కేసీఆర్తో లోపాయికారీ ఒప్పందం చేసుకుందా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ట్యాపింగ్ కేసులో అరెస్టయిన వాళ్లు వాంగ్మూలం ఇచ్చినా కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావించారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం, ధరణి పేరుతో దోచుకున్నదాన్ని కక్కిస్తామన్నారని గుర్తుచేశారు. తీరా అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతి, కుంభకోణాల మీద రేవంత్రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లిక్కర్ కేసు నుంచి తన కుమార్తె కవితను తప్పించడంకోసమే బీజేపీ నేతలపై కేసీఆర్ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు.బీఆర్ఎస్ రద్దు కోరుతూ లేఖ రాస్తా: కొండా 2017కంటే ముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తామని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల వ్యవహారాలతో పాటు రక్షణ పరమైన ఒప్పందాల్లో నూ కేసీఆర్ వేలు పెట్టాడని తెలుస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో నయీం తరహా పాలన సాగిందని, సొంత కుటుంబం పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు.రేవంత్ను సోనియా బెదిరించారు: బూర‘బీఆర్ఎస్పై కేసులు పెడితే నీపని అవుతుంది అని సోనియా గాంధీ బెదిరించారు. అందుకే రేవంత్ రెడ్డి మొహం చిన్నగా చేసుకుని వచ్చాడు’ అని బూ ర నర్సయ్యగౌడ్ వ్యాఖ్యానించారు. ధర్నాలో ఎంపీ బీబీపాటిల్, మాజీ మంత్రులు జి.విజయ రామా రావు, ఇ.పెద్దిరెడ్డి, నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్రెడ్డి, ఎన్. రామ చంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఎం.ధర్మా రావు, ప్రేంసింగ్ రాథోడ్, భేతి సుభాష్రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
డీఎస్పీ ప్రణీత్రావు వాంగ్మూలం.. 1,000 నుంచి 1,200 ఫోన్లు ట్యాపింగ్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్రావు నేతృత్వంలోని బృందం 1,000 నుంచి 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తమ కస్టడీలో ప్రణీత్రావు అనేక కీలకాంశాలు వెల్లడించినట్లు కోర్టుకు తెలిపారు. ప్రతిపక్షాలకు నిధులు ఇస్తున్న సంస్థల డబ్బును స్వాదీనం చేసుకోవడం కోసం ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు నాంపల్లి కోర్టుకు నేరాంగీకార వాంగ్మూలాన్ని సమర్పించారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ప్రణీత్ ప్రవర్తనపై ఫిర్యాదులు వరంగల్ జిల్లా మేడేపల్లికి చెందిన ప్రణీత్ 2008లో శిక్షణ పూర్తి చేసుకుని ఎస్సైగా బయటకు వచ్చారు. నల్లగొండ జిల్లా మోత్కూరులో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేశారు. ఐపీఎస్ అధికారి రాజేష్ కుమార్ నల్లగొండ ఎస్పీగా ఉండగా ప్రణీత్రావు ప్రవర్తన సరిగ్గా లేదంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటి ఆధారంగా ఆయన ప్రణీత్పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు నల్లగొండ ఎస్పీగా బదిలీపై రావడంతో ప్రణీత్రావు ఆయనతో పరిచయం పెంచుకున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరువురి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో ప్రణీత్ను బీబీనగర్ ఎస్సైగా ప్రభాకర్రావు నియమించారు. 2016లో ప్రభాకర్రావు నిఘా విభాగానికి బదిలీ అయ్యారు. దీంతో ఆయన్ను సంప్రదించిన ప్రణీత్ కూడా అందులోకే వచ్చారు. ప్రణీత్కు సీనియారిటీ ప్రాతిపదికన 2017లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి వచ్చింది. అదే సమయంలో ప్రభాకర్రావు సైతం డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి పొంది ఎస్ఐబీ చీఫ్గా మారారు. అదే సామాజిక వర్గానికి చెందిన ఎస్పీ వేణుగోపాల్ రావు వద్ద పని చేయాలని ప్రణీత్కు ప్రభాకర్రావు సూచించారు. అప్పటి నుంచి ప్రణీత్ నేరుగా వీరిద్దరికి మాత్రమే రిపోర్ట్ చేసేవారు. ఎవరిపై నిఘా ఉంచాలి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలనే వివరాలు వీరిద్దరి నుంచి ప్రణీత్కు అందేవి. అక్రమ ట్యాపింగే ప్రధాన విధిగా... ప్రభాకర్రావు చొరవతోనే ప్రణీత్కు 2023లో యాక్సిలేటరీ పదోన్నతి వచ్చింది. ప్రభాకర్రావు ఆదేశాల మేరకు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ఏర్పాటు చేసుకున్న ప్రణీత్కు ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, మరో ఇద్దరు ఏఎస్సైలు, ముగ్గురు కానిస్టేబుళ్లను కేటాయించారు. ఎస్ఐబీ కార్యాలయం మొదటి అంతస్తులో వీరి కోసం రెండు గదులు కేటాయించారు. వాటిలోనే లాగర్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్న ప్రణీత్ 17 కంప్యూటర్లు, ల్యాప్టాప్తో అక్రమ ఫోన్ ట్యాపింగ్ల కథ నడిపారు. బీఆర్ఎస్లోని అసమ్మతి నేతలు, అసంతృప్తులతో పాటు ప్రతిపక్షాలపై నిఘా పెట్టడం కోసం అక్రమ ట్యాపింగ్కు పాల్పడటమే ఎస్ఓటీ ప్రధాన విధిగా పని చేసింది. ప్రభాకర్రావు ఆదేశాలతో చేసిన అనేక ఆపరేషన్ల వివరాలు దర్యాప్తు అధికారుల వద్ద వెల్లడించడానికి నిరాకరించిన ప్రణీత్ 1,000 నుంచి 1,200 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశామని బయటపెట్టారు. వారి వివరాలను సైతం బయటకు చెప్పనంటూ పోలీసులకు స్పష్టం చేశారు. ప్రణీత్ వద్ద 8 ఫోన్లు ఎస్ఓటీ పనిని పర్యవేక్షించడానికి, టీమ్లోని వారితో సంప్రదింపులు జరపడానికి ప్రణీత్రావు 8 ఫోన్లు నిర్వహించారు. వీటిలో 3 అధికారిక నంబర్లు కాగా, మిగిలినవి వ్యక్తిగతమైనవి. ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో అనేక మంది ఫోన్లు ట్యాప్ చేసిన ప్రణీత్ టీమ్ ప్రధానంగా నగదు రవాణాపై దృష్టి పెట్టింది. ఎస్ఓటీ నిఘాలో ఉన్న వారిలో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక సహాయం చేస్తున్న వ్యాపారులు, ఫైనాన్షియర్లు కూడా ఉన్నారు. వీరి ఫోన్లు ట్యాప్ చేయడంతోపాటు కదలికల్ని పసిగట్టిన ప్రణీత్ బృందం ఆ సమాచారాన్ని ఆయా జిల్లాలకు చెందిన పోలీసులు అందించేది. ఆ బృందాలు వాళ్లు రవాణా చేస్తున్న నగదును స్వా«దీనం చేసుకునేవి. అయితే ప్రతిపక్షాలతోపాటు ఎన్నికల సంఘాన్నీ తప్పుదోవ పట్టించిన ప్రణీత్ టీమ్ ఈ నగదుకు హవాలా రంగు పూసింది. ట్యాపింగ్, నిఘాకు వినియోగించిన ఉపకరణాల్లో కొన్నింటిని నగరానికి చెందిన కన్వర్జెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ అనే సంస్థ నుంచి సమీకరించుకున్నారు. బీఆర్ఎస్ ఓడిపోతోందని రావడంతో... అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతోందని గత నవంబర్ 30న ఎగ్జిట్ పోల్స్లో రావడంతో ఆ రోజు నుంచి ట్యాపింగ్ కార్యకలాపాలు ఆపేయాలని ప్రభాకర్రావు ఆదేశించారు. డిసెంబర్ 4న ఫలితాలు వెలువడటంతోనే తన పోస్టుకు రాజీనామా చేసిన ప్రభాకర్రావు ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేయాలని ప్రణీత్కు సూచించారు. దీంతో ప్రణీత్ అదే రోజు రాత్రి 7.30 నుంచి 8.15 గంటల వరకు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కన్వర్జెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ సంస్థకు చెందిన శ్రీనివాస్, అనంత్ సహకారంతో హార్డ్డిస్క్లు, డాక్యుమెంట్లు బయటకు తీశారు. సర్వర్లు తదితరాలను వారిద్దరికీ అప్పగించి... 50 హార్డ్డిస్క్ల్ని ఆర్ఎస్సై హరికృష్ణతో కలిసి ధ్వంసం చేశారు. హెడ్ కానిస్టేబుల్ కె.కృష్ణ ద్వారా ఈ హార్డ్లిస్క్ల్ని ఎలక్ట్రిక్ కట్టర్తో ముక్కలు చేయించారు. కంప్యూటర్లను ఫార్మాట్ చేసి, పత్రాలను ఎస్ఐబీ కార్యాలయం ఆవరణలోనే కాల్చేసిన ప్రణీత్రావు హార్డ్డిస్క్ ముక్కల్ని మాత్రం నాగోల్, మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పారేశారు. ఫార్మాట్ చేసిన సెల్ఫోన్లు, పెన్డ్రైవ్స్ని బేగంపేట నాలాలో విసిరేశారు. ఎట్టకేలకు విషయం బయటకు రావడంతో పంజగుట్టలో కేసు నమోదై అరెస్టులు చోటు చేసుకున్నాయి. -
1200 వందల ప్రముఖుల ఫోన్లు ట్యాప్ నిజాలు ఒప్పుకున్నా ప్రణీత్ రావు
-
1,200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ట్యాపింగ్ ఆపింది అప్పుడే!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా ఫోన్లు ట్యాప్ చేశామని ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, మాజీ పోలీస్ అధికారి ప్రణీతరావు వాంగ్మూలం ఇచ్చాడు. మొత్తం 1,200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు అంగీకరించాడు. వాంగ్మూలం నివేదిక దర్యాప్తు అధికారులు బయటకు విడుదల చేయగా.. అందులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. జడ్జీలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు.. ఇలా మొత్తం 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు చెప్పాడు. వీళ్లతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు సైతం టాప్ చేసినట్లు పేర్కొన్నాడు. ప్రభాకర్ రావు సహాయంతో 17 సిస్టం ద్వారా ట్యాపింగ్కు పాల్పడ్డాం. రెండు లాగర్ రూమ్ లో 56 మంది సిబ్బందిని వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ట్యాపింగ్ కొనసాగించాం. ఎనిమిది ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్లో ఉన్నా. అధికారికంగా మూడు ఫోన్లు వినియోగించా. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు ట్యాపింగ్ను మానిటరింగ్ చేశాం. ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నాం.పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికి అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించాం.ఇక.. ఫోన్ టాపింగ్ ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నాం. ఈ ల్యాబ్ కు సంబంధించిన శ్రీనివాస్, అనంత్ లో సహాయంతో టాపింగ్ ని విస్తృతంగా చేసాం. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి టాపింగ్ని ఆఫ్ చేసాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పాడు. ఇదీ చదవండి: బీఆర్ఎస్ కోసం ఏ ఒక్కరినీ వదల్లేదు!ప్రభాకర్ రావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్లను తీసుకొచ్చాం. పాత వాటిలో కొత్త హార్డ్ డిస్క్లు ఫిక్స్ చేశాం. అందులో 17 హార్డ్ డిస్క్ లో అత్యంత కీలకమైన సమాచారం ఉంది. ఆ 17 హార్డ్ డిస్క్ లను కట్టర్ తో కట్ చేసి ధ్వంసం చేశాం. పెద్ద ఎత్తున ఉన్న సీడీఆర్ తో ఐడీపీఆర్(Inter-Domain Policy Routing) డాటా మొత్తాన్ని కూడా కాల్చివేసాం. పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ల్యాప్ట్యాప్స్.. ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులో ఉన్న డాటా మొత్తాన్ని ఫార్మేట్ చేశాం. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు అన్నింటిని కూడా నాగోల్, మూసారంబాగ్ వద్ద మూసీ నదిలో పడవేశాం. ధ్వంసం చేసిన సెల్ ఫోన్లు పెన్ డ్రైవ్లు అన్నిటిని కూడా బేగంపేట నాలాలో పడేశాం. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ టాపింగ్ సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించాడు. ఆ ఆదేశాల ప్రకారమే ట్యాపింగ్ వ్యవహారం నడిచింది అని ప్రణీత్రావు వాంగ్మూలం ఇచ్చాడు.స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ)లో ఆధారాల ధ్వంసం కేసుకు సంబంధించి మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావును మార్చి రెండో వారంలో ప్రత్యేక బృందం సిరిసిల్లలో అరెస్ట్ చేసింది. -
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు
-
సొంతంగా ముందుకెళ్లం!: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ విషయంలో నిపుణుల కమిటీ, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు చెప్పినట్లే నడుచుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి సొంతంగా నిర్ణయాలు తీసుకోబోమని చెప్పారు. మేడిగడ్డలో ఎంతో కొంత నీళ్లు నింపి, ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పంపినా.. అవి ఉంటాయో, ఊడుతాయో తెలియట్లేదని వ్యాఖ్యానించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక సైతం అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పటిష్టతపై సందేహాలు వ్యక్తం చేసిందని తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం తుగ్లక్ రోడ్డులోని అధికారిక నివాసంలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఇంకెన్ని బ్లాక్లు కూలతాయో తెలియదు ‘80 వేల పుస్తకాలు చదివి, సొంత తెలివితేటలతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశారు. అల్లుడు హరీశ్రావు వరల్డ్ రికార్డు కోసం ఆగమాగం పనులు చేశాడు. ఇప్పుడు అది కూలింది. మేడిగడ్డలో కూలిన బ్లాక్ను సరిచేసి నీళ్లు నిలిపితే, ఇంకెన్ని బ్లాక్లు కూలతాయో తెలియదు. ఒకవేళ రెండున్నర మీటర్లలో మేడిగడ్డ నింపి అన్నారం, సుందిళ్లకు నీటిని పంపితే వాటి పరిస్థితి ఏంటో తెలియదు. ఒకవేళ భారీ వరదలు వచ్చి ఎల్లంపల్లి నిండితే ఆ వరద నీరు, ఎత్తిపోసిన నీరు అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ నుంచే కిందికి పోవాలి. ఇప్పటికే 52 టీఎంసీల ఎత్తిన నీళ్లు కిందకు పోయాయి. సముద్రంలోకి పోయిన నీటికి కరెంట్ బిల్లులు కట్టాం. 80 వేల పుస్తకాలు చదివిన తెలివి అట్లుంది. కాళేశ్వరం సమస్య.. 32 పళ్లలో ఒక పన్ను విరిగితే వచ్చిన సమస్య లాంటిది కాదు. విరిగింది వెన్నెముక. మేడిగడ్డ పునరుద్ధరణ అంశంపై ఇప్పటికే మూడు కేంద్ర ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఆ ఏజెన్సీలు ఇచ్చిన సిఫారసుల మేరకు ముందుకు వెళతాం..’ అని రేవంత్రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికి అంచనాలు, చెల్లింపుల జోలికి పోలేదు ‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వరకే జ్యుడీషియల్ విచారణ జరుగుతోంది. ఇక్కడి తప్పిదాలకు ఎవరు బాధ్యులో అది తేలుస్తుంది. ఇది కాకుండా అంచనాలు ఎందుకు తారుమారయ్యాయి, ఎస్కలేషన్ ఎంత..ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వ్యవహారంపై విచారణ మొదలు పెడితే అది ఇక్కడితో ఆగదు. మొత్తం ప్రాజెక్టే ముందుకెళ్లదు. అంచనాల పెంపులో అవకతవకలను విచారిస్తూ పోతే ఏ ప్రాజెక్టూ ముందుకు పోదు. ప్రభుత్వం కూడా పనులు చేయించలేదు. బిల్లులు ఇవ్వలేదు. ఒకవేళ పనులు కొనసాగిస్తే విచారణకు ఆదేశించాక కూడా ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. అప్పుడు ఇందులో ఏదో మతలబు ఉందని మీడియానే రాస్తుంది. అందుకే అంచనాలు, చెల్లింపుల జోలికి పోలేదు. మేడిగడ్డ అంశం తేలాక దానిపై ఆలోచిస్తాం..’ అని సీఎం వివరణ ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్పై విచారణ ‘రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారంలో నేనేమాత్రం జోక్యం చేసుకోవడం లేదు. దీనిపై ఇంతవరకు ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు. ఒకవేళ జోక్యం చేసుకున్నా ఇప్పటికిప్పుడు నాకు కానీ, పారీ్టకి కానీ దక్కే ప్రయోజనం ఏంటి? ఈ విషయంలో కోర్టు ఆదేశాల మేరకే విచారణ కొనసాగుతోంది. విచారణలో నిందితులు చెబుతున్న అంశాలు నేను కూడా పత్రికల ద్వారానే తెలుసుకుంటున్నా. ప్రతి చిన్న అంశంపై సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు? మా ప్రభుత్వం మాత్రం ఫోన్ ట్యాపింగ్ వంటి వెధవ పనులు చేయడం లేదు. లోక్సభ ఎన్నికల్లో పోలీసులు పారదర్శకంగా పనిచేశారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఇక్కడ పోలీసుల బదిలీలు జరగలేదు..’ అని ముఖ్యమంత్రి అన్నారు. కరెంట్ కోతల్లేవు..అంతరాయం మాత్రమే ‘రాష్ట్రంలో ఎక్కడా కరెంట్ కోతల్లేవు. చెట్లు పడిపోవడం, విద్యుత్ వినియోగం పెరగడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వల్ల అంతరాయాలు ఏర్పడ్డాయి తప్పితే ఎక్కడా కోతలు లేవు. తెలంగాణ రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యత పూర్తిగా అందెశ్రీకి ఇచ్చాం. ఆయన దానికి కీరవాణితో సంగీతం సమకూర్చుకుంటారో, మరొకరితోనో అనేది ఆయన ఇష్టం. తెలంగాణ చిహ్నంలో రాచరికపు పోకడలు ఉండకూదనేది మా ఉద్దేశం. దానికి అనుగుణంగానే కొత్త చిహ్నం ఉంటుంది..’ అని రేవంత్ చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా – సీఎం రేవంత్రెడ్డి వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: జూన్ 2న పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరు కానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం 10 జన్పథ్ నివాసంలో సోనియాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్ర దశాబ్ది వేడుకలకు రావాలంటూ ఆహ్వానించారు. సుమారు అరగంట సేపు జరిగిన సమావేశానంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. 4 కోట్ల ప్రజలకు సంతోషకరమైన వార్త ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా జరుపుతున్న ఉత్సవాల్లో సోనియా భాగస్వామ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ మేరకు తీర్మానం చేసింది. ఈరోజు సోనియాగాం«దీని కలిసి ఆహ్వానించాం. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. ఇది రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు సంతోషకరమైన వార్త. సోనియా గాంధీ పర్యటన, అవతరణ ఉత్సవాల కోసం కాంగ్రెస్ శ్రేణులంతా ఎదురుచూస్తున్నాం. రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు సోనియా గాం«దీని సత్కరించడం ద్వారా కృతజ్ఞత తెలియజేయాలని అనుకుంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోనియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ సముచిత గౌరవం ప్రజా పాలనలో చేసుకుంటున్న తొలి ఉత్సవాలు ఇవి. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వాముల్ని చేస్తాం. అందరినీ అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. వారందరికీ సముచితమైన గౌరవం దక్కుతుంది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాం..’ అని సీఎం తెలిపారు. కేసీ వేణుగోపాల్తో భేటీ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కూడా రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు. సుమారు 40 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. దీనికి ముందు తుగ్లక్ రోడ్డులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జరుగుతున్న మరమ్మతు పనులను రేవంత్ పరిశీలించారు. బంగ్లా మొత్తం కలియ తిరిగి అధికారులకు కొన్ని మార్పులు సూచించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం సోమవారం అర్ధరాత్రి కేరళ నుంచి ఢిల్లీకి వచ్చారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్కు వెళ్లారు. -
టాస్క్ఫోర్స్ కేంద్రంగా వసూళ్ల పర్వం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అగ్ర నాయకుల ఆదేశాల మేరకు, ఆ పార్టీ కోసం హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకి షన్రావు భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఏఎస్పీ నాయిని భుజంగరావు పోలీసుల ఎదుట వెల్లడించారు. నగరంలో ఆయనకున్న వనరులను అనుకూలంగా మార్చుకుని ఈ దందాలు చేసినట్లు నేరాంగీకార వాంగ్మూలంలో బయటపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ కేంద్రంగా సాగిన వ్యవహారాలను ఈ వాంగ్మూలా ల్లో పోలీసులు పొందుపరిచారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభా కర్రావు నాటి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్రావు పేర్లు చెప్పి సైబరాబాద్ పోలీసులను ప్రభావితం చేసినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకుల ఆదేశాల మేరకు పనిచేసిన రాధాకిష న్రావు టాస్క్ఫోర్స్ కార్యాలయంలో వ్యాపారులు, ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన సెటిల్మెంట్లు పెద్దఎత్తున చేశారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల నగదు రవాణాలోనూ రాధాకిషన్రావు కీలకంగా వ్యవహరించారు. దీనికోసం తన టాస్క్ఫోర్స్ను వినియోగించడంతోపాటు ప్రతిమ, యశోద ఆస్పత్రుల యజమానుల సహకారం తీసుకున్నాడు. 15 ఆపరేషన్లు చేసిన తిరుపతన్న టీమ్తనతోపాటు ప్రభాకర్రావు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ తిరుపతన్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్, సైబరాబాద్, రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ సహకారం తీసుకున్నారని భుజంగరావు వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నగదు పట్టుకోవడం కోసం ప్రత్యేక టీమ్తో పని చేశారు. ఇందులో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, పది మంది కానిస్టేబుళ్లు, మరో పది మంది హెడ్ కానిస్టేబుళ్లను నియమించుకున్నారు. తిరుపతన్న రోజూ గరిష్టంగా 40 ఫోన్లు ట్యాప్ చేశారు. తన కార్యాలయంలో మూడు సిస్టమ్స్తోపాటు తొమ్మిది లాగర్స్ను ఏర్పా టు చేసుకున్నారు. ఇలా వివిధ మార్గాల నుంచి వచ్చిన సమాచారంతో 15 ఫీల్డ్ ఆపరేషన్లు చేశారు. రేవంత్రెడ్డి మిత్రులు గాలి అనిల్కుమార్ నుంచి రూ.90 లక్షలు, కె.వినయ్రెడ్డి నుంచి రూ.1.95 కోట్లు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన రాఘవ ఇన్ఫ్రా నుంచి రూ.10.5 కోట్లు, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మిత్రు డు సీహెచ్ వేణు దగ్గర రూ.3 కోట్లు, జి.వినోద్కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి రూ.50 లక్షలు, ఉత్తమ్కుమార్రెడ్డి మిత్రుడు గిరిధర్ నుంచి రూ.35 లక్షలు, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి నుంచి రూ.90 లక్షలు, ఖమ్మంలో ఫెర్టిలైజర్ సంస్థ యజమాని నుంచి రూ.10 లక్షలు స్వాధీనం చేసు కోవడంలో తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు. -
ఫోన్ ట్యాపింగ్.. నేను అలాంటి పనులు చేయను: సీఎం రేవంత్
న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఫోన్ ట్యాపింగ్పై సమీక్ష జరపలేదని తెలిపారు. ప్రస్తుతానికి ఈ అంశాన్ని అధికారులే చూసుకుంటున్నారని పేర్కొన్నారు. హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారని, బ్యాకప్ డేటాకు సంబంధించిన హార్డ్ డిస్కులు ఫామ్ హౌస్ లో ఉందో ఎక్కడ ఉందో విచారించి అధికారులు తేల్చాల్సి ఉంది.అన్నింటికీ సీబీఐ విచారణ అడిగే హరీష్ రావు, కేటీఆర్.. ఫోన్ టాపింగ్ అంశాన్ని సీబీఐకి ఇవ్వాలని ఎందుకు అడగడం లేదని సీఎ రేవంత్ ప్రశ్నించారు.ఫోన్ ట్యాపింగ్తో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఫోన్ ట్యాపింగ్ చేయించడం లేదని, అలాంటి పనులు కూడా చేయనని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉందన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు..
-
బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ టీం ట్యాప్ చేసింది: రాధాకిషన్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు