ట్యాపింగ్‌ కేసు: ప్రభాకర్‌రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు | Telangana Phone Tapping Case: CBI Letter To Interpol Red Corner Notices | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ప్రభాకర్‌రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Published Fri, Sep 20 2024 8:23 AM | Last Updated on Fri, Sep 20 2024 9:51 AM

Telangana Phone Tapping Case: CBI Letter To Interpol Red Corner Notices

హైదరాబాద్‌, సాక్షి: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ ఐపీఎస్‌ ప్రభాకర్‌రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అమెరికాలో ఉన్న ఆయన్ని భారత్‌కు రప్పించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఇంటర్‌పోల్‌కు సీబీఐ లేఖ రాసింది.

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో  ఏ1 నిందితుడిగా ప్రభాకర్‌రావు ఉన్న సంగతి తెలిసిందే.  ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ అయిన ప్రభాకర్‌రావు.. ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిన టైంలోనే విదేశాలకు వెళ్లిపోయారు. విచారణ నిమిత్తం రావాలన్నా.. సహకరించడం లేద దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీకి సీబీఐ అనుమతి ఇచ్చింది. 

తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, విచారణ నుంచి తనకు ఊరట కావాలని ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ.. నాంపల్లి కోర్టు అందుకు అనుమతించలేదు. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సిట్‌, తెలంగాణ సీఐడీ సాయంతో సీబీఐని ఆశ్రయించింది. దీంతో.. జాతీయ దర్యాప్తు సంస్థ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీకి సీబీఐ అనుమతించింది. 

ప్రభాకర్‌రావుతో పాటు ఐన్యూస్‌ ఛానల్‌ ఎండీ శ్రవణ్‌ కుమార్‌పైనా రెడ్‌ కార్నర్‌ నోటీసులకు అనుమతి జారీ చేసింది. త్వరలో ఇంటర్‌పోల్‌ వీళ్లిద్దరినీ రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయనుంది. అదే జరిగితే.. వాళ్లను భారత్‌కు రప్పించడం సులువు అవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement