
తెలంగాణలో టెట్ ఎగ్జామ్కు సంబంధించి కీలక ప్రకటన చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టెట్ ఎగ్జామ్ వాయిదా వేయడం కుదరదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాష్ అవ్వకుండానే ఎగ్జామ్ తేదీ ముందుగానే ఖరారు చేసామని ఆమె మంత్రి కేటీఆర్కు తెలిపారు.
జూన్ 12వ తేదీన రైల్వే ఎగ్జామ్ ఉన్నందున.. టెట్ ఎగ్జామ్ ను వాయిదా వేయాలంటూ ఓ అభ్యర్థి చేసిన ట్వీట్ను పరిగణనలోకి తీసుకోవాలంటూ మంత్రి సబితకు ట్యాగ్ చేశారు కేటీఆర్. అయితే సంబంధిత అధికారులతో మాట్లాడిన తర్వాతే ట్వీట్ చేస్తున్నట్లు తెలిపిన ఆమె.. వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. దాదాపు 3.5లక్షల మంది రాయాల్సి ఉన్న టెట్ ను అన్ని పరిగణలోకి తీసుకునే ఏర్పాట్లు చేసామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
any other competitive exams. Taking everything into consideration postponing TET exams is not possible as it has cascading effect on other preparations of the Dept— SabithaReddy (@SabithaindraTRS) May 21, 2022