snake
-
ఢిల్లీ ఎయిర్పోర్టులో పాముల బ్యాగు కలకలం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు(Indira Gandhi Airport)లో కలకలం చెలరేగింది. కస్టమ్స్ అధికారులు అరుదైన జీవ జాతులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ ఉదంతంలో ముగ్గురు భారత పౌరులను అదుపులోనికి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే నిన్న(శనివారం) రాత్రి బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానం ఏఐ 303లో ముగ్గురు ప్రయాణికులు అరుదైన జీవ జాతులను అక్రమంగా భారతదేశానికి తీసుకువచ్చారు. వీరి బ్యాగులను చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు(Customs officials) షాక్ తిన్నారు. ఆ బ్యాగులో పాములు, బల్లులు, కప్పలు, కీటకాలతో పాటు అంతరించిపోతున్న కొన్ని జీవ జాతులు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ జీవ జాతులను వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ అథారిటీకి అప్పగించారు. గతంలోనూ ఢిల్లీ ఎయిర్పోర్టులో ఇటువంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయి.ఇది కూడా చదవండి: రోడ్డెక్కిన అత్తాకోడళ్లు.. చూసి తీరాల్సిందే! -
శివాలయంలో అనుకోని అతిథి
-
అక్కడ స్నాక్గా స్నేక్లు..!
మాములుగా మన దేశంలో చిరుతిండిగా వీధి స్టాల్స్లో సమోసాలు, బజ్జీలు, పకోడిలు నోరూరించేలా కనువిందు చేస్తుంటాయి. కానీ ఈ దేశంలో స్నాక్గా ఏం ఉంటాయో తెలిస్తే వామ్మో అని నోరెళ్లబెడతారు. మనిషికి అత్యంత హానికరమైన దాంతోనే వంటకం, అదే అక్కడ ఫేమస్ కూడా. ఇంతకీ ఏంటా రెసిపీ అంటే..ఫుడ్ వ్లాగర్లు(Food vloggers) ఇతర దేశాల్లో ఉండే వైవిధ్యభరితమైన వంటకాల విశేషాల గురించి చెప్పడమే గాక ఆసక్తిని రేకెత్తిస్తుంటారు. అలానే ఒక భారతీయ వ్లాగర్ తన ఇండోనేషియా(Indonesia) పర్యటనలో వీధి దుకాణల్లో అమ్మే ఫేమస్ వంటకాన్ని గురించి తెలసుకుని కంగుతిన్నాడు. చిరుతిండిగా క్రోబ్రా(cobra)తో చేసిని వంటకాన్నే తింటారట. ఆ వంటకం అంటే అక్కడ పడిచస్తారట. అందుకు తగ్గట్టుగానే వరుస దుకాణాల్లో బోనుల్లో అప్పటికప్పుడు తాజాపాముతో ఈ వంటకాన్ని రెడీ చేయడం తదితరాలను చూసి నోటి మాట రాలేందుంటూ అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ముఖ్యంగా ఆ వంటకం కోసం క్యూలో నిలబడటం చూసి మతిపోయిందని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు ఫుడ్ వ్లాగర్. అంతేకాదండోయ్ ఇండోనేషియ వాసులు కోబ్రాతో చేసిన వంటక తినడం వల్ల చర్మఆరోగ్యానికి, వ్యాధి నిరోధక శక్తినికి మంచిదని బలంగా నమ్ముతారట. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడమే గాక దాదాపు 4 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అక్కడ పప్పు, బియ్యంతో వంటలు ఎలా వండాలో నేర్పిస్తానని ఒకరూ, మనిషి కంటే ప్రమాదకరమైన జంతువు ఇంకొకటి లేదని మరొకరు రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Akash Chaudhary (@kaash_chaudhary) (చదవండి: న్యూ ఇయర్ పార్టీ జోష్: ఫస్ట్ డే తలెత్తే హ్యాంగోవర్ని హ్యాండిల్ చేయండిలా..!) -
అంగన్వాడీ కేంద్రంలో పాము కలకలం
అన్నానగర్: పర్వతాలతో కూడిన కృష్ణగిరి జిల్లాలో తేన్కనికోట అంతెవనపల్లి కొండ గ్రామం ఉంది. ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో గురువారం పాము కలకలం సృష్టించింది. పిల్లలు కేంద్రంలో ఆడుకుంటున్న సమయంలో ఒక్క సారిగా పాము కనిపించడంతో సిబ్బంది చిన్నారులను బయటకు పంపించి తెన్కనికోట్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు పామును పట్టుకుని అడవుల్లోకి వదిలేశారు. -
పాము గుడ్లు కూడా విషపూరితమేనా? తింటే ఏమవుతుంది?
పాము.. ఈ మాట వినగానే చాలామంది భయపడిపోతుంటారు. కొందరు పామును చూస్తే వణికిపోతారు. పాము సంగతి పక్కనుంచి దాని గుడ్లు విషయానికొస్తే పలువురిలో అనేక అనుమానాలున్నాయి. పాము గుడ్లు తినవచ్చా? లేదా అనేదానిపై చర్చలు కూడా సాగుతుంటాయి.మన దేశంలో కోడి గుడ్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. చాలా రకాల ఆహారాలలో గుడ్లను విరివిగా వాడుతుంటారు. అలాగే బాతు, ఉష్ట్రపక్షి గుడ్లను కూడా తింటుంటారు. వీటి గుడ్లను తిన్నప్పుడు మరి పాము గుడ్లు తింటే ఏమవుతుంది? దీనికి మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ నివాసి, స్నేక్ క్యాచర్ మహదేవ్ పటేల్ సమాధానం తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన పాము గుడ్లను మనిషి తినడం అనేది అసాధారణమైన ఘటన అని, ఎవరైనా పాము గుడ్డు తింటే, పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన తెలిపారు. పాము గుడ్లలో బ్యాక్టీరియా లేదా పరాన్నజీవులు ఉంటాయని, ఇవి ఫుడ్ పాయిజనింగ్ లేదా ఇన్ఫెక్షన్కు కారణమవుతాయని మహదేవ్ పటేల్ వివరించారు.సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా పాము గుడ్లలో ఉంటుందని, ఇది ఆహారాన్ని కలుషితం చేస్తుందన్నారు. పాము గుడ్లు తినడం వల్ల అలెర్జీ వస్తుందని, ఇది చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస సమస్యలు లేదా అనాఫిలాక్సిస్ లాంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందన్నారు. పాము గుడ్లలో విషం ఉండదని, అందుకే వాటిని తిన్న వ్యక్తి మరణించడని మహదేవ్ తెలిపారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పాముల గుడ్లలో విషం ఉండదు, ఎందుకంటే పాము కోరల వెనుక ఉన్న గ్రంధులలో విషం తయారవుతుంది. ఇది గుడ్డు దశలో ఏర్పడదు. పాము గుడ్లు తినడం వల్ల మనిషి శరీరంలోకి విషం ప్రవేశించే అవకాశాలు చాలా తక్కువ.భారతదేశంలో పాములను పూజిస్తారు. అందుకే దాని గుడ్లు తినడం అనే ఆలోచన చేయరు. అయితే విదేశాల్లో పాము గుడ్లు తింటుంటారు. అక్కడివారు పాము గుడ్లను తినాలనుకున్నప్పుడు వాటిని బాగా ఉడికిస్తారు. తద్వారా దానిలోని బ్యాక్టీరియా, పరాన్నజీవులు నాశనమవుతాయి. మరోవైపు పాము గుడ్లు తినడం సాధ్యమేనని, వాటిలో పోషక విలువలు ఉంటాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. అయితే పాము గుడ్డులోని బ్యాక్టీరియా కారణంగా అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాగా భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులకు హాని కలిగించడం శిక్షార్హమైన నేరమని మహదేవ్ పటేల్ తెలిపారు.ఇది కూడా చదవండి: ‘ఇండియా’కు ఎవరు బెస్ట్? రాహుల్.. మమత బలాబలాలేమిటి? -
Tirumala: తిరుమలలో 8 అడుగుల నాగుపాము
తిరుమల: తిరుమలలో మంగళవారం 8 అడుగుల నాగుపాము స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. తిరుమలలో స్థానికులు నివాసముంటున్న బీ–టైపు 23వ క్వార్టర్స్ ప్రాంతంలో నాగుపాము వచ్చింది. స్థానికులు టీటీడీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు చాకచక్యంగా పామును పట్టుకు అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. -
HYD: ఎయిర్పోర్టులో పాముల కలకలం
సాక్షి,హైదరాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి.సోమవారం(నవంబర్ 25) బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు మహిళల దగ్గర పాములున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.దీంతో మహిళల బ్యాగులను తనిఖీ చేసిన సిబ్బంది వారి నుంచి విషపూరితమైన పాములను స్వాధీనం చేసుకున్నారు. పాములను స్మగ్లింగ్ చేస్తున్నారా లేక దీని వెనుక ఇంకేదైనా వ్యవహారం ఉందా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: పోలీసులకు మహిళ బెదిరింపులు -
10 రోజులుగా ఆటబొమ్మలో నాగుపాము
భువనేశ్వర్: ఆటబొమ్మలో నాగుపాము బుసలు కొడుతూ భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన పూరీ జిల్లా సత్యబాది గ్రామంలో చోటుచేసుకుంది. పెరటి తోటలో వింత శబ్దం రావడంతో వెళ్లిన యజమాని ప్లాస్టిక్ ఆటబొమ్మను పరిశీలించగా నాగు పాము ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే స్నేక్ హెల్ప్ లైనుకు సమాచారం అందించడంతో కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజబండ్రీ అధ్యాపకుడు డాక్టరు ఇంద్రమణి నాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందం శస్త్ర చికిత్స పరికరాలతో చేరుకుని పాముని విడుదల చేశారు. సుమారు 10 రోజులుగా ఆహారం లేక నీరసించిన పాము వైద్య సంరక్షణలో పూర్తిగా కోలుకున్నాక అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని చెప్పారు. -
సీపీఆర్ చేసి పాము ప్రాణాలు కాపాడిన యువకుడు.. వీడియో వైరల్
ఈ మధ్య కాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు బాధితులను కాపాడేందుకు ఉన్న తక్షణ మార్గం సీపీఆర్. ఈ అత్యవసర చికిత్స ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రాణాపాయంలో ఉన్న వారికి సీపీఆర్ చేసిప్రాణాలను నిలుపుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా, గుజరాత్ వడోదరలో ఓ వ్యక్తి ఇలానే ప్రాణాపాయంలో ఉన్న పాముకు సీపీఆర్ చేసి దాని ప్రాణాలు నిలపాడు. నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న నిజంగానే జరిగింది. వివరాలు.. బృందావన్ చౌరస్తాలో రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో ఉన్న పామును గుర్తించిన కొందరు జంతు సంరక్షణ కార్యకర్తలకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న బృందం దానికి సీపీఆర్ చేయాలని నిర్ణయించింది. వెంటనే యశ్ తాడ్వి అనే యువకుడు నిర్జీవంగా పడివున్న పాముపిల్లను చేతుల్లోకి తీసుకున్నాడు. దాని ప్రాణాలు పోలేదని నిర్ధారించుకున్న అతడు వెంటనే దానికి నోటితో శ్వాస అందిస్తూ సీపీఆర్ చేశాడు. పాము నోరు తెరిచి నోటిలోకి మూడు నిమిషాలు ఊది స్పృహలోకి తీసుకురావడానికి యత్నిచాడు.మొదటి రెండు ప్రయత్నాలలో సీపీఆర్ ఇచ్చినా, దాని పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. మూడోసారి పాములో చలనం వచ్చింది. CPR to the snake with his mouth and unconscious snake back to life.This video going viral on social media from Vadodara, Gujarat, India#CPR #Life #Viral #India pic.twitter.com/VZXEOuTXKz— Chaudhary Parvez (@ChaudharyParvez) October 17, 2024 ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు యశ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. -
కలలో పాములు కనిపిస్తే దేనికి సంకేతం ?
నాకు తరచు కలలో పాములు కనిపిస్తుంటాయి. ఇది దేనికి సంకేతం?కలలో పాములు కనిపిస్తున్నాయని మీరు ఆందోళన పడనక్కరలేదు. ఇది శుభానికే సంకేతం. మీకు త్వరలో ఆకస్మిక ధన ్రపాప్తి కలగబోతోందనడానికి సూచన అది. అంతేకాదు, మీకు సంతానం కలగబోతోందనడానికి కూడా సంకేతం కావచ్చు. సాధారణంగా కలలో పాములు కనిపించడం అనేది తీరని కోరికలకు సంకేతం. ఒకోసారి ఆ కోరికలు కార్యరూపం దాల్చబోతున్నాయనడానికి కూడా సూచికగా తీసుకోవచ్చు.దిష్టి తీయడానికి ఎర్రనీళ్లనే ఎందుకు ఉపయోగిస్తారు?వివాహాది శుభకార్యాలలో, నూతన వధూవరుల గృహప్రవేశ సమయంలోనూ, ఇంటిలో ఎవరైనా జబ్బుపడి లేచి స్వస్థత చేకూరి ఇంటికి వచ్చేటప్పుడూ ఎర్రనీళ్లతో దిష్టితీస్తారు. పసుపు, సున్నం నీళ్లు కలిపితే ఎర్రనీళ్లు తయారవుతాయి. ఈ ఎర్రనీళ్లను పళ్లెంలో పోసి దిష్టి తీస్తారు. ఆ నీళ్లను ఎవరూ తొక్కనిచోట పారబోస్తారు. గృహప్రవేశానికి ముందు తియ్యగుమ్మకు చిన్న రంధ్రం చేసి పారాణి ముద్దను ఉంచుతారు. దాన్ని దిష్టితీసి పగలగొడతారు. కొంతమంది ఎండుమిరపకాయలతో, మరికొందరు నూనెలో తడిపి వెలిగించిన గుడ్డపీలికలతోటీ దిష్టి తీస్తారు. ఘాటైన పదార్థాలు, ఎర్రని వస్తువులు దిష్టిని పోగొట్టడంలో శక్తిమంతంగా పని చేస్తాయని ఇలా చేస్తారు.ఇంటిలోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?తులసి చెట్టు, నిమ్మ, వేప వంటివి ఇంటిలోకి దుష్టశక్తులను రానివ్వకుండా చేస్తాయని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా దిష్టి తగలకుండా ఉండడం కోసం వాకిలి వద్ద కొంతమంది బూడిద గుమ్మడి కాయలు కట్టుకుంటారు. అదేవిధంగా పటికను ఎర్ర లేదా నల్లటి వస్త్రంలో మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తారు. ఇష్టదైవానికి సంబంధించిన చిన్న పటాలను గుమ్మానికి తగిలించడం కూడా మంచిదే. -
ఎగిరే పామును చూశారా..?
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఏజెన్సీ ప్రాంత ప్రజలు కూడా ఎన్నడు చూడని అరుదైన పాము పాడేరులో కనిపించింది. స్థానిక చాకలిపేటలో ఉపాధ్యాయుడు ఒంపురి కేశవరావు ఇంటి రెండో అంతస్తులోని వంటగదిలో నలుపు ఎరుపు, గోల్డ్ రంగుల మిశ్రమంలో రింగ్లుగా ఉన్న ఈ పామును చూసి స్థానికులంతా భయాందోళన చెందారు. స్థానికుల ఫోన్తో వచ్చిన స్నేక్ క్యాచర్ బండారు వాసు చాకచక్యంగా పామును పట్టుకున్నారు. మూడున్నర అడుగులున్న ఈ పాము ఒరంటే ఫ్లయింగ్ స్నేక్ అని వాసు తెలిపారు. ఎగిరే స్వభావంగల ఈ పాము అడవుల్లో రాత్రిళ్లు ఎక్కువగా సంచరిస్తుందని చెప్పారు. ఆ పామును ఆయన పాడేరు ఘాట్లోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
పాముకాటు వీరులు
1960లలో నా భర్త రోమ్ తన స్నేహితులుతో కలిసి ఫ్లోరిడాలోని "ఎవర్ గ్లేడ్" అనే నీటితో నిండిన గడ్డి మైదాన ప్రాంతంలో పాములను వెతుకుతూ వెళ్లేవారు. ఒకసారి తన స్నేహితుడు షూబెర్ట్ తో కలిసి వెళ్ళినప్పుడు వారికి ఒక మోకాస్సిన్ అనే నీటి పాము నీటిలో తేలుతున్న దుంగపై కనిపించింది. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో ఆ దుంగ నీటిలో మునిగిపోబోయింది. ఎక్కడ ఆ పాము నీటిలోకి తప్పించుకుని వెళ్లిపోతుందో అనే కంగారులో రోమ్ ఆ పాముని చేత్తో పట్టుకుని సంచిలో పెట్టేసాడు. ఆ పాముని సంచిలో పెట్టాక నింపాదిగా "షూబెర్ట్ ఆ పాము నన్ను కరిచింది !" అని అసలు విషయం చెప్పాడు. ఆ విషయం విన్న షూబెర్ట్ ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా "అవి అంతే అప్పుడప్పుడు ఆలా కరుస్తుంటాయి!" అని చాలా తేలికగా అనేశాడు. కాసేపటికి రోమ్ చెయ్య వాసిపోయేసరికి వారు ఆరోజుకి పాములను వెతకటం ఆపేసి ఇంటికి వెళ్లిపోయారు. షూబెర్ట్ మాత్రం రోమ్ చేసిన పని వలన తను ఆ రోజంతా పాములను చూసే మంచి అవకాశం కోల్పాయానని నసుగుతూనే ఉన్నాడు.రోమ్ బాస్ బిల్ హాస్ట మాత్రం ఎంతో అయిష్టంగానే రోమ్ కు మరుసటి రోజు సెలవు తీసుకొనిచ్చాడు. మిగిలిన మిత్రులైతే - "ఆయన ఇంకా నేర్చుకుంటున్నట్టు ఉన్నాడు!", "అమ్మాయిల్ని ఆకట్టుకుందామని అనుకుంటున్నాడా ఏంటి ఈ మూర్ఖుడు!" అనే అన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ తన పని చేస్తున్నప్పుడు చిన్న షాక్ కొడితే తన తోటి ఎలక్ట్రీషియన్ వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో, అలాగే తన సహోద్యోగులు కూడా స్పందించారు. తన పని సరిగ్గా ఎలా చెయ్యాలో తెలియని వాడు అని వారి ఉద్దేశం. మరొకసారి అట్టిల అనే మా స్నేహితుడు తన ఇంటివద్ద పెంచుకుంటున్న పాము నీటి గిన్నె మార్చబోతుంటే, ఆ పాము అతని చేతిపై కాటువేసింది. ఈ సారి రోమ్ కొంత విచక్షణతో "నువ్వు ఆ పాముని ఇంకో సంచిలోనో లేక పెట్టెలోనో ఎందుకు పెట్టలేదు? " అని అడిగాడు. "ఆ పాము మరొక వైపు చూస్తుంది కదా ఈ లోపల నేను చటుక్కున నీరు మార్చేద్దామని అనుకున్నా!" అన్నాడు అట్టిల . ఆ మాట విన్న స్నేహితులంతా , ఒక పక్క నొప్పితో అట్టిల బాధపడుతున్నా అతని అవివేకానికి విరగబడి నవ్వేశారు. చివరకి ఎవరో అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు అనుకోండి. పాములను పట్టుకుని వాటిని రక్షించే వారు (స్నేక్ క్యాచర్స్ ) పాము కాటుకి గురైతే అది వారి తప్పే అవుతుంది తప్ప పాముది కాదు! ఆ పాముని పట్టుకునే వ్యక్తి నిర్లక్ష్యం వలనో లేక కోసం ఏదో హడావిడి చేద్దాం అనే వారి ఉద్దేశం వలనే ఇలా పాముకాటుకు గురవుతారని రోమ్ మరియు అయన స్నేహితులకి 1960ల నుండి ఉన్న అభిప్రాయం. ఈ అభిప్రాయం రీల్స్ / వీడియో లైక్స్ మోజులో ఉన్న ఈ తరానికి కూడా వర్తిస్తుంది. ఈ ఉద్దేశంతోనే ఆలా ఎవరైనా పాములను రక్షించేవారు పాము కాటుకు గురైతే మాత్రం వారిని నిర్దాక్షిణంగా ఆటపట్టిస్తుంటారు. అనుకోకుండా పాముకాటుకు గురైన సాధారణ జనాలకి మాత్రం ఇది వర్తించదులెండి. ఒక రకంగా ఇలాంటి సహచరులను మందలించే సాంప్రదాయమే వారిని నిర్లక్షానికి అవకాశమివ్వకుండా పని చేస్తూ, ఈ రోజుకి జీవించి ఉండేటట్లు చేసింది అనేది నా అభిప్రాయం.కానీ మన దేశంలో అనేక స్నేక్ క్యాచర్స్, అందులోని ముఖ్యంగా యువకులు, వారు పాముకాటుకు గురైన సందర్భాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కొంతకాలం క్రిందట ఒక కుర్రవాడు పల్చటి సంచిలో త్రాచుపామును పట్టుకుని ముడి వేయబోతుంటే, ఆ పాము పల్చటి సంచిలో నుండి కాటు వేసింది. అతను కొన్ని రోజుల హాస్పిటల్లో ఉండగా ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్లంతా అలవాటుగా పరామర్శకు వచ్చారు. ఆ కుర్రాడు ఇదేదో తాను చేసిన ఘనకార్యం వలనే అనుకుని పొంగిపోయాడే తప్ప ఒక్కసారి కూడా ఈ అనుకోని ప్రమాదం ఎందుకు జరిగిందో ఆలోచించలేదు. తన ఘనకార్యం గురించి అనేక సార్లు మాట్లాడుతుంటే, ఒకసారి రోమ్ "అసలు ఇందులో తప్పు ఎవరిది?" అని అడిగాడు . ఆ కుర్రాడైతే కచ్చితంగా సమాధానం చెప్పలేకపోయాడు కానీ తన తప్పయితే ఏమి లేదని బుకాయించాడు. దానికి రోమ్ " నువ్వు సరైన బ్యాగ్ వాడినట్లైతే ఆ పాము నిన్ను కాటు వేసి ఉండేది కాదు కదా!" అని అడిగితే అటు నుండి సమాధానమే లేదు. నేను మా "మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్" మాసపత్రికలో ప్రచురించడం కోసం వ్యాసాలు అడిగితే అనేక మంది తమ పాముకాటు అనుభవం గురించి రాసి పంపారు. ఆలా వచ్చిన వాటిల్లో ఓక వ్యాసం శీర్షిక "నా సాహస పతకం" అని రాసి పంపారు. నాకైతే దాన్ని "నా అజ్ఞాన పతకం" అని మార్చాలని అనిపించింది. ఇలా పాముకాటు నుండి బతికి బయటపడ్డవాళ్లు గమనించని విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి - వారిని కాటేసిన పాముకాటులో ఎంత విషం ఉంది , రెండవది - వారిని కాపాడిన డాక్టర్ ప్రతిభ. ఈ రెండు కారణాలతో వారు బహుశా బ్రతికి బయపడి ఉండవచ్చు. "పాము పోకరీలు" అనే మేము ముద్దుగా పిలిచే ఇలాంటి వారు తమ పాముకాటు సంఘటన ఏదో తమ ప్రతిభ అన్నటు మాట్లాడతారు కానీ అది వారి తెలివితక్కువతనం అని తెలుసుకోవట్లేదు. ఒక వండ్రంగి మేకుని కొట్టబోతే ఆ సుత్తి గురితప్పు వేలుకి తగిలి రక్తం వస్తే, అదేదో తన ప్రతిభ వల్లే అయ్యింది అని అనుకున్నట్లు ఉంటుంది వీరి ప్రవర్తన. పాములను పట్టుకుని రక్షించే మీ స్నేక్ క్యాచర్ స్నేహితులు ఎవరైనా పాముకాటు నుండి కోలుకుని బ్రతికి బయటపడితే మీరు మాత్రం దయచేసి వారిని పరామర్శించడానికి వెళ్లి ఆహా ఓహో అని మాత్రం వారిని పొగడకండి! -రచయిత, ఫోటోలు : జానకి లెనిన్-అనువాదం : చంద్ర శేఖర్ బండి -
Snake Fruit: స్నేక్ ఫ్రూట్!
‘స్నేక్ ఫ్రూట్’ లేదా సలక్ ఫ్రూట్. శాస్త్రీయ నామం సలక్క జలక్క. అరెకేసియే కుటుంబం. ఈత, ఖర్జూర వంటి పామ్ జాతికి చెందిన ఒక రకం. ఇండోనేషియాలోని జావా, సుమత్ర ప్రాంతం దీని పుట్టిల్లు. ఇండోనేషియా, మలేషియా, థాయ్లాండ్ వంటి ఈశాన్య ఆసియా దేశాల్లో విస్తారంగా సాగులో ఉన్న పండు. లేత కాఫీ రంగులో ఉండే ఈ పండు పైన పోలుసు పాము చర్మంపై పోలుసులను పోలి ఉంటుంది. అందుకే కాబోలు, దీనికి స్నేక్ ఫ్రూట్ లేదా స్నేక్ స్కిన్ ఫ్రూట్ అంటారు. పండిన అంజూర పండు సైజులో, అదే ఆకారంలో స్నేక్ ఫ్రూట్ ఉంటుంది. పైపోర పెళుసుగా ఉంటుంది. పైపోరను ఒలిస్తే లోపల తెల్లటి రెబ్బలు (వెల్లుల్లి రెబ్బల మాదిరిగా) ఉంటాయి. వాటి లోపల గోధుమ రంగు గింజలు ఉంటాయి. గింజలు తీసేసి ఈ రెబ్బల్ని తినాలి. రుచి గమ్మత్తుగా, విలక్షణంగా ఉంటుంది. ద ఫ్యూచర్ ఆఫ్ ద హెల్త్ అని, సూపర్ హీరోస్ ఆఫ్ ఫంక్షనాలిటీ అని దీన్ని వ్యవహరిస్తుంటారు. సలక్కు ఇంకా చాలా పేర్లున్నాయి. ఇండోనేషియాలో పోందో, థాయ్లాండ్లో రకం, చైనాలో సలక లేదా షి పై గ్యో జాంగ్, మయన్మార్లో ఇంగన్ అని పిలుస్తున్నారు. న్యూ గినియ, ఫిలిప్పీన్స్, క్వీన్స్లాండ్, ఉత్తర ఆస్ట్రేలియా, పోనపె ఐలాండ్ (కారోలిన్ అర్చిపెలాగో), చైనా, సూరినామ్, స్పెయిన్, ఫిజి తదితర దేశాల్లో స్నేక్ ఫ్రూట్ను సాగు చేస్తున్నారు. ఇండోనేషియాలోని ఇతరప్రాంతాల్లో దీన్ని ఆహార పంటగా సాగు చేస్తున్నారు.20 అడుగుల ఎత్తుస్నేక్ ఫ్రూట్ చెట్టుకు కాండం చాలా చిన్నది. అయితే, కొమ్మలు పెద్దగా 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ప్రతి కొమ్మకు ముళ్లతో కూడిన 2 మీటర్ల పోడవైన తొడిమె ఉంటుంది. ముల్లు 6 అంగుళాల వరకు పోడవుంటుంది. కొమ్మకు చాలా ఆకులుంటాయి. ఈ చెట్టు కాండానికి కాయలు గెలలుగా కాస్తాయి. ఆకు అడుగున లేత ఆకుపచ్చగా, పైన ముదురు ఆకుపచ్చగా ఉంటుంది. స్నేక్ ఫ్రూట్ మొక్క నాటిన తర్వాత 3–4 ఏళ్లలో కాపుకొస్తుంది. ఇప్పుడు ముళ్లు లేని వంగడాలు కూడా వచ్చాయి. ఆడ చెట్లు, మగ చెట్లు ఉంటాయి. కొన్ని రకాల స్నేక్ ఫ్రూట్ చెట్లలో (ఉదా.. సలక్ బాలి) ఆడ, మగ పూలు రెండూ ఒకే చెట్టుకు పూసి స్వపరాగ సంపర్కం చెందుతాయి. పూలు గుత్తులుగా పూస్తాయి. ఆడ పూలు 20–30 సెం.మీ., మగవి 50–100 సెం.మీ. పోడవు ఉంటాయి. పరాగ సంపర్కం కోసం మగ పూలలో 20%ని మాత్రమే ఉంచి, మిగతావి తొలగించాలి. మనుషులు చేతులతో పరాగ సంపర్కం చేయిస్తే పండ్ల దిగుబడి పెరుగుతుంది.తీపి కాదు, వగరుసలక్క చెట్ల రకాలు 21 జాతులున్నాయి. మలేషియాలో మూడు రకాలను పెంచుతున్నారు. ఎస్.గ్లాబెరెసెన్స్, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన. ఎస్. గ్లాబెరెసెన్స్ను లోకల్ సలక్గా భావిస్తారు. దీని నుంచి 9 క్లోన్స్ను తయారు చేశారు. ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలు ఇండోనేషియా నుంచి మలేషియాకు వచ్చాయి. ఇక ఇండోనేషియాలో దేశీయ, విదేశీ మార్కెట్ల కోసం వాణిజ్యపరంగా ఎస్. జటక్క, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలను సాగు చేస్తున్నారు. మనోంజయ, బొంగ్కాక్, బంజార్నెగర, కొండెట్, పోందో, బాలి, ఎన్రెంకంగ్, సైడెంపుయన్ వంటి అనేక రకాల స్నేక్ ఫ్రూట్ వంగడాలు సాగులో ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్ తియ్యని పండు కాదు, కొంచెం వగరు. బోంగ్కాక్ రకం పండు మరీ ఎక్కువ వగరు. మిగతా రకాల కన్నా తక్కువ తీపి కలిగి ఉంటుంది.పుష్కలంగా పోషకాలుస్నేక్ ఫ్రూట్లో ఇతర పండ్లతో పోల్చినప్పుడు అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సుక్రోజ్ (7.6 గ్రా/100 గ్రా.), ఫ్రక్టోజ్ (3.9 గ్రా/100 గ్రా.), టోటల్ సుగర్ (17.4 గ్రా./100 గ్రా.), జీర్ణమయ్యే పీచు (0.3 గ్రా./100 గ్రా.), జీర్ణం కాని పీచు (1.4 గ్రా./100 గ్రా.), టోటల్ డైటరీ ఫైబర్ (1.7 గ్రా./100 గ్రా.), నీరు (80గ్రా./100 గ్రా.), కేలరీలు (77 కిలోకేలరీలు/ 100 గ్రా.),ప్రోటీన్ (0.7గ్రా./100 గ్రా.), బూడిద (0.6గ్రా./100 గ్రా.), కొవ్వు (0.1 గ్రా./100 గ్రా.). ఉన్నాయి. సహజ పీచు, సుగర్స్కు స్నేక్ ఫ్రూట్ చక్కని వనరు. దీని గుజ్జులో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఫాస్ఫరస్ (1161 ఎంజి/కేజీ), పోటాషియం (11.339 ఎంజి/కేజీ), కాల్షియం (220 ఎంజి/కేజీ), మెగ్నీషియం (607 ఎంజి/కేజీ), సోడియం (231 ఎంజి/కేజీ), ఐరన్ (12.0 ఎంజి/కేజీ), మాంగనీసు (10.4 ఎంజి/కేజీ), రాగి (3.36 ఎంజి/కేజీ), బోరాన్ (5.07 ఎంజి/కేజీ), సల్ఫర్ (5.07 ఎంజి/కేజీ), అస్కార్బిక్ ఆసిడ్ (400 ఎంజి/కేజీ), కెరోటిన్ (5 ఎంజి/కేజీ), థయామిన్ (20 ఎంజి/కేజీ), నియాసిన్ (240 ఎంజి/కేజీ), రిబోఫ్లావిన్ (0.8 ఎంజి/కేజీ), ఫొలేట్ (6 ఎంజి/కేజీ) మేరకు ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్లో ఆరోగ్యదాయకమైన పీచు, పిండి పదార్థం నిండుగా ఉన్నాయి. ఇతర విదేశీ పండ్లతో పోల్చితే దీని గుజ్జులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ పండును నేరుగా తినొచ్చు లేదా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. డ్రైఫ్రూట్స్, పచ్చళ్లు, చిప్స్, ఊరబెట్టి కూడా వాడుకుంటున్నారు. పోందో (ఇండోనేషియన్ సలక్) రకం లేత కాయలను గింజలతో సహా తినొచ్చు. స్నేక్ ఫ్రూట్ ఆకులను, రెమ్మలను కూడా చాపలు, బుట్టల అల్లికకు వాడుతున్నారు.50 ఏళ్ల పాటు దిగుబడిస్నేక్ ఫ్రూట్ను విత్తనాలతో మొక్కలు పెంచి నాటుకోవాలి. అయితే, 50% మాత్రమే ఆడ మొక్కలు వస్తాయి. పండు నాణ్యత ఒకే స్థాయిలో ఉంటుంది. తల్లి మొక్క లక్షణాలు పూర్తిగా రావాలంటే మాత్రం పిలకలు నాటుకోవాలి. 6–12 నెలల వయసు మొక్కను పైన ఆకుల నుంచి కింది వేర్ల వరకు నిలువుగా చీల్చి నాటుకోవచ్చు. పిహెచ్ 4.7 – 7.5 వరకు తట్టుకుంటుంది. లేత మొక్క నీడలో బాగా పెరుగుతుంది. వాణిజ్యపరంగా సాగయ్యే తోటల్లో కొబ్బరి, డ్యూరియన్ చెట్ల నీడన ఈ మొక్కల్ని పెంచుతుంటారు. నాటిన 3–4 ఏళ్లకు కాపు ్రపారంభం అవుతుంది. ఈ చెట్టు 50 ఏళ్ల పాటు హెక్టారుకు 5–15 టన్నుల పండ్ల దిగుబడినిస్తుంది. ఏటా నాలుగు సార్లు పూత వచ్చినప్పటికీ ఏప్రిల్ – అక్టోబర్ మధ్యలోనే పండ్లు వస్తాయి. మొక్కలు 60–70 సెం.మీ. ఎత్తు పెరిగిన 5–7 నెలల తర్వాత నాటుకోవాలి. గుంతలు 40“40“40 సెం.మీ. సైజులో తవ్వాలి. 1.5 “ 3 మీటర్ల నుంచి 2 “ 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. కొమ్మకత్తిరింపు, కలుపు తీత ప్రతి రెండు నెలలకోసారి చేస్తే పూత బాగా వస్తుంది. సరిగ్గా లేని లేదా పాడైన పండ్లను ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. గుత్తికి 20–25 పండ్లు ఉంటే దిగుబడి లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా వర్షాధారంగానే పెరుగుతుంది. కొమ్మ కత్తిరించినప్పుడు, పండ్లు ఎదుగుతున్న దశలో, వేడి సీజన్లలో నీరు అందించాలి. పూత దశలో, పండ్ల కోతకు ముందు రోజుల్లో తగుమాత్రంగా నీరివ్వాలి. ఎక్కువ నీరిస్తే కుళ్లిపోతాయి. వాణిజ్యపరంగా సాగు చేసే తోటల్లో అధిక దిగుబడి కోసం కూలీలతో పోలినేషన్ చేయిస్తారు. పువ్వు గట్టిపడితే పోలినేషన్ సక్సెస్ అయ్యిందని గుర్తు. మెత్తగానే ఉండిపోతే ఫెయిలైనట్లు గుర్తించి తొలగిస్తారు. పండు తగిన సైజు, రంగు వచ్చి, పండుపై ఉన్న సన్నని ముళ్లు ఊడిపోయిందంటే పక్వానికి వచ్చినట్లు గుర్తిస్తారు. పండు 70–80% పండినప్పుడు కూలీలతో పండ్లు కోయిస్తారు. తాజా పండ్ల మార్కెట్లో విక్రయించటంతో పాటు స్నేక్ ఫ్రూట్స్ను ఊరగాయ పచ్చడి పెడతారు. సుగర్, ఈస్ట్ కలిపి వైన్ తయారీలో కూడా స్నేక్ ఫ్రూట్స్ వాడుతున్నారు. -
గరీభ్రథ్ రైలులో పాము.. ప్రయాణీకులు పరుగు..
సాక్షి, ముంబై: ప్రయాణంలో రైలులో పాము ప్రత్యక్షం కావడం ప్రయాణీకులకు భయాందోళనకు గురిచేసింది. గరీభ్రథ్ ఎక్స్ప్రెస్ రైలులో పాము కనిపించడంతో ప్రయాణీకులు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నుంచి గరీభ్రథ్ ఎక్స్ప్రెస్(12187) రైలు ముంబైకి బయలుదేరింది. రైలు నడుస్తుండగానే మార్గ మద్యంలో కాసర రైల్వే స్టేషన్ వద్ద ఏసీ కోచ్ జీ-17లో పాము కనిపించింది. రైలు కోచ్లో అప్పర్ బెర్త్ హ్యాండిల్కు చుట్టుకొని కాసేపు అలాగే ఉంది. ఒక్కసారిగా పామును చూసి భయపడిన ప్రయాణీకులు వేరే కోచ్లోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో కోచ్ డోర్లు మూసివేశారు.కాసర రైల్వే స్టేషన్కు రైలు చేరుకోగానే.. ప్రయాణీకులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అనంతరం, స్నేక్ క్యాచర్స్ టీమ్ వచ్చి పామును పట్టుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Snake in train! Snake in AC G17 coach of 12187 Jabalpur-Mumbai Garib Rath Express train. Passengers sent to another coach and G17 locked. pic.twitter.com/VYrtDNgIIY— Rajendra B. Aklekar (@rajtoday) September 22, 2024 ఇది కూడా చదవండి: పని ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య! -
రైల్వేస్టేషన్ ప్లాట్ఫారమ్పై పెద్ద పాము.. ప్రయాణికుల పరుగులు
పాములంటే అందరికీ భయమే.. అవి కనిపిస్తే ఆమడదూరం పరిగెడుతుంటారు. ఈ మధ్య ఇళ్లలోకి, రోడ్లపైకి, ఆఖరికి బైక్, షూవంటి వాటిల్లోనూ పాములు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా రైల్వే స్టేషన్లో పాము ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. రైల్వే ప్లాట్ఫారమ్పై పామును చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఈ సంఘటన జరిగింది.శుక్రవారం ఉదయం రిషికేశ్లోని యోగనగరి రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై ఆరు అడుగుల పొడవైన పాము కనిపించింది. ఆ పాము పాకుతూ ప్లాట్ఫారమ్పైకి చేరింది. కాగా పామును చూసి ఆ ప్లాట్ఫారమ్పై ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి దూరంగా పరుగెత్తారు. కొందరు తమ లగేజ్ వదిలేసి పరుగులు తీశారు. ఆ ప్లాట్ఫారమ్పై పాము ఉన్నట్లు అక్కడున్న వారిని అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.#उत्तराखंड : आप स्टेशन पर ट्रेन का इंतजार कर रहे हों और सामने सांप आ जाए तो क्या होगा...। #ऋषिकेश रेलवे स्टेशन का एक वीडियो वायरल है। प्लेटफार्म पर अचानक एक लंबे सांप को रेंगता देख यात्रियों में अफरा-तफरी मच गई। #Uttarakhand #Rishikesh pic.twitter.com/qN3HAGt893— अनुराग शुक्ला/Anurag Shukla 🇮🇳 (@anuraganu83) September 20, 2024 వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో పామును పట్టి సురక్షితంగా సమీపంలో అడవిలో వదిలారు. అయితే ప్లాట్ఫారమ్పై పెద్ద పాము పాకుతూ వెళ్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
పులి భయపడింది
-
బంగారం దగ్గర పాములు ఎందుకున్నాయి?
‘తంగలాన్’ సినిమాలో బంగారానికి పాములు కాపలా కాస్తున్నట్లు దర్శకుడు చూపించాడు. గుప్త నిధులు ఉన్న దగ్గర పాములు ఉంటాయని పూర్వం చందమామ కథల్లో విఠలాచార్య సినిమాల్లో చూపించేవారు. తంగలాన్లో బంగారం కోసం వెళ్లిన ప్రతిసారి పాములు వచ్చి కాటేస్తుంటాయి. బంగారం గునుల్లో, నిధుల దగ్గర పాములు నిజంగానే ఉంటాయా? కొందరు శాస్త్రవేత్తలు ఏమంటారంటే హెవీ మెటల్స్ ఉన్న దగ్గర పాములు ఉంటాయి అని. బంగారం, యురేనియం, మెర్క్యురీ వంటి హెవీ మెటల్స్ ఉండే ప్రదేశాల్లో పాములు సంచరిస్తాయని వారి అధ్యయనంలో కనిపించింది. పాములు తమ శరీరంలో ఉండే లుసుల్లో హెవీ మెటల్స్ను దాస్తాయట. పాములు బయో ఇండికేటర్స్గా పని చేస్తాయని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. యురేనియం దోరికే ప్రాంతాల్లో గాని బంగారం దొరికే కోలార్ వంటి ప్రాంతాల్లోగాని పాములు ఎక్కువగా సంచరిస్తుండేది అందుకే అని పర్యావరణవేత్తలు కూడా చెబుతున్నారు. -
పడక గదిలో కింగ్ కోబ్రా
శివమొగ్గ: ఇంటిలో ఒక చిన్న ఎలుక సంచరిస్తేనే మనకు రాత్రంతా భయంగా ఉంటుంది. అలాంటిది పడకగదిలోనే మహాసర్పం ఒకటి తిష్ట వేస్తే ఇక ఆ ఇంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. తీర్థహళ్లి తాలూకా ఆగుంబె సమీపంలోని సిగువ సోమేశ్వర గ్రామంలో ఎదురైంది. అక్కడి ఇంటి పడకగదిలోకి సుమారు 9 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా ఒకటి చేరింది. ఒక పాత్రలో చేరి దర్జాగా పడకేసింది. ఇంటివారు చూసి వణికిపోయారు. అటవీసిబ్బంది పాములు పట్టే వ్యక్తిని పిలుచుకొచ్చి సురక్షితంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. -
బస్సు అద్దాన్ని పగులగొట్టి...కండక్టర్పై పామును విసిరి...
నల్లకుంట (హైదరాబాద్): మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ నల్లకుంట ప్రాంతంలో హల్చల్ చేసింది. చెయ్యెత్తినా సిటీ బస్సు ఆపకపోవడంతో ఆగ్రహంతో బీర్ బాటిల్ విసిరేయడమే కాకుండా.. ప్రశ్నించిన లేడీ కండక్టర్పై పామును విసిరేసింది. జవహర్నగర్ ప్రాంతానికి చెందిన బేగం (50) గురువారం సాయంత్రం విద్యానగర్–ఎన్సీసీ గేటు మధ్య రహదారిపై నిలుచుంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆమె ఆ ఇరుకైన రోడ్డులోని లక్కీ ఎక్స్ రోడ్ వద్ద సిటీ బస్సుల్ని ఆపే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ‘107 వీ’సర్వీస్ నెంబర్ కలిగిన బస్సు అక్కడకు రావడంతో ఆపాలంటూ బేగం చెయ్యి ఎత్తింది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకున్న డ్రైవర్ ఆపకుండా ముందుకు వెళ్లారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బేగం తన చేతిలో ఉన్న సంచి నుంచి బీర్ బాటిల్ తీసి బస్సు వైపు విసిరింది. దీంతో బస్సు వెనుక అద్దం పగిలిపోయింది. లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపడంతో కిందికి దిగి వచ్చిన కండక్టర్ స్వప్న బేగంను నిలదీశారు. మద్యం మత్తులో ఉన్న బేగం తన చేతి సంచి నుంచి పామును బయటకు తీసి కండక్టర్పై విసిరారు. పాము పక్కకు పడటంతో కండక్టర్కు ముప్పు తప్పింది. బేగం అంతటితో ఆగకుండా కండక్టర్తో వాగ్వాదానికి దిగింది. ఈలోపు సమాచారం అందుకున్న నల్లకుంట పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పాము కోసం స్నేక్ క్యాచర్ల సాయంతో వెతికినా ఫలితం దక్కలేదు. కండక్టర్ ఫిర్యాదు మేరకు బేగంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బేగంపై బస్సు అద్దాన్ని «ధ్వంసం చేయడం, కండక్టర్తో దురుసుగా ప్రవర్తించడం, పాము పట్ల అమానుషంగా ప్రవర్తించడం తదితర ఆరోపణలతో కేసు నమోదైంది. -
పీకలదాకా తాగి పాముతో ఆటలు..
-
వికాస్ను ఎనిమిదో‘సారీ’ కాటేసిన పాము!
ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన వికాస్ ద్వివేదికి సంబంధించిన ‘పాము కాటు’ ఉదంతం ఆసక్తికరంగా మారింది. తనకు బద్దశత్రువుగా మారిన సర్పం పీడను వదిలించుకోవడానికి 11 రోజులుగా వికాస్ రాజస్థాన్లోని మెహందీపూర్ బాలాజీ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నాడు. అయినా కూడా వికాస్ ఎనిమిదోసారి పాము కాటుకు గురైనట్లు సమాచారం. అయితే..దేవుని దయతో వికాస్కు ఏమీకాలేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాము కాటు వేసిన తర్వాత కూడా వికాస్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. అయితే పాము వికాస్ దగ్గరకు రావడాన్ని, వెళ్లడాన్ని తాము చూడలేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏడుసార్లు పాము కాటుకు గురైన వికాస్ వికాస్ జూలై 13న మెహందీపూర్ బాలాజీ ఆశ్రమానికి వచ్చాడు. ఆయన జూలై 14న మీడియాతో మాట్లాడుతూ.. తనకు కలలో పాము కనిపించిందని, జూలై 20న పాము తనను ఎనిమిదవసారి కాటేస్తుందని చెప్పాడు. అయితే అలాంటి ఘటనేమీ జరగలేదు. కానీ, 22న సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో పాము మరోసారి వికాస్ను కాటేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.వికాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పాము తనను కాటు వేయడానికి వచ్చినప్పుడల్లా, తన ఎడమ కన్ను కొట్టుకుంటుందని తెలిపాడు. సోమవారం కూడా అలానే జరిగిందని చెప్పాడు. మరోవైపు ఇటీవల తనకు కూడా పాము కల వచ్చిందని వికాస్ తండ్రి సురేంద్ర ద్వివేది తెలిపారు. తన కుమారుడిని పాము కాటువేయగా, అతను చనిపోవడాన్ని తాను కలలో చూశానని పేర్కొన్నాడు. కాగా బాలాజీ టెంపుల్ ట్రస్టు వికాస్కు ఆశ్రయం కల్పిస్తూ సాయం అందిస్తోంది. -
శ్రీశైలంలో అద్భుతం..
-
భార్యను కాటేసిన పాము.. ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త ఏం చేశాడంటే
సాధారణంగా పామును చూస్తేనే దానికి దూరం పరుగెత్తుతారు. ఒకవేళ పాము కాటుకు గురైతే భయపడిపోయి ప్రాణభయంతో వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి పరుగుతీస్తాం. కానీ బీహార్ ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పాముకాటుకు గురైన మహిళను ఆమె భర్త ఆసుపత్రికి తీసుకురాగా ఆమెతోపాటు కాటు వేసిన పామును కూడా తీసుకురావడంతో వైద్యులు షాక్కు గురయ్యారు.సబౌర్లోని జుర్ఖురియా గ్రామంలో నిషా అనే మహిళ తన ఇంటిని శుభ్రం చేస్తుండగా పాము కాటుకు గురైంది. సాయం కోసం కేకలు వేయడంతో, భర్త రాహుల్ ఆమె దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. ఈ లోపు పాము పారిపోతుంటే దాని వెంట వెళ్లి ఇంట్లో దేవుడి ఫోటోల వెనక్కి నక్కిన పాము కనిపించింది.వెంటనే కర్రతో దానిని తీసి బకెట్లో వేశాడు. అప్పటికే నిషా స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను తన బైక్పై కూర్చోబెట్టి, బకెట్లో పాముతోపాటు బైక్ హ్యాండిల్కు వేలాడదీశాడు. భాగల్పూర్ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లిన తర్వాత వైద్యులు మొదట పామును చూసి భయపడిపోయారు.అయితే ఆ పాము తన భార్యను కరిచిందని చెబుతూ.. ఆమెను కాపాడాల్సిందిగా వైద్యులను వేడుకున్నాడు నిషా భర్త.. అనంతరం దానిని దూరంగా ఉంచమని చెప్పి.. మహిళను చికిత్స కోసం అత్యవసర విభాగానికి పంపారు. ఆ పాము విషాన్ని అంచనా వేయడం ద్వారా ఆమెకు వైద్యులు చికిత్స చేశారు. ప్రస్తుతం నిషా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పామును మళ్లీ అడవిలో విడిచిపెట్టారు. -
కాటు వేసిందని పామునే కరిచి చంపేయడంతో..!
పాము కాటుకి గురైతే సాధారణంగా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం చేస్తాం. మరికొందరూ సదరు పాముని చంపి, దాన్ని పట్టుకుని వెళ్లి మరీ చికిత్స పొందిన ఘటనలు చూసి చూశాం. కానీ ఏకంగా ఆ పాముని కరిచి చంపేయడం గురించి విన్నారా. ఈ దిగ్భ్రాంతికర ఘటన బిహార్లో చోటు చేసుకుంది.వివరాల్లోకెళ్తే..35 ఏళ్ల సంతోష్ లోహార్ అనే వ్యక్తి ఒకరోజు రైల్వే లైన్లు వేసే పనిని ముగించుకుని తన బేస్ క్యాంపులో నిద్రిస్తుండగా ఓ పాము అతనిపై దాడి చేసింది. దీంతో అతడు వెంటనే ఆ పాముని చేతుల్లోకి తీసుకుని రెండు సార్లు కసితీరా కరిచేశాడు. ఈ అసాధారణ చర్యకు పాము అక్కడికక్కడే చనిపోయింది. ఈ దుశ్చర్య తర్వాత లోహార్ ఆస్పత్రిపాలయ్యాడు. ఓ రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయాడు. అయితే సదరు వ్యక్తి కాటు వేసిన పాముని తిరిగి కొరికేస్తే విషం తగ్గిపోతుందనే మూఢనమ్మకంతో చేశాడట. ఈ విషయం తెలుసుకుని అక్కడ ఆస్పత్రి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఇలా పాము కాటుకి గురయ్యితే ఏం చేయాలో తెలుసుకుందాం..పాము కాటుకి గురైనప్పుడు త్వరగా చర్య తీసుకోవాలని, వైద్య సహాయం కోరాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఈ తక్షణ వైద్య సంరక్షణ అనేది పలు సమస్యలను నివారించడమే గాక దీర్ఘకాలికి వైకల్యం లేదా మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తప్పక చేయాల్సినవి..పాము కరిచినట్లయితే ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లడం వంటివి చేయాలి. కాటే వేసిన ప్రదేశంలో బిగుతుగా ఉన్న దుస్తులను తీసివేయాలి. ప్రభావిత అవయవాన్ని కదలకుండా ఉంచి, బాధితుడిని తక్షణమే సురక్షితంగా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు వైద్య సహాయం కోసం ఎదరుచూస్తున్నప్పుడూ ప్రభావిత అవయవాన్ని గుండె స్థాయికి దిగువున ఉంచి ప్రాథమి చికిత్స అందించాలి. అలాగే బాధితుడికి తినేందుకు, తాగడానికి ఏమి ఇవ్వకూడదని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: ఆ రెస్టారెంట్లో దోస, ఇడ్లీ రేట్లు తెలిస్తే కంగుతింటారు: హర్ష గోయెంకా ట్వీట్) -
కాటేసిన నాగుపాము, ఆ రైతు ఏం చేశాడంటే..
వేలూరు: కాటేసిన నాగుపాముతో ఓ రైతు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన సంఘటన కలకలం రేపింది. తిరుపత్తూరు జిల్లా వాదనవాడి గ్రామానికి చెంది న వేలాయుధం రైతు. ఇతడి వ్యవసాయ బావిలో పూడికతీత పనులు సాగుతున్నాయి. ఆ సమయంలో రైతు వేలాయుధం కాలుపై పాము కరిచినట్లు కనిపించింది. దీంతో అక్కడ కనిపించిన నాగు పామును కొట్టి చంపి దాన్ని ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వెంటనే తిరుపత్తూరు ప్రభు త్వాస్పత్రికి తెచ్చాడు. దాన్ని చూ సిన అత్యవసర విభాగంలోని వైద్యులు అవాక్కయ్యారు. కాగా వేలాయుధం తనను ఈ పాము కరిచిందని వెంటనే వైద్యం అందజేయాలని తెలిపి స్పృహ త ప్పి పడిపోయాడు. దీంతో వైద్య సిబ్బంది వెంటనే రైతుకు వైద్యం చేశారు. -
అమెజాన్ పార్సిల్ లో పాము కలకలం
-
పాముల్లో విషం తయారవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలుసా..?
వర్షాకాలం వచ్చిందంటే చాలు పల్లెల్లో పాముల బెడద మొదలవుతుంది. పొలం పనులకు వెళ్లిన వారు ఎక్కువగా పాముకాటుకు గురవుతుంటారు. గతంలో పాముకాటుతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేక, మందుల కొరతతో ప్రాణాలు కోల్పోయేవారు. కానీ గత ప్రభుత్వంలో మారుమూల ప్రాంతాలకూ వైద్యసేవలను చేరువచేయడంతో పాటు క్వాలిఫైడ్ వైద్యులను నియమించి, తగిన మందులు అందుబాటులో ఉంచడంతో సకాలంలో మెరుగైన వైద్యం అందుతోంది. ఈ సీజన్లోనే ఇప్పటి వరకు దాదాపు వంద మంది పాముకాటుకు గురవగా ఒక్కరికి కూడా ప్రాణాపాయం లేదు. ఒంగోలు టౌన్: ఇప్పటి దాకా వేసవి ఎండల వలన గుంతలు, పొదలు, గుబురుగా ఉండే చెట్ల మధ్య, గడ్డివాముల్లో తల దాచుకునే పాములు అలా వర్షాలు కురుస్తాయే లేదో బుసలు కొడుతూ బయటకు వస్తాయి. పొలం గట్ల మీద తిరుగుతుంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పడగ విప్పి కాటేస్తాయి. పల్లెల్లో చింత చెట్ల మీద తాచు పాములు, నాగు పాములు, పసిరిక పాములు, కట్లపాములు కనిపిస్తుంటాయి. పాము కాటు బాధితుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు, రైతు కూలీలే ఉండడం గమనార్హం. మారుమూల ప్రాంతాల్లో పాము కరిచినప్పుడు సాధ్యమైనంత త్వరగా వైద్యశాలకు వెళ్లే సౌకర్యం లేకపోవడంతో గతంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకునేవారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు సరిగా ఉండేవి కావు. ఎక్కడో ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది. అక్కడ వైద్యుడు ఉండేవారు కాదు. సిబ్బంది కూడా అంతంత మాత్రంగా ఉండేవారు. పాము కాటుకు విరుగుడు ఇంజక్షన్లు ఉండేవి కావు. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు క్వాలిఫైడ్ వైద్యులను నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రైతు కూలీలు పాము కాటుకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం పాము కాటు విరుగుడుకు ఉపయోగించే యాంటి వీనమ్ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచింది. దీంతో ఇప్పడు పాము కాటు వలన చనిపోయేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది 100 పాముకాట్ల నమోదు: జూన్ నుంచి అక్టోబర్ వరకు పాముకాట్లు ఎక్కువగా ఉంటాయి. మామూలు సమయాల్లో జిల్లాలో రోజుకు 1 నుంచి 2 పాము కాటు కేసులు వస్తే వర్షాకాలం ప్రారంభమైన తరువాత రోజుకు 4 నుంచి 5 కేసుల వరకు వస్తున్నాయి. జిల్లాలో ప్రతి ఏడాది పాముకాట్లు పెరుగుతున్నాయి. అయితే పాముకాటు వలన మరణించేవారి సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గింది. 2022 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకు 119 మంది పాముకాటుకు చికిత్స కోసం ఒంగోలు లోని జీజీహెచ్కు వచ్చారు. వీరిలో 56 మంది పురుషులు కాగా 63 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 99 మంది అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. 2023 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకు 393 మంది పాముకాటు చికిత్స కోసం వచ్చారు. వీరిలో 240 మంది పురుషులు కాగా 153 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 305 మంది అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు. ఒకరు మరణించారు. ఇక 2024లో జనవరి నుంచి జూన్ వరకు ఈ ఆరు నెలల్లో 100 మంది పాము కాటుకు గురై చికిత్స కోసం వచ్చారు. వీరిలో 63 మంది పురుషులు కాగా 37 మందిమహిళలు ఉన్నారు. ఈ వంద మందిలో కేవలం 87 మంది మాత్రమే చికిత్స కోసం అడ్మిట్ అయ్యారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు. గత రెండేళ్లలో పాము కాటు వలన మరణించిన వారిలో కేవలం పురుషులు మాత్రమే ఉండడం గమనార్హం. మరణాలు గణనీయంగా తగ్గడానికి సకాలంలో వైద్యం అందడమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇంజక్షన్లు సరిపడా ఉన్నాయి: జిల్లాలో పాము కాటుకు వినియోగించే ఇంజక్షన్లు సరిపడా ఉన్నాయి. జిల్లాలోని అన్నీ ప్రభుత్వ వైద్యశాలలకు అవసరమైన ఔషధాలను తొలి త్రైమాసికంలోనే పంపించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 3642 డోసుల యాంటి స్నేక్ వీనం ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. స్నేక్ వీనం యాంటి సీరం అనే ఇంజక్షన్లు 229 డోసులు ఉన్నాయి. లక్షణాలను ఇలా గుర్తించాలి... పాము కాటు వేసిన చోట వాపు, నొప్పి ఉంటుంది. కొంత మందిలో మూత్రంలో రక్తం పోతుంది. అందుకే మూత్రం ఎర్రగా వస్తుంది. కళ్లు మూత పడడం, మింగడానికి ఇబ్బందిగా ఉండడం, శ్వాస ఆడక ఇబ్బంది పడతారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యం చేస్తామని జీజీహెచ్ జనరల్ ఫిజీషియన్ డా.కళ్యాణి చెప్పారు. మూఢనమ్మకాలను నమ్మవద్దు: పాముకాటు వేసిన వారు మూడు రోజుల పాటు నిద్ర పోకూడదని గ్రామీణ ప్రాంతాల్లో ఒక నమ్మకం విస్తృతంగా ప్రచారంలో ఉంది. అలాగే ఫలానా వస్తువులు తినకూడదని పత్యాలు పెడుతుంటారు. నిజానికి ఎలాంటి ఆందోళన చెందకుండా నిద్రపోవచ్చు. ఆహారం విషయంలో కూడా ఎలాంటి పత్యాలు లేవు.విష పాములను గుర్తించడం ఎలా...? పాము కాటేసిన వెంటనే విషం కంటే పాము కాటేసిందన్న భయమే ఒళ్లంతా పాకేస్తుంది. మానసిక ఆందోళనతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నారని వైద్య నివేదికలు చెబుతున్నాయి. నిజానికి పాములన్నీ విషపూరితమైనవి కావు. ఇందులో కొన్ని పాములు విష పాములు ఉంటే మరికొన్ని విషరహిత పాములుంటాయి. విష పాములకు రెండు కోరలు ఉంటాయి. విషరహిత పాములకు ఎలాంటి కోరలు ఉండవు. అందుకే పాము కాటేసినప్పడు గాయాన్ని నిశితంగా పరిశీలించాలి. శరీరంపై రెండు గాట్లు దిగినట్లు కనిపిస్తేనే విష సర్పం కాటేసినట్లు గుర్తించాలి. ఒకసారి పాము కాటేసిన పాములో తిరిగి విషం ఉత్పత్తి కావడానికి 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కువగా నాగు పాము, కట్ల పాములు ఉన్నాయి. నాగుపాము కాటేసినప్పుడు నొప్పితో విలవిల్లాడిపోతారు. అదే కట్ల పాము కనుక కాటేస్తే చీమ కుట్టినట్టు మాత్రమే ఉంటుంది. దాంతో పాము కాటు వేసినట్లు అనుమానించరు. నిర్లక్ష్యం చేస్తారు. ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది.జిల్లాలో 72 పీహెచ్సీలు.. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పీహెచ్సీలో ఇద్దరేసి క్వాలిఫైడ్ వైద్యులను నియమించారు. ప్రతి వైద్యశాలలోనూ అత్యవసర వైద్య సేవలను అందించేందుకు తగిన సిబ్బంది, ఔషధాలను ఏర్పాటు చేశారు. నగర శివారు ప్రజలకు అందుబాటు ఉండేలా 18 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్క ఒంగోలు నగరంలోని శివారు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా 9 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామ మాత్రంగా హాస్పిటళ్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకోకుండా ప్రతి యూపీహెచ్సీల ఒక ఎంబీబీఎస్ వైద్యుడితో పాటు ఏడుగురు సిబ్బందిని నియమించారు. ప్రతి పీహెచ్సీ, యూపీహెచ్సీలో పాముకాటు ఇంజక్షన్లు అందుబాటులో ఉంచారు. దీంతో పాముకాటుకు గురైన వారిని సకాలంలో వైద్య చికిత్స చేసేందుకు అవకాశం ఏర్పడింది.సకాలంలో వైద్యశాలకు తరలించాలి ఎవరికైనా పాము కరిస్తే ఆందోళన చెందకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలి. మన ప్రాంతంలో ఎక్కువగా విష సర్పాలు లేవు. ఉన్నా డ్రైడ్ పాములు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ధైర్యంగా ఉండాలి. కాటుకు పై భాగంలో ఎలాంటి కట్లు కట్టాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మంచి వైద్యం అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీలైనంత త్వరగా వైద్యశాలకు తరలించి సుశిక్షితులైన వైద్యులచేత చికిత్స చేయించడం మంచిది. –డాక్టర్ ఎన్.కళ్యాణి, జనరల్ ఫిజీషీయన్, హెచ్ఓడీప్రజల్లో అవగాహన కలిగించాలి అన్నీ రకాల పాములు విషపాములు కావు. పాము కాట్లన్నీ ప్రమాదం అని అనుకోకూడదు. అలాగని నిర్లక్ష్యం వహించకూడదు. ముందుగా ఎలాంటి పాము కాటు వేసిందో నిర్ధారించాలి. అది విషం కలిగిన పాము అయితే వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి సకాలంలో వైద్యం చేయిస్తే చాలు. జీజీహెచ్లో పాము విషం విరుగుడు ఇంజక్షన్లతోపాటుగా తగిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. – డాక్టర్ జీ.దుర్గాదేవి, సూపరింటెండెంట్, జీజీహెచ్, ఒంగోలు. -
మహిళను కాటేసిన అత్యంత విషపూరితమైన పాము
నెల్లూరు(అర్బన్): నెల్లూరు దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో రత్నమ్మ అనే అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికురాలిని అత్యంత విషపూరితమైన రక్తపింజరి పాము కాటేసింది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. సిబ్బంది కథనం మేరకు.. రోజులాగే రత్నమ్మ సోమవారం విధులకు వచ్చింది. సంబంధిత సూపర్వైజర్ మెడికల్ కళాశాల ఆవరణలో గడ్డిని తొలగించే పనిని ఆమెకు అప్పగించారు. దీంతో గడ్డిని తొలగిస్తుండగా పాము ఆమె చేతి వేలిపై కాటువేసింది. రత్నమ్మ కేకలు వేయగా సహచర సిబ్బంది వచ్చి ఆమెను ఆస్పత్రి క్యాజువాలిటీలో చేర్చారు. డాక్టర్ ప్రాథమిక వైద్యం అనంతరం ఐసీయూకి తరలించారు. ఈసీజీ తీశారు. అనంతరం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అయిన ఎజైల్ గ్రూపు మేనేజర్ కొండయ్య మరికొన్ని రక్తపరీక్షలను బయట ల్యాబ్లో చేయించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.గతంలో ఓ కార్మికురాలి మృతిగతంలో ఓపారిశుద్ధ్య కార్మికురాలు పెద్దాస్పత్రి ఆవరణలో గడ్డి కోస్తుండగా పాము కాటు వేసింది. తర్వాత భయాందోళనకు, ఒత్తిడికి లోనైంది. రెండో రోజు మృతి చెందింది. ఈ ఘటన అప్పట్లో ఆస్పత్రిలో సంచలనం రేకెత్తించింది. ఆమె మృతితో కుటుంబం వీధిన పడింది. ఏజెన్సీ ఎజైల్ సంస్థ తదితరులు సుమారు రూ.లక్ష సాయం అందించారు.పెస్ట్ కంట్రోల్ వైఫల్యంఆస్పత్రిలో పాములు లేకుండా, చెదపురుగులు పట్టకుండా, ఎలుకలు లేకుండా చూసే బాధ్యత పెస్ట్ కంట్రోల్ది. దీనికి సంబంధించి కాంట్రాక్ట్ను పొందిన వ్యక్తికి ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.50 లక్షలు చెల్లిస్తోంది. అయితే ఆ సంస్థ నిబంధనలు గాలికొదిలేశారని ఆరోపణలున్నాయి. మందును స్ప్రే చేయడం మినహా మిగతా పనులు చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలుకలు పట్టేందుకు బోనులు పెట్టాలి. పాములు నివసించేందుకు అనువైన పుట్టలు, బొరియలుంటే తొలగించాలి. బొద్దింకలు, ఇతర చెదపురుగులు చేరకుండా మందులు వాడాలి. ప్రతి నెలా రూ.లక్షలో బిల్లులు తీసుకుంటున్నా నిబంధనల మేరకు పని చేయడంలేదని విమర్శలున్నాయి. సరిపడా ఉద్యో గులను నియమించలేదని తెలుస్తోంది. అయినా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆ ఏజెన్సీకి ఫుల్ మార్కులు వేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి లోపాలు సరిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. -
ఈ వాసనకి.. పాములిక పరారే..!
మారుతున్న కాలానుగుణంగా ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఎండాకాలం, చలికాలం కాస్త వాతావరణంలో పొడిగా, ఎండుగా ఉన్నా.. వర్షాకాలం మాత్రం నేల చాలావరకు తడిగానే ఉంటుంది. దీంతో చెట్లు, పొదలు విపరీతంగా పెరగడంతోపాటు విషజీవులకు నెలవుగా మారుతుంది.. ఆ విషయానికొస్తే పాములు అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలు.పాము కనిపించగానే భయానికిలోనై ప్రాణరక్షణలో దానిని చంపడమో? తప్పించుకోవడమో? చేస్తుంటాము. మనుషులకు నచ్చని దుర్వాసనలు ఎలాగైతే ఉంటాయో.. నిపుణుల పరిశోధన ప్రకారం.. పాములకు కూడా నచ్చని కొన్ని వస్తువుల వాసనలున్నాయి. పాములు మన చుట్టూ పరిసరాలలో కనిపించకుండా, రక్షణగా ఉండడానికి ఈ వాసనలను వెదజల్లితే చాలు. ఇక దరిదాపుల్లో కూడా కనిపిచకుండాపోతాయి.అవి...- ప్రతీ ఇంట్లో సహజంగా నిల్వఉండే వెల్లుల్లి, ఉల్లిపాయలు పదార్థాల వాసనకు పాములు తట్టుకోలేవట.- పుదీనా, తులసి మొక్కల నుంచి వెలువడే వాసనను పాములు ఇష్టపడవు. బహుశా ఏళ్ల తరబడి భారతీయ ఇళ్లల్లో తులసి మొక్కను నాటడానికి కారణం ఇదే.- అలాగే నిమ్మరసం, వెనిగర్, దాల్చిన చెక్క నూనె కలిపి స్ప్రే చేస్తే కూడా పాములు వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయి.- అమ్మోనియా వాయువు వాసనను పాములు తీవ్ర ఇబ్బందిగా, అశాంతిగా భావిస్తాయి.- పాములు కిరోసిన్ వాసనను కూడా తట్టుకోలేవు.ఇవి చదవండి: ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే.. -
పొదల్లో బుస్.. బుస్
రాయవరం: వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల బెడద ఎక్కువవుతోంది. వాతావరణంలో వేడి తగ్గి భూమి చల్లబడిన సమయంలో విష పురుగులు సహజంగా బయటకు వస్తుంటాయి. ఇలా బయటకు వచ్చిన విషసర్పాలు, పురుగులు రాళ్ల గుట్టలు, దట్టమైన పొదల మాటున ఉంటాయి. పొదలు, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలాగే పొలాల్లోని గడ్డివాములు, గట్ల వెంబడి తిరుగుతుంటాయి. ఇళ్ల పరిసరాలు, పొలాల్లోనూ సంచరించే విష సర్పాలు, తేళ్లు, ఇతర విష కీటకాలతో ప్రమాదం పొంచి ఉంది. వీటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నాగుపాము, కట్లపాము, పొడపాము, రక్తపింజర వంటి వాటివల్లే ప్రమాదం అఽధికంగా ఉంటుంది. సాధారణంగా 50 శాతం పైగా పాముల వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు.రైతన్నా.. జాగ్రత్త అవసరంపొలం గట్ల వెంబడి వెళ్లేటప్పుడు కర్ర చప్పుడు చేస్తూ నడవడం మంచిది. రాత్రి పూట పొలాలకు నీరు కట్టడానికి వెళ్లేటప్పుడు టార్చిలైట్లు తీసుకు వెళ్లాలి. ధాన్యపు గాదెలు, గడ్డివాములు ఉండే చోట ఎలుకలు, తడిగా ఉంటే కప్పలు తిరుగుతాయి. వాటిని ఆహారంగా తీసుకునేందుకు పాములు చేరతాయి. అలాగే తేళ్లు, జెర్రెలు వంటి ప్రమాదకర ప్రాణులు సంచరించే అవకాశముంది. ఎక్కువగా పాములు పొదలు, గోడల వారగా చేరతాయి. ప్రజలు చీకట్లో బయటకు వెళ్తే తప్పనిసరిగా చెప్పులు వేసుకోవాలి.విషసర్పాల కాటు లక్షణాలువిషసర్పం కాటు వేసిన ప్రదేశంలో పాము కోరల గాయం స్పష్టంగా కనిపిస్తుంది. నొప్పి తీవ్రంగా ఉంటుంది. నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు గొంతులో ఏమీ దిగని పరిస్థితి తలెత్తవచ్చు. చొంగ కారవచ్చు. కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. నాగుపాము అత్యంత ప్రమాదకరం. ఇది కాటువేస్తే 15 నిమిషాల్లో విషం ఎక్కుతుంది. ఈ పాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఎవరినైనా పాము కరిస్తే అది విష సర్పమో కాదో గుర్తించే ప్రయత్నం చేయాలి. దానివల్ల చికిత్స కచ్చితంగా చేసేందుకు వీలవుతుంది. పాము కాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలి. నాటు వైద్యం, మంత్రాల జోలికి వెళ్లరాదు. పాముకాటుకు గురైన వారు ఆందోళన చెందితే గుండెపోటు వచ్చే అవకాశముంది.జిల్లాలో పరిస్థితి ఇదీడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2022 ఏప్రిల్ నుంచి 2023 జూన్ వరకూ 191 మందికి పాము కాటుకు గురయ్యారు. 2022 జూలైలో అధికంగా 25 మంది, నవంబరులో 24 మంది పాముకాటు బారిన పడ్డారు. 2022 ఏప్రిల్ నుంచి 2023 జూన్ వరకూ 154 మంది పురుషులు, 37 మంది మహిళలు పాముకాటుకు గురైనట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2023 జూన్ నుంచి ఇప్పటి వరకూ 227 మంది పాటుకాటుకు గురయ్యారు. ఈ బాధితులకు జిల్లా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, అర్బన్ హెల్త్సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల్లో యాంటీ స్నేక్ వీనమ్ మందులు అందుబాటులో ఉంచారు. బాధితులకు ఉచితంగా మందులు వేస్తున్నారు.వైద్యం ఆలస్యం కారాదుపాముకాటు వేసిన వారికి ధైర్యం చెప్పి, వెంటనే వైద్యం అందించేందుకు ప్రయత్నించాలి. ముందుగా ప్రథమ చికిత్స చేయాలి. కట్ల, నాగుపాములు కాటువేస్తే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి బాధితుడు కోమాలోకి వెళ్లే అవకాశముంది. పాముకాటు వేయగానే నిర్లక్ష్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా ప్రథమ చికిత్స చేయించి, ఆసుపత్రిలో చేర్చాలి.–వి.అనిరుథ్, పీహెచ్సీ వైద్యాధికారి, రాయవరంఆసుపత్రుల్లో ఉచితంగా మందులుజిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో యాంటీ స్నేక్ వీనమ్ (పాము కాటు మందులు) అందుబాటులో ఉన్నాయి. మందుల కొరత ఏర్పడితే ఆసుపత్రి అభివృద్ధి కమిటీల ద్వారా మందులు కొనుగోలు చేసుకోవచ్చు. జిల్లాలో ఎక్కడా కొరత లేదు.–దుర్గారావుదొర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, అమలాపురం -
సేవ్ స్నేక్ (ఫోటోలు)
-
Hyderabad: ట్రాఫిక్ సిగ్నల్పై పాము
హిమాయత్నగర్: లిబర్టీ చౌరస్తాలో ఓ త్రాచు పాము కలకలం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద ఉన్న వేప చెట్టుపై మొదట పాము ప్రత్యక్షమైంది. అక్కడి నుండి కేబుల్ వైర్ల సహాయంతో ట్రాఫిక్ సిగ్నల్పైకి చేరింది. నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉండే సిగ్నల్ వద్ద ఒక్కసారిగా పాము కనిపించడంతో వాహనదారులు ఖంగుతిన్నారు. ఆ పాము ఎక్కడ మీద పడుతుందో అని ఎక్కడికక్కడ తమ వాహనాలను నిలిపివేశారు. దీంతో సుమారు గంట పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొద్దిసేపటికి సిగ్నల్ పోల్ సహాయంతో కిందకు చేరిన పాము..పక్కనే ఖాళీగా ఉన్న బిల్డింగ్ సెల్లార్ లోకి వెళ్లింది. దీంతో వాహనదారులు, పోలీస్ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. కాగా కొందరు ఈ దృశ్యాలను సెల్ఫోన్లలో బంధించారు. -
పామును పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్
అన్నానగర్: కోయంబత్తూరులో అనుమతి లేకుండా పామును పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. కోయంబత్తూరులోని గణపతి ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వరి చిన్నతనం నుంచి గుడి రూపు ప్రాంతంలో సంచరించే పాములను పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగిస్తూ వచ్చింది. ఈ స్థితిలో కోయంబత్తూరులోని పులి యంగులం నివాస ప్రాంతంలో పాము సంచరిస్తోందని ఆ ప్రాంత ప్రజలు వారికి సమాచారం అందించారు. పాములు పట్టే ఉమామహేశ్వరి, సంజయ్ ఘటనా స్థలానికి చేరుకుని 8 అడుగుల పొడవున్న పామును పట్టుకుని అడవిలోకి పంపించారు. అంతకుముందు స్నేక్ క్యాచర్ ఉమా మహేశ్వరి పాము పట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అనుమతి లేకుండా పామును పట్టుకుని, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. #Coimbatore Forest Department arrested two individuals for illegally handling an Indian rat snake and posting a video of it on social media, which went viral on May 25. The snake, listed under Schedule I of the Wildlife Protection Act, 1972, is a protected species.@THChennai📽️:… pic.twitter.com/WCenHD66Sf— Avantika Krishna (@AvantikaKrish) May 28, 2024 -
ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
ఆరోగ్యానికి మంచిదంటూ పాతకాలపు వంటలు, వంటలు ఇపుడొక ఫ్యాషన్. జపాన్లో ఒక వింత వంటకం తెగర వైరల్ అవుతోంది. శతాబ్దాల నాటి చిరుతిండిని లేటెస్ట్గా వడ్డించడంతో, ఖరీదు ఎక్కువైనా సరే ఎగబడి తింటున్నారట అక్కడి జనం. అసలు స్టోరీ ఏంటంటే..ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నాయి జపాన్ రెస్టారెంట్లు. శతాబ్దాల చరిత్రగల పురాతన వంటకం ‘రైస్ బాల్’ ను వెరైటీగా సిద్ధంచేసి మరీ ఆహారప్రియులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి కూడా. ఇంతకీ ఈ స్నాక్ ఎలా తయారు చేస్తారో తెలిస్తే మాత్రం.. దిమ్మ దిరగాల్సిందే.జపాన్లో ఒనిగిరి లేదా రైస్ బాల్ (అన్నం ముద్దలు) వంటకం చాలా ఫేమస్. ఉడకబెట్టిన వివిధ కూరగాయలు, మాంసం, అన్నం, నోరి అనే ఎండబెట్టిన సముద్ర పాచిలో చుడతారు. సాధారణంగా ఒనిగిరి అన్నం ముద్దలను చేత్తోనే లడ్డూల్లా చుడతారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇటీవలి కాలంలో అందమైన మహిళా చెఫ్లను రెస్టారెంట్ల యజమానులు రంగంలోకి దించారు. ఆ అమ్మాయిలు ఒనిగిరి ముద్దలను చేత్తో బదులు చంక కింద పెట్టుకొని చుడతారు. ఇక్కడో ఇంకో సంగతి ఏంటంటే...ఆర్మ్పిట్ టెక్నిక్ను వంటగదిలో కస్టమర్లను చూడటానికి అనుమతిస్తాయి. అంతేకాదు మేము చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇన్ఫోక్షన్స్ రాకుండా డిస్ ఇన్ఫెక్ట్ట్తోశుభ్రంగా ఉండేలా చూసు కుంటామంటూ యజమానులు హామీ ఇస్తున్నారు. ఆర్మ్పిట్ ఒనిగిరి ముద్దలను కొన్ని రెస్టారెంట్లు ఏకంగా 10 రెట్ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోందీరైస్ బాల్! కొందరు పాజిటివ్గా కమెంట్ చేస్తోంటే, మరికొందరు నెగిటివ్ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మొత్తం మీద రైస్బాల్ తయారీ విధానంపై చర్చ రచ్చ రచ్చగా మారింది.కొందరు కస్టమర్లు వహ్వా అంటూ లొట్టలేసుకొని తింటుంటే మరికొందరు మాత్రం రుచిలో పెద్దగా తేడా రాలేదంటూ పెదవి విరుస్తున్నారట. చెఫ్కు ఏదైనా గుప్త రోగం ఉంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది. సాధారణంగా తమకు రైస్బాల్స్ అంటే ప్రాణం.. కానీ ఇది అత్యంత జుగుప్సాకరంగా ఉందని మండి పడుతున్నారు. తాము ఎప్పటికీ ఈ డిష్ను ట్రై చేయబోమని తెగేసి చెబుతున్నారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం చంకలో తయారయ్యే చెమటలో ఒక ప్రత్యేకమైన ఫెరోమోన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందట. దీన్ని వాసన చూస్తే లైంగిక ఆకర్షణలు పెంచుతుందని 2013 నాటి అధ్యయనంలో తేలిందట. -
స్నేక్ ఎఫెక్ట్.. ఆలస్యమైన బుల్లెట్ రైలు
టోక్యో: జపాన్లో బుల్లెట్ రైలు 17 నిమిషాలు ఆలస్యమవడం హాట్టాపిక్గా మారింది. సాధారణంగా బుల్లెట్ రైళ్లు నిమిషం ఆలస్యం కాకుండా షెడ్యూల్ ప్రకారం నడుస్తుంటాయి. అయితే అనూహ్యంగా బుల్లెట్ రైలు ఆలస్యమవడానికి ఓ పాము కారణమైంది. పాము రైలుపైకి ఎలా వచ్చిందనేదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సాధారణంగా ఈ రైళ్లలో కొన్ని జంతువులను తీసుకెళ్లడానికి మాత్రం అనుమతి ఉంటుంది. పాములను మాత్రం అనుమతించరు. ప్రయాణికుల లగేజీని మాత్రం చెక్ చేసే నిబంధన లేదు. ఎవరైనా ప్రయాణికుల లగేజీలో పాము వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. జపాన్లో బుల్లెట్ రైలు 1964 సంవత్సరంలోనే ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో బుల్లెట్ రైలు నెట్వర్క్ 2700కిలోమీటర్లుగా ఉంది. బుల్లెట్ రైళ్ల ఆలస్యం సగటున నిమిషానికంటే తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం బుల్లెట్ రైలు స్పీడు గంటకు 300 కిలో మీటర్లు. ఇదీ చదవండి.. జపాన్కు పోటెత్తిన పర్యాటకులు.. ఒక్క నెలలో రికార్డు -
గోల్డెన్ స్నేక్.. డైరెక్టుగా దుబాయ్ నుంచి..!
అతిపెద్ద పామును చూశాం.. రెండు తలల పామును చూశాం. అత్యంత విషపూరితమైన పాముల గురించి చాలా కథనాలు విన్నాం. తాజాగా బంగారు రంగు పాము ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎక్స్(ట్విటర్) యూజర్ సంతోష్ ఈ గోల్డెన్ స్నేక్ వీడియోని ఏప్రిల్ ఒకటో తేదీన షేర్ చేశారు. గోల్డెన్ స్నేక్ అనే క్యాప్షన్తో వచ్చిన ఈ వీడియో ఇప్పటికే 23 మిలియన్లకు పైగా వ్యూస్ను దక్కించుకుంది. బంగారురంగులో ఓ ఆరు అడుగుల పాము రోడ్డు దాటుతున్నట్టుగా వీడియో ఈ పోస్ట్లో ఉన్నాయి. పామును చూసిన స్థానికులు ఆశ్చర్యపోతూ రికార్డు చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు. బంగారు వర్ణంలో ధగ ధగ లాడుతూ అలా రోడ్డు అవతల ఉన్న గడ్డిలోకి జారిపోయింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ముఖ్యంగా బంగారం ధర రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో ఎన్ని తులాలుంటుంది, దుబాయ్ నుంచి డైరెక్ట్గా వచ్చేసినట్టుంది అంటూన్న కామెంట్స్ మాత్రం చాలా స్పెషల్గా నిలిచాయి. అది ఎల్లో స్నేక్ అనీ అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటని మరొకరు వ్యాఖ్యానించారు. Golden snake 🐍 pic.twitter.com/kYnJ52gCEa — Shanthosh (@shanthosh) April 4, 2024 -
Cutest Snakes AI Photos: ఈ పాములు ఏంట్రా బాబు ఇంత ముద్దుగా ఉన్నాయ్ (ఏఐ ఫోటోలు)
-
అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!
మనం పాములను దేవతగా పూజిస్తాం. చంపేందుకు కూడా వెనకడతాం. ఎంతో పరిస్థితి సివియర్గా ఉంటేనే గానీ వాటి జోలికి వెళ్లం, హాని తలపెట్టం. అలాంటిది ఒక దేశంలో ఏకంగా వాటి రక్తాన్ని టీ, కాఫీలు తాగినట్టు తాగేస్తారట. పైగా ఎందుకుని ఇలా తాగుతారో వింటే గుండెఝల్లుమంటుంది. అందుకోసం వీటి రక్తాన్ని తాగాలా అని అసహ్యంచుకుంటారో కూడా. ఇంతకి ఎక్కడ ఇలా చేస్తారు? దేని కోసం అంటే. విష సర్పాన్ని చూసి అల్లంతా దూరానికి పరిగెడతాం. కానీ ఇండోనేషియన్ అమ్మాయిలు మాత్రం లొట్టలేసుకుంటూ వాటి రక్తాన్ని తాగేస్తారు. వాటి రక్తం తాగితే శరీరాన్ని ఫిట్గా అందంగా ఉంటుందని వారు ప్రగాఢం నమ్ముతారట. పాము రక్తం కోసం దుకాణాల్లో రద్దీ కూడా ఓ రేంజ్లో ఉంటుందట. ఇండోనేషియా రాజధాని జకర్తాలో పాము రక్తం తాగడం అనేది అత్యంత సాధారణ విషయం. ఎక్కడ చూసినా కాఫీ, టీ స్టాల్ మాదిరిగా పాము రక్తాన్ని విక్రయించడం విశేషం. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసినప్పుడు పాము రక్తాన్ని తప్పక తాగుతారట. అంతేకాదు జకర్తాలో ఈ పాము రక్తానికి మంచి డిమాండ్, ట్రెండ్ కూడా ఉంది. దీని కారణంగా ప్రతిరోజు వేలాది పాములను చంపుతారట ప్రజలు. అయితే ఈ రక్తాన్ని తాగిన తర్వాత సుమారు మూడు నుంచి నాలుగ గంటల వరకు టీ, కాఫీలను తాగకూడదట. అయితే ఎప్పుడు పడితే అప్పుడు మనం ఆఫీస్లు, కాలేజీల్లో టీ, కాఫీలు ఎలా తాగుతామో అలా అక్కడ పాము రక్తం తాగేస్తారట వాళ్లు. ఎందుకు తాగుతున్నారంటే.. ఇండోనేషియా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని.. ముఖ్యంగా అక్కడి స్త్రీలు తమ అందం పెంచుకునేందుకు తప్పనిసరిగా ఈ పాము రక్తం తాగుతారట. పాము రక్తం వల్ల చర్మం కాంతిమంతంగా ఉంటుందట. ఆరోగ్యం బాగుంటుందట. ఇలా పాము రక్తం తాగే సంప్రదాయం పురాతన కాలం నుంచి ఇండోనేషియన్ వాసులకు అనాదిగా వస్తుందట. అయితే వాళ్లు ఇలా పాము రక్తాన్ని తాగడమే కాదు వాటిని ఆహారంగా తింటారట కూడా. వాటిని చక్కగా నిమ్మగడ్డితో ఉడకబెట్టి వేయించి మరీ తింటారట. (చదవండి: అక్కడ పోలీసులు పెట్రోలింగ్కి గేదెలను ఉపయోగిస్తారట!) -
పాపికొండల్లో అరుదైన మిత్రుడు
కైకలూరు: పర్యావరణ మిత్రునిగా పిలిచే అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ (గుడ్డి పాము) జాడ నిజమేనని మంచినీటి జీవశాస్త్ర ప్రాంతీయ కేంద్రమైన హైదరాబాద్లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గుంటూరులోని బయోడైవర్సిటీ బోర్డు పాపికొండలు సమీపంలోని రంపచోడవరం జలపాతం వద్ద 2022 సెపె్టంబర్ 8న చనిపోయిన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ మృతదేహాన్ని కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన శాస్త్రవేత్తలు దీపా జైస్వాల్, బి.భరత్, ఎం.కరుతాపాండి, శ్రీకాంత్ జాదవ్, కల్యాణి, కుంటేలు గుడ్డిపాము కళేబరాన్ని రసాయనాలతో హైదరాబాద్ జూలాజికల్ మ్యూజియంలో భద్రపరిచారు. అప్పటినుంచి పరిశోధనలు చేసి చివరకు డీఎన్ఏ పరీక్ష ద్వారా దీనిని అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్గా నిర్ధారించారు. 1839లో జావా దీవుల్లో గుర్తింపు డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ను 1839లో ఇండోనేషియాలోని జావా దీవుల్లో తొలిసారిగా గుర్తించారు. ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త పియరి మోడర్డ్ డియార్డ్ గౌరవార్థం దీనికి డయార్ట్స్ అని నామకరణం చేశారు. ఆర్గిరోఫిస్ డయార్టి శాస్త్రీయ నామం కలిగిన ఇది టైఫ్లోపిడే కుటుంబంలో విషపూరితం కాని పాము జాతికి చెందినది. ఇవి అడుగు వరకు పొడవు పెరుగుతాయి. భారతదేశంలో ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ప్రదేశ్, అసోం, హరియాణా, బిహార్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో వీటి జాతి ఉంది. మొదటిసారి ఏపీలోని పాపికొండలు అభయారణ్య ప్రాంతమైన రంపచోడవరం జలపాతం వద్ద దీనిని కనుగొన్నారు. వానపాములు భూసారాన్ని పెంపొందించడంలో ఏ విధంగా సాయపడతాయో అంతకంటే ఎక్కువగా పర్యావరణాన్ని కాపాడటంలో గుడ్డిపాములు దోహదపడతాయి. ఐయూసీఎన్ ఆందోళన ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తగ్గుతున్న జీవుల జాబితా అయిన రెడ్ లిస్ట్లో డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ను చేర్చింది. భారతీయ వన్యప్రాణి (రక్షణ) సవరణ చట్టంలో దీనిని చేర్చారు. చిత్తడిగా ఉండే అటవీ ప్రాంతం, పొదలు, గడ్డి భూముల్లో ఇవి నివసిస్తాయి. వీటితో పర్యావరణం పరిఢవిల్లుతుందని శాస్త్రవేత్తలు భావిస్తారు. తూర్పు కనుమల ప్రాంతమైన తమిళనాడు, ఏపీ, ఒడిశా ప్రాంతాల్లో కేవలం పాపికొండలు వద్ద ఈ జాతిని గుర్తించడంతో ఈ ప్రాంతాల్లో మరింతగా వీటి జాడ ఉండే అవకాశం ఉంది. విషపూరితమైనవి కావు డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ విషపూరితమైనవి కావు. క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. వానపాములు ఏ విధంగా సంతానోత్పత్తి చేస్తాయో అదేవిధంగా వీటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి. పంట పొలాల్లో రసాయనాలు అధిక వినియోగం వల్ల వీటి సంతతి నశిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. వీటిని పరిరక్షించుకోవాలి. – బి.భరత్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాద్ -
పాము విషానికి విరుగుడు.. ఒంటె కన్నీరు!
ఒంటె కన్నీటిలోని రసాయనాలు పాము విషానికి విరుగుడుగా పనికివస్తాయని శాస్త్రవేత్తలు చేసిన పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ నేపధ్యంలో ఒంటె కన్నీటితో పాము విషాన్ని తొలగించగల ఔషధాన్ని తయారు చేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాము కాటు కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 1.25 లక్షల మంది మరణిస్తున్నారు. కొన్ని పాములు అత్యంత విషపూరితమైనవి. ఇవి కాటువేసినప్పుడు మనిషి బతికేందుకు అవకాశం ఉండదు. ఈ నేపధ్యంలో పాము విషానికి విరుగుడుగా పనికి వచ్చే ఔషధాల తయారీకి నిరంతరం పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయ్లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ (సీవీఆర్ఎల్) ఒంటె కన్నీటిని ఉపయోగించి, పాము విషానికి విరుగుడును తయారు చేయవచ్చని వెల్లడించింది. దుబాయ్లోని ఈ ల్యాబ్లో దీనిపై చాలా ఏళ్ల క్రితం పరిశోధనలు జరిగినప్పటికీ నిధుల కొరత కారణంగా అవి ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు నిధులను సమకూర్చుకుని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళతామని సీవీఆర్ఎల్ పేర్కొంది. తాము త్వరలోనే పాము విషాన్ని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని తయారు చేయనున్నామని ఈ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ వార్నర్ తెలిపారు. ఒంటె కన్నీటిలో అనేక రకాల ప్రొటీన్లు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా కాపాడతాయి. ఒంటె కన్నీటిలోని ఔషధ లక్షణాలపై అమెరికా, ఇండియా, తదితర దేశాల్లో పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ఒంటె కన్నీటిలో లైసోజైమ్లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్లను నిరోధిస్తాయి. ఒంటె కన్నీరే కాదు మూత్రానికి కూడా ఔషదీయ గుణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. -
బైక్ ఆఫ్ అవడంతో బైక్ సీటు తెరిచి చూస్తే.. ఒక్కసారిగా షాక్!
మహబూబ్నగర్: బైక్ ఆఫ్ అయితుందని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లిన యువకులకు సీటు కింద పాము కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్కు చెందిన బాలు, వినయ్ అక్కడే ఓ పరిశ్రమలో పని చేసేవారు. కంపెనీ పని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడిపత్రికి వెళ్లారు. ఆదివారం తిరుగు ప్రయాణంలో కర్నూల్ వద్ద బైక్లో పెట్రోల్ పోయించుకున్నారు. అడ్డాకుల సమీపంలోకి రాగానే బైక్ ఆఫ్ అయితుండటంతో స్థానికంగా ఉన్న మెకానిక్ దగ్గరికి వచ్చారు. దాన్ని బాగు చేసే క్రమంలో బైక్ సీటు తీయగా దాని కింద పాము కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత యువకులంతా కలిసి దాన్ని బయటకు తీసి చంపేశారు. ఇవి చదవండి: ఆన్లైన్లో ఫింగర్ప్రింట్ స్కానర్ బుక్.. తెరిచిచూస్తే షాక్! -
వామ్మో ఆఫ్రికన్ నత్తలు! ఇవి ఎంత ప్రమాదమో తెలుసా?
ఆఫ్రికన్ నత్తలు(జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్) మార్కాపురం–తర్లుపాడు రోడ్డులోని మాగుంట పార్కులో ప్రత్యక్షమయ్యాయి. గత మూడు రోజులుగా సుమారు 100 నత్తలు పార్కులో సంచరిస్తూ వాకర్లను ఆకర్షిస్తున్నాయి. మన ప్రాంతంలో కనిపించే సాధారణ నత్తల కంటే ఇవి భిన్నంగా ఉండటమే అందుకు కారణం. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఈ నత్తలు వచ్చి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. ఇవి మామూలు నత్తలు కావు.. అచాటినిడే కుటుంబానికి చెందిన ఈ ఆఫ్రికన్ నత్తలు ప్రపంచ వ్యాప్తంగా చీడ సమస్యలకు ప్రధాన కారణం. వ్యవసాయ పంటలతోపాటు స్థానిక మొక్కలకూ నష్టం కలిగిస్తాయి. అత్యంత హానికరమైన ఇన్వాసివ్(ఆక్రమిత) జాతుల్లో ఒకటైన ఈ ఆఫ్రికన్ నత్తలు మానవుల్లో మెనింజైటిస్కు కారణమవుతున్నాయి. ప్రపంచంలో టాప్ 100 ఆక్రమిత జాతుల్లో ఈ నత్తలూ ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ స్పష్టం చేసింది. ఇవి చదవండి: వర్షం పడని వింత గ్రామం ఎక్కడుందో మీకు తెలుసా? మేఘాలను దగ్గర్నుంచి.. -
Video: హెల్మెట్లో దూరిన పాము.. జస్ట్ మిస్
ఈ మధ్యకాలంలో పాములు ఒక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. ఇళ్లు, షూలు, బైక్లు.. ఇలా కనిపించిన ప్రతిచోటా దూరిపోతున్నాయి. అనుకొని ప్రదేశాల్లో పాములు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి హెల్మెట్లో పాము కలకలం రేపింది. నాగుపాము బుసలు కొట్టుకుంటూ ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Dev Shrestha (@d_shrestha10) ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో దేవ్ శ్రేష్ట అనే వ్యక్తి నవంబర్1న షేర్ చేశారు. ఇందులో నేలపై ఉంచిన హెల్మెట్లో పాము కనిపిస్తుంది. దగ్గరగా ముడుచుకొని హెల్మెట్లో నుంచి బయటకు చూస్తూ ఉంది. దాని దగ్గరకు ఎవరైనా వచ్చేందుకు ప్రయత్నిస్తే దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే హెల్మెట్లో పాము ఉన్న విషయాన్ని అతడు ముందుగానే గమనించడంతో ప్రాణాలుదక్కించుకున్నాడు. తాజాగా ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. నాలుగు మిలియన్లకు పైగా వీక్షించారు. 43వేల మంది లైక్ కొట్టారు. కాగా పాములు జనావాసాల్లోకి రావడం వస్తువుల్లోకి దూరడం ఇదేం తొలిసారి కాదు. ఇటీవల కేరళలోని త్రిస్సూర్లో పార్క్ చేసిన బైక్ హెల్మెట్లో పాము దాక్కుంది. సోజన్ అనే వ్యక్తి తాను పని చేసే ప్రాంతంలో ఓ చోట బైక్ పార్క్ చేసి ఉంచాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్దామని సాయంత్రం బైక్ తీయబోయాడు. అందులో పాము పిల్ల కనిపించిడంతో నిర్ఘాంతపోయిన సోజన్.. పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. హెల్మెట్లో నుంచి దాన్ని బయటకు తీసి అటవీప్రాంతంలో విడిచిపెట్టారు. ‼️WATCH: A man in Kerala narrowly avoided a venomous snake bite when he discovered a small cobra inside his two-wheeler helmet. The incident unfolded at his workplace in Kerala’s Thrissur. Sojan, who is a native of Thrissur, had placed his helmet on the platform beside his… pic.twitter.com/8OMTiqMGYE— truth. (@thetruthin) October 8, 2023 -
వందేభారత్ స్నాక్ ట్రేలు ధ్వంసం చేస్తున్న పిల్లలు?
భారతీయ రైల్వేకు సంబంధించిన ఓ వింత ఘటన బుధవారం వెలుగు చూసింది. రైలులో పరిశుభ్రత లోపించడం, సరిగా లేని ఆహారం తదితర విషయాలపై ప్రతిరోజూ రైల్వే అధికారులకు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా రైల్వే అధికారి ఒకరు ప్రయాణికులపై ఆరోపణలు చేశారు. అనంత్ రూపనగుడి అనే రైల్వే అధికారి ఇద్దరు చిన్నారుల ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వందే భారత్, ఇతర రైళ్లలో స్నాక్ ట్రేలు విరిగిపోవడానికి లేదా పాడైపోవడానికి ఇదే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఫోటోలో ఆ పిల్లలు ట్రేపై కూర్చున్నారు. అయితే ఆ ఫోటో సరైనదో కాదో ఇంకా తెలియరాలేదు. ఈ పోస్ట్ను లక్ష మందికి పైగా నెటిజన్లు చూశారు. వెయ్యిమందికిపైగా యూజర్లు లైక్ చేశారు. 350 మందికి పైగా యూజర్లు ఈ పోస్టును షేర్ చేశారు. దీనిపై స్పందించిన ఒక యూజర్.. ఇలాంటి పిల్లల తల్లిదండ్రుల నుండి జరిమానా వసూలు చేయాలని రాశారు. అయితే రైల్వేశాఖ నుంచి ఈ ఘటనపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది కూడా చదవండి: మనిషి పాదరక్షలు ఏనాటివి? ఆశ్చర్యపరుస్తున్న పరిశోధనలు! One of the main reasons for breaking of snack trays or defective snack trays in #VandeBharat and other trains! Even with photographic evidence, whiners would say that I pass on the blame only to passengers! #IndianRailways #Responsibility #passengers pic.twitter.com/ykv0VNED9a — Ananth Rupanagudi (@Ananth_IRAS) November 22, 2023 -
అంతరిక్షంలోకి స్నేక్ రోబో.. నాసా ఆవిష్కరణలో భారత మేధస్సు
న్యూయార్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ సరికొత్త రోబోను తయారుచేసింది. చంద్రుడు, అంగారక గ్రహంపై జీవం పుట్టుక ఆనవాళ్లను పసిగట్టడానికి ఈ రోబో ఉపయోగపడనుంది. సరిగ్గా పాములాగే కనిపించే ఈ రోబో ఎలాంటి ప్రతికూల ప్రదేశాలకైన ప్రయాణించగలదు. అయితే.. దీని తయారీ వెనక ఓ భారతీయ కుర్రాడి ప్రతిభ దాగి ఉంది. నాగ్పుర్లో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన రోహణ్ టక్కర్ నాసాలో పనిచేస్తున్నారు. ‘ఎగ్జోబయోలజీ ఎక్స్టంట్ లైఫ్ సర్వేయర్(ఈఈఎల్ఎస్)’ పేరుతో పిలుస్తున్న ఈ రోబోను టక్కర్ కనిపెట్టాడు. పైథాన్లా ప్రయాణించే ఈ రోబో ఎలాంటి గరుకైన ప్రదేశాలకైన వెళ్లగలదు. కొండలు, గుహల్లోనూ సునాయసంగా ప్రయాణించగలదు. ఇతర గ్రహాలపైనా జీవం పుట్టుకను కూడా ఇది అన్వేషించగలదు. విపత్తు నిర్వహణల్లోనూ ఇది ఉపయోగపడనుంది. నాగ్పూర్లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజినీరింగ్లో బీటెక్ పూర్తి చేసిన టక్కర్.. నాసా కోసం మార్టిన్ హెలికాప్టర్ను రూపొందించారు. ఐఐటీ చదివిన బాబ్ బలరామ్ నుండి ప్రేరణ పొందినట్లు పంచుకున్నారు. తను ఐఐటీ సాధించడంలో విఫలమయ్యానని అయినప్పటికీ నాసాలో విజయం సాధించానని చెప్పారు. చంద్రయాన్ 3 విజయం భారత్కు గర్వకారణం అని అన్నారు. ఇదీ చదవండి: బైడెన్తో జిన్పింగ్ భేటీ -
13 అడుగుల గిరినాగు అలజడి
ఎస్.కోట పట్టణంలోని ఇండియన్ ఆయిల్ బంక్ సమీపంలో రాత్రి 7.30 గంటల సమయంలో సుమారు 13 అడుగుల పొడవు ఉన్న గిరినాగు హల్చల్ చేసింది. దీనిని స్థానికులు గుర్తించి స్నేక్క్యాచర్ వానపల్లి రామలింగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. ఆయన చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాటిపూడి రిజర్వాయర్ అటవీప్రాంతంలో పామును విడిచిపెడతానని స్నేక్క్యాచర్ తెలిపాడు. -
పాముకు ప్రాణదానం
రాయచూరు రూరల్: పాము అంటేనే ప్రాణాలు తీస్తుందని భయపడతాం. కనిపిస్తే పరుగులు తీస్తాం... కానీ అస్వస్థతకు గురైన ఓ పామును వైద్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి వైద్యం చేసి ఊపిరిపోశారు. ఈ సంఘటన మంగళవారం కర్ణాటకలోని రాయచూరు జిల్లా లింగసూగూరులో చోటుచేసుకుంది. లింగసూగూరు తాలూకా హట్టి సమీపంలోని పామనకల్లూరు క్రాస్ వద్ద ఓ జెర్రిపోతు పాము కారులోకి దూరింది. హట్టి ఆస్పత్రి వైద్యుడు రవీంద్రనాథ్ ఆ పామును పట్టుకోవడానికి ప్రయత్నించగా దొరకలేదు. అది కారు నుంచి బయటకు రావాలని ఫినాయిల్ చల్లడంతో వాసన తట్టుకోలేక బయటకొచ్చింది. కానీ స్పృహ తప్పి అచేతనంగా పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న లింగసూగూరుకు చెందిన పాముల వైద్యుడు ఖాలిద్ చావుస్ వచ్చి ఆ పామును గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. పాము నోట్లో ఆక్సిజన్ పైపు పెట్టి చికిత్స చేయడంతో కోలుకుంది. తర్వాత ఆ పామును ఊరికి దూరంగా వదిలిపెట్టారు. -
యూట్యూబర్ పైత్యం: మండిపడుతున్న నెటిజనులు
యూట్యూబ్లో లైక్స్, వ్యూస్ కోసం కొంతమంది వింత విన్యాసాలు, ప్రమాదకర ఫీట్స్తో సోషల్మీడియా యూజర్లకు చిరాకు తెప్పించడం ఈ మధ్య కాలంలో రొటీన్గా మారి పోయింది. ఈ క్రమంలోనే రైలు పట్టాలపై పటాకులు కాల్చిన వీడియో నెటిజనులకు ఆగ్రహం తెప్పింది. రైల్వే ప్లాట్ఫారమ్పై యూట్యూబర్ నిర్భయంగా పటాకులు స్నేక్ క్రాకర్స్ కాల్చుతున్న వీడియో ట్విటర్లో వైరల్ అయింది. దీంతో సోషల్ మీడియా క్రియేటర్లకు, యూట్యూబర్ల అతి చేష్టలకు హద్దు పద్దూ లేకుండా పోతోందంటూ ఆగ్రహం పెల్లుబుకింది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ రైల్వే శాఖను ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు. దీంతో ర్వైల్వే శాఖ స్పందించింది. ఫూలేరా-అజ్మీర్ సెక్షన్లోని దంత్రా స్టేషన్ సమీపంలో ఈ వీడియోను షూట్ చేసినట్టు తెలుస్తోంది.ఇందులో రైలు పట్టాలపై కుప్పగా పోసిన పాము బిళ్లల్ని ఒక్కసారిగా వెలిగించాడు. దీంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ అలుముకుంది.33 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ట్రైన్స్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. దయచేసి ఇలాంటి దుర్మార్గులపై అవసరమైన చర్యలు తీసుకోండి అనే క్యాప్షన్తో దీన్ని షేర్ చేసింది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి...ప్రాణాలతో చెలగాటాలా అంటూ ఒకరు, అసలే దేశమంతా కాలుష్యంతో మండిపోతోంది. దీపావళి సందర్భంగా పిల్లలు ఎక్కువగా ఇష్ట పడే ఈ పాము బిళ్ళలు ఎక్కువ కార్బన్ను రిలీజ్ చేస్తాయంటూ మరొకరు మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం ఇలా చేస్తారా? పర్యావరణం కలుషితమవుతోంది. రైలు పట్టాల దగ్గర ఇలాంటి ప్రయోగాలు ప్రమాదకరం అంటూ తీవ్రంగా స్పందించడం గమనార్హం. అంతేకాదు ఇది పెను ప్రమాదానికి దారి తీయవచ్చు..చర్యలు తీసుకోండి అంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ వీడియోపై నార్త్ వెస్ట్రన్ రైల్వే స్పందించింది. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా డివిజనల్ రైల్వే మేనేజర్, జైపూర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను ఆదేశించింది. ప్రస్తుతం వీడియోపై ఆర్పీఎఫ్ దర్యాప్తు చేస్తోంది. ఇది ఇలా ఉంటే స్నేక్ క్రాకర్స్ అనేవి అత్యధిక మోతాదులో PM2.5 (2.5 మైక్రాన్ల కంటే తక్కువ పర్టిక్యులేట్ మ్యాటర్)ను విడుదల చేస్తాయని 2016నాటి చెస్ట్ రీసెర్చ్ ఫౌండేషన్ (CRF), పూణే విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. YouTuber bursting crackers on Railway Tracks!! Such acts may lead to serious accidents in form of fire, Please take necessary action against such miscreants. Location: 227/32 Near Dantra Station on Phulera-Ajmer Section.@NWRailways @rpfnwraii @RpfNwr @DrmAjmer @GMNWRailway pic.twitter.com/mjdNmX9TzQ — Trains of India 🇮🇳 (@trainwalebhaiya) November 7, 2023 -
ఈ పోలీస్ మాములోడు కాదు.. పాముకు సీపీఆర్
మధ్యప్రదేశ్లోని నర్మదాపురంనకు చెందిన ఒక వీడియో వైరల్గా మారింది. ఒక పోలీసు కానిస్టేబుల్ తన నోటి ద్వారా పాముకు ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నిం చేశారు. ఈ విధంగా పాముకి సీపీఆర్ ఇచ్చేందుకు ప్రయత్నించడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. సెమ్రీ హర్చంద్లోని తవా కాలనీలో పాము ఉన్నట్లు పోలీసు కానిస్టేబుల్ అతుల్ శర్మకు సమాచారం అందింది. అతుల్ 2008 నుండి ఇప్పటి వరకూ 500 పాములను రక్షించారు. డిస్కవరీ ఛానెల్ చూసి, పాములను ఎలా రక్షించాలో అతుల్ నేర్చుకున్నారు. తాజా ఘటనలో నీటి పైపులైన్లో పాము ఉందని తెలుసుకున్న అతుల్ శర్మ దానిని బయటకు తెచ్చేందుకు పురుగుమందును నీటిలో కలిపి పైపులైన్లో వేయగా, ఆ పాము అపస్మారక స్థితికి చేరుకుంది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో ఒక పాము అపస్మారక స్థితిలో ఉండటం, దానికి పోలీసు కానిస్టేబుల్ సీపీఆర్ ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను చాలా మంది షేర్ చేశారు. మరోవైపు ఈ వీడియో చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో మరికొందరు ఆ పోలీసు ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: దేశంలో వీధి కుక్కలు ఎన్ని? కుక్క కాటు కేసులు ఎక్కడ అధికం? #MadhyaPradesh : ज़हरीले सांप की जान बचाने के लिए पुलिस वाले ने दिया CPR, VIDEO देख हैरत में पड़े लोग#CPR #SnakeRescue pic.twitter.com/FK8Xft2Myr — NDTV India (@ndtvindia) October 26, 2023 -
ఆ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట!
పాములు లేని ఊరు, గ్రామం ఉండు. కానీ కొన్ని దేశాల్లో అస్సలు పాము అనేదే కనిపించదట. ముఖ్యంగా ఓ దేశంలో అయితే ఇంతవరకు పాము కనిపించిన దాఖలాలు లేవని తేల్చి చెబుతున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఎందువల్ల అక్కడ పాములు కనిపించవు? రీజన్ ఏంటి తదితరాల గురించే ఈ కథనం!. బ్రిటన్ , ఐర్లాండ్లో పామలు అస్సలు కనపించవట. అందుకు కారణంగా అతి శీతల ప్రదేశాలు కావడం వల్ల అని అంటుంటారు. గడ్డకట్టే చలిలో ఆ సరిసృపాలు జీవించలేవని అందువల్లే ఇక్కడ పాములు లేవని చెబుత్నున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకు ఒక్క పాము కూడా కనిపించనట్లు రికార్డుల్లో కూడా లేదని చెప్పారు. పురాణాల ప్రకారం క్రీస్తు శకంలో సెయింట్ పాట్రిక్ అనే క్రైస్తవ మత పెద్ద ఐర్లాండ్ ద్వీపం నలుమూలలోని పాములను తరిమేసి సముద్రంలోకి పడేశాడని అందువల్లే ఇక్కడ పాములు ఉండవని కథలు కథలుగా చెబుతుంటారు. అంతేగాదు సుమారు పదివేల సంవత్సరాల క్రితం ప్రకృతి వైపరిత్యం వల్ల హిమనీనదాలు కరిగిపోవడంతో ఈ ఐర్లాండ్ ద్వీపం కొన్నేళ్ల వరకు మునిగిపోయిందని, అందువల్లే పాములు లేవని చెబుతుంటారు. పురావస్తు రికార్డుల ప్రకారం, బ్రిటన్, ఐర్లాండ్ దేశాల్లో పాములు లేవని వెల్లడించింది. ఐతే ఆ తర్వాత మరికొన్ని పరిశోధన కారణంగా ఈ దేశాల్లో మూడు రకాల పాము జాతులను గుర్తించారు. గడ్డి పాములు, ఎడ్డర్ పాములు, సాధారణ పాములు వంటి సరీసృపాలు జాతులను మాత్రమే గుర్తించారు. అలాగే న్యూజిలాండ్లో కూడా ఒక్క పాము కూడా కనిపించదట. ఇది ఎన్నో రకాల అడవి జంతువులకు నిలయమైన ఇక్కడ కూడా ఒక పాము కూడా కనిపించదట. (చదవండి: నిద్ర సమస్యల్ని ఈజీగా పట్టేస్తుంది ఈ వాచ్!) -
అది పాము కళేబరం కాదు.. ప్లాస్టిక్
చిత్తూరు: గర్భిణికి పంపిణీ చేసిన పౌష్టిక ఆహారంలోని ఎండు ఖర్జూజ ప్యాకెట్లో వచ్చింది పాము కళేబరం కాదని, అది ప్లాస్టిక్ అని ఐసీడీఎస్ పీడీ నాగశైలజ స్పష్టం చేశారు. మండలంలోని జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్ అంగన్ వాడీ కేంద్రంలో ప్రభుత్వం సరఫరా చేసిన పౌష్టిక ఆహారంలో పాము కళేబరం అంటూ బుధవారం పచ్చ పత్రికల్లో, చానళ్లలో వార్తలు ప్రచురితమైయ్యాయి. దాంతో ఐసీడీఎస్ పీడీ శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో విచారణ చేపట్టారు. పౌష్టికాహారం అందుకున్న గర్భిణి మానసను విచారించారు. ఈ నెల నాలుగో తేదీ పంపిణీ చేశారనీ, అందులో ఎండు ఖర్జూరం ఫ్యాకెట్ను మంగళవారం తెరిచినట్లు ఆమె తెలిపింది. అందులో పాము లాంటి వస్తువు ఉండడంతో ఈ విషయాన్ని అంగన్వాడీ కార్యకర్త జానకి దృష్టికి తీసుకు వెళ్లినట్లు పేర్కొంది. తరువాత ఎండు ఖర్జూరం ప్యాకెట్లో పాము లాంటి వస్తువును చేతిలోకి తీసుకుని కళేబరమా లేక ఇతర వస్తువేదైనా అని పరిశీలించారు. దాని వాసన చూశారు. చేతిలో పట్టుకుని గట్టిగా విరిచారు. విరగక పోవడంతో పాము కళేబరం కాదని నిర్థారించారు. పీడీ మాట్లాడుతూ పాము కళేబరం ఐతే తునిగి ముక్కలుగా విరిగిపోయేదన్నారు. ప్యాకింగ్ సమయంలో ప్లాస్టిక్ లాంటి వస్తువు ఎండు ఖర్జూజంతో ఫ్యాక్ అయిందని అనుమానం వ్యక్తం చేశారు. ఫ్యాకెట్లో ఉన్న వస్తువు గట్టిగా అంగుళంపైగా ఉందని, అక్కడక్కడ పచ్చచుక్కలు కలిగి ఉందని, ల్యాబ్కు పంపుతామన్నారు. అంగన్వాడీ సిబ్బంది పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. పాము కళేబరం ఫ్యాకెట్లో ఉంటే వాసన వచ్చేదన్నారు. పచ్చపత్రికలు ప్రభుత్వంపై బురద జల్లె ప్రయత్నం చేయడం గర్హనీయమని తెలిపారు. -
పెంపుడు పాములను ఎప్పుడైనా చూసారా?
-
ఇంటి బయట ‘షూ’ విడుస్తున్నారా?.. ఈ వీడియో మీకోసమే..
సాక్షి, హైదరాబాద్: పాములను చూస్తే భయంతో దూరంగా పరుగులు తీస్తాం. అలాంటిది.. ఇటీవలే ఒకరి హెల్మెట్లో పాము పిల్ల దూరిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా భయంకరమైన కింగ్ కోబ్రా.. ఒక మహిళ షూలోకి దూరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్ వేదికగా పాముకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. వీడియో ప్రకారం.. ఓ మహిళ తన ఇంటి ముందు షూను వదిలేసింది. ఇక అందరి కళ్లుగప్పి.. నాగుపాము షూలోకి దూరింది. సదరు మహిళ షూ వేసుకునేందుకు యత్నించగా, బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. Cobra trying a new footwear😳😳 Jokes apart, as the monsoon is coming to a close, please be extra careful. pic.twitter.com/IWmwuMW3gF — Susanta Nanda (@susantananda3) October 5, 2023 ఇంతలో షూను కదిలించగా, పడగ విప్పి బయటకు వచ్చింది కింగ్ కోబ్రా. దీంతో ఆమె హడలిపోయింది. దూరంగా పరుగెత్తింది. కాసేపటికే నాగుపాము అటు నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది కూడా చదవండి: భార్యకు గుడ్బై.. ఇజ్రాయెల్ కోసం భర్త సంచలన నిర్ణయం -
తాచుపాముతో ఆటలాడుతున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా?
పై ఫోటోలో చేతిలో పాము పట్టుకొని ధైర్యంగా చూస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? సరే మీకోసం ఓ చిన్న క్లూ. ఆమె ఒక మల్టీ టాలెంటెడ్ నటి. యాంకర్, నిర్మాత, సింగర్, నటిగా.. అన్ని రంగాల్లోనూ రాణించింది. ఆమె తండ్రి ఓ సీనియర్ హీరో. ఆమెకు ఇద్దరు సోదరులు.. వాళ్లు కూడా హీరోలే. ఎస్.. మీరు ఊహించింది కరెక్టే. ఆమె మన మంచు లక్ష్మీనే. సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. బహుముఖ ప్రజ్ఞతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తొలుత కొన్ని ఇంగ్లీష్ సీరియల్స్, టీవీ షోలు చేసిన లక్ష్మీ.. అనగనగా ఓ ధీరుడు(2011) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే నెగెటివ్ పాత్రలో నటించింది మెప్పించింది. ఆ తర్వాత హీరోయిన్గా దొంగలముఠా, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, చందమామ కథలు, బుడుగు, దొంగాట తదితర సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించింది. నేడు(అక్టోబర్ 8) మంచు లక్ష్మీ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఆమె చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
పాముకాటుతో కాంగ్రెస్ నాయకురాలి మృతి
అనంతపురం: పాముకాటుతో మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు జానకమ్మ (50) శుక్రవారం మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాలమేరకు.. జానకమ్మ కూడేరులోని శివపార్వతుల జోడు లింగాల సంగమేశ్వరస్వామి దేవాల యం వద్ద పూజా సామగ్రి దుకాణం నిర్వహిస్తోంది. వారి కుటుంబం సభ్యులు కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. శుక్రవారం వేకువజామున జానకమ్మను పాము కాటేయడంతో గమనించిన భర్త ఆంజనేయులు పామును చంపేశాడు. తొలుత స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లాడు. వైద్య సిబ్బంది సూచన మేరకు అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జానకమ్మ సాయంత్రం మృతి చెందింది. -
పూజగదిలో బుస్....
కర్ణాటక: దేవుని గదిలో పాము బొమ్మను పెట్టుకుని నాగదేవత అని పూజలు చేస్తారు. అదే నిజమైన పాము వస్తే బెంబేలెత్తిపోతారు. ఆహారం వెతుక్కుంటూ వచ్చిన నాగుపాము ఒకటి ఇంటిలోకి వెళ్లి ఏకంగా దేవుని గదిలో తిష్టవేసింది. పడగ విప్పి బుస్ మంటున్న పామును చూసి ఇంట్లోనివారు కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఈ సంఘటన తుమకూరు నగరంలోని యల్ళాపురలోని వినాయక నగరలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. సిద్దరాజు అనే వ్యక్తి ఇంటిలోని దేవుని గదిలోకి ఎక్కడి నుంచో నాగుపాము వచ్చింది. పూజ చేయాలని వచ్చిన సిద్దరాజు పామును చూసి భయపడిపోయాడు. పాములు పట్టడంలో నిపుణుడైన దిలీప్కు కాల్ చేయగా ఆయన వచ్చి పామును పట్టుకుని దేవరాయన దుర్గ అడవిలో వదిలిపెట్టాడు. -
పాకిస్తాన్ జాతీయ జంతువు ఏది? ఏ విషప్రాణులను మింగుతుంది?
మార్ఖోర్ అనేది అడవి మేక. ఇది హిమాలయ ప్రాంతాలలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి చాలా కథలు వినిపిస్తాయి. ఇది పాములకు తొలి శత్రువు అని చెబుతారు. పాములు ఎక్కడున్నాయో కనిపెట్టి, వాటిని చంపి, నమిలి మింగేస్తుందని చెబుతారు. పాకిస్తానీ గూఢచార సంస్థ ఐఎస్ఐ చిహ్నంలో మార్ఖోర్ కనిపిస్తుంది. మార్ఖోర్ పాకిస్తాన్ జాతీయ జంతువు. మార్ఖోర్ అనేది పర్షియన్ పదం. దీని అర్థం పాములను తినేది లేదా పాములను చంపేది. ఈ జంతువు తన వాడి అయిన కొమ్ములతో పాములను చంపి, వాటిని తినగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని స్థానిక జానపద కథలు చెబుతున్నాయి. పాముకాటు నుండి విషాన్ని తొలగించడంలోనూ మార్ఖోర్ సహాయపడుతుందని కూడా చెబుతారు. అయితే మార్ఖోర్.. పాములను తిన్నట్లు లేదా వాటి కొమ్ములతో పాములను చంపినట్లు ఆధారాలు ఎక్కడా కనిపించవు. అయితే పాకిస్తాన్ ప్రజలు మార్ఖోర్లు ఉండే చోట పాములు కనిపించవని నమ్ముతారు. ప్రస్తుతం మనకు సాధారణంగా మేక.. మార్ఖోర్ నుండి ఉద్భవించి ఉండవచ్చని చార్లెస్ డార్విన్ ఊహించాడు. మార్ఖోర్ చాలా శక్తివంతమైనది. 6 అడుగుల పొడవు, 240 పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. దీనికి దవడ నుండి కడుపు దిగువ వరకు విస్తరించిన దట్టమైన గడ్డం ఉంటుంది. మార్ఖోర్లు ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి టర్కిస్తాన్ వరకు 2,000 నుండి 11,800 అడుగుల ఎత్తయిన పర్వతాలలో నివాసం ఉంటాయి. ఇవి ప్రధానంగా శాఖాహారులు. ఇవి సాధారణంగా గుంపులుగా జీవిస్తాయి. ఒక మందలోని మార్ఖోర్ల సగటు సంఖ్య దాదాపు 9గా ఉంటుంది. కాగా వేట కారణంగా మార్ఖోర్ల జనాభా తగ్గుతోంది. వాటి ప్రత్యేకమైన కొమ్ముల కోసం వేటగాళ్లు మార్ఖోర్లను వేటాడుతారు. ఇది కూడా చదవండి: భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్ భవితవ్యం -
ఆహా పాము రుచి..! తినరా మైమరచి!!
సాక్షి, హైదరాబాద్: పాము దొరికిందంటే అతనికి పసందైన విందే.. దాన్ని చంపి తోలు ఒలిచి పచ్చిదే ఆరగిస్తుంటాడు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామానికి చెందిన పుల్లన్నకు పాములు తినే అలవాటుంది. గతంలో చిన్నచిన్న పాములను పట్టుకుని తినే పుల్లన్న సోమవారం చనిపోయిన ఆరడుగుల పామును మెడలో వేసుకుని కొరుక్కుని తింటూ గ్రామ వీధుల్లో తిరిగాడు. ఈ ఘటన చూసిన గ్రామస్తులు విస్తుపోయారు. దీనిపై పుల్లన్నను ప్రశ్నించగా పామును తినడం తనకు అలవాటేనని, కోడికూర తిన్నట్లే ఉంటుందని చెప్పాడు. అయితే ఈ పాము బాగా ముదిరిపోయి ఉన్నందున మూరెడు ముక్క మాత్రమే తినగలిగానని చెప్పాడు. – పుట్లూరు -
ఈ పాములు కరిస్తే సెకన్లలోనే ప్రాణం పోతుంది..
మార్కాపురం: పొలాల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షాలు కురవడంతో పాములు పుట్టల్లో నుంచి పొలాల్లోకి వచ్చి రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏ క్షణం ఎటువైపు నుంచి ఎలాంటి పాము వస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మిరప పొలాల్లోనే పాముల సంచారం అధికంగా ఉంది. వారం రోజుల క్రితం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రామచంద్రాపురం రైతు పాముకాటుకు గురయ్యారు. సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణానికి ప్రమాదం తప్పింది. హలో.. సార్.. పాము! పాముల్లో అత్యంత విషపూరితమైన పాముల్లో మొదటిది రక్తపింజర, రెండోది తాచు, మూడోది కట్ల పాము. మార్కాపురం ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎక్కువగా రక్తపింజరలు సంచరిస్తుండటంతో ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం ప్రాంతంలో అధికారికంగా స్నేక్ రెస్క్యూ టీమ్ సభ్యుడైన నిరంజన్ 20 రోజుల వ్యవధిలో 10 పాములను పట్టుకున్నారు. రామచంద్రాపురం, రాయవరం, కొండేపల్లి, నికరంపల్లి బడేఖాన్పేట, బుడ్డపల్లి, మాల్యవంతునిపాడు, సీతానాగులవరం తదితర గ్రామ పొలాల్లో పాములను గుర్తించిన రైతులు సకాలంలో స్నేక్ క్యాచర్కు సమాచారం ఇవ్వడంతో బంధించి అటవీ ప్రాంతంలో వదిలారు. వీటిలో ఎక్కువగా రక్తపింజర, తాచు, కట్లపాములు ఉన్నట్లు స్నేక్ క్యాచర్ ‘సాక్షి’కి వివరించారు. రక్తపింజర యమా డేంజర్ ఐదు అడుగుల పొడవుండే రక్తపింజర పాముల్లో అత్యంత ప్రమాదకరమైంది. కాటేసిన 40 నిమిషాల్లోపు వైద్య చికిత్స అందకపోతే ప్రాణానికి ప్రమాదం. కాలుకు గురైన వారి శ్యాస వ్వవస్థ దెబ్బతినడంతోపాటు శరీరమంతా చెమటలు పడతాయి. రక్తపింజర విషం రక్తాన్ని వేగంగా పలుచన చేస్తుంది. తద్వారా గుండె బలహీనపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఎక్కువగా గడ్డి, పొదలు, పత్తి, మిరప, పొగాకు, కంది చేలల్లో రక్తపింజరలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లోకి కొండచిలువలు మార్కాపురం ప్రాంతంలో కొండచిలువలు జనావాసాల మధ్యకు వస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. 18 అడుగుల పొడవు 90 నుంచి 100 కిలోల బరువు ఉండే కొండచిలువలు పొలాల్లో రైతులను భయపెడుతున్నాయి. ఇటీవల కాలంలో 3 ప్రాంతాల్లో భారీ కొండచిలువలు పట్టుకుని అడవుల్లో వదిలేశారు. నల్లమల అడవుల్లో నుంచి సమీప గ్రామాల్లోకి వస్తున్న కొండచిలువలు కోళ్లు, మేకలు, కుందేళ్లు, జింకలను భుజిస్తున్నాయి. భారీ కొండచిలువలు మనిషిని చుట్టేస్తే దాని పట్టు నుంచి బయటపడటం చాలా కష్టం -
పాములు కాటేసే ముందు హెచ్చరిస్తాయా..?
పాములు కాటేసే ముందు ముందుగానే హెచ్చరిస్తాయట. ఆ ఒక్క పాము మినహా మిగిలిన అన్ని పాములు ముందుగానే వివిధ శబ్ధాలతో మన్నల్ని హెచ్చరిస్తాయి. నిజానికి అవి నేరుగా కాటేయవని ముందుగా సిగ్నల్ ఇస్తాయని నిపుణుల అంటున్నారు. దాన్ని నిశితంగా గమనిస్తే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చట. నిజానికి పాములను చూసి మనం భయపడతాం గానీ వాటికి మనం అంటేనే భయం. అందువల్లే అవి ప్రాణ భయంతో కాటేసే యత్నం లేదా సంకేతం ఇస్తాయట. ఒక్క కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ కాటు వేసే ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెప్తున్నారు. కట్లపాము ఒక్కటే ఎప్పుడు కాటువేస్తుందో చెప్పలేం. మిగిలిన పాములు మాత్రం కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ "బుస్స్" "బుస్స్".. అని శబ్ధం చేస్తాయి. శరీరాన్ని నేలపై బలంగా కదిలిస్తూ శబ్ధం చేసే ప్రయత్నం చేస్తాయి. పాముల ప్రవర్తనను నిశితంగా గమనించగలిగితే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు అని స్నేక్ క్యాచర్ ధర్మేంద్ర త్రివేది అన్నారు. కట్లపాము విషయానికి వస్తే, రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటుంది. రాత్రి నుంచి ఉదయం వరకు ఆహారం కోసం వేటాడుతుంది. అందుకే రాత్రి సమయంలో ఎక్కువగా ఈ పాము కాటు ప్రమాదాలు చోటచేసుకుంటాయి. మిగిలిన పాములు పంట పొలాలు, నిర్మాణ ప్రదేశాలలో కనిపిస్తాయి. అవి బూడిద, నలుపు, గోధుమ రంగుల్లో ఉంటాయి కాబట్టి, ఈ ప్రదేశాల్లో సులభంగా దాక్కొని ఆహారం కోసం వేటాడతాయని చెబుతున్నారు. పాము కాటు వేసిన వెంటనే ఏం జరుగతుందంటే.. పాము కాటుకు గురైన 15-20 నిముషాల నుంచి విషం ప్రభావం శరీరంలో కనిపించడం మొదలవుతుంది. 30 నుంచి 45 నిముషాల సమయంలో విషం శరీరమంతా వ్యాపిస్తుంది. విషపూరిత లక్షణాలు కనిపించడానికి సుమారు రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతుంది. దాదాపు 4 నుంచి 6 గంటల్లో తీవ్రత గరిష్టస్థాయికి చేరుకుంటుంది. పాము కాటు వేసిన భాగంలో మాత్రమే నొప్పి తీవ్రంగా ఉంటుంది. అయితే, పాము కాటు వేస్తే, లక్షణాలు వెంటనే కనిపించవు” అని అన్నారు. పాము కాటు వేస్తే ఏం చేయాలి పాము కాటుకు గురైన వ్యక్తికి ముందు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. ఆందోళన పడకోడదు. సాధ్యమైనంత త్వరగా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి లేదా వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. ఏం చేయకూడదు..? పాము కాటుకు గురైన వ్యక్తిని కదల్చకూడదు. దీని వలన విషం వేగంగా శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంది. గాయానికి కట్టు కట్టడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది. పాము కాటుని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి క్షణమూ విలువైనదే అని గుర్తుంచుకోవాలి. వేసకి కాలంలో బయట సంచరిస్తాయట. శీతకాలంలో నిద్రాణ స్థితిలో ఉంటాయట. వర్షాకాలంలో గుడ్లు పెడతాయట. శీతకాలం వచ్చేలోపు ఈ సమయంలో కావల్సిన ఆహరం కోసం వేట మొదలుపెడతాయట. అందువల్ల ఈ కాలంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. (చదవండి: నత్తల విసర్జకాలు, తేనెటీగల విషంతో బ్యూటీ ప్రొడక్ట్స్! కొరియన్ల బ్యూటీ రహస్యం ఇదేనా!) -
స్కూటీలో దూరి.. చుక్కలు చూపించి..
సాక్షి, రాజన్న సిరిసిల్ల: చిన్నదే కానీ చుక్కలు చూపించింది. స్కూటీలో దూరి ఓనర్ని టెన్షన్ పెట్టించింది. దానిని చూసేందుకు జనం సైతం ఎగబడడంతో భారీగా ట్రాఫిక్ఝామ్ కూడా అయ్యింది. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద జరిగిన హైడ్రామా.. స్నేకా.. మజాకా అని అందరితో అనిపించింది. సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ వద్ద షబ్బీర్ అనే వ్యక్తి ఓ షాప్ ముందుకు తన స్కూటీని ఉంచాడు. అయితే.. నెమ్మదిగా అందులోకి దూరింది ఓ పాము. సమాచారం అందన్కున్న స్నేక్ క్యాచర్ గంటపాటు శ్రమించి బండి మొత్తం పార్ట్స్ విప్పదీశాడు. ఎట్టకేలకు ఆ చిన్నపామును పట్టుకోగలిగాడు. ఆపై దానిని వాటర్ బాటిల్లో దూర్చి దూరంగా తీసుకెళ్లాడు. స్కూటీలో పాము దూరిందనే వార్త సాధారణంగానే జనాలను ఆకట్టుకుంది. చుట్టూ మూగి ఆ డ్రామా అంతా చూస్తూ ఉండిపోయారు. చివరకు పామును స్నేక్క్యాచర్ పట్టేయడంతో స్కూటీ ఓనర్ ఊపిరి పీల్చుకున్నాడు. -
అపార్ట్మెంట్లో కొండచిలువ కలకలం..!
హైదరాబాద్: ఓ అపార్ట్మెంట్లోకి కొండ చిలువ ప్రవేశించడంతో స్థానికంగా కలకలం రేపింది. నిజాంపేట్ కార్పొరేషన్ ప్రగతినగర్లోని సాయి ఎలైట్ అపార్ట్లోని పార్కింగ్ ప్రదేశంలోకి కొండ చిలువ ప్రవేశించడంతో అపార్ట్మెంట్ వాసులు భయబ్రాంతులకు లోనయ్యారు. ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ సభ్యుడు అంకిత్ శర్మకు ఫోన్ చేయడంతో వెంటనే అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నాడు. తన వెంట తెచ్చిన బ్యాగ్లో కొండ చిలువను తీసుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద నీటితో కొండ చిలువ కొట్టుకుని వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
తెలంగాణ: 200 ఏళ్లకు ఆ పాము దర్శనం
మహబూబ్నగర్: మున్సిపాలిటీ పరిధిలోని మహాత్మాజోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల సమీపంలో బుధవారం అరుదైన పామును గుర్తించారు. నల్లటిరంగు కలిగి తెల్లటి పట్టీలతో కూడిన వెల్లూరు బ్రైడల్ పామును చూసిన స్థానికులు డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డా.సదాశివయ్యకు సమాచారం అందించారు. ఆయన బయోలజి ఉపాధ్యాయు డు దేవిలాల్కు చెప్పడంతో వెళ్లి పామును పట్టుకుని ఫొటోలను సదాశివయ్యకు పంపించారు. పట్టుకున్న పాము అరుదైనదిగా గుర్తించారు. విషరహిత పాము కావటం వల్ల దానివల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని సమీపంలోని అటవీప్రాంతంలో వదిలేయాలని సూచించటంతో దేవిలాల్ దానిని గుట్టపై ఉన్న అటవీప్రాంతంలో వదిలేశారు. సదాశివయ్య మాట్లాడుతూ నల్లటిరంగులో తెల్లటి పట్టీలు కలిగి అందంగా కనిపించే పామును శాసీ్త్రయంగా డ్రయోకలామస్ నింఫా అని పిలువబడే కోలుబ్రీడే కుటుంబానికి చెందినదిగా వివరించారు. 50సెం.మీ. వరకు పాము పొడవు అవుతుందన్నారు. ఈ పామును మొట్టమొదట తమిళనాడులోని వెల్లూరు సమీపంలో 1803లో గుర్తించారని తెలిపారు. దీనిమెడపైన ఉన్న తెల్లని మచ్చ పెళ్లికూతురు మెడమీద ఉన్న ఓణిలా ఉండటం మూలాన వెల్లూర్ బ్రైడల్ స్నేక్ అని పిలుస్తారన్నారు. కేరళ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో దీనిని గుర్తించినా ఇప్పటి వరకు పాముకు సంబంధించిన అనేక విషయాలు ప్రపంచానికి తెలియవన్నారు. ఎన్నిగుడ్లు పెడుతుంది, ఎన్ని రోజులకు పిల్లలుగా మారుతాయి, ప్రత్యుత్పత్తి వివరాలు తెలియవన్నారు. ఎలాంటి గోడలైనా సునాయాసంగా ఎక్కగలదని, ఎలుకలు, బల్లులు ప్రధాన ఆహారంగా తీసుకుంటుందన్నారు. -
చల్లారని పాము పగ?.. 3 నెలల్లో తొమ్మిదిసార్లు కాటు!
కర్ణాటక: పాము పగ 12 ఏళ్లు అనే నానుడి ఉంది, అది నిజమో, అబద్ధమో తెలియదు కానీ ఒక సర్పం బాలున్ని పదే పదే కాటేస్తూనే ఉంది. వివరాలు.. కలబురగి జిల్లా చిత్తాపుర తాలూకాలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సుమారు మూడు నెలల వ్యవధిలో 9 సార్లు కాటు వేసిందంటే అశ్చర్యం కలగకమానదు. జూలై 3న మొదటిసారిగా బాలున్ని నాగుపాము కాటు వేయడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందించారు. ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లిన మూడు రోజులకే మళ్లీ పాము కరిచింది. ఇలా తొమ్మిదిసార్లు కాటు వేయగా ఆరుసార్లు ఆస్పత్రిలోను, మూడుసార్లు నాటు ఔషధంతో చికిత్సలు చేయించారు. చివరకు కుటుంబసభ్యులు పాముకు భయపడి సొంతూరు హలకర్ణి గ్రామం వదిలి వాడి అనే ఊరుకు వలసపోయారు. అక్కడ కూడా బాలున్ని పాము కాటు వేసింది. అయితే కరిచిన పాము తల్లిదండ్రులకు గానీ, స్థానికులకు గానీ కనిపించడం లేదని చెబుతున్నారు. -
హడలెత్తించిన భారీ నల్లతాచు
శ్రీకాకుళం: మందసలో భారీ నల్లతాచు శనివారం స్థానికులను భయపెట్టింది. పట్టణంలోని వాసుదేవ స్వామి ఆలయం సమీపంలోని కూరగాయల తోటలకు శనివారం ఉదయం స్థానికులు పనికి వెళ్తుండగా చలనం లేకుండా పడి ఉన్న 14 అడుగుల నల్లతాచు కనిపించింది. సర్పాన్ని చూసిన వెంటనే వారు హడలెత్తిపోయారు. కాస్త పరిశీలనగా చూసి మరణించిందని నిర్ధారించుకున్నారు. ఆ పామును చూసేందుకు స్థానికులంతా అక్కడకు వచ్చా రు. మందస ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, జూవాలజీ అధ్యాపకుడు చింతాడ శరత్బాబు మాట్లాడుతూ ఇది అరుదైన కింగ్కోబ్రా అని, దీనినే రాచనాగు అనికూడా పిలుస్తారన్నారు. దీని జాతి పేరు ఓఫియోఫేగస్ అని, సుమారు 18 నుంచి 20 అడుగుల వరకు పెరుగుతుందని, జీవితకాలం 20 ఏళ్లన్నారు. ఇది సిగ్గరి అని, ఎవరి కంట పడడానికి ఇష్టపడదని, నాగుపాములు, ఇతర పాములను ఆహారంగా తీసుకుంటుందన్నారు. -
అత్యంత అరుదైన పాము! వీడియో వైరల్
కొన్ని పాములు అత్యంత అరుదుగా కనిపిస్తాయి. అవి చూసేందుకు కూడా చాలా వింతగా ఉంటాయి. పురాణల్లోనో, సినిమాల్లోనో చూసి ఉంటాం అలాంటి రెండు తలలు పాముల లేదా ఐదు తలల పాములు. అంతేతప్ప మాముటుగా చూడటం కుదరదు. పైగా తాచుపాము జాతుల్లోని ప్రత్యేక పాములే ఇలా ఉంటుంది. ఆ ఐదు తలలు సెపరేట్గా ఉండి ఆ తలలన్నింటికి ఒకటే దేహంలా కింద భాగం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పాము అందుకు విభన్నం రెండు తలలు కలిసి పోయి ఉంటుంది. అచ్చం మనుషులకు జన్మించే అవిభక్త కవలల మాదిరిగా ఆ పాము ఉంది. నిజానికి ఆ రీతిలో జన్మించినవి పుట్టిన కొద్దిసేపటికే చనిపోతాయి. కానీ ఇది అలా కాదు. ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉంది. హాయిగా కదులుతుంది. కాస్త ఆహారం తినేటప్పుడూ ఇబ్బంది పడుతుందేమో గానీ చూస్తే మాత్రం మాములు పాముల మాదిరిగానే పాకుతుండటం విశేషం. ఈ ఘటన యూకేలోని ఓ దుకాణంలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Exeter Exotics (@exeter_exotics) (చదవండి: గోల్డెన్ పాస్పోర్ట్ గురించి తెలుసా! అత్యంత ధనవంతులే తీసుకోగలరా!) -
నాగుల పంచమి నాడు నాగుపామునే ఇంటికి తీసుకొచ్చి పూజలు
శ్రావణమాసానికి ఎంతో విశిష్టత ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ మాసంలో ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. శ్రావణమాసం ప్రారంభం కాగానే నోములు, వ్రతాలతో పాటు పెద్ద ఎత్తున శుభకార్యాలు జరుగుతాయి. ఇక నిన్న శ్రావణ సోమవారంతో పాటు నాగపంచమి కూడా కావడంతో దేశంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నాగపంచమి అంటే పుట్టలో పాలుపోసి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. కానీ పామునే ఇంటికి తీసుకొచ్చి పూజలు చేసే వ్యక్తులు ఉంటారన్న విషయం మీకు తెలుసా? ఇది ఏంటో తెలియాలంటే స్టోరీ చదివేయండి. నాగ పంచమి రోజున నాగపామునే నట్టింట్లోకి తీసుకొచ్చి పూజ చేసింది ఓ కుటుంబం. చక్కగా పూలు, పాలతో పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించి ఆశీస్సులు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన ప్రశాంత్ హులేకర్ అనే వ్యక్తికి పాములు అంటే చాలా ఇష్టమట. అందుకే ప్రతి ఏటా నాగులపంచమికి కుటుంబంతో కలిసి పాములకు ప్రత్యేకంగా పూజలు చేస్తారట. అది కూడా ఇంటికి తీసుకొచ్చి మరీ. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నాగుల పంచమి సందర్భంగా ఓ పామును తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆ పామును అడవిలో వదిలిపెట్టారు. తనకు పాములంటే ఇష్టమని పాముల సంరక్షణ కోసం కృషి చేస్తుంటానని ప్రశాంత్ తెలిపాడు. అతని తండ్రి సురేష్ కూడా పాముల సంరక్షణ కోసం చాలా చేశాడట. ఇక ప్రతీ ఏడాది నాగుల పంచమి నాడు ఇలా పాముని ఇంటికి తీసుకొచ్చి ఆ తర్వాత జాగ్రత్తగా దాన్ని అడవిలో వదిలివేయడం చేస్తామని పేర్కొన్నారు. తన తండ్రి నుంచి వారసత్వంగా ఇలా చేయడం ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తుందని, ఇప్పటివరకు దీని వల్ల కుటుంబంలో ఎవరికి హానీ జరగలేదని తెలిపాడు. పాముల పట్ల తమకు ప్రత్యేక భక్తి ఉందని, అందుకే ఇలా చేస్తానని వెల్లడించాడు. -
పాము కాటుకు గురైన ప్రముఖ మంత్రి..
చంఢీగర్: పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ పాముకాటుకు గురయ్యారు. రూపనగర్ జిల్లాలోని ఆనంద్పూర్ సాహిబ్ ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సంచరిస్తుండగా.. ఈ ఘటన జరిగింది. ఆగష్టు 15 రాత్రి పాముకాటుకు గిరికాగా.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా పాంగ్, భాక్రా డ్యామ్ల నుంచి నీటిని విడుదల చేయగా.. పంజాబ్లో రూప్నగర్, గుర్దాస్పూర్, హోసియాపూర్, కపుర్తలా, ఫిరోజ్పూర్ ప్రాంతాలు వరదమయమయ్యాయి. ఈ డ్యామ్ల నుంచి విడదలైన నీటితో బియాస్, సట్లేజ్ నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. With God's grace, the flood situation in my constituency, Shri Anandpur Sahib, is better now. During the rescue operations, I was bitten by a venomous snake on the intervening night of 15th Aug, but that didn’t deter my determination to help my people. With God’s grace and… pic.twitter.com/vQkX14xltK — Harjot Singh Bains (@harjotbains) August 19, 2023 మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తన సొంత నియోజకవర్గమైన ఆనంద్పూర్ సాహిబ్లో సహాయక చర్యలు చేపట్టారు. తానే స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండగా..పాముకాటుకు గురయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షితంగా రక్షించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: బీజేపీకి ఎదురుదెబ్బ.. సింధియాను వీడి.. కాంగ్రెస్ చేరి.. -
బడిలో ఏడు పాములు.. ఒకేసారి విద్యార్థిపైకి..
సంగారెడ్డి: మండల పరిధిలోని ముస్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో పాములు కలకలం రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడుపాములు బయట పడడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం తరగతి గదిలోకి వెళ్లిన విద్యార్థులు పామును చూసి అరిచారు. అక్షయ పాత్ర సిబ్బంది, స్థానికులు అక్కడికి చేరుకుని పామును చంపివేశారు. అయితే మరోవైపు నుంచి ఒక్కో పాము రావడంతో వారు విస్తుపోయారు. మొత్తం ఆరు పాములను చంపివేశారు. తరగతి గది అపరిశుభ్రంగా ఉండడంతో పాములు సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
పాముకాటుతో నర్సింగ్ విద్యార్థిని షఫీనా మృతి
వరంగల్: పాముకాటుతో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన సీరోలు మండలం కొత్తూరు(సీ) గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆర్ఎంపీ షేక్ యాకూబ్ కుమార్తె నర్సింగ్ విద్యార్థిని షఫీనా(22) శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తోంది. ఈ సమయంలో పాము కాటు వేసింది. దీంతో షఫీనా లేచి తండ్రి యాకూబ్తో ఏదో కుట్టిందని చెప్పింది. ఇంతలోనే షఫీనాకు వాంతులు అవుతుండగా యాకూబ్ వెంటనే మహబూబాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ గ్రామానికి చేరుకుని షఫీనా మృతదేహంపై పూలమాల వేసి నివాళులరి ్పంచారు. కార్యక్రమంలో కాంపల్లి సొసైటీ చైర్పర్సన్ కొండపల్లి శ్రీదేవి, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి బజ్జూరి పిచ్చిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తోటలాలయ్య, సర్పంచ్ యానాల గంగాధర్రెడ్డి, నాయకులు రవి, భిక్షమయ్య, సత్యనారాయణ, సైదులు, రాందాస్నాయక్ పాల్గొన్నారు. -
లంక ప్రీమియర్ లీగ్లో మరోసారి పాము కలకలం.. తృటిలో తప్పించుకున్న ఉదాన
లంక ప్రీమియర్ లీగ్-2023లో మరోసారి పాము కలకలం రేపింది. లీగ్లో భాగంగా దంబుల్లా ఔరా, గాలే టైటాన్స్ మధ్య జులై 31న జరిగిన మ్యాచ్ సందర్భంగా తొలిసారి స్టేడియంలో ప్రత్యక్షమైన పాము.. నిన్న (ఆగస్ట్ 12) కొలొంబోని ప్రేమదాస స్టేడియంలో జాఫ్నా కింగ్స్, బి లవ్ క్యాండీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా మరోసారి మైదానంలోని చొచ్చుకొచ్చి హల్చల్ చేసింది. Lucky escape for @IAmIsuru17 from the RPS snake #LPL2023 🐍🇱🇰🏏 pic.twitter.com/OnYokQxzvW — Azzam Ameen (@AzzamAmeen) August 13, 2023 మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో (జాఫ్నా ఇన్నింగ్స్ 18వ ఓవర్) ఈ ఘటన చోటు చేసుకుంది. నువాన్ ప్రదీప్ బౌలింగ్ చేసే ముందు ఫీల్డింగ్ సెట్ చేస్తుండగా మైదానంలోకి ప్రవేశించిన పాము ఇసురు ఉదాన పక్క నుంచి వెళ్లింది. ఫీల్డ్ అడ్జస్ట్మెంట్లో భాగంగా అటుఇటు జరుగుతున్న ఉదాన పామును తొక్కబోయాడు. ఉదాన ఆ భారీ పామును చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అనంతరం మైదానంలో నుంచి వెళ్లిపోయిన పాము బౌండరీ లైన్ అవల ఉన్న కెమెరాల వద్దకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. All these snakes showing up in anticipation of a Naagin dance celebration? 🐍 #LPL2023 #LPLOnFanCode pic.twitter.com/quKUACGr9u — FanCode (@FanCode) August 13, 2023 ఇదిలా ఉంటే, బి లవ్ క్యాండీ-జాఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో క్యాండీ జట్టు 8 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో జాఫ్నా 170 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. క్యాండీ ఇన్నింగ్స్లో మహ్మద్ హరీస్ (51 బంతుల్లో 81; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. ఫకర్ జామన్ (22), ఏంజెలో మాథ్యూస్ (22) ఓ మోస్తరు పరుగులు చేశారు. LPL match was interrupted after snake invaded the field.pic.twitter.com/SUF7iVf2St#LPL | #LPL2023 — Saikat Ghosh (@Ghosh_Analysis) July 31, 2023 జాఫ్నా బౌలర్లలో తషార 3, వెల్లలగే, మధుశంక తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం జాఫ్నాను షోయబ్ మాలిక్ (55), తిసార పెరీరా (36), క్రిస్ లిన్ (27), డేవిడ్ మిల్లర్ (24) గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. క్యాండీ బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్ 3, నువాన్ ప్రదీప్ 2, ఇసురు ఉదాన ఓ వికెట్ పడగొట్టారు. -
డోంగర్ గామ్ లోని హనుమాన్ ఆలయంలో పాము సంచారం
-
పాముల పెంపకం.. కోట్లలో ఆదాయం - ఎక్కడో తెలుసా?
Snake Farming In China: మనిషి బతకాలంటే ఏదో ఒకటి చేయాలన్న విషయం అందరికి తెలుసు. మనదేశంలో వ్యవసాయం చేస్తూ ధాన్యం, పండ్లు, కూరగాయలు వంటివి విరివిగా పండిస్తారు. అంతే కాకుండా కోళ్లు, గొర్రెలు వంటివి పెంచడం ద్వారా కూడా ఆదాయం పొందుతారు. అయితే చైనాలో ఇందుకు భిన్నంగా పాములను పెంచి కోట్లలో సంపాదిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, చైనాలోని జిసికియావో గ్రామంలో పాములను పెంచి ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ గ్రామం స్నేక్ విలేజ్గా మారిపోయింది. ఇక్కడ ప్రతి వ్యక్తి సుమారు 30వేలకంటే ఎక్కువ పాములను పెంచుతారని చెబుతారు. పిల్లలు కూడా బొమ్మలకి బదులు పాములతోనే ఆడుకుంటారు. నిజానికి పాములను పెంచుతున్నారు కదా? ఇవన్నీ విషరహితమైనవనుకుంటే పొరపాటే. ఎందుకంటే వీటిలో చాలావరకు ఎక్కువ విషం ఉన్న పాములు కూడా ఉన్నాయని తెలుస్తోంది. పాముల మాంసంతో పాటు వాటి శరీర భాగాలను కూడా అమ్ముతూ బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఒక లీటరు విషం ఏకంగా రూ. 3.5 కోట్లు వరకు ఉంటుంది. ఇదీ చదవండి: మానవాద్భుత సృష్టి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు! మన దేశంలో పనీర్ మాదిరిగా చైనాలో పాముల మాంసం తింటారు. అంతే కాకుండా క్యాన్సర్ సంబంధిత మందుల తయారీకి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. కావున పాములను చెక్క పెట్టెలు లేదా గాజు పెట్టెలలో పెంచుతారు. ఇవి పెద్దవైన తరువాత విషం సేకరిస్తారు. ఆ తరువాత వంటలు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. పాము చర్మం ఖరీదైన బెల్టులు, ఇతర వస్తువుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. -
పాముకాటుకు తల్లీకొడుకుల బలి
ఒడిశా: జిల్లాలొని కాసీపూర్ సమితి చంద్రగిరి పంచాయతీ సిపిలిజొల్ గ్రామంలో పాముకాటుతో తల్లీకుమారులు మృతిచెందారు. బృందాబిసి(32), ఆమె కొడుకు బిజయ్ బిసి (9) ఎప్పట్లాగే శుక్రవారం వారు రాత్రి భోజనాలు చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో విష సర్పం ఇంటిలోకి ప్రవేశించి ముందుగా బిజయ్ను. పక్కనే ఉన్న బృందాను కాటువేసింది. మెలకువ తెచ్చుకున్న బృందా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు. పాము కాటువేసినట్టు గమనించి చంద్రగిరి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించేలోపే ఇద్దరూ ప్రాణాలు విడిచారు. ఒకే కుటుంబంలొ ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
గడ్డి కోస్తుండగా ఆకాశం నుంచి పాము..దాన్ని అటాక్ చేస్తూ గద్ద..రెండూ..
ఇలాంటి సంకట స్థితి ఎవ్వరకి రాకూడదూ. తలచుకుంటేనే అమ్మ బాబోయే అనిపిస్తుంది. ఆ క్షణంలో ఎవ్వరున్నా.. గుండె ఆగిపోవడం ఖాయం. అలాటి దారుణమైన ఘటన టెక్సాస్లో చోట చేసుకుంది. వివరాల్లోకెళ్తే...టెక్సాస్లో ఓ మహిళ ఎంత దారుణమైన ఆపదలో చిక్కుకుందంటే.. పగవాడికి కూడా వద్దురా బాబు ఇలాంటి ఆపద అనిపిస్తుంది. టెక్సాస్లోని బ్యూమాంట్ సమీపంలో సిల్స్బీకి చెందిన పెగ్గీ జోన్స్ అనే మహిళ తోటపని చేస్తోంది. ఇంతలో హఠాత్తుగా ఓ పాము ఆకాశం నుంచి పెగ్గీ జోన్స్పై పడింది. ఆ పాము ఒక్కసారిగా పెగ్గీ చేతిని గట్టిగా చుట్టుకుంది. ఆ తర్వాత దాన్ని తరుముకుంటూ ఓ గద్ద కూడా అదే టైంలో...భయంతో విలవిల్లాడుతున్న ఆ మహిళ వద్దకు వచ్చింది. దీంతో ఆ రెండు ఒకేసారి ఆమెపై దారుణంగా దాడి చేస్తున్నాయి. పాము కోసం గద్ద..గద్ద నుంచి తప్పించకునే క్రమంలో పాము..ఇలా రెండు ఒకేసారి పెగ్గి చేతిపై దాడి చేస్తున్నాయి. భయంతో ఒక్కసారిగా పెగ్గీ కేకలు వేస్తూ ఉంది. ఇంతలో భర్త పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడి ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించాడు. పెగ్గీ చేతికి దారుణంగా గాయలవ్వడంతో వైద్యులు సత్వరమే చికిత్స అందించారు. దీంతో నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. పాము కాటేసిందనుకున్నా.. ఆ రెండింటి దాడిలో పెగ్గి చేతి గాయమవ్వడమే గాక పాము విషం ఆమె కంటి అద్దాలపై పడటంతో.. కొద్దిపాటులో సేఫ్గా బయటపడింది. అయితే పెగ్గీ మాత్రం పాము తనని కాటువేసిందనుకుంది గానీ నిజానికి ఆమె పాము కాటుకి గురికాలేదు. కాకపోతే గద్ద, పాము పొట్లాటలో ఆమెకు గాయాలయ్యాయి. సమయానికి ఆమె భర్త రావడంతో త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడగలిగింది. ఈ క్రమంలో పెగ్గీ మాట్లాడుతూ..ఇంతకుమునుపు కూడా పాము కాటుకి గురయ్యి.. బయటపడ్డ. మరోసారి ఈ భయానక ఆపద నుంచి సేఫ్గా బయటపడటంతో తాను చాలా లక్కీ అని మురిసిపోతోంది పెగ్గీ. (చదవండి: ఆ దేశం పీతలను నిర్మూలించడానికి ఏకంగా రూ. 26 కోట్లు..!) -
శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే నివాసంలో అలజడి.. వీడియో వైరల్..
ముంబయి: శివసేన చీఫ్(యూబీటీ), మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాసంలో ఓ పాము అలజడి సృష్టించింది. ముంబయిలోని తూర్పు బాంధ్రా కాలానగర్లో ఉన్న థాక్రే ఇంట్లోకి ఆదివారం ఓ పాము దూరింది. విషయం గమనించి స్నేక్ క్యాచ్ర్కు ఫోన్ చేశారు. ఘటనాస్థలానికి వచ్చిన స్నేక్ క్యాచర్ బృందాలు.. పామును పట్టుకున్నారు. కోబ్రా జాతికి చెందిన విషపూరిత పాముగా గుర్తించారు. मातोश्री में निकला सांप, पानी की टांकी के पीछे से सांप को किया गया रेस्क्यू । उद्धव ठाकरे ने किया सर्प मित्रो का शुक्रिया @IndiaTVHindi @indiatvnews pic.twitter.com/byAiNqS6yu — Namrata Dubey (@namrata_INDIATV) August 7, 2023 దాదాపు నాలుగు అడుగుల మేర పాము ఉందని చెప్పారు. పామును చూడటానికి ఉద్ధవ్ థాక్రే ఇంటి బయటకు వచ్చారు. పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ బృందాలు.. దానిని సమీప అడవిలో వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇదీ చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం -
పాము కాటుతో బాలిక మృతి
తుమకూరు: పాము కాటుతో బాలిక మృతి చెందిన ఘటన జిల్లాలోని కుణిగల్ తాలూకా పంచవటి తండాలో జరిగింది. చైతన్య బాయి (10) శనివారం ఉదయం తండ్రితో కలిసి పొలం పనుల్లో ఉండగా పాము కాటేసింది. హుటాహుటిన బాలికను కుణిగల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూసింది. -
కారులో శబ్ధం.. డోర్ ఓపన్ చేయగానే గుండె ఝల్లుమంది!
జయపురం: పట్టణంలోని ఇండాల్ సర్వీసింగ్ కేంద్రానికి వచ్చిన కారులో 6 అడుగుల నాగుపాము కనిపించింది. దీంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే... నవరంగపూర్ జిల్లాలోని ఇంద్రావతిగుడకు ఆదిత్య పట్నాయక్ తన కారును సర్వీసింగ్ నిమిత్తం తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో బోనెట్ ఎత్తి పరిశీలిస్తున్న మెకానిక్కు లోపలి నుంచి శబ్ధం వినిపించింది. కారు డోర్ ఓపన్ చేసి టార్చ్లైట్ వేసి పరిశీలించగా, సర్పం కనిపించింది. దీంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. ఇంతలో కొందరు చాకచక్యంగా పామును బంధించి నక్కిడొంగర పర్వత ప్రాంతంలో విడిచి పెట్టారు. నవరంగపూర్ లోనే కారు ఇంజిన్లో పాము చేరి ఉంటుందని సర్వీసింగ్ సెంటర్ యజమాని తదితరులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వాళ్లందరికి రేషన్ కార్డు రద్దు! -
పాము, ఆవు ఎంత సన్నిహితంగా ఉన్నాయంటే..చూస్తే వామ్మో ఏంటిది?
-
బస్సు ఎక్కిన పాము.. ఎక్కడికెళ్దామని?