
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో నాగుల పంచమి రోజున అరుదైన దృశ్యం వెలుగు చూసింది. గ్రామ శివారులోని బొమ్మన వేణి మల్లయ్య వ్యవసాయ పొలంలో రెండు సర్పాలు సయ్యాటలాడాయి. రెండు గంటలపాటు ప్రకృతి ఒడిలో పరవసించి పోయాయి. పాముల సయ్యాటను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. ఆసక్తిగా తిలకించారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
(నెటిజనుల ఆగ్రహం.. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్)
Comments
Please login to add a commentAdd a comment