![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/20/5_mr_0.jpg.webp?itok=X9ig-5Cn)
ప్రకాశం: ఓ పాము తన దారిలో వెళ్తూ ఉండగా శునకాలు ఆ పామును గమనించి నిలవరించాయి. ఈ సంఘటన కొమరోలు మండలంలోని తాటిచెర్ల గ్రామంలో చోటు చేసుకుంది. నాగుపాము తాటిచెర్ల గ్రామ సమీపంలోని పొలాల వద్ద తన దారిలో తాను వెళుతూ ఉండగా ఆ పామును గమనించిన రెండు కుక్కలు దాని వద్దకు వెళ్లి మొరుగుతుండటంతో పాము అలాగే స్తబ్దుగా నిలబడింది.
స్థానికంగా ఉన్న వారు ఈ సంఘటనను తమ కెమెరాలలో బంధించారు. పామును నిలువరించడానికి కుక్కలు దాదాపు ఓ గంటసేపు మొరగడంతో పాము వెనుదిరిగి వెళ్లిపోయింది.
![1](https://www.sakshi.com/gallery_images/2023/06/20/3_mr.jpg)
Comments
Please login to add a commentAdd a comment