request
-
పవన్ మీకో దండం.. రోడ్డు వేయాలంటూ గిరిజనుల నినాదాలు
-
'దయచేసి నా అభిమానులు ఆ పని చేయొద్దు'.. జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు. మిమ్మల్ని కలిసేందుకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానని తెలిపాడు. త్వరలోనే మీ అందరినీ కలుస్తానని అన్నారు. త్వరలో సమావేశం ఏర్పాటు చేసి వ్యక్తిగతంగా మాట్లాడతానని వెల్లడించారు. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పాదయాత్రలు చేయొద్దు..అయితే తనను కలిసేందుకు పాదయాత్రలు లాంటివి చేయవద్దని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. మీ సంక్షేమమే నాకు ముఖ్యమన్నారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న మీ ఆసక్తిని అర్థం చేసుకుని వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అధికారులతో అన్ని అనుమతులు తీసుకుని.. అందరినీ సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని తెలిపారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది.. ఈ విషయంలో అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు.గతేడాది దేవర మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంతో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.A Statement from @tarak9999 Office#JrNTR #ManOfMasses𝐍𝐓𝐑#Devara #war2 #Ntrneel pic.twitter.com/erzTOohW0R— TigerNation 🐯 (@IamGanesh1718) February 4, 2025 -
ఎస్పీ కి వైఎస్ఆర్సీపీ నేతల విజ్ఞప్తి
-
ఈసీ షెడ్యూల్.. వైఎస్సార్సీపీ కోరిందే జరిగింది
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ చేసిన విజ్ఞప్తిని మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి.. ఒకే రోజు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహణకు మొగ్గు చూపింది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఒకేసారి లోక్సభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ పలుమార్లు కోరిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి ప్రతిపక్షాలపై ఫిర్యాదు చేసిన టైంలోనే కాకుండా.. ఈసీ సమీక్షకు వచ్చినప్పుడు కూడా వినతి పత్రాలను ఈసీకి సమర్పించింది. ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడం ద్వారా.. దొంగ ఓట్లను అరికట్టవచ్చని వైఎస్సార్సీపీ మొదటి నుంచి చెబుతోంది. తెలంగాణలో ఓటర్లుగా నమోదైన వారంతా ఏపీలో కూడా ఓటు నమోదు చేసుకున్నారని.. రెండు చోట్ల ఓటు వేయకుండా నిరోధించడానికే తాము ఒకేసారి ఎన్నికల నిర్వహణ కోరుతున్నామని వైఎస్సార్సీపీ ఆ వినతుల్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. నాలుగో దశలో ఏపీలో 25, తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు జూన్ 4వ తేదీన ఇరు రాష్ట్రాల లోక్సభ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇదీ చదవండి: 175 మందితో వైఎస్సార్సీపీ సిద్ధం -
భారత్కు మాల్దీవుల అభ్యర్థన.. ఎందుకో తెలుసా?
మాల్దీవుల-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా భారత్ తాను ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కూడా మాల్దీవులకు రూ.600 కోట్ల ఆర్థిక సాయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఆ మరోసటి రోజే.. తాజాగా మాల్దీవుల నుంచి భారత్కు ఒక అభ్యర్థన వచ్చింది. తమ దేశ సముద్ర ప్రాదేశిక జలాల్లో మూడు మత్స్యకారుల నౌకల్లో ఇండియన్ కోస్ట్గార్డు సిబ్బంది ప్రవేశించటంపై భారత్ నుంచి స్పష్టత ఇవ్వాలని కోరింది. శుక్రవారం రాత్రి తమ దేశ మిలిటరీ.. గురువారం విదేశి మిలిటరీ సిబ్బంది మాల్దీవుల మత్స్యకారుల నౌకల్లోకి ప్రవేశించినట్లు సమాచారం అందుకుందని.. అందులో భారత్కు చెందిన కోస్ట్ గార్డు సిబ్బంది ఉన్నట్లు గుర్తించినట్లు భారత్కు నివేదించింది. అదేవిధంగా మరో రెండు నౌకల్లో కూడా ఇండియన్ కోస్ట్గార్డు సిబ్బంది ప్రవేశించారని పేర్కొంది. అయితే వారు ఏం చేశారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మాల్దీవీయన్ ఎక్స్క్లూసివ్ ఎకానమిక్ జోన్లో ప్రయాణిస్తున్న మాల్దీవుల మత్స్యకారుల నౌకల్లోకి ఇండియన్ కోస్ట్ సిబ్బంది ప్రవేశించటంపై భారత్ అధికారికంగా నివేదిక అందించాలని ఈ మేరకు మాల్దీవుల విదేశీ వ్యవహారాల మంత్రి భారత్కు అధికారిక విజ్ఞప్తి చేసింది. సంబంధిత అధికారులతో సమన్వయం లేకుండా అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఘటనపై స్పష్టత ఇవ్వాలని ఆ దేశ స్థానిక భాషలోనే భారత్ను అభ్యర్థించడం గమనార్హం. ఇక.. మాల్దీవుల- భారత్ మధ్య నెలకొన్నదౌత్యపరమైన ప్రతిష్టంభన నేపథ్యంలో ఇది మొదటి దౌత్యపరమైన అభ్యర్థనగా తెలుస్తోంది. ఇక కీలకమైన హిందూ మహాసముద్రంలో భారత్, చైనా తమ వ్యూహాత్మ ప్రాధాన్యపై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. మాల్దీవుల మంత్రులు.. లక్షద్వీప్ విషయంలో ప్రధానిమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో చైనా అనుకూల వ్యక్తిగా పేరున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జతో భారత్ దౌత్యపరమైన సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి. చదవండి: US Strikes: యూఎస్ ప్రతీకార దాడులు.. ఆరుగురు ఉగ్రవాదులు మృతి! -
'తప్పుగా అనుకోవద్దు ప్లీజ్'.. వారందరికీ బిగ్బాస్ కంటెస్టెంట్ రిక్వెస్ట్!
బిగ్బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా గతేడాది జరిగిన బిగ్బాస్ సీజన్-7పై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్బాస్ షోపై రివ్యూలతో మరింత ఫేమస్ అయ్యారు. అయితే తాజాగా ఆదిరెడ్డికి ఓ సమస్య వచ్చిపడింది. సాయం కావాలంటూ ప్రతి ఒక్కరు నేరుగా ఇంటికి వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అభిమానులుకు ఆదిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దయచేసి ఎవరూ కూడా ఇలా రావొద్దంటూ రిక్వెస్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (ఇది చదవండి: అయోధ్య రామ మందిరానికి బిగ్ బాస్ 'ఆదిరెడ్డి' విరాళం) ఆది రెడ్డి వీడియోలో మాట్లాడుతూ మాట్లాడుతూ.. 'దయచేసి అర్థం చేసుకోండి .. నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను. నాకు వీలైనంత సాయం చేస్తుంటే ఉంటా. కానీ డైరెక్ట్గా ఇంటికి చాలా మంది వస్తున్నారు. వాళ్ల అందరికి నేనేం చేయగలను చెప్పండి . ఎవరు వచ్చినా ఆహారం అంటే ఒకరోజు పెట్టించగలను. కానీ వాళ్ల బాధలన్నీ చెప్పినా నేను ఏం చేయలేని పరిస్థితి. దయచేసి ఎవరు కూడా ఇంటికి కానీ.. సెలూన్కు కానీ రావొద్దు. సమాజానికి నా వంతు కృషి చేస్తాను. అంతే కానీ అందరికి చేయలేను కదా. ఎలాగోలా వచ్చిన వాళ్లకి ఛార్జీలకి ఇచ్చి పంపుతున్నా . దయచేసి అర్థం చేస్కోండి. తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. నాతో మాట్లాడాలంటే కామెంట్స్, మెసేజేస్ ద్వారా పంపండి.' అంటూ విజ్ఞప్తి చేశారు ఆదిరెడ్డి. కాగా.. ఆదిరెడ్డి ఇటీవలే 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర' ట్రస్ట్కు తన వంతుగా ఒక లక్ష రూపాయలు విరాళం అందించాడు. View this post on Instagram A post shared by Adi Reddy (@adireddyofficial) -
‘ప్లీజ్.. పెళ్లి చేసుకోండి’.. యువతులను వేడుకుంటున్న చైనా అధ్యక్షుడు
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్లో విచిత్రమైన భయం నెలకొంది. దేశంలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతుండటంతో, అభివృద్ధికి ఆమడదూరంలోకి వెళ్లిపోతామని ఆయన భయపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే దేశంలోని యువతులంతా పెళ్లి చేసుకోవాలని మరోమారు జిన్పింగ్ పిలుపునిచ్చారు. తాజాగా జరిగిన ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో జిన్పింగ్ యువతులు పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. చైనాలో శిశుజననాల రేటు భారీగా తగ్గింది. మరోవైపు చైనా యువతులు పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ దేశంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన దేశంలో కుటుంబ వ్యవస్థను కాపాడటంతో మహిళలదే కీలకపాత్ర అని అన్నారు. సమాజంలో కొత్త ఒరవడిని నెలకొల్పడంలో మహిళలు ముందుంటారని పేర్కొన్నారు. దేశంలో వివాహాలు, సంతాన సాఫల్యత అనే నూతన సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. 2022లో చైనా సంతానోత్పత్తి రేటు చారిత్రాత్మకంగా పడిపోయి 1.09కి చేరుకుంది. దేశంలో పిల్లలు లేని జంటల సంఖ్య రెండింతలు పెరిగింది. తాజాగా విడుదలైన ఒక నివేదిక ప్రకారం దేశంలో పిల్లలు లేని జంటల వాటా 2017-2022 మధ్య 20.6 శాతం నుండి 43.2 శాతానికి చేరుకుని, రెండింతలు పెరిగింది. పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చు, కెరీర్ సంక్షోభం, లింగ వివక్ష తదితర అంశాలు చైనా యువత పెళ్లికి దూరంగా ఉండటానికి కారణాలుగా నిలిచాయి. ఈ నేపధ్యంలో శిశు జననాల రేటు భారీగా పడిపోయింది. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా అధ్యక్షుడు దేశంలోని యువత పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా భవిష్యత్తులో చైనా వృద్ధాప్య దేశంగా మారిపోనున్నది. ఇప్పటికే చైనాలో వృద్ధుల జనాభా అధికమయ్యింది. మరోవైపు చైనాలో కార్మికుల సంఖ్య తగ్గింది. ఫలితంగా ఉత్పత్తి వ్యయం అంతకంతకూ పెరుగుతోంది. ఇది కూడా చదవండి: ప్రియాంకకు చేదు అనుభవం: పుష్ఫగుచ్ఛం ఇచ్చారు.. పూలు మరచారు! -
హైదరాబాద్ నుంచి నేరుగా విమానాలు ఏర్పాటు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమానసర్వీసులు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డికి యూఎస్ఏ ఎన్నారైలు వినతిపత్రం సమరి్పంచారు. ఈ మేరకు అమెరికాలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డిని తెలుగు ఎన్నారైలు కలిశారు. ఢిల్లీ, ముంబై వంటి అనేక ఇతర భారతీయ నగరాలు ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాలతో నేరుగా విమాన కనెక్షన్లు కలిగి ఉన్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం కోసం ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ మరింత ఎదుగుతుందని పేర్కొన్నారు. కాగా ఎయిర్ ఇండియా కొత్త ఫ్లైట్లను ఆర్డర్ చేయటంతోపాటు, కొత్త రూట్లలో విమాన సర్వి సులను తెచ్చేందుకు కృషి చేస్తోందని, కేంద్ర అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ప్రవాసుల కోరిక నెరవేరేలా చూస్తామని కిషన్రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విలాస్ జంబుల, లక్ష్మణ్ అనుగు, సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ తుమ్మల, ప్రదీప్ కట్టా, వంశీ యమజాల, మధుకర్ రెడ్డి, రామ్ వేముల, రఘువీర్ రెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ నేతలు భేటీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డితో అమెరికాలోని ప్రవాస తెలంగాణవాదులు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీఎఫ్ మాజీ అధ్యక్షుడు మురళి చింతలపాని, లక్ష్మణ్ అనుగు, ఇతర కార్యవర్గసభ్యులు కిషన్రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్ర సాధనలో ప్రవాస తెలంగాణవాసులు, టీడీఎఫ్ పోషించిన పాత్రను కిషన్రెడ్డి అభినందించారు. -
కేటీఆర్ సార్.. మెట్రో మాక్కూడా!
హైదరాబాద్: నగరవాసుల ప్రయాణ బాధల్ని తీరుస్తూ.. లక్షల మందికి ఊరట ఇస్తోంది మెట్రో రైలు వ్యవస్థ. ఫేజ్ల వారీగా మరింత దూరం పట్టాలపై పరుగులు పెట్టేందుకు సిద్ధమైపోతోంది ఇది. అయితే.. ఈ సర్వీసులను తమ ప్రాంతంలోనూ ఏర్పాటు చేయాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్ చెంతకు క్యూ కడుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధులు మంత్రి కేటీఆర్కు మెట్రో సర్వీస్ పొడిగింపుపై విజ్ఞప్తులు చేశారు. ఎల్బీనగర్-రామోజీ ఫిలింసిటీ, ఎల్బీనగర్-తుర్కయాంజాల్, ఆదిభట్ల-కొంగరకలాన్, ఉప్పల్-బోడుప్పల్-ఫిర్జాదీగూడ, మియాపూర్-పటాన్ చెరు మార్గాల్లో మెట్రో ప్రాజెక్టు నిర్మించాలని కోరారు. ఈ ప్రాజెక్టుల విషయంలో డీపీఆర్ తయారు చేయాలంటూ అధికారులను ఆదేశించాలని మంత్రి కేటీఆర్కు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో పొడిగింపుతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకం, వాణిజ్యం ఊపందుకుంటాయని వారు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలకు ముగింపు పడుతుందని చెప్పారు. ఈ విజ్ఞప్తులను పరిశీలిస్తామని ఆయన వాళ్లకు చెప్పినట్లు తెలుస్తోంది. -
‘మాకొక వందే భారత్ కావలెను’
ఢిల్లీ: వందేభారత్ రైళ్లకు అక్కడ ఫుల్ గిరాకీ ఉంటోంది. ప్రయాణికులతో అనుకునేరు. మా రూట్లలో ఆ రైలు నడపండి మహాప్రభో అంటూ కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నారు పలువురు ఎంపీలు. వాళ్లలో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు సైతం ఉండడం గమనార్హం. గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో.. భారత్లో సెమీ హైస్పీడ్ రైల్గా వందే భారత్ పేరొందింది. టికెట్ ధర ఎక్కువే అయినా.. ఫ్లైట్లో ఉండేలా అత్యాధునిక వసతులు, త్వరగతిన గమ్యస్థానానికి చేర్చుతుండడంతో వందే భారత్ రైళ్లను తమ నియోజకవర్గాల్లోని ప్రజలు కోరుకుంటున్నారని చెబుతూ ఎంపీలు.. కేంద్ర రైల్వేశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. పార్లమెంట్ నుంచి దాదాపు 60 మంది ఎంపీలు.. వందే భారత్ రైళ్లను తమ రూట్లలో నడపాలంటూ కేంద్ర రైల్వే శాఖకు విజ్ఞప్తి చేశారు. వందే భారత్ 2.0 సూపర్ సక్సెస్ అయ్యింటూ లేఖలో పేర్కొన్నారు వాళ్లు. వీళ్లలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. అలాగే పలువురు బీజేపీ ఎంపీలతో పాటు విపక్షాల నుంచి 14 మంది ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా రైల్వేస్కు విజ్ఞప్తి చేసినవాళ్లలో ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పది వందే భారత్ రైళ్లు వివిధ రూట్లలో ప్రయాణిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నడుమ సికింద్రాబాద్-విశాఖపట్నం నడుమ వందే భారత్ రైలు నడుస్తోంది. -
వందే భారత్ రైళ్లలో ఇది పరిస్థితి.. భారతీయ రైల్వేస్ రిక్వెస్ట్
Viral News: ఇతర దేశాల్లో బుల్లెట్ ట్రైన్లు, మాగ్నటిక్ బుల్లెట్ ట్రైన్ల టెక్నాలజీతో రైల్వే రంగాలు దూసుకుపోతున్నాయి. మన దగ్గర అంతస్థాయిలో కాకపోయినా మెట్రో, ఈ మధ్యకాలంలో వందే భారత్ లాంటి సెమీ స్పీడ్ రైళ్లను పట్టాలెక్కించింది కేంద్రం. అయితే.. భారత్లో ఇప్పటిదాకా హైక్లాస్ రైలుగా వందే భారత్ ఓ ఫీట్ సాధించగా.. వసతులు, ఆధారంగా భూతల విమానంగా అభివర్ణిస్తున్న వందే భారత్ రైలులో పరిస్థితి ఇది అంటూ తాజాగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వందే భారత్ రైలు కంపార్ట్మెంట్లో మొత్తం వాటర్ బాటిళ్లు, చెత్తా చెదారం, కవర్లు నిండిపోయి ఉన్నాయి. ఓ వర్కర్ దానికి శుభ్రం చేస్తుండగా తీసిన ఫొటో ఇది. ఐఏఎస్ అధికారి అవానిష్ శరణ్ తన ట్విటర్లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. పైగా ‘వీ ద పీపుల్’ అంటూ మన జనాల్లోని కొందరి మైండ్ సెట్ను ఉదాహరించారాయన. “We The People.” Pic: Vande Bharat Express pic.twitter.com/r1K6Yv0XIa — Awanish Sharan (@AwanishSharan) January 28, 2023 ఆయన పోస్ట్కు రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ప్లాస్టిక్ నిషేధం లేన్నన్నాళ్లూ ఇలాంటి పరిస్థితి తప్పదంటూ కొందరు.. జనాలకు స్వీయ శుభ్రత అలవడితేనే పరిస్థితి మారుతుందంంటూ మరికొందరు.. ఏది ఏమైనా మన దేశంలో ఇలాంటి పరిస్థితిలో మార్పురాదని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఓవైపు చెత్తాచెదారం శుభ్రం చేశాక కూడా.. సిబ్బంది ముందే చెత్తా పారబోస్తున్నారు. వందే భారత్ రైళ్లు గమ్యస్థానం నుంచి ప్రారంభం అయ్యే లోపే ప్రయాణికులు వేస్తున్న చెత్తాచెదారంతో నిండిపోతోందని సిబ్బంది వాపోతున్నారు. ఇదిలాఉంటే సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్ రైలులో చెత్తాచెదారం దర్శనమివ్వగా.. దయచేసి శుభ్రతను పాటించాలంటూ భారతీయ రైల్వేస్ సంస్థ వందేభారత్ ప్రయాణికులకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల వైఖరి, మనస్తతత్వం మారనంత కాలం.. స్వచ్ఛ భారత్ సాధించడం కష్టం. కాబట్టి, మెరుగైన సేవలను అందుకోవడానికి రైల్వేస్తో సహకరించండి. దయచేసి చెత్తచెదారం వేయకండి. డస్ట్బిన్లలోనే చెత్త వేయండంటూ అంటూ ప్రకటనలో పేర్కొంది భారతీయ రైల్వేస్. హైక్లాస్ రైలు.. అత్యాధునిక, సాంకేతిక వ్యవస్థలతో పనిచేసే వందే భారత్ రైళ్లలో.. విమానాల్లో మాదిరి ఇంటీరియర్ కనిపిస్తుంది. కోచ్లన్నీ ఫ్లైట్ ఇంటీరియర్తో పోలి ఉంటాయి. సీటింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఆటోమేటిక్ డోర్లు ఉండటమే కాక అవన్నీ రొటేట్ అవుతుంటాయి. సీట్ల వద్ద ఉండే బటన్ ప్రెస్ చేసి ఎవరితోనైనా మాట్లాడవచ్చు. సీసీ కెమెరాలుంటాయి. ప్రయాణికుల కదలికలను సెంట్రల్ స్టేషన్ నుంచి మానిటరింగ్ చేస్తారు. భద్రతకు ప్రాధాన్యత.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా భద్రతా వ్యవస్థ సత్వరం స్పందిస్తుంది. ఎమర్జన్సీ అలారం ఉంటుంది. మరుగుదొడ్లు స్టార్ హోటల్లో ఉన్నట్టుగా తలపిస్తాయి. ఇంజిన్ కాక్పిట్ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ-డిస్ప్లేలుంటాయి. గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోయినా గ్లాసులో వాటర్ ఒలకదు. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సగటు వేగం 88 కిలోమీటర్ల మేర ఉంటుంది. సున్నితంగా ఉంటుంది ఈ రైలులో ప్రయాణం. -
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికి ఈడీ షాక్!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. రోహిత్రెడ్డి అభ్యర్థనను ఈడీ అధికారులు తిరస్కరించారు. ఆయన లేఖను ఈడీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రోహిత్రెడ్డి హాజరుకానున్నారు. కాగా, విచారణకు హాజరు కాలేనని లాయర్తో ఈడీకి రోహిత్రెడ్డి లేఖ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు చాలా తక్కువ సమయం ఇచ్చారని, వరుస సెలవులు కారణంగా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్, ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేకపోయానని రోహిత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అయితే రోహిత్రెడ్డి విజ్ఞప్తిని ఈడీ అధికారులు తిరస్కరించారు. కాగా, ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది. -
విచారణకు రాలేను.. ఈడీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి
ఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విచారణలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. దర్యాప్తు సంస్థకు ఓ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విచారణకు హాజరుకాలేనంటూ ఇవాళ ఓ లేఖ రాశారు ఆయన. తన తల్లి బాగోగులు చూసుకునేందుకు అనుమతించాలని, విచారణను పొడిగించాలని లేఖలో ఈడీని కోరారు రాహుల్ గాంధీ(51). నేషనల్ హెరాల్డ్ కేసులో.. రాహుల్ గాంధీ పాత్రపై అనుమానాలు ఏమిటో ఈడీ ఇప్పటిదాకా స్పష్టత అయితే ఇవ్వలేదు. కానీ, మూడు రోజులు పాటు మాత్రం ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా ప్రశ్నల వర్షం కురిపించింది. మరోవైపు ఈ చర్యకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తోంది. అయితే ఈడీ విచారణకు గురువారం బ్రేక్ పడింది. తిరిగి శుక్రవారం తమ ఎదుట హాజరుకావాలంటూ కోరింది ఈడీ. తన తల్లి(సోనియా గాంధీ) కరోనాతో చికిత్స పొందుతున్నందునా.. విచారణకు హాజరుకాలేనని, తన తల్లి బాగోగులు చూసుకోవడానికి కొన్ని రోజులు విచారణను పొడిగించాలని లేఖలో కోరారు రాహుల్. అయితే ఈడీ ఆ విజ్ఞప్తిపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. 75 ఏళ్ల వయసున్న సోనియా గాంధీ కూడా నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే.. కరోనా కారణంగా హాజరుకాలేకపోయిన ఆమె.. చికిత్స కోసం గంగారాం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం సోనియాగాంధీ కొడుకు కూతురు రాహుల్, ప్రియాంక వాద్రాలు గంగారాం ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. -
భారత్ను బతిమాలుతున్నాం: ఐఎంఎఫ్ చీఫ్
దావోస్: ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జియేవా(68) Kristalina Georgieva.. భారత్ను బతిమాలుతున్నారు. గోధుమ ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించగా.. ఈ నిర్ణయంపై వీలైనంత త్వరగా పునరాలోచన చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. అంతర్జాతీయ ఆహార భద్రత, ప్రపంచ స్థిరత్వంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నక్రిస్టలీనా.. వీలైనంత త్వరగా నిషేధాన్ని ఎత్తేయాలని కోరారు. వేసవి ప్రభావంతో గోధుమ ఉత్పత్తి తగ్గిపోవడం, దేశీయంగా ధరలు పెరిగిపోవడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారత్ తరపున ఈ పరిస్థితులను అర్థం చేసుకోగలమని పేర్కొన్న ఆమె.. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడబోయే సంక్షోభ స్థితిని భారత్ అర్థం చేసుకోవాలని కోరారు. భారతదేశాన్ని వీలైనంత త్వరగా పునరాలోచించవలసిందిగా నేను వేడుకుంటున్నాను, ఎందుకంటే ఈ నిర్ణయంతో ఎక్కువ దేశాలు ఎగుమతి ఆంక్షలపైకి అడుగుపెట్టే అవకాశం ఉంది. మరికొన్ని దేశాలు కూడా ఆ ఆలోచన చేయొచ్చు. అప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కష్టతరంగా ఉంటుంది అని ఆమె అన్నారు. ఇప్పటికే ఓ పక్క యుద్ధ సంక్షోభం కొనసాగుతోంది. ఈజిప్ట్, లెబనాన్ లాంటి దేశాల ఆకలి తీర్చేది భారత్. అలాంటప్పుడు భారత్ నిర్ణయంతో ఆయా దేశాల్లో ఆకలి కేకలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సామాజిక అశాంతి నెలకొనే అవకాశం ఉంది అని ఆమె అభ్రిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్ దావోస్ వేదికగా ఓ భారతీయ మీడియాతో ఆమె పైవ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టెట్ ఎగ్జామ్ వాయిదా వేయడం కుదరదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాష్ అవ్వకుండానే ఎగ్జామ్ తేదీ ముందుగానే ఖరారు చేసామని ఆమె మంత్రి కేటీఆర్కు తెలిపారు. జూన్ 12వ తేదీన రైల్వే ఎగ్జామ్ ఉన్నందున.. టెట్ ఎగ్జామ్ ను వాయిదా వేయాలంటూ ఓ అభ్యర్థి చేసిన ట్వీట్ను పరిగణనలోకి తీసుకోవాలంటూ మంత్రి సబితకు ట్యాగ్ చేశారు కేటీఆర్. అయితే సంబంధిత అధికారులతో మాట్లాడిన తర్వాతే ట్వీట్ చేస్తున్నట్లు తెలిపిన ఆమె.. వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. దాదాపు 3.5లక్షల మంది రాయాల్సి ఉన్న టెట్ ను అన్ని పరిగణలోకి తీసుకునే ఏర్పాట్లు చేసామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. any other competitive exams. Taking everything into consideration postponing TET exams is not possible as it has cascading effect on other preparations of the Dept— SabithaReddy (@SabithaindraTRS) May 21, 2022 -
Cryptocurrency: బాబ్బాబు.. కొట్టేసిందంతా వెనక్కి ఇచ్చేయండ్రా!
ఊహించని రీతిలో లాభాలను కురిపిస్తున్నాయనే ఆనందమే కాదు.. క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా హ్యాకర్ల ముప్పు పొంచి ఉండడంతో అభద్రతా భావానికి లోనవుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వాలు, ఆర్థిక విభాగాలు లేవనెత్తుతున్న అభ్యంతరాల్లో ఇది కూడా ఉంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్ ‘క్యూబిట్ ఫైనాన్స్’ నుంచి సుమారు 80 మిలియన్ డాలర్ల (600 కోట్ల రూపాయలకు పైనే) క్రిప్టోకరెన్సీ చోరీకి గురైంది. పక్కాగా ప్లాన్ చేసిన హ్యాకర్లు ఈ ఏడాది ఆరంభంలోనే ఈ భారీ చోరీకి పాల్పడ్డారు. ఇది గ్రహించిన క్యూబిట్ ఫైనాన్స్.. హ్యాకర్లతో బేరానికి దిగింది. మొదట కొంచెం సీరియస్గానే వార్నింగ్ ఇచ్చిన క్యూబిట్.. అటుపై కొంచెం తగ్గి ట్వీట్లు చేసింది. The protocol was exploited by; 0xd01ae1a708614948b2b5e0b7ab5be6afa01325c7 The hacker minted unlimited xETH to borrow on BSC. The team is currently working with security and network partners on next steps. We will share further updates when available. — Qubit Finance (@QubitFin) January 28, 2022 కొట్టేసిందంతా తిరిగి ఇచ్చేయాలని, బదులుగా.. మంచి నజరానా ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు ఎలాంటి న్యాయపరమైన చర్యలకు వెళ్లమని మాటిస్తోంది కూడా. ఇక క్రిప్టోకరెన్సీలో అరుదైన సర్వీస్ను క్యూబిట్ అందిస్తోంది. దీని ప్రకారం.. బ్రిడ్జ్ అనే సర్వీస్లో వివిధ రకాల బ్లాక్చెయిన్స్ ఉంటాయి. డిపాజిట్ చేసిన క్రిప్టోకరెన్సీని వేరొకదాంట్లోనూ విత్డ్రా చేసుకోవచ్చు. An appeal to the exploiter: It's not too late to return to funds. We will pay the maximum bounty reward as mentioned as well as not seek any legal charges if you return the funds and do right by the community. — Qubit Finance (@QubitFin) January 28, 2022 అయితే 2020లో బినాన్స్ స్మార్ట్చెయిన్ను లాంఛ్ చేసినప్పటి నుంచి డెఫీ(అప్కమింగ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ) ప్రాజెక్టులకు హ్యాకింగ్ తలనొప్పులు ఎదురవుతున్నాయి. కిందటి ఏడాది ఏప్రిల్లో యురేనియం ఫైనాన్స్ నుంచి 50 మిలియన్ డాలర్లు, మే నెలలో వీనస్ ఫైనాన్స్ నుంచి 88 మిలియన్ డాలర్లు హ్యాకర్ల బారినపడింది. చదవండి: క్రిప్టో దెబ్బకి మిలియనీర్ల నుంచి బికారీలుగా మారిన వేలమంది! -
మీడియాకు జాక్వెలిన్ అభ్యర్థన.. మీ ప్రియమైన వారికి ఇలా చేయరుగా
Jacqueline Fernandez Request To Media Not Circulate Her Private Photos: శ్రీలంక బ్యూటీ, బీటౌన్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పలు బాలీవుడ్ హీరోయిన్స్తోపాటు జాక్వెలిన్కు సుకేష్ ఖరీదైన బహుమతులు ఇవ్వడంతో ఈడీ ఆమెను విచారించింది. అప్పటినుంచి ఫిల్మ్ దునియాలో తరచుగా, వార్తల్లో అప్పుడప్పుడూ జాక్వెలిన్ పేరు వింటూనే ఉన్నాం. తాజాగా జాక్వెలిన్ మీడియాకు విన్నవించుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. సుకేష్ చంద్రశేఖర్తో లీక్ అయిన తన ఫొటోను ప్రసారం చేయొద్దని మీడియాను అభ్యర్థించింది. తన గోపత్యకు భంగం కలిగిస్తోందని పేర్కొంది జాక్వెలిన్. 'ఈ దేశం, ఈ ప్రజలు నాకు విపరీతమైన ప్రేమ, గౌరవాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం నేను కఠినమైన పరిస్థితిలో ఉన్నాను. అది నా స్నేహితులు, అభిమానులు గమనిస్తూనే ఉన్నారని తెలుసు. ఈ నమ్మకంతోనే నా వ్యక్తిగత చిత్రాలను ప్రసారం చేయొద్దని మీడియా మిత్రులను అభ్యర్థిస్తున్నాను. నేను ఇప్పటికే చాలా నేర్చుకున్నాను. నా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తున్నాను. మీరు మీ ప్రియమైన వారికి ఇలా చేయరు కదా. అలాగే నాకు కూడా ఇలా చేయరని నమ్ముతున్నా. న్యాయం, మంచి గెలుస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.' అని పోస్ట్లో రాసుకొచ్చింది జాక్వెలిన్. View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) ఇదీ చదవండి: జాక్వెలిన్ను సుకేష్ ఇలా ముగ్గులోకి దింపాడట.. -
సినీ పరిశ్రమను కాపాడాలని సీఎంకు నిర్మాతల విజ్ఞప్తి
చెన్నై సినిమా : సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు తమిళ సినీ నిర్మాతల మండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా నిర్మాతల మండలి నిర్వాహకులు ఆదివారం ఉదయం సమాచార శాఖ మంత్రి వెళ్లకోవిల్ సామినాథన్ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమను కూడా కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా క్యూబ్ రుసుమును తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో తమిళ్ అభివృద్ధి, సమాచార శాఖ కార్యదర్శి మహేశన్ కాశీరాజు నుంచి, సమాచారశాఖ డైరెక్టర్ వీపీ.జయశీలన్, తమిళ్ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు ఎన్.రామసామి తదితరులు పాల్గొన్నారు. -
భక్తి పారవశ్యంతో ఈ పూజారి చేసిన పని... విగ్రహానికి వైద్యం..!!
ఒక్కోసారి కొంత మంది భక్తిలో పరవశించుపోతూ చేసే కొన్ని పనులు మనకు భయాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒక్కొసారి ఆ స్థాయి మరి ఎక్కువగా చేరితే ఇక వారి వింత ప్రవర్తనతో జనాలను విసిగిస్తుంటారు. అయితే అచ్చం అలానే ఇక్కడొక పూజారి చేశాడు. అసలు విషయంలోకెళ్లితే..ఒక పూజారి ఉత్తరప్రదేశ్లో ఆగ్రాలోని జిల్లా ఆసుపత్రికి చేరుకుని విచిత్రంగా అభ్యర్థించాడు. ఈ మేరకు అతను తన కృష్ణుడి చిన్ననాటి విగ్రహమైన లడ్డూ గోపాల్ విగ్రహానికి స్నానం చేయిస్తున్నప్పుడు చేయి విరిగిపోయిందని అందువల్ల చికిత్స చేయాలంటూ ఏడుస్తూ అభ్యర్థిస్తాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్కి గురవుతారు. అయితే మొదటగా ఎవరు అతని అభ్యర్థనను పట్టించుకోరు. కానీ కాసేపటికి జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ స్పందించి పేషంట్ పేరు కృష్ణుడిగా రిజిస్టర్లో నమోదు చేసుకుని. పూజారి సంతృప్తి నిమిత్తం విగ్రహానికి కట్టుకట్టామని తెలిపారు. అయితే పూజారి లేఖ్ సింగ్ అర్జున్ నగర్లోని ఖేరియా మోడ్లోని పత్వారీ ఆలయంలో గత 30 ఏళ్లుగా పూజారిగా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!) -
ఆ డబ్బులు అఫ్గనిస్తాన్వి.. మాకు తిరిగివ్వండి: తాలిబన్లు
కాబూల్: అఫ్గనిస్తాన్లో తాలిబన్ల అరాచక పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. క్రూరమైన శిక్షలు, పాశవిక పాలన మధ్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరోవైపు దేశం ఆర్థిక సంక్షోభంలో పడిపోవడంతో పాటు ప్రజలకు తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఖజానా పరంగా కూడా నగదు లేకపోవడంతో పొరుగు దేశాలతో ఎగుమతి ,దిగుమతులకు కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన తమ డబ్బును తిరిగివ్వాలని తాలిబన్ ప్రభుత్వం బ్యాంకులను కోరుతోంది. అఫ్గనిస్థాన్ గత ప్రభుత్వాలు బిలియన్ల కొద్ది డాలర్లను యూఎస్ ఫెడరల్ రిజర్వ్, ఐరోపాలోని ఇతర సెంట్రల్ బ్యాంకులలో నిల్వచేసింది. అయితే ఆగస్టులో ఇస్లామిస్ట్ తాలిబాన్ పాశ్చాత్య-మద్దతుగల ప్రభుత్వాన్ని తొలగించినప్పటి నుంచి ఆయా దేశ ప్రభుత్వాలు ఆ డబ్బును విత్డ్రా చేసుకోకుండా నిలిపివేశాయి. దీంతో ప్రస్తుతం తమ దేశంలో పరిస్థితుల దృష్ట్యా ఆ డబ్బుని తిరిగి ఇవ్వాలని తాలిబన్ ప్రభుత్వం బ్యాంకులను అభ్యర్థిస్తోంది. అఫ్గన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఆ డబ్బు అఫ్గనిస్తాన్ దేశానిది. కాబట్టి మా డబ్బు మాకివ్వండి. నగదు నిల్వలను నిలుపుదల చేయడం సమజసం కాదని, అంతర్జాతీయ చట్టాలు, విలువలకు విరుద్ధం. ’’ అని తెలిపారు. తమ ప్రభుత్వం మహిళలకు విద్య సహా మానవ హక్కులను గౌరవిస్తుందని, మానవత్వంతో చేసే పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు. చదవండి: ‘నన్ను ప్రత్యక్షంగా చూస్తే థ్రిల్లింగ్గా ఉందా.. తేడా కొడితే మాత్రం ఇంతే’ -
ప్లీజ్.. గర్భవతిని! నా పోర్న్ వీడియోల్ని తీసేయండి
కెరీర్లో ఉన్నంత కాలం అవకాశాల కోసం ప్రయత్నిస్తూ.. రాణిస్తూ, ఆపై ఫేమ్ తెచ్చిన ఇండస్ట్రీపై విమర్శలు చేయడం అడల్ట్ స్టార్లకు అలవాటైన పనే. మియా ఖలీఫా, సన్నీ లియోన్ లాంటి మాజీ పోర్న్ స్టార్స్ వ్యతిరేక కామెంట్లు చేసిన వాళ్లే. ఇక ఇప్పుడు ఈ లిస్ట్లోకి చేరింది లానా రోడ్స్. చికాగో ఇల్లినాయిస్లో పుట్టిన పెరిగిన ఈ 25 ఏళ్ల మాజీ అడల్ట్ స్టార్ అసలు పేరు అమరా మాపుల్. టీనేజీలోనే పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి లానా రోడ్స్గా ఫేమ్ సంపాదించుకుంది. మొదట మోడలింగ్, యూట్యూబ్, ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. 2016 అడల్ట్ సినిమాల్లోకి అడుగుపెట్టి.. రెండేళ్లపాటు స్టార్డమ్ను కొనసాగించింది. కొంతకాలం క్రితం కెరీర్కు గుడ్బై చెప్పిన ఆమె.. ప్రస్తుతం హ్యారీ జోసే పాడ్కాస్ట్ ‘టాప్ ఇన్’లో పని చేస్తోంది. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీపై తరచూ విమర్శలు చేస్తోంది. తాజాగా తాను గర్భవతిని అనే బాంబ్ పేల్చిన లానా.. తన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి వీడియోల్ని తొలగించాలని విజ్ఞప్తి చేస్తోంది. ‘‘ప్రస్తుతం నేను గర్భంతో ఉన్నా. నాకు పుట్టే బిడ్డకు నా గతం గురించి తెలిసినా.. ఆ జ్ఞాపకాలు అందకూడదనే అనుకుంటున్నా. అందుకే నిజాయితీగా కోరుతున్నా. దయచేసి అడల్ట్ వెబ్సైట్లు ఆవీడియోలను తొలగించండి. అవకాశం దొరికితే నేనే కాలంలో వెనక్కి వెళ్తా. అలాంటి పనులకు దూరంగా ఉంటా. నా గౌరవాన్ని నేను కాపాడుకుంటా’’ అని పశ్చాత్తాప పడింది లానా. ఇక అంతేకాదు సెక్స్ వర్కర్స్తో ఇంటెరాక్షన్ ద్వారా.. వాళ్ల మానసిక సంఘర్షణను అందరికీ తెలియజేసేలా ప్రోగ్రామ్లు చేస్తోందామె. వాళ్లకు(అడల్ట్ వెబ్సైట్లకు) కొంత కాలం అవకాశం ఇవ్వాలనుకంటున్నా.. అవసరమైతే న్యాయపరమైన చర్యల దిశగా ఆలోచిస్తా అని చెప్తోంది లానా. చదవండి: అడల్ట్ సినిమాలతో మియా ఖలీఫా సంపాదనెంతో తెలుసా? ఇంతకీ తండ్రెవరు? మైక్ మజ్లక్ అమెరికన్ నటుడు, పాపులర్ వ్లోగర్. లానా రోడ్స్తో చాలాకాలంగా రిలేషన్షిప్ కొనసాగించాడు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. కొన్ని నెలల క్రితం వీళ్లిద్దరూ విడిపోయారు. దీంతో లానా కడుపులో బిడ్డకు తండ్రి అతనేనా? అనే అనుమానం ఆమె అభిమానులకు వ్యక్తం అవుతోంది. అయితే ఈ ప్రశ్నకు ఆమె ‘బిడ్డ పుట్టాక డీఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంద’ని సరదా సమాధానం ఇచ్చింది. చదవండి: పాక్ చేష్టలపై మియా ఖలీఫా ఫైర్ -
ముంబైలో కరోనా కల్లోలం.. చేతులెత్తి మొక్కిన మేయర్
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో విలయ తాండవం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారి కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేక పోతున్నాయి. ఇదిలా ఉంటే కరోనా దెబ్బకు మహరాష్ట్ర విలవిలలాడుతోంది. ముఖ్యంగా ముంబై నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రతీ రోజూ నమోదవుతున్న కేసులతో పాటు మరణాలు అదే స్థాయిలో పెరుగడం ముంబై వాసులను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై నగర మేయర్ కిషోర్ పెడ్నెకర్ కరోనా నిబంధనలను ప్రజలు తప్పక పాటించాలని వేడుకున్నారు. ముంబై నగరం వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలతో ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఈ క్రమంలో జనాభా తాకిడి కూడా అధికమే. అంతటి జనాభా ఉన్నప్పుడు అందులో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా అది అందరినీ ప్రమాదంలో పడేస్తుంది. ప్రస్తుతం ముంబైలో కేసుల పెరుగుదలకు ఇదొక కారణమనడంలో సందేహం లేదు. ఓ పక్క కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఇంకా కొందరు నిర్లక్ష్యంగా మాస్క్లు ధరించకపోవడం, అవసరం లేకపోయినా బయట సంచరించడం లాంటివి చేస్తూ కేసుల పెరుగుదలకు పరోక్షంగా కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో నగర మేయర్ ముంబై వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీకు చేతులెత్తి మొక్కుతున్నా.. డబుల్ మాస్క్లు పెట్టుకోండి. అవసరం ఉంటేనే బయటకి రండి, లేదంటే రాకండి.. అని వేడుకున్నారు. ( చదవండి: శభాష్ ప్యారే ఖాన్: రూ.కోటితో ఆక్సిజన్ ట్యాంకర్లు ) I request everyone with folded hands to wear a mask, that too double masks. People are requested to not step out of their houses unnecessarily: Mumbai Mayor Kishori Pednekar#COVID19 pic.twitter.com/zyjTAPew6x— ANI (@ANI) May 1, 2021 -
తన కొడుకు ప్రాణాలను కాపాడమని ఓ తల్లి ఆవేదన
-
కరోనా కష్టాల్లో రుణగ్రహీతలు
ముంబై: కరోనా వైరస్ పరిణామాలతో రుణగ్రహీతలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రుణాలను 2021 దాకా వన్–టైమ్ ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించేందుకు అనుమతించాలంటూ రిజర్వ్ బ్యాంక్ను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) కోరాయి. అలాగే రుణ వాయిదాలపై మారటోరియం వెసులుబాటు తమకూ ఇవ్వాలని, ప్రొవిజనింగ్ నిబంధనల సడలింపునివ్వాలని విజ్ఞప్తి చేశాయి. ఆర్బీఐతో జరిగిన సమావేశంలో పరిశ్రమ వర్గాలు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేసినట్లు ఎన్బీఎఫ్సీల సమాఖ్య ఆర్థిక రంగ అభివృద్ధి మండలి (ఎఫ్ఐడీసీ) వెల్లడించింది. లాక్డౌన్తో తమ కస్టమర్ల ఆదాయాలు గణనీయంగా దెబ్బతిన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం మిగతా కాలం కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐకి తెలిపాయి. ప్రధానంగా రవాణా ఆపరేటర్లు, కాంట్రాక్టర్లు, లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) మొదలైన వాటిపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం ఉందని ఎన్బీఎఫ్సీలు వివరించాయి. ‘ఈ నేపథ్యంలో మొండిపద్దుల కింద వర్గీకరించే పరిస్థితి రాకుండా.. 2021 మార్చి దాకా రుణాల రీపేమెంట్ షెడ్యూల్స్ను సవరించేందుకు లేదా వాయిదాలను పొడిగించేందుకు లేదా ఈఎంఐలను పునర్వ్యవస్థీకరించేందుకు వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్కు అనుమతివ్వాలి‘ అని కోరినట్లు ఎఫ్ఐడీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఎంఎస్ఎంఈలకు ఇచ్చిన రుణాలను 2020 డిసెంబర్ దాకా వన్–టైమ్ పునర్వ్యవస్థీకరణ చేసేందుకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు ఆర్బీఐ అనుమతించింది. దీన్ని మిగతా రుణ గ్రహీతలందరికీ కూడా వర్తింపచేయాలని ఎన్బీఎఫ్సీలు కోరుతున్నాయి. ఇక మూడు నెలల పాటు ఈఎంఐలను వాయిదా వేసుకునేందుకు ఆర్బీఐ ప్రకటించిన మారటోరియంతో రుణగ్రహీతలకు కాస్త ఉపశమనం లభించిందని ఎఫ్ఐడీసీ తెలిపింది. అయితే, పరిస్థితులు ఇంకా చక్కబడనందున నాలుగో నెలలోనూ వారు వాయిదాలు చెల్లించగలిగే అవకాశాలు ఉండకపోవచ్చని పేర్కొంది. నిధుల లభ్యత పెంచాలి .. తమ రుణ వితరణ కార్యకలాపాలు యథాప్రకారం సాగేలా తోడ్పడేందుకు రీఫైనాన్స్ మార్గం ద్వారా చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బి).. నాబార్డ్ నుంచి మరిన్ని నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని ఎన్బీఎఫ్సీలు కోరాయి. టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ (టీఎల్టీఆర్వో 2.0)కి సగం స్థాయిలోనే బిడ్లు రావడమనేది .. బ్యాంకులు రిస్కు తీసుకోవడానికి ఇష్టపడకపోవడాన్ని సూచిస్తోందని ఎఫ్ఐడీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో మిగతా మొత్తాన్ని సిడ్బి, నాబార్డ్లకు కేటాయించి తద్వారా తమకు నిధుల లభ్యత మెరుగుపడేలా చూడాలని కోరింది. ఇక, గడువు తీరి 1 రోజు దాటిన రుణ పద్దులన్నింటికీ 10 శాతం దాకా ప్రొవిజనింగ్ చేయాలన్న ఆదేశాలను కాస్త సడలించాలని కోరింది. తమ దగ్గర రుణాలు తీసుకునే ట్రక్కు ఆపరేటర్లు లాంటి వివిధ వర్గాలవారు పలు కారణాలతో ఈఎంఐలను కాస్త ఆలస్యంగా చెల్లించడం సాధారణమేనని పేర్కొంది. కొంత ఆలస్యమైనా 30 రోజుల్లోపే చెల్లించేస్తుంటారు కాబట్టి, ఈ పద్దులను క్రెడిట్ రిస్కు కింద పరిగణించడానికి లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రొవిజనింగ్ నిబంధనను 30 రోజులు దాటిపోయిన రుణాలకు మాత్రమే వర్తింపచేసేలా అనుమతినివ్వాలని ఎన్బీఎఫ్సీలు విజ్ఞప్తి చేశాయి. పీఎస్బీలకు మొండిపద్దుల భారం ► ఈసారి 2–4% పెరుగుతాయి ► బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండిబాకీల భారం 2–4 శాతం మేర పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజి దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీవోఎఫ్ఏ) హెచ్చరించింది. దీనితో బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ కింద ప్రభుత్వం 7–15 బిలియన్ డాలర్ల దాకా అదనపు మూలధనం సమకూర్చాల్సి రావొచ్చని పేర్కొంది. ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను వసూళ్లు పడిపోవడం, డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాలు నెరవేరే అవకాశాలు లేకపోవడం తదితర అంశాల కారణంగా ద్రవ్య లోటు 2 శాతం మేర పెరగవచ్చని బీవోఎఫ్ఏ తెలిపింది. బ్యాంకులకు అదనపు మూలధనం అందించడానికి అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం వివిధ మార్గాలు అన్వేషించాల్సి రావచ్చని వివరించింది.రీక్యాపిటలైజేషన్ బాండ్లను జారీ చేయడం లేదా ఆర్బీఐ దగ్గరున్న నిల్వల నుంచి కొంత భాగాన్ని వినియోగించడం వంటి అంశాలు పరిశీలించవచ్చని తెలిపింది. కరోనా వైరస్ కట్టడికి సంబంధించిన పరిణామాలతో బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు భారీగా పెరగవచ్చంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో బీవోఎఫ్ఏ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. -
చేతులెత్తి నమస్కరిస్తున్నా.. అర్థం చేసుకోండి
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అదుపు చేయాలంటే మూడు వారాల పాటు ఎక్కడి వారక్కడే ఉండి పోవాలని, ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే మరో మార్గం లేదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విపత్కర పరిస్థితుల్లో కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని, లేదంటే అనర్థం జరుగుతుందన్నారు. మనందరం ఇళ్లకే పరిమితం కాకపోతే ఈ వైరస్ను అదుపు చేయలేమని అన్నారు. దేశంలో కరోనా వైరస్ ప్రబలకుండా ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరూ ప్రభుత్వం విధించిన ఆంక్షలకు అనుగుణంగా స్వీయ నియంత్రణ పాటించి సహకరించాలని కోరారు. పరిస్థితులను అర్థం చేసుకోవాలని చేతులు జోడించి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేశారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. మన వాళ్లను చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి లేదు ►వందేళ్లకు ఒకసారి వచ్చే ఇలాంటి వ్యాధులను మన జీవిత కాలంలో ఇప్పుడు చూడాల్సి వస్తోంది. దీనిని మనం క్రమశిక్షణతోనే నివారించగలం. నిర్లక్ష్యం చేస్తే కొన్ని దేశాల్లో ఏం జరిగిందో చూశాం. అందుకే కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోకపోతే అనర్థం జరుగుతుందనే భయం ఉంది. కాబట్టి అందరూ సహకరించాలి. ►నిన్న (బుధవారం) రాత్రి జరిగిన కొన్ని ఘటనలు మనసును కలిచి వేశాయి. మన వాళ్లను కూడా మనం చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి లేక పోవడం బాధ కలిగించింది. కానీ అందరం ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ మనందరం ఇళ్లకు పరిమితం కాకపోతే వ్యాధిని అదుపు చేయలేం. ఇవాళ కూడా పొందుగుల, దాచేపల్లి, సాగర్ సరిహద్దుల్లో మన వాళ్లను మనం రానీయలేని పరిస్థితి ఉంది. ►ఒకసారి ప్రదేశం మారుతున్న వారు ఎందరితోనో కాంటాక్ట్లో ఉండి ఉంటారు. వారు ఇంకా ఎంత మందితో కాంటాక్ట్లోకి వెళ్తారో తెలియదు. అది కనుక్కోవడం చాలా కష్టం. ఏప్రిల్ 14 వరకు ఇళ్లల్లోనే ఉండక తప్పదు ►ఏప్రిల్ 14 వరకు మనం ఎక్కడికీ వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటే, కాంటాక్ట్ ట్రేసింగ్ తేలిగ్గా తెలిసి పోతుంది. వ్యాధి సోకిన వారిని గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించవచ్చు. ఈ మూడు వారాల పాటు అందరూ ఎక్కడి వారు అక్కడే ఆగిపోవాలి. మన వాళ్లను మనమే ఆపాల్సి రావడం బాధ కలిగిస్తోంది. ►నిన్న (బుధవారం) మార్కాపురం, అద్దంకి వద్ద 44 మందిని, కందుకూరు వద్ద 152 మందిని అనుమతించాం. మానవతా దృక్పథంతో అనుమతించినా, వారు వేరే రాష్ట్రం నుంచి వచ్చారు కనుక వారందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచక తప్పదు. ►విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు మొత్తం 27,819 మంది ఉండగా, వారందరిపై నిఘా వేసి ట్రాకింగ్లో పెట్టాం. వారు ఎందరితో కాంటాక్ట్లో ఉన్నారో పరిశీలిస్తున్నాం. ఇదే సమయంలో మనందరం స్వయం క్రమశిక్షణ, సామాజిక దూరం పాటించకపోతే ఇబ్బంది పడతాం. నాలుగు క్రిటికల్ కేర్ ఆసుపత్రులు ► విశాఖ, నెల్లూరు, విజయవాడ, తిరుపతి.. నాలుగు చోట్ల క్రిటికల్ కేర్ ఆస్పత్రులు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 470 ఐసీయూ పడకలతో వెంటిలేటర్లు, అదనపు పడకలు అందుబాటులో ఉన్నాయి. ►ప్రతి జిల్లాలో 200 పడకలతో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రైవేటు సెక్టార్లో కూడా 213 ఐసీయూ పడకలతో వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. ►పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబుతో పాటు, మరో 10 మంది ఉన్నతాధికారులను ఏర్పాటు చేశాం. ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలకు 104 నంబర్ కూడా అందుబాటులో ఉంది. కంట్రోల్ రూమ్లు అండగా ఉన్నాయి.. ►రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఇందులో పది మంది సీనియర్ అధికారులతో పాటు ముగ్గురు మంత్రులు, సీఎం ఆఫీసు నుంచి మరో ముగ్గురు అధికారులు ఉంటారు. ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ రూమ్లు ఉంటాయి. జిల్లా మంత్రులు జిల్లా కంట్రోల్ రూమ్లలో భాగస్వాములవుతారు. అక్కడ కూడా వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులు ఉంటారు. ఎవరికి అసౌకర్యం కలగకుండా చూస్తారు. ►ఎవరికీ ఆహారం, వసతి ఇతర సౌకర్యాల లోటు లేకుండా చూడాలని కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఏ ఇబ్బంది ఉన్నా 1902 కు ఫోన్ చేయండి. వెంటనే కలెక్టర్ స్పందించి మీ సమస్యలు పరిష్కరిస్తారు. ►సరుకుల రవాణా వాహనాలకు అనుమతి ఇచ్చాం. నిత్యావసరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు. ►రైతు బజార్లను విస్తరిస్తున్నాం. ప్రజల సంఖ్య, వారి అవసరాలు గుర్తించి కేవలం 2 నుంచి 3 కి.మీ పరిధిలో రైతు బజార్లతో పాటు, నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్నీ తెరిచి ఉంటాయి. కాబట్టి అవసరమైనవి తీసుకుని, ఆ తర్వాత ఇళ్లలోనే ఉండండి. రైతులు సామాజిక దూరం పాటించాలి ►పంటలు కోతకు వస్తున్నాయి కాబట్టి తప్పదు కనుక రైతులు, రైతు కూలీలు పనులకు వెళ్లండి. కానీ అక్కడ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి. ►గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని పంచాయతీ రాజ్, పురపాలక శాఖలకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాం. -
‘నా కొడుకు ఉద్యోగం మానేస్తాడు.. వదిలిపెట్టండి’
శ్రీనగర్ : ‘మా కుమారుడు ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. తనను వదిలిపెట్టండి. తనే మా కుటుంబానికి ఆధారం. ఇద్దరు ముసలి వాల్లం, ఇద్దరు చిన్నారులు తన మీదే ఆధారపడ్డారు. దయచేసి తనను వదిలి పెట్టండి. ఈ ఉద్యోగం మానేస్తాడు’ అంటూ 70 ఏళ్ల సైదా బేగం కన్నీరు మున్నిరుగా విలపించిన ఆ పాశాన హృదయాలు కరగలేదు. అతి కిరాతకంగా నిసార్ అహ్మద్(44)ని హత్య చేశారు. ఈ హృదయవిదారకరమైన ఘటన కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ముగ్గురు స్పెషల్ పోలీసు అధికారులను(ఎస్పీవో) శుక్రవారం వారి ఇళ్ల నుంచి అపహరించి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అలా ఉగ్రవాదుల చేతిలో హతమైన వారిలో నిసార్ అహ్మద్ ఒకరు. పోలీసులను కిడ్నాప్ చేసిన అనంతరం హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూప్ నాయకుడు ఓ వీడియోను విడుదల చేసినట్లు సమాచారం. ఈ వీడియోలో అతడు సదరు పోలీసులను తమ ఉద్యోగాలకు రాజీనామా చేయలని.. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుంది అని తెలిపారు. దాంతో నిసార్ తల్లి, సైదా తమ కుమారుడు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడని.. అతన్ని విడుదల చేయాల్సిందిగా కోరింది. తన కుటుంబానికి అతనోక్కడే ఆధారం అని తెలిపింది. సైదా అభ్యర్ధనను అంగీకరించిన ఉగ్రవాదుల అతన్ని విడుదల చేస్తామని తెలిపారు. కానీ మాట తప్పి నిసార్ని హత్య చేసి అతని కుటుంబానికి తీవ్రం అన్యాయం చేశారు. ఈ ముసలి వయసులో మాకు దిక్కెవరంటూ ఏడుస్తున్న సైదాని సముదాయించడం ఎవరి తరం కాలేదు. -
రిలీఫ్ మెటీరియల్కి స్థలం లేదు: డబ్బులు ప్లీజ్
సాక్షి, బెంగళూరు: భారీ వర్షాలతో భీతిల్లిన కర్నాటక వాసులను ఆదుకునేందుకు భారీ స్పందన లభిస్తోంది. కర్నాటక ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ పేరుతో కొడగు జిల్లాకు నిత్యావసరాలు, ఇతర ఆహార పదార్థలు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి తమ వద్ద ఉన్న ఆహార పదార్థాల నిల్వలు చాలని, ఇక పంపవద్దని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే తగినంత ఆహార, వస్తు సామగ్రి ఉన్నందువల్ల రిలీఫ్ ఫుడ్ మెటీరియల్ పంపించడాన్ని నిలిపివేయాలని కొడగు జిల్లా ఇన్ చార్జి మంత్రి ఎస్ఆర్ మహేష్ ప్రజలకు, దాతలకు విజ్ఞప్తి చేశారు. ఇంతకుమించి సేకరించినా నిల్వ చేయడానికి స్థలం లేదని ఆయన చెప్పారు. దీనికి బదులుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బును బదిలీ చేయాలని కోరారు. కాగా ఒకపక్క భారీ వర్షాలు, వరదలు కేరళను వణికించగా, మరోవైపు పొరుగు రాష్ట్రం కర్నాటకను కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా కొడగు జిల్లా భారీగా ప్రభావితమైంది. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 8మంది మరణించగా, 4వేలమందికి పైగా నిర్వాసితులయ్యారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ ప్రాంతాల్లో వందలాదిమంది చిక్కుండిపోయారు. వర్షాల కారణంగా 123 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 800కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముఖ్యమంత్రి కుమారస్వామి బాధిత ప్రాంతాల్లో పర్యటించి, సహాయ పునరావాస శిబిరాలను సందర్శించి, పరిస్థితిని సమీక్షించి సంగతి తెలిసిందే. -
బ్రిటన్లోనే నీరవ్: సీబీఐ కీలక చర్య
సాక్షి, న్యూఢిల్లీ: అతిపెద్ద బ్యాంకింగ్ స్కాంకు సంబంధించి సీబీఐ కీలక సమాచారాన్ని సేకరించింది. దాదాపు రూ.14000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ యునైటెడ్ కింగ్ డమ్ (యుకె)లోనే ఉన్నట్టు సీబీఐ సోమవారం వెల్లడించింది. ఈ మేరకు బ్రిటన్ అధికారులు సమాచారం ఇచ్చినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. వేలకోట్ల రుణాలను ఎగొట్టి లండన్కు చెక్కేసిన బిలియనీర్ వజ్రాల వ్యాపారి నీరవ్ను తమకు అప్పగించాలని కోరినట్టు తెలిపింది. నీరవ్ మోదీ అప్పగించాల్సిందిగా సీబీఐ హోమ్ మంత్రిత్వ శాఖ ద్వారా దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తును విదేశాంగ శాఖ బ్రిటన్కు పంపిస్తుంది. అలాగే నీరవ్ మోదీని అదుపులోకి తీసుకోవాల్సిందిగా సీబీఐ యుకె అధికార యంత్రాంగాన్ని కోరింది. దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ స్కామ్ పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి రాకముందే నీరవ్ మోదీ, భార్య అమీ మోదీ, సోదరుడు నిశాల్ మోదీ మామ మెహుల్ చోక్సీ విదేశాలకు చెక్కేశారు. ఈ కేసు విచారణలో భాగంగా మోదీ, చోక్సీల పాస్పోర్ట్లను రద్దు చేసింది. అలాగే ఇంటర్ పోల్ కూడా మాల్యాకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. అటు ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ.9,వేల కోట్లు రుణం తీసుకొని ఎగ్గొట్టి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కూడా లండన్కు పారిపోయిన సంగతి తెలిసిందే. -
ఫ్యాన్స్ని ఓపిక పట్టమన్న బన్నీ
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇంతవరకు తదుపరి ప్రాజెక్ట్ను ప్రకటించలేదు. దీంతో బన్నీ తదుపరి చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బన్నీ కొత్త సినిమా ఎప్పుడు ప్రకటిస్తాడనే దానిపై విపరీతమైన చర్చ నడుస్తోంది. కాగా, ఈ వార్తలపై బన్నీ ట్విటర్లో స్పందించారు. ‘మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. మీ అందరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను.. నా తదుపరి చిత్రం గురించి ప్రకటించే వరకు దయచేసి ఓపికగా ఉండండి. ఎందుకంటే ఇది ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. నేను మంచి సినిమా చేయాలని చూస్తున్నాను. దీనికి టైం పడుతోంది. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ బన్నీ ట్వీట్ చేశారు. -
మోదీజీ మీకో విన్నపం
తమిళసినిమా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీకో విన్నపం అని అన్నది ఎవరో తెలుసా? సంచలన నటి వరలక్ష్మీ శరత్కుమార్. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ సంచలన నటి సమాజంలో జరుగుతున్న సంఘటనలపైనా తనదైన బాణిలో స్పందిస్తున్న విషయం తెలిసిందే. సేవ్శక్తి అనే స్వచ్ఛంద సేవా సంస్థను నెలకొల్పి మహిళా రక్షణ కోసం పోరాడుతున్న వరలక్ష్మీశరత్కుమార్ ఇటీవల దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆమె ఇక ప్రకటనను విడుదల చేస్తూ జమ్ముకశ్మీర్లోని చిన్నారి హత్యాచారం దేశాన్నే కదిలించి వేసిందన్నారు. అలాంటి దారుణాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వయసు మళ్లిన వ్యక్తి మనవరాలి వయసున్న యువతిపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాల వీడియో ఒకటి సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో ఆ ముదుసలి వ్యక్తిని ప్రజలు చితకబాదారు. ఈ వీడియోలోని దృశ్యాలు నటి వరలక్ష్మీశరత్కుమార్ని మరింత ఆగ్రహానికి గురి చేశాయట. అంతే వెంటనే తన ట్విట్టర్లో ప్రధానికో విన్నపం అంటూ మొదలెట్టి, ఇదేనా మనం నివశిస్తున్న ప్రపంచం? ఇలాంటి దేశాన్నే మీరు పరిపాలించాలని కోరుకుంటున్నారా? ప్రధాని మోదీ గారూ మీకు ఓట్లు వేసిన ప్రజల ఆలోచనలను గౌరవించి మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారిని ఉరిశిక్ష విధించే చట్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను అని నటి వరలక్ష్మీశరత్కుమార్ ప్రధాని నరేంద్రమోదీకి ట్వీట్ చేశారు. మరి ఈమె ట్వీట్కు ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూద్దాం. -
రేపు సెలవు ప్రకటించండి
సాక్షి, న్యూఢిల్లీ : షాహిద్ దివస్ సందర్భంగా రేపు అంటే మార్చి 23న సెలవుగా ప్రకటించాలని శిరోమణి అకాళీ దళ్ పార్టీ కోరుతోంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ ప్రేమ్ సింగ్ చందుముజ్రా గురువారం లోక్సభలో ఓ లేఖను సమర్పించారు. ‘వారి గౌరవార్థం పార్లమెంట్కు సెలవు దినం ప్రకటించాలి. లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్కు లేఖ రాశాను. ఆమె సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని ప్రేమ్ సింగ్ మీడియాకు తెలిపారు. గదర్ కుట్రలో నిందితులుగా తేలటంతో లాహోర్లోని జైల్లో 1931, మార్చి 23న భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరి తీశారు. వారి గుర్తుగా మార్చి 23ను ప్రతీ ఏటా షాహిద్ దివస్గా జరుపుకుంటున్నాం. అంతేకాదు పార్లమెంట్ హౌజ్లోలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నాడు(1929, ఏప్రిల్8వ తేదీన) భగత్ సింగ్, భటుకేశ్వర దత్లు చేసిన బాంబు దాడికి గుర్తుగా సందర్శకుల గ్యాలెరీలో వారికి రెండు కుర్చీలు కేటాయించాలని అకాళీదల్ కోరింది. -
విరుష్క.. ఇక ఆపితేనే మంచిది!
సాక్షి, స్పోర్ట్స్/సినిమా : టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్మన్ కమ్ కెప్టెన్, బాలీవుడ్ నటి అనుష్క శర్మ... వివాహం తర్వాత తమ బంధాన్ని మరింత ధృడంగా మార్చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో టైమింగ్ ఫోటోలతో ఈ ఇద్దరూ చెలరేగిపోతున్నారు. అయితే అభిమానులు పెట్టింది చాలూ.. ఇక ఆపమంటున్నారు. తమ తమ వృత్తుల్లో నిత్యం బిజీగా ఉండే వీరిద్దరూ.. టైం దొరికితే చాలూ ఇలా అల్లుకుపోతున్నారు. ట్రై సిరీస్కు విరామం లభించటంతో కోహ్లి.. జీరో, సుయి ధాగా చిత్రాలకు బ్రేక్ తీసుకున్న అనుష్క... కొత్త ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతూ మధుర క్షణాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా అనుష్క కొహ్లీని ముద్దాడుతున్న ఓ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఫోటో పెట్టిన గంటలోనే 7 లక్షల లైకులు. వేలల్లో కామెంట్లు... ఫ్యాన్స్ ఖుష్. అంతా హ్యాపీనే. కానీ.. వీళ్లను చూసి అసూయ పడేవాళ్లు కూడా లేకపోలేదు. అందుకే ఇకపై అలాంటి ఫోటోలు పెట్టడం ఆపితేనే మంచిందన్నది విరుష్కల హార్డ్ కోర్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్. 💑 A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Mar 11, 2018 at 5:38am PDT Chilling and how! 😎 A post shared by Virat Kohli (@virat.kohli) on Mar 11, 2018 at 4:22am PDT Watching the sunrise & sunset in Chanderi is one of my most cherished moments in life! Will miss it now that the shoot here comes to an end. Next stop.. Bhopal! #suidhaaga #TeamPixel #Pixel2XL #sponsored 🌞 A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Mar 10, 2018 at 5:32am PST -
మా కుమారుడికి మెరుగైన వైద్యం అందించండి
సాక్షి, హైదరాబాద్ : తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందించాలని చెంగిచర్ల ఆయిల్ ట్యాంకర్ పేలుడు ఘటనలో గాయపడిన వెంకట్నాయక్ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన వెంకట్ నాయక్ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతను చెన్నయ్లో ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీలో కాంట్రాక్ట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. -
ఈ సారైనా నాకు ఓటేయండి!
సుంకిరెడ్డిపాలెం(పొన్నలూరు): మీ గ్రామంలో అభివృద్ధి పనులు చేశాను. గత ఎన్నికల్లో మీరు నాకు ఓట్లు వేయలేదు కనీసం ఈ సారైన నాకు ఓట్లు వేయండని ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి గ్రామస్తులకు విన్నవించారు. మండలంలోని సుంకిరెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మీ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, ఇప్పటికైన మీరు మారి ఈ సారైన నాకు ఓటు వేయాలన్నారు. ఎమ్మెల్యే పలుమార్లు గత ఎన్నికల్లో మీరు నాకు ఓట్లు వేయలేదని అనడంతో అవాక్కైన గ్రామస్తులు మీరు దగ్గరుడి చూసినట్లు పదే పదే నాకు ఓటు వేయలేదంటున్నారేమిటని ప్రశ్నించారు. స్థానిక సర్పంచ్ వరికూటి బ్రహ్మారెడ్డి ప్రభుత్వం నుంచి మంజూరైన అభివృద్ధి పనులను తనను చేయనివ్వకుండా పక్క గ్రామాలకు చెందిన అధికారపార్టీ నాయకులతో చేయించడం ఏమిటంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ మట్టి తోలించి బిల్లులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కార్యక్రమంలో కందుకూరు డీఎస్పీ ప్రకాశరావు, ప్రత్యేక అధికారి ఉమాదేవి, ఎంపీపీ వీరకుమారి, ఎంపీడీఓ పద్మజ, తహసీల్దార్ మహ్మద్హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
పడగొట్టి.. పరిగెత్తి.. కాళ్లుపట్టి....!
బైక్ ఢీకొట్టడంతో కిందపడ్డ కానిస్టేబుల్ బైక్, వాహనంతో వెళ్లేందుకు యత్నిస్తున్న యువకుడు, వదిలేయమని వేడుకుంటున్న దృశ్యం ఉదయం 10 గంటల సమయంలో ఆదాలత్ వైపు నుంచి నక్కగుట్ట వైపు ఓవర్ స్పీడ్గా బైక్పై వచ్చిన ఓ యువకుడు జెడ్పీ ఎదుట డివైడర్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ కోర్టు కానిస్టేబుల్ను బలంగా ఢీకోట్టాడు. దీంతో కానిస్టేబుల్ కింద పడ్డాడు. బైక్ కొంత ధ్వంసం అయింది. కాళ్లుచేతులకు దెబ్బలు తగిలాయి. ఇది గమనించిన యువకుడు బండితో అక్కడి నుంచి ఉడాయించే ప్రయత్నం చేశాడు. కానిస్టేబుల్ తేరుకుని యువకుని సెల్ ఫోన్, బైక్ కీస్ లాక్కోవడంతో కొంత దూరం పరిగెత్తి చేసేదిలేక మళ్లీ తిరిగొచ్చాడు. దీంతో అప్పటికే మంట మీదున్న కానిస్టేబుల్ యువకుడికి నాలుగు తగిలించాడు. తన వాహనం రిపేర్ చేయించమని, లేదంటే పోలీస్ స్టేషన్కు పదమని అన్నాడు. దీంతో యువకుడు చేసేదిలేక తప్పయింది వదిలేయమంటూ కాళ్లబేరానికి వచ్చాడు. తన వద్ద డబ్బులు కూడా లేవని ప్రాథేయపడ్డాడు. యువకుడి వేడుకోలు చూసి అంతా కానిస్టేబుల్కు సర్దిచెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది. – హన్మకొండ అర్బన్ -
సత్తా చూపుతా.. సాయం చేయరూ!
విలువిద్యలో ప్రావీణ్యం ఉంది ప్రోత్సహించండి ఎవరెస్ట్ అధిరోహకుడు కుంజా దుర్గారావు వీఆర్పురం : తనకు తగిన ప్రోత్సాహం అందిస్తే విలువిద్య(ఆర్చరీ)లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చూపిస్తానని ఎవరెస్ట్ అధిరోహకుడు కుంజా దుర్గారావు అన్నాడు. రేఖపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం దుర్గారావు మాట్లాడుతూ విలువిద్యలో తనకు ప్రావీణ్యం ఉందని, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో, ఒలింపిక్స్లో పాల్గొనేందుకు తగిన సాధన చేయాల్సి ఉందన్నాడు. సాధనకు అవసరమైన పరికరాలకు సుమారు రూ.మూడు లక్షలకు పైగా ఖర్చవుతుందని తెలిపాడు. ప్రభుత్వంగానీ, దాతలు గానీ తన ఆశయ సాధనకు ఆర్థిక సహకారం అందించాలని కోరాడు. అనంతరం తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్కు వినతి పత్రం ఇచ్చాడు. దుర్గారావును తహసీల్దార్ అభినందించారు. దుర్గారావు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పూనెం సత్యనారాయణ, సోయం చినబాబు తదితరులు ఉన్నారు. -
మాల్యాకు షాక్...కీలక పరిణామం
న్యూఢిల్లీ: వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను తిరిగి దేశానికి రప్పించే ప్రక్రియలో మరో కీలక అడుగు పడింది. సుమారు రూ 9,000 కోట్ల మేరకు రుణ డిఫాల్ట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యాను వెనక్కి రప్పించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా విదేశాంగ శాఖ అభ్యర్థనను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు యూకే మాజిస్ట్రేట్ మాల్యాపై అరెస్ట్ వారెంట్ జారీ చేయొచ్చని భావిస్తున్నారు. పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాను అప్పగించే విషయంలో భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అభ్యర్థను బ్రిటన్ స్టేట్ సెక్రటరీ ఆమోదించిందని పీటీఐ నివేదించింది. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను అప్పగించాల్సిందిగా కోరుతూ ఎక్ట్రాడిషన్ రిక్వెస్ట్ ను భారత విదేశాంగ శాఖ బ్రిటన్ ప్రభుత్వానికి అంద జేసింది. నేరస్థుల అప్పగింతకు సంబంధించి భారత్ –బ్రిటన్ ల 1993 నాటి ఒప్పందం నేపథ్యంలో విజయ్ మాల్యాను బ్రిటన్ అప్పగించాలని కోరింది. కాగా మాల్యాను స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు ఇంకా పెండింగ్ లోఉన్నాయని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి కె సింగ్ గురువారం రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. గత అయిదు సంవత్సరాల కాలంలో ఫ్యుజిటివ్ క్రిమినల్ సమీర్ బాయ్ విను భాయ్ పటేల్ ఒక్కడినే రప్పించగలిగామని చెప్పారు. మాల్యాతో సహా పారిపోయిన నేరస్తులకు సంబంధించి భారత 10 అప్లికేషన్లు బ్రిటన్ లో పెండింగ్ లో ఉన్నట్టు చెప్పారు. -
సిలబస్ కాకుండా పరీక్షలు సరికాదు
డీఈఓకు బీఈడీ ఉపాధ్యాయ సంఘం వినతి అనంతపురం ఎడ్యుకేషన్ : సిలబస్ పూర్తి కాకుండా 6 – 9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించడం సరికాదని బీఈడీ ఉపాధ్యాయ సంఘం నాయకులు సోమవారం డీఈఓ లక్ష్మీనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ 6 – 9 తరగతుల విద్యార్థులకు ఈనెల 14 నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం ఈనెల చివరి వరకు సమయం ఉందన్నారు. అయినప్పటికీ సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టాలని ఎలా నిర్ణయించారని ప్రశ్నించారు. దీనికితోడు పదో తరగతి పరీక్షలు కూడా అదే సమయంలో ఉన్నందున ఎక్కువమంది టీచర్లు డీఓ, సీఓ, ఇన్విజిలేటర్లుగా వెళతారన్నారు. ఈ పరిస్థితుల్లో 6 – 9 తరగతులకు పరీక్షలు పెట్టడానికి టీచర్ల కొరత ఉంటుందన్నారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి పరీక్షలు పెట్టడం వల్ల ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. మరి పిల్లలు ఈ సమయంలో కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు ఎలా వస్తారో అధి కారులు ఆలోచించాలన్నారు. ఎండకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పూర్వకాలం నుంచీ ఒంటిపూట బడులు నడుపుతున్నారన్నారు. ఇలాంటి వాటిని పక్కనబెట్టి విద్యార్థులు ఇక్కట్లు పడేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పునరాలోచించాలని విజ్ఞప్తి చేశా రు. పదో తరగతి స్పాట్ వాల్యూయేష¯ŒSకు బోధన చేస్తున్న హెచ్ఎంలను మాత్రమే సీఎస్లుగా నియమించాని కోరారు. డీఈఓను కలిసిన వారిలో బీఈ డీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారా యణస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకరయ్య, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులున్నారు. -
అరుదైన వ్యాధితో బాధపడే రమ్యను కాపాడుకుందాం
-
కాపులకు ప్రత్యేక కోటాలో రిజర్వేషన్లు కల్పించాలి
కొత్తపేట : బీసీలకు ఏవిదమైన నష్టం కలగకుండా కాపులకు ప్రత్యేక కోటాలో రిజర్వేషన్లు కల్పించాలన్నదే తమ డిమాండ్ అని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. కాపు ఉద్యమ ప్రణాళికలో భాగంగా సోమవారం ఆయన కొత్తపేటలో రాష్ట్ర బీసీ నాయకుడు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్ఎస్)ను కలసి వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు కాపునాడు నాయకుడు చీకట్ల ప్రసాద్ స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీలకు ఏవిధంగానూ నష్టం కలగకుండా విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రత్యేక కేటగిరీలో మాత్రమే రిజర్వేషన్లు కోరుతున్నామని, బీసీ రిజర్వేషన్ల శాతం పెంచమని మీరు డిమాండ్ చేస్తే దానికి తామూ మద్దతు ఇస్తామని ముద్రగడ ఆర్ఎస్తో అన్నారు. సీఎం కాపులు, బీసీలను సమావేశపరచి బీసీలకు నష్టం కలగని ఫార్ములాతో వస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి తమకు అభ్యంతరం ఉండదని ఆర్ఎస్ అన్నారు. దానికి ముద్రగడ మద్దతు పలికారు. అదే విధంగా మంజునాథ కమిషన్ సర్వే సందర్భంగా ఒక రోజు బీసీలు, మరో రోజు కాపుల అభిప్రాయాలను సేకరించాలని ఆర్ఎస్ అనడంతో తమదీ అదే అభిప్రాయమని ముద్రగడ తెలిపారు. ముద్రగడ వెంట కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, కాపు నాయకులు మిండగుదిటి మోహన్, పాలూరి సత్యానందం, బండారు రాజా, ముత్యాల వీరభద్రరావు, సూధా గణపతి తదితరులు ఉన్నారు. కాపు రిజర్వేషన్లు పార్లమెంట్లో ప్రస్తావిస్తా : ఎంపీ రవీంద్రబాబు కాకినాడ రూరల్: కాపు రిజర్వేషన్ల అంశం పార్లమెంటులో ప్రస్తావిస్తానని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. ముద్రగడ పద్మనాభం కాపు జేఏసీ ప్రతినిధులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు తదితరులతో కలసి సోమవారం ఎంపీ రవీంద్రబాబును రమణయ్య పేటలోని ఆయన స్వగృహంలో కలసి వినతిపత్రం అందజేశారు. ఆ సందర్భంగా రవీంద్రబాబు పైమేరకు వారికి హామీ ఇచ్చారు. -
కులాల మధ్య చిచ్చు
కాపుల న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలి కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కాపు జేఏసీ నేతల వినతిపత్రం గోపాలపురం (రావులపాలెం) : కాపులను బీసీల్లో కలుపుతామని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. శుక్రవారం ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు చేపట్టిన కాపు రిజర్వేష¯ŒS సాధన ఉద్యమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలోని కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని కాపు ఉద్యమానికి మద్ధతుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ అధికార పీఠం కోసం ఎన్నికల ముందు కాపు రిజర్వేషన్లు తదితర 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు నేడు వాటిని గాలికి వదిలేశారన్నారు. బీసీలకు నష్టం లేకుండా తమకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాపులు చేస్తున్న డిమాండ్ న్యాయమైనదే అన్నారు. వారి ఉద్యమానికి పూర్తి సహకారాన్ని అందజేస్తానన్నారు. వారి ఆకాంక్షలను తమ పార్టీ అధినేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాపు కార్పొరేష¯ŒS రుణాలను కేవలం పచ్చ చొక్కాలకే ఇస్తున్న వైనంపై నియోజకవర్గంలో మొదటిసారి ప్రశ్నించింది తానే అన్నారు. అర్హులందరికీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు. ఉద్యమనేతల పట్ల ప్రభుత్వం గౌరవం కలిగిఉండాలని, ముద్రగడ పద్మనాభం వంటి సీనియర్ నాయకుడి పట్ల ప్రభుత్వం, చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నానన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందన్నారు. ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు, ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నదే తమ డిమాండ్ అన్నారు. తొలుత ఆకుల రామకృష్ణ ఇంటి వద్ద నుండి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఇంటి వరకూ కాపు నేతలు పాదయాత్రగా వెళ్లి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు ఆర్వీ సుబ్బారావు, సాధనాల శ్రీనివాస్, చల్లా ప్రభాకరరావు, ముత్యాల వీరభద్రరావు. చీకట్ల ప్రసాద్, బండారు శ్రీనివాస్, ఆకుల భీమేశ్వరరావు, ఎంపీటీసీ జవ్వాది రవిబాబు, పాలూరి సత్యానందం తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యాన్స్కు సూపర్స్టార్ రజనీకాంత్ విన్నపం!
ప్రతేడాది డిసెంబర్ 12 అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు పెద్ద పండుగ రోజు. ఎందుకంటే ఆ రోజు ఆయన పుట్టినరోజు. రజనీ బర్త్డే వేడుకలను పెద్ద ఎత్తున్న సెలబ్రేట్ చేయాలని అభిమానులు తెగ ప్లాన్స్ చేస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు జరగడం లేదట. 66 వయసులోకి అడుగుపెడుతున్న రజనీకాంత్ తన అభిమానులకు ఓ విన్నపం చేశారు. ఈ ఏడాది తన బర్త్డే వేడుకలు నిర్వహించవద్దని కోరారు. ఈ విషయాన్ని ఆయన మేజర్ రియాజ్ అహ్మద్ శుక్రవారం ట్వీట్ చేశారు. తన ఫ్యాన్స్ తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని రజనీకాంత్ కోరినట్టు ఆ ట్వీట్ సందేశం. అంతేకాక ప్రతేడాది రజనీ పుట్టినరోజున ఏర్పాటుచేసే పెద్ద పెద్ద బ్యానర్లు, పోస్టర్లను నెలకొల్పవద్దని ఆయన కోరినట్టు ట్వీట్లో పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత మృతిచెందడంతో ఈ విషాద సమయంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకూడదని ఆయన నిర్ణయించుకున్నారని తెలిసింది. ప్రస్తుతం రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.0 మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. -
రెవెన్యూ అధికారులతోనే ‘టాస్’
రెవెన్యూ జారుుంట్ యాక్షన్ కమిటీ విన్నపం సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో మాదిరిగానే రాష్ట్రంలోనూ రెవెన్యూ అధికారులతోనే తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(టాస్)ని ప్రవేశపెట్టాలని రెవెన్యూ జారుుంట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం తెలంగాణ రెవెన్యూ జారుుంట్ యాక్షన్ కమిటీ ప్రతినిధుల బృందం తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(టాస్) ప్రతిపాదనలపై అధ్యయనంలో భాగంగా శుక్రవారం బెంగళూరులో విధానసౌధ(సెక్రటేరియేట్)ను సందర్శించింది. కర్ణాటకలో 1957 నుండి కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉందని, ఇందులో గ్రూప్ ఏలో డిప్యూటీ కలెక్టర్ స్థారుు అధికారులు, గ్రూప్ బీలో తహసీల్దార్ స్థారుు అధికారులతో పూర్తిగా రెవెన్యూశాఖ అధికారులతో కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(కాస్) నిర్వహిస్తున్నారని తెలిపారు. -
కొత్త విజ్ఞప్తులు స్వీకరించొద్దు
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అధికారులకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి వచ్చిన ప్రతీ విజ్ఞప్తిని క్షుణ్నంగా పరిశీలించి తుది నోటిఫికేషన్ ఇచ్చినందున జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ముగిసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులకు స్పష్టత ఇచ్చారు. తుది నోటిఫికేషన్ ప్రకారం కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటయ్యాయని, దీని ప్రకారమే పాలన జరుగుతుందని, ఇంకా మార్పులు చేర్పులకు ఏ మాత్రం అవకాశం లేదని, ఏవైనా విజ్ఞప్తులు వచ్చినా స్వీకరించొద్దని ఆయన ఆదేశించారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. దాదాపు ఏడాది పాటు వివిధ స్థాయిల్లో అత్యంత లోతుగా చేసిన కసరత్తు ఫలితంగా కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, పోలీసు కమిషనరేట్లు, పోలీస్ సబ్-డివిజన్లు, సర్కిల్ కార్యాలయాలు, పోలీస్స్టేషన్ల కూర్పు అద్భుతంగా జరిగిందని అభిప్రాయపడ్డారు. ఇక మరింత బాగా పనిచేసే అంశాలపై దృష్టిపెట్టాలని సీఎస్ కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. -
ప్రజావాణికి 103 ఫిర్యాదులు
ఇందూరు : కలెక్టర్ కార్యాలయం కిటకిటలాడింది. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారులతో సందడి నెలకొంది. సోమవారం ప్రగతిభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి –– ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ యోగితారాణా, జాయింట్ కలెక్టర రవీందర్రెడ్డి, డీఆర్వో పద్మాకర్, ఐకేపీ చంద్రమోహన్రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సిఫారసు చేశారు. చెరువులకు మరమ్మతులు చేపట్టాలి.. (03ఎన్జెడ్టి221–12050037) భారీ వర్షాలతో తమ గ్రామంలోని రెండు చెరువులకు సంబంధించిన కట్టలు తెగిపోయాయని, వాటికి మరమ్మతులు చేయించాలని నవీపేట మండలం బినోలా గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించారు. ఖాళీ అయిన చెరువులను ఎత్తిపోతల పథకం ద్వారా నింపాలని కోరారు. గ్రామంలోని పెద్దచెరువు కట్ట, ఖదిరాబాద్ చెరువు కట్టలు తెగిపోయి, పంటలు నీట మునిగాయని సర్పంచ్ సుధాకర్, వీడీసీ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం చెరువుల్లో నీరు లేదని, రబీలో పంటలు పండించడానికి కష్టంగా మారుతుందని తెలిపారు. కావున చెరువులకు మరమ్మతులు చేపట్టి, ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులను నింపాలని కలెక్టర్ను కోరారు. కార్మికులను ఆదుకోవాలి.. (03ఎన్జెడ్టి222) సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అడ్డా మీది కార్మికులకు వసతులు కల్పించాలని, సేదతీరడానికి రేకుల షెడ్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని సంఘం జిల్లా అధ్యక్షుడు కల్లెడి గంగాధర్ కోరారు. అడ్డా మీది కార్మికులకు ఉపాధి హామీ పని కల్పించాలని, ఈఎస్ఐ సౌకర్యంతో పాటు 60 ఏళ్లు నిండిన వారికి పెన్షన్లు ఇప్పించాలని విన్నవించారు. కార్మికుల కోసం ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేసి ఇళ్లు కట్టివ్వాలని, కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని కోరారు. శాంతయ్య, నర్సింహులు, గంగారాం, తదితరులు కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. హరితహారం కూలీ డబ్బులివ్వండి.. (03ఎన్జెడ్టి223) హరితహారంలో భాగంగా నర్సరీల్లో పెంచిన మొక్కలకు నీరు పట్టి, చెట్లను పెంచినందుకు రావాల్సిన కూలీ డబ్బులు ఇంకా రాలేదని, నాలుగు నెలల నుంచి అధికారులు డబ్బులు ఇవ్వలేదని నిజామాబాద్ మండలం నర్సింగ్పల్లి గ్రామానికి చెందిన మహిళలు వాపోయారు. ఈ మేరకు కూలీలు లక్ష్మి, భూదవ్వ, భూలక్ష్మి, తదితరులు కలెక్టర్ యోగితారాణాను కలిసి వినతిపత్రం సమర్పించారు. నర్సింగ్పల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను పెంచడానికి పని చేశామని, దానికి సంబంధించిన కూలీ డబ్బు ఇంకా రాలేదని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని, త్వరగా కూలీ డబ్బులు ఇప్పించాలని విన్నవించారు. స్పందించిన కలెక్టర్ డ్వామా అధికారులకు సిఫార్సు చేశారు. సదరం సర్టిఫికెట్ ఇప్పించండి.. (03ఎన్జెడ్టి224) చిత్రంలో కనిపిస్తున్న వీరు డిచ్పల్లి మండలం రాంపూర్ తండాకు తల్లి కూతుళ్లు మంగిబాయి, పీరుబాయి. శారీరక వికలాంగురాలైన పీరుబాయికి సదరం సర్టిఫికేట్ లేకపోవడంతో ఏడాది నుంచి పెన్షన్ నిలిపివేశారు. ప్రస్తుతం సదరం సర్టిఫికేట్ ఉంటేనే పెన్షన్ ఇస్తామని అధికారులు స్పష్టం చేయడంతో సర్టిఫికేట్ ఇప్పించాలని మంగిబాయి తన కూతురితో కలిసి ప్రజావాణిలో కలెక్టర్ను కలిసింది. సదరం సర్టిఫికేట్ ఇప్పించి, పెన్షన్ను పునరుద్ధరించాలని యోగితారాణాకు వినతిపత్రం సమర్పించారు. బిల్లులు ఇవ్వట్లేదు... (03ఎన్జెడ్టి225) ఈయన పేరు నీరడి ఆశోక్. డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామం. తన ఇంట్లో ప్రభుత్వ పథకం కింద మరుగుదొడ్డిని నిర్మించకున్నానని, అయితే అందుకు సంబంధించిన బిల్లును ఇవ్వడం లేదని వాపోయారు. బిల్లులు ఇవ్వాలంటే రూ.2 వేలు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ అడుగుతున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తన సొంత డబ్బుతో మరుగుదొడ్డి నిర్మించానని, తనకు బిల్లులు ఇప్పించాలని విన్నవించాడు. ఆర్థిక సాయం అందించండి... (03ఎన్జెడ్టి228) వీరిద్దరు అన్నదమ్ములు బానోత్ వినోద్, సుమన్. తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలుగా మారారు. అయితే, తన తమ్ముడు సుమన్కు ప్రమాదవశాత్తు వెన్నెముక విరిగిందని, చికిత్స చేయించడానికి స్తోమత లేదని వినోద్ తెలిపాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయం అందించాలని ఆదుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశాడు. స్పందించిన యోగితారాణా ఆరోగ్యశ్రీ అధికారులకు సిఫార్సు చేశారు. దోమకొండలోనే కొనసాగించాలి... (03ఎన్జెడ్టి229) కొత్తగా ఏర్పాటు కానున్న బీబీపేట్ మండలంలో తమ గ్రామాన్ని కలపవద్దని కోరుతూ మహ్మదాపూర్ గ్రామస్తులు కలెక్టరేట్కు తరలివచ్చారు. అనంతరం కలెక్టర్ యోగితారాణాకు వినతి పత్రం అందజేశారు. బీబీపేట్ మండలంలో తమ గ్రామాన్ని విలీనం చేయడం సరికాదని, కొత్త మండలంలో కలిపితే తమకు నష్టం జరుగుతుందన్నారు. తమను పాత మండలమైన దోమకొండ మండలంలోనే కొనసాగించాలని కోరారు. గ్రామస్తులు గజ్జెల లక్ష్మీకాంతం, నాగం రాజుగౌడ్, యాచం నరేందర్, బాగిరెడ్డి, లక్ష్మారెడ్డి, రాజు, బాల్రెడ్డి, పోషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డును బాగుచేయండి.. ఇటీవల కురిసిన వర్షాలకు తమ గ్రామానికి చెందిన రోడ్డు తెగిపోయిందని, రోడ్డును బాగు చేయించాలని మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామస్తులు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. చెక్ డ్యాం కట్ట తెగిపోవడంతో రోడ్డు పూర్తిగా చెడిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. కావున రోడ్డుకు మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. -
ఇనుగుర్తిని మండలం చేయాలని సీఎంకు వినతి
మహబూబాబాద్ : కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావుతో కలిసి సీఎంకు విన్నవించినట్లు ఎమ్మెల్యే శంకర్నాయక్ తెలిపారు. సీఎం సానుకూలంగా స్పందించి అధికారులను ఆదేశించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. -
అబ్జర్వర్ విధుల కోసం వినతి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు శని వారం నుంచి జరగనుండగా తమకు అబ్జర్వ ర్ల విధులు కేటాయించాలని కాంట్రాక్చువల్ లెక్చరర్లు, పార్ట్టైం లెక్చరర్లు, పరిశోధకులు, పీడీఎఫ్ అభ్యర్థులు కోరారు. ఈ మేరకు గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు క్యాంపస్లో వేచి ఉన్న పలువురు రాత్రి వీసీ ఆర్.సాయన్నకు వినతిపత్రం అందజేశారు. అయితే, వీసీ సాయన్న వారికి పరిశీలకుల విధులు అప్పగించేది లేదని స్పష్టం చేశారు. కాగా, పెద్దసంఖ్యలో అభ్యర్థులు క్యాంపస్కు రాగా బందోబస్తు ఏర్పాటుచేశారు. -
‘సీపీఎస్’ను రద్దు చేయాలని వినతి
మచిలీపట్నం (చిలకలపూడి) : రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీర్జా జైగం అబ్బాస్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు వినతిపత్రాలు అందజేశారు. 2004, సెప్టెంబర్ ఒకటో తేదీన తర్వాత ఉద్యోగం పొందిన వారికి నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. దీనివల్ల రివైజ్డ్ పెన్షన్ రూల్స్–1980 ద్వారా పొందుతున్న పెన్షన్, కుటుంబ పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, పీఎఫ్ సౌకర్యాలు రద్దయ్యాయని వివరించారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు బీవీ మల్లికార్జునరావు, ఉపాధ్యక్షుడు అబ్దుల్ వహీద్ పాల్గొన్నారు. -
దళితులకు భూమిని పంచాలంటూ వినతి
నడిగూడెం: మండల పరిధిలోని రామాపురం రెవిన్యూ పరిధిలో ఉన్న 190 సర్వే నంబర్లో గల భూములను ప్రభుత్వం దళితులకు మూడె ఎకరాల చొప్పున పంపిణీ చేయాలంటూ మంగళవారం ఉపతహసీల్దారు అహ్మద్ షరీఫ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సర్వే నెంబరు పరిధిలో 2200 ఎకరాలకు పైగా భూములు బీళ్లుగా ఉన్నాయని ఆ భూములను దళితులకు పంపిణీ చేస్తే బాంగుంటుందని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు పాతకొట్ల నాగేశ్వరరావు, దున్నా శ్రీనివాస్, దాసరి శ్రీను, దున్నా అంబేద్కర్, బాణాల నాగరాజు తదిరులున్నారు. -
బిడ్డ కారుణ్యమరణానికి అనుమతించండి
పుంగనూరులో తల్లిదండ్రుల అభ్యర్థన తోసిపుచ్చిన న్యాయమూర్తి వైద్యానికి చొరవ తీసుకుంటామని కౌన్సెలింగ్ పుంగనూరు: బీద కుటుంబం..దారుణమైన వ్యాధి సోకింది. ఉన్నదంతా వైద్యానికి వెచ్చించినా నయంకాలేదు. మరణానికి చేరువవుతున్న బిడ్డను చూడలేక అతనికి కారుణ్యమరణానికి అనుమతించాలని తల్లిదండ్రులు అభ్యర్థించిన వైనం చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగంది. రామసముద్రం మండలం దిన్నిపల్లెకు చెందిన బుడ్డప్పకు కర్నాటక సోమయాజులపల్లెకు చెందిన నరసమ్మతో 2010లో పెళ్లయింది. బుడ్డప్ప పుంగనూరులో క్షౌరవృత్తి చేసుకుంటున్నాడు. వీరికి మహేష్ (5), వేదవతి(3) పిల్లలు. గత సంవత్సరం మహేష్ ఆనారోగ్యానికి గురయ్యాడు. బెంగళూరులోని ఇందిరాగాందీ వైద్యశాలలో 30 రోజుల పాటు చికిత్స చేయించారు. అక్కడి వైద్యులు బోన్క్యాన్సర్గా నిర్ధారించారు. అప్పటికే అప్పులు చేసి, సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేసిన బుడ్డప్పకు ఆర్థికంగా చితికిపోయాడు. ఇబ్బందులకు గురైయ్యాడు. మరోమారు అప్పు చేసి వేలూరు సీఎంసీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు చికిత్సకు రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో నిశ్చేష్టుడయ్యాడు. ఏం చేయాలో పాలుపోలేదు. అంత డబ్బులు సమకూర్చలేక నరకయాతన అనుభవిస్తున్నాడు. మరోపక్క కళ్లెదుట కుమారుడు మృత్యువుకు దగ్గరవుతూ అవస్థ పడటాన్ని చూసి భరించలేకపోయారు ఆ దంపతులు. వైద్యం చేయించే స్తోమత లేని నిస్సహాయ స్థితిలో తమ బిడ్డకు కారుణ్యమరణానికి అనుమతించాలని ఈ దంపతులు శనివారం పుంగనూరులో న్యాయమూర్తి మోతీలాల్కు వినతిపత్రం అందజేశారు. న్యాయమూర్తి మోతీలాల్ చలించిపోయారు. ఇందుకు అనుమతి ఇవ్వలేమని సున్నితంగా చెప్పారు. మండల న్యాయసేవా సమితి ద్వారా బిడ్డకు చికిత్స చేయించేందుకు న్యాయస్థానం చొరవ తీసుకుంటుందన్నారు. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఓదార్చి కాస్సేపు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ విషయమై న్యాయమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ఆనారోగ్యంతో బాధపడుతున్న మహేష్కు చికిత్స చే యించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
కేంద్ర మంత్రికి పీఆర్టీయూ వినతి
నల్లగొండ రూరల్ : జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఢిల్లీలో గురువారం ఎంపీల బృందంతో కలిసి పీఆర్టీయూ నాయకులు కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్కు వినతిపత్రం అందజేశారు. ఒకేసారి 5 వేల మందికి శిక్షణ, 10వ తరగతి మూల్యాంకన క్యాంప్ నిర్వహించేందుకు వీలుగా అన్ని వసతులతో కూడిన నిర్మాణాలు చేయాలని, ప్రాథమిక విద్యా దశలోనే నైతిక విలువలు, నైపుణ్యం, బోధించే అంశాలు చేర్చాలని కోరారు. ఉమ్మడి సర్వీసు రూల్స్ త్వరగా అమలు చేసి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, కేజీవీబీలలో పని చేస్తున్న ఉపాధ్యాయులను సీఆర్టీలుగా రెగ్యులర్ చేస్తూ వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీలు జితేందర్రెడ్డి, కొండా విశ్శేశ్వర్రెడ్డి, సీతారాంనాయక్, కె.ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్తో కలిసి తెలంగాణ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు హర్షవర్ధన్రెడ్డి, చెన్నయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మేరెడ్డి అంజిరెడ్డి, గిరిధర్ తదితరులకు వినతిపత్రం అందజేశారు. -
కలెక్టర్కు వీఆర్వోల సంఘం నాయకుల వినతి
నగరంపాలెం (గుంటూరు) : 2012 ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రామ రెవెన్యూ అధికారుల నియామకం పొంది నాలుగేళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారికి సర్వీస్ రెగ్యులైజేషన్ కానీ, ప్రొబేషన్ పీరియడ్ డిక్లరేషన్ గానీ చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా నాయకులు శనివారం కలెక్టర్ కాంతిలాల్ దండేను కోరారు. కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ దండేను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ప్రకాశం, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సర్వీస్ రెగ్యులరైజషన్ జరిగిందన్నారు. ఆరేళ్లు పూర్తి చేసుకున్న వీఆర్వోలకు స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఆరు నెలలుగా కలెక్టరేట్లో పెండింగ్ ఉన్నాయని తెలిపారు. వివిధ కారణాలతో సస్పెండైన వీఆర్వోలు ఏడాది కాలంగా ఇబ్బంది పడుతున్నారని, వారికి మానవతా దృక్పథంతో పోస్టింగ్లు ఇవ్వాలని కోరారు. జిల్లాలో పని చేస్తున్న 13 మంది పార్టు టైం వీఆర్వోలకు 11 నెలలుగా జీతాలు రావటం లేదని, ఇటీవల ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీ అయిన వీఆర్వోలను కొంతమంది తహశీల్దార్లు రిలీవ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సూరేపల్లి రాజశేఖర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ప్రసన్నకుమార్, జిల్లా కార్యదర్శి పెరుగు శ్రీనివాసరావు, ట్రెజరర్ జి.బ్రహ్మేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎస్. వంశీ కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు. -
వ్యాపార నిర్వహణ మరింత సులభతరం
♦ సమస్యల జాబితా తయారు చేయాలని ♦ సీఏఐటీకి వాణిజ్యశాఖ వినతి న్యూఢిల్లీ: దేశంలో వ్యాపార నిర్వహణ మరింత సులభతరం చేయడంపై వాణిజ్య మంత్రిత్వశాఖ దృష్టి సారిస్తోంది. ఈ దిశలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి వీలుగా... సమస్యల జాబితాను రూపొందించాలని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ)కి విజ్ఞప్తి చేసింది. పన్నులు, బ్యాంకింగ్ అంశాలుసహా వ్యాపార నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలనూ కేంద్రం దృష్టికి తీసుకురావాలని కోరింది. పారిశ్రామిక విధానం అభివృద్ధి శాఖ కార్యదర్శి రమేష్ అభిషేక్ మంగళవారం సీఏఐటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. సమస్యల జాబితాను రెండు వారాల్లో ప్రభుత్వానికి సమర్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. ఇందుకు సంబంధించి అవసరమైతే ఇతర శాఖలు, రాష్ర్ట ప్రభుత్వాలతో కూడా వాణిజ్యమంత్రిత్వశాఖ సంప్రతింపులు జరుపుతుందని తెలిపారు. ఈ-కామర్స్ రంగానికి సంబంధించి డీఐపీపీ జారీ చేసిన మార్గదర్శకాల విషయంలో ఏదైనా వివరణలు అవసరమయితే ట్రేడర్లు డెరైక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను సంప్రతించవచ్చని సూచించారు. సమావేశంలో నీతీ ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో చిన్న వ్యాపారవేత్తల పాత్ర కీలకమని వివరించారు. దేశంలో ఈ-కామర్స్ రంగం భారీగా వృద్ధి చెందుతోందని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం మార్కెట్ పరిమాణం 20 బిలియన్ డాలర్లుకాగా, 2023-24 నాటికి 350 బిలియన్ డాలర్ల స్థాయికి ఈ పరిశ్రమ చేరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మాస్టర్కార్డ్ దక్షిణాసియా విభాగం ప్రెసిడెంట్ పురోస్ సింగ్ మాట్లాడుతూ, 2014 నుంచి దేశంలో రూ.2,700 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. -
ప్రజల ఉసురు పోసుకోవద్దు
విపక్ష నేతలకు మంత్రి హరీ్శ్రావు విజ్ఞప్తి జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): కరువు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుని పాలమూరు జిల్లా ప్రజల ఉసురుపోసుకోవద్దని ప్రతిపక్ష పార్టీలకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు విజ్ఙప్తి చేశారు. సోమవారం మహబూబ్నగర్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. మహబూబ్నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు 90 శాతం పనులు పూర్తయ్యాయని, కేవలం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయని తెలిపారు. ‘మీకు చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. ఇప్పటిదాకా కేవలం 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, ఇంకా 40 శాతం పనులు చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లాలో మరో 4 లక్షల కొత్త ఆయకట్టు పెంచుతున్నామన్నారు. జీఓ 123 ప్రకారం రైతులకు రెట్టింపు పరిహారం ఇస్తున్నామని, భూ సేకరణ అడ్డుకుని జిల్లా ప్రజల నోట్లో మన్ను కొట్టవద్దని హితవు పలికారు. ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, గువ్వల బాల్రాజు, మర్రి జనార్దన్రెడ్డి పాల్గొన్నారు. -
'అమ్మా' రక్షించు.. శివశంకర్ మాస్టర్ విన్నపాలు!
చెన్నై: తెలుగు ప్రేక్షకులకు శివశంకర్ మాస్టర్ గా సుపరిచితమైన డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్... శివశంకర్.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రూపంలో విన్నపాలను పంపారు. తమ కుటుంబానికి ఆత్మ హత్య చేసుకోవడం తప్పించి మరో దారి లేదని, తమ కేసును ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించే ప్రయత్నం చేయాలంటూ ఆయన తన లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనదైన శైలిలో.. ప్రత్యేక అభినయంతో.. సూపర్ ఛాలెంజ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ శివశంకర్ ప్రసాద్ కష్టాల్లో పడ్డట్టు తెలుస్తోంది. ఆయన కుమారుడు విజయ కృష్ణ ప్రసాద్ తో భార్య జ్యోతి... విడాకులు తీసుకున్నప్పటికీ తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని, తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ఆయన అమ్మకు (తమిళనాడు సీఎం జయలలిత) రాసిన ఉత్తరంలో తన గోడును వెళ్ళబోసుకున్నారు. చట్ట ప్రకారం విడాకులు తీసుకుని మరీ తమను ఏడిపించాలని చూస్తోందని, పది కోట్లు చెల్లించాలని డిమాండ్ చేయడంతోపాటు, తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి ఇంటిని లాక్కోవాలని చూస్తోందంటూ జయలలితకు శివశంకర్ ప్రసాద్ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 2013 సంవత్సరంలో శివశంకర్ మాస్టారి కుమారుడు విజయశంకర్ ప్రసాద్ బెంగళూరుకు చెందిన జ్యోతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇద్దరి మధ్యా వచ్చిన విభేదాలతో డైవర్స్ తీసుకున్నారు. అయితే అప్పట్నుంచీ శివశంకర్ మాస్టారి కుటుంబాన్ని పలు రకాలుగా వేధిస్తున్న జ్యోతి... తాజాగా వారిపై కేసు పెట్టింది. ఇటీవల తమ ఇంటిముందు ఆందోళనకు దిగి పదికోట్ల డబ్బును డిమాండ్ చేసిందని, ఆమె టార్చర్ భరించలేక తమ కుటుంబం కొన్ని రోజులపాటు అజ్ఞాతంలోకి పోవాల్సిన పరిస్థితి వచ్చిందని శివశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తమ కుటుంబంపై అక్రమ కేసును బనాయించిందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేదంటే కుటుంబం మొత్తం ఆత్మ హత్య చేసుకోవడం తప్ప మరోదారి లేదని తెలిపారు. మరి మాస్టారి విషయంలో అమ్మ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
ఆహ్వానం ఉన్నవారే ప్లీనరీకి రండి
టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి జగదీశ్రెడ్డి సూచన ఖమ్మం: ఖమ్మంలో ఈ నెల 27న జరిగే టీఆర్ఎస్ ప్లీనరీకి ఆహ్వానం ఉన్నవారే హాజరుకావాలని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. ఆదివారం సాయంత్రం ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పాలేరు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందనే విషయాన్ని విపక్షాలు చెప్పకనే చెబుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. సిట్టింగ్ స్థానం కావడంతో పరువు కోసం కాంగ్రెస్ అభ్యర్థిని నిలుపుతోందని, టీడీపీ పోటీలో నిలవలేక పారిపోయే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. -
ఎఫ్బీఐ కోరిక సమంజసమే
ఎఫ్బీఐ అభ్యర్థన అసమంజసం అంటున్న యాపిల్ సంస్థపై వైట్ హౌస్ కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన ఉగ్రవాది యాపిల్ ఐ ఫోన్ పాస్ వర్డ్ కనిపెట్టడం ఆ టెక్నాలజీ సంస్థకు పెద్ద విషయం కాదని, అందుకు ఎటువంటి కొత్త టెక్నాలజీని, డిజైన్ ను కనిపెట్టాల్సిన అవసరం లేదని విరుచుకు పడుతున్నారు. ఎటువంటి బ్యాక్డోర్ను సృష్టించాల్సిన పని లేకపోయినా... ఎఫ్బీఐకి సహకరించడం లేదని వైట్ హౌస్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఎఫ్బీఐ అభ్యర్థన చాలా పరిమితమైన పరిధిలోనిదని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ విలేకరులతో అన్నారు. శాన్ బెర్నార్డినోలో క్రిస్మస్ పార్టీ సందర్భంలో ఫరూక్ తన భార్యతో కలసి 14 మందిని హతం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పోలీసు కాల్పుల్లో భార్య సహా అతడూ చనిపోయాడు. ఆ ప్రాంతంలో ఉగ్రవాది ఫరూక్ కు చెందిన ఐఫోన్ ను ఎఫ్బీఐ స్వాధీనం చేసుకుంది. అందులోని డేటాను సేకరించడానికి మాత్రమే ఎఫ్బీఐ యాపిల్ సంస్థను అభ్యర్థిస్తోందని, డేటాలోని విషయాలు అమెరికా ప్రజల గోప్యత, పౌర స్వేచ్ఛను రక్షించగలవని ఒబామా యంత్రాంగం వాదిస్తోంది. అమెరికా ప్రజల రక్షణ కోసం ఆ ఫోన్ లోని డేటాను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఉగ్రవాదుల వివరాలు తెలిస్తే... ప్రజల రక్షణకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు ఎర్నెస్ట్ వివరిస్తున్నారు. ఈ కేసులో ఉగ్రవాద కదలికలను, వారికి సంబంధించిన సమాచారం ఎఫ్బీఐ పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు పాస్ వర్డ్ అన్లాక్ చేయాలని ఎఫ్బీఐ ఒత్తిడి తెస్తోందని చెప్తున్నారు. పాస్ వర్డ్ విషయంలో టెక్ కంపెనీలు ఏదో ఒక మార్గాన్ని చూపాల్సిందేనని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా ప్రజల భద్రత కన్నా చనిపోయిన ఉగ్రవాది వ్యక్తిగత అంశాలను కాపాడేందుకు యాపిల్ సంస్థ ప్రాధాన్యం ఇస్తోందంటూ ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు ఎంతటి ఒత్తిడి తెచ్చినా యాపిల్ సంస్థ మాత్రం తమపై కొనుగోలుదారుల నమ్మకాన్ని కోల్పోకూడదన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పాస్వర్డ్ అన్ లాక్ చేసేందుకు విముఖతనే చూపిస్తోంది. -
పండగలు ఉన్నాయి.. మా రాష్ట్రానికి రావద్దు!
న్యూఢిల్లీ: మిజోరం రాష్ట్ర ప్రభుత్వం చిత్రమైన ప్రకటనను విడుదల చేసింది. 'ఎవరైనా వీఐపీలు డిసెంబర్ 14 నుంచి జనవరి 8 లోపు మా రాష్ట్రంలో పర్యటించే ఉద్దేశంతో ఉంటే దయచేసి ఆ పర్యటనలను వాయిదా వేసుకోవాలి' అని తెలిపింది. మిజోరం ప్రభుత్వం క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా వీఐపీలు పర్యటిస్తే వారికి కావలసిన సదుపాయాలను కల్పించడం రాష్ట్రానికి ఇబ్బందిగా ఉంటుందని, అందువల్ల కేంద్రప్రభుత్వ అధికారులు, ఇతర వీఐపీలు ఈ సమయంలో పర్యటనలు వాయిదా వేసుకోవాలని కోరింది. మిజోరం రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తుంది. సాంప్రదాయ పద్దతిలో నిర్వహించే ఈ వేడుకల్లో స్థానిక తెగలు ఉత్సాహంగా పాల్గొంటాయి. డిసెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే క్రిస్మస్ సంబరాలకు ప్రభుత్వం ముందుగానే సమాయత్తమౌతుంది. ఈ వేడుకలు జనవరి మొదటి వారం వరకు కొనసాగుతాయి. -
భూముల జోలికి పోకండి!
-
మా కుటుంబాల జోలికి రాకండి
న్యూఢిల్లీ: కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టను మంటగలపడానికి ప్రయత్నిస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆరోపించారు. మీడియా సంస్థలు ఏ ఎజెండాను కొనసాగించినా, తమ పార్టీ నేతల కుటుంబాల జోలికి మాత్రం రావద్దని కోరారు. తమ పార్టీ నేత కుమార్విశ్వాస్ కుటుంబాన్నంతటినీ మీడియా స్కానర్ కిందకు తెచ్చిన తీరు ఘోరమన్నారు. విశ్వాస్పై వచ్చిన ఆరోపణలు ఆయన కుటుంబాన్ని తీవ్ర అసహనానికి గురిచేశాయని ఆయన చెప్పారు. ఆ కారణంగా ఆయన కుమార్తె మంగళవారం పాఠశాల మానేసిందన్నారు. ‘ఇదేనా రాజకీయం, ఇదేనా జర్నలిజం. ఏ ఆధారాలు లేకుండా ఓ వ్యక్తి జీవితా న్ని మీడియా నాశనం చేస్తోంది.’ అని కేజ్రీవాల్ తెలిపారు. కుమార్ విశ్వాస్తో తనకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు వస్తున్న వదంతులను విశ్వాస్ ఖండించటం లేదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి ఢిల్లీ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సంజాయిషీ ఇవ్వాలని డీసీ డబ్ల్యు ఇచ్చిన నోటీసుకు విశ్వాస్ స్పందించలేదు. -
అధినేతలకు అర్జీలు... ఒక్క క్లిక్తో..
కనీసం గ్రామ కార్యదర్శికి సమస్య విన్నవించాలంటేనే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్న రోజులివి. వినతి పత్రం ఇవ్వడానికి పనులు మానుకొని, అనేక వ్యయప్రయాసలకోర్చి గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి, అక్కడ అమాత్యులు, అధికారులు కనిపించకపోతే పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఇటువంటి కష్టాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చెక్ పడనుంది. ముఖ్య నేతలకు ప్రజలు తమ గోడు వినిపించుకోడానికి వారధిగా నిలుస్తోంది ఆన్లైన్. కాస్త సాంకేతిక పరిజ్ఞానం ఉండి.. ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. ఇంట్లో నుంచి కాలు కదపకుండానే రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి తదితరులకు ఒక్క క్లిక్తో తమ సమస్యపై విన్నపం పంపుకోవచ్చు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా గవర్నర్కు ఇలా పంపాలి... aprajbhavan@gmail.com మెయిల్కు ఫిర్యాదుదారుడు తమ పూర్తి చిరునామాతో సమస్యను సంక్షిప్తంగా నేరుగా పంపవచ్చు. ⇒ఇంటర్నెట్ ఉంటే చాలు.. ⇒ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు ⇒సీఎం, గవర్నర్, ప్రధాని, రాష్ట్రపతికీ చిటికెలో విన్నపం రాష్ట్రపతికి పంపాలంటే... రాష్ట్రపతికి వినతిపత్రం పంపాలంటే www.presidentofindia.nic.in వెబ్సైట్లోకి వెళ్లాలి. పేజీ తెరుచుకోగానే అడుగుభాగంలో కుడిపైపు హెల్ప్లైన్ పోర్టల్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ప్రెసిడెంట్ సెక్రటేరియట్ అనే పేజీ తెరుచుకుంటుంది. అక్కడ కనిపించే ‘లోడేజ్ ఏ రిక్వెస్ట్’మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫారం వస్తుంది. దాన్ని నింపి గ్రీవెన్స్ డిస్క్రిప్షన్ అనే బాక్సులో 4000 పదాలకు మించకుండా సమస్య వివరించి పీడీఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలి. ఈ క్రమంలో మన ఫిర్యాదుకు సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కనిపిస్తుంది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన సమస్య పరిష్కారం అయిందో కాలేదో తెలుసుకోవడానికి రిజిస్ట్రేషన్ సంఖ్య ఉపయోగపడుతుంది. ప్రధానికి ఫిర్యాదు చేయాలంటే.. దేశ ప్రధానమంత్రికి ఫిర్యాదు చేయాలంటే www.pmindia. gov.in వెబ్సైట్లోకి వెళ్లి సమస్యలను విన్నవించవచ్చు. పేజీ ఓపెన్ చేయగానే ‘ఇంటరాక్ట్ విత్ హానరబుల్ పీఎం’ వస్తుంది. క్లిక్ చేస్తే ‘టు రైట్ టు ది ప్రైమినిస్టర్ క్లిక్ హియర్’ అనివస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే చిరునామాతోపాటు ఈ మెయిల్ ఐడీ లింక్ ఉంటుంది. ‘క్లిక్ హియర్’అన్న చోట క్లిక్ చేస్తే ‘కామెంట్స్’ అనే పేజీ తెరుచుకుంటుంది. ఫిర్యాదు దారుడి వివరాలు, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. సంబంధిత పేజీలో 1000 అక్షరాలలోపు సమస్యను వివరించి దిగువ భాగాన ఉన్న కోడ్ను నమోదు చేయాలి. ముఖ్యమంత్రికి సమస్య విన్నవించాలంటే .. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలంటే www.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లాలి. పేజీ తెరుచుకోగానే ఎడమవైపు దిగువ భాగంలో సిటిజన్ ఇంటర్ ఫేస్ అనే పోర్టల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఈ మెయిల్ ఐడీని నమోదుచేసి సంబంధిత విషయాన్ని క్లుప్తంగా వివరించాలి. -
ముఖ్యమంత్రి గారికి...
బారులు తీరిన ఉద్యోగ, {పజా సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి ఫిర్యాదుల వెల్లువ నగరంలో మూడో రోజు శనివారం గడిపిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు వినతులు వెల్లువెత్తారుు. వ్యక్తిగత విన్నపాలతోపాటు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, కులవృత్తుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, కాలనీ సంఘాలు, ఉద్యోగులు, వృద్ధులు, వితంతువులు ఇలా ప్రతి ఒక్కరూ ఆయనను నేరుగా కలిసి వినతిపత్రం అందించి వారి సమస్యలు వినిపించారు. ముఖ్యమంత్రి వారి సమస్యలను ఓపికగా విన్నారు. హన్మకొండ : హైదరాబాద్ లుంబినీపార్కులో బుద్ద విహార్ను నిర్మించాలని, వరంగల్లో బుద్ధ విహార్కు స్థలం కేటాయించాలని, హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్లోని బుద్ద విహార్లలో వసతులు కల్పించాలని ది బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మల కట్టయ్య కోరారు. ఆయనతో విశ్వేశ్వర్రావు, కృష్ణస్వామి, ఎల్లయ్య ఉన్నారు. హన్మకొండలో పదేళ్లుగా పెండింగ్లో ఉన్న గిరిజన భవన్ నిర్మాణానికి నిధులు మంజూ రు చేయాలని తెలంగాణ బంజార సంక్షేమ సంఘం అధ్యక్షుడు సజ్జన్నాయక్ కోరారు. 18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారని, తెలంగాణలో తమను ఎస్టీ జాబి తాలో చేర్చాలని రజక హక్కుల సాధన సమి తి అధ్యక్షుడు డి.కుమారస్వామి కోరారు. పోల్టాక్సీని రద్దు చేయాలని తెలంగాణ గ్రామీణ కేబుల్ ఎంఎస్ఓ, ఆపరేటర్స్ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్వంచ కోటేశ్వర్, బైరి శ్రీనివాస్, ఉమాశంకర్, ఇంద్రసేనారెడ్డి కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయూస్ యూనియన్, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోషియేషన్, మైనారిటీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మహ్మద్ నయూమోద్దీన్, చాట్ల రవికుమార్, అబిద్ ఆలీ, చెన్నమల్ల రమేశ్, టి.వి.శ్రీనివాస్, మహ్మద్ ఇక్బాల్, పి.సంపత్ కోరారు. ముదిరాజ్లను బీసీ‘డీ’ నుంచి బీసీ ‘ఏ’లోకి మార్చాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పల్లెబోయిన అశోక్ ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. ఆయనతో నాయకులు బుస్సా మల్లేశం, బయ్య స్వామి, బోళ్ల బాలరాజు, ఇండ్ల నాగేశ్వర్రావు, పులి రజనీకాంత్ ఉన్నారు. తమ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, ఎంపీటీసీ సభ్యులు సీఎం కేసీఆర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎంపీటీసీలు శానబోయిన అశోక్, మహబూబ్రెడ్డి, అన్నారపు యాకయ్య పాల్గొన్నారు. అలాగే ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పాతూరి రమేష్, ఉపాధ్యక్షురాలు ముద్దసాని రాధ, ప్రధాన కార్యదర్శి పోరిక గోవింద్నాయక్ మరో వినతిపత్రం సమర్పించారు. నాయూబ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని సీఎంను ఆ సంఘం జిల్లా కార్యదర్శి నాగవెళ్లి సురేష్కుమార్, నాయకులు భాగ్యలక్ష్మి, జి.ఉపేంద్ర, ఎన్.జగన్, నరేందర్, సారన్న కోరారు. తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అంధుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్.రవీందర్, నాయకులు గద్దల రవీందర్ సీఎంను కలవగా ఆయన సానుకూలంగా స్పందించారు. నగరంలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికి పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలని సీపీఐ(ఎం) నాయకులు దుబ్బ శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్, బోగి సురేష్ యాదగిరి, టి.ఉప్పలయ్య, కారు ఉపేందర్ కోరారు. 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర 108 ఎంప్లాయూస్ యూనియన్ నాయకులు మహేందర్రెడ్డి, ఏఎస్.రావు, సురేష్ కోరారు. ఆక్రమిత ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు జన్ను నర్సయ్య, నాయకులు గుండె కుమార్, మారెపల్లి శేఖర్ కోరారు. ఐకేపీలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసి, పదోన్నతులు కల్పించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు డి.బాలసుందర్, జి.అశోక్ కోరారు. నగరంలోని మురికివాడల ప్రజలకు వ్యక్తిగత గృహాలు నిర్మించాలని, ఎస్ఆర్ఆర్తోటలోని ఆకారపు వీరలక్ష్మి కాలనీ గుడిసెవాసులకు ప్రభుత్వ గృహాలు నిర్మించాలని కోరుతూ నివాస హక్కుల పరిరక్షణ ప్రచార సమితి(చత్రి) సిటీ కో ఆర్డినేటర్ ఎస్.సాహితి, ఫీల్డ్ కోఆర్డినేటర్ ఎస్.అనిల్ వినతిపత్రం సమర్పించారు. అంగన్వాడీ వర్కర్ల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సరస్వతి, ప్రతినిధులు సుష్మచంద్ర, భవానీ, సుమాంజలి, మంగళగౌరి, జయ, భాగ్యలక్ష్మి కోరారు. పర్యాటక అభివృద్ధి సంస్థ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని పర్యాటక అభివృద్ధి సంస్థ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి కోరారు. నాయకులు సీహెచ్.శ్రీధర్రెడ్డి, అశోక్రెడ్డి, వెంకట్, చారి, పాషా, రాజ్కుమార్ పాల్గొన్నారు. ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలో 12 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వారు సీఎంను కోరారు. ఆయన సానుకూలంగా స్పందించి జిల్లా అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. పారామెడికల్ ఉద్యోగుల సమస్యలు సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ పారామెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, కార్యదర్శి సురేందర్, నాయకులు ఉపేంద్రచారి, రాములు సీఎంను కోరారు. కమలాపురం(మంగపేట) : బిల్ట్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బిల్ట్ కార్మిక జేఏ సీ నాయకులు సీఎంను కలిశారు. ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని ఎలా సమస్యను పరిష్కరించాలనే ఆలోచనలో ఉన్నట్లు సీఎం చెప్పినట్లు జేఏసీ నాయకులు కుర్బాన్అలీ తెలిపా రు. జేఏసీ నాయకులు వడ్లూరి రాంచందర్, పుసులూరి గణపతి, డీవీపి రాజు, చొక్కారావు, శర్మ, విజయరావు ఉన్నారు. రీరుుంబర్స్మెంట్ కోసం.. విద్యార్థులు కేయూక్యాంపస్ : పెండింగ్లోఉన్న స్కాలర్షిప్లను, ఫీజురీయింబర్స్మెంట్ను పూర్తిస్థాయిలో చెల్లించాలని, కేయూకు వీసీని, పాలకమండలిని నియమించాలని పీడీఎస్ యూ, టీఎన్ఎస్ఎఫ్, ఏబీవీపీ, ఆధ్వర్యంలో వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. పీడీఎస్యూ జిల్లా, నగర ప్రధా న కార్శదర్శులు బి. నరసింహారావు, దుర్గం సారయ్య, కేయూ బాధ్యులు చెలమల్ల వీరన్న, సూత్రపు అనిల్, చిరంజీవి, సురేశ్, మహేందర్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూక్య సాంబయ్య, రాష్ట్ర కార్యదర్శి జాటోత్ సంతో ష్, నాయకులు సాయిరామ్, మాదాసు శ్రీని వాస్, వంశీ, ఏబీవీపీ నాయకులు మైల నర్సింహులు, వెంకట్, రాకేష్ పాల్గొన్నారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని, రాష్ర్ట వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ను వెంటనే ప్రకటించాలని, వికలాంగులకు చైర్మన్గా కేయూ ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని ఫిజికల్లీ చాలెంజ్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ బాధ్యులు కోరారు. కేయూకు రెగ్యులర్ వీసీని నియమించి, ఈసీని ఏర్పాటు చేయాలని, టీచింగ్, నాన్టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, అధ్యాపకులకు 65 ఏళ్లకు, నాన్టీచింగ్ ఉద్యోగులకు 60 ఏళ్లవరకు ఉద్యోగ విరమణ వయోపరిమితిని పెంపుదల చేయాలని నాయకులు కోరా రు. అకుట్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. సారంగపాణి, జనరల్ సెక్రటరీ డాక్టర్ వి. కృష్ణారెడ్డి, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి.కొండల్రెడ్డి, కేయూ ఎన్జీవో అధ్యక్షుడు డాక్టర్ కోల శంకర్, క్లాస్ఫోర్త్ నేత వెంకట్రాంనర్సయ్య పాల్గొన్నారు. ఎస్డీఎల్సీఈలో పనిచేస్తున్న టైంస్కేల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని టైంస్కేల్ ఉద్యోగుల సంఘం బాధ్యులు కోరారు. వారిలో టైంస్కేల్ ఎంప్లాయూస్ యూనియన్ బాధ్యులు బండ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బూర సత్యప్రకాశ్, బాల్నెనాగేశ్వర్రావు, దొంతుల ఈశ్వరయ్య, ప్రతాప్, శ్రీరాం వెంకటేశ్వర్లు, రహీం పాల్గొన్నారు. పోచమ్మమైదాన్ : ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు రంగయ్య, త్రిపురనేని గోపీచంద్ సీఎంను కోరారు. సీఎంను కలిసిన వారిలో సీఏలు రాజేంద్రకుమార్, చంచల్ అగర్వాల్, రాజు కరుణాకర్, క్రాంతి, హరికృష్ణ, ఉన్నారు. వరంగల్ అర్బన్ : ఏడాది కాలంగా నగర పాలక సంస్థలో జరిగిన అభివృద్ధి పనులు, అక్రమాలపై విచారణ నిర్వహించి కమిషనర్ సువర్ణపండాదాస్పై చర్యలు తీసుకోవాలని ఆక్రమణ ఏరియాల భూముల, చెరువుల పరిరక్షణ సోసైటీ అధ్యక్షుడు పెరుమాండ్ల లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. ఆయనతో ఉపాధ్యక్షుడు మహబూబ్అలీ,వెంకటేశ్వర్లు ఉన్నారు. కాజీపేట : గీత, చేనేత కార్మికులకు అంది స్తున్న విధంగా 50 ఏళ్లకే విశ్వబ్రాహ్మణులకు పింఛన్ వర్తింపచేయాలని గ్రేటర్ వరంగల్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శృంగారపు బిక్షపతి, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు బిక్షపతి, వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు మారోజు దేవేంద్రచారి, జిల్లా అధ్యక్షుడు భాస్కరాచారి కోరారు. విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు వారు చె ప్పారు. 1991 బ్యాచ్ సీఐల నివేదన.. వరంగల్ క్రైం : వరంగల్ జోన్లో తమకు అన్యాయం జరిగిందంటూ 1991 బ్యాచ్కు చెందిన సీఐలు సీఎంను కలిశారు. ఈ జోన్ లో 57 సీఐ పోస్టుల క్వాలిఫికేషన్లో తప్పు లు దొర్లాయన్నారు. మిగతా జోన్లలో తమ బ్యాచ్ సీఐలు ఇప్పటికే డీఎస్పీలుగా ప్రమోషన్ పొందారని చెప్పారు. సీఐలు రాయల ప్రభాకర్, జితేందర్, వెంకటేష్బాబు, విద్యాసాగర్, సత్యనారాయణ ఉన్నారు. మేడారంపై దృష్టి పెట్టరూ.. మేడారం(తాడ్వాయి) : ‘అయ్యా సీఎం గారూ.. మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర దగ్గరపడుతోంది. అధికారంలోకి వస్తే మేడారం జాతర రూపురేఖలు మారుస్తామని అప్పట్లో మీరు చె ప్పిండ్లు. కానీ మినీజాతర లో కనీస సౌకర్యాలు కల్పనపై గింతైనా ఆలోచించడం లేదుసారూ.. తెలంగాణ స్వరాష్ట్రానికి మీరు సీఎం కావాలని మా అర్యా దైవాలైన సమ్మక్క- సారలమ్మలు దీవించారు కదా సారూ’ అని సమ్మక్క పూజరులు సీఎం చంద్రశేఖరరావును వేడుకుంటున్నారు. -
హోం మంత్రికి పోలీసు అధికారుల సంఘం వినతి
కడప అర్బన్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అగ్రహారం శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో ఆదివారం వినతిపత్రం అందజేశారు. వ్యక్తిగత రుణాల మంజూరు కోసం బ్యాంకులు వేతన ధ్రువీకరణ పత్రాలు తప్పని సరి అని పేర్కొంటున్నాయన్నారు. కానీ పోలీసు శాఖలో వేతన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన హోం మంత్రి పోలీసు సిబ్బందికి వేతన ధ్రువీకరణ పత్రాలను డ్రాయింగ్ అధికారి ద్వారా జారీ చేసేలా ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు. సమస్యపై సానుకూలంగా స్పందించిన హోం మంత్రికి పోలీసు అధికారుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. హోంమంత్రిని కలిసిన వారిలో సంఘం ఉపాధ్యక్షుడు నాయకుల నారాయణ, కార్యదర్శి బాల మద్దిలేటి, కోశాధికారి ఆర్.నారాయణరాజు, సభ్యులు కె.మనోహర్వర్మ, బాలాజీ ఉన్నారు. -
తాగునీటి సమస్య తీర్చండి సారూ..
కలెక్టర్కు పెద్దకోట్ల గ్రామస్తుల వినతి తాడిమర్రి : ‘తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నాం.. మా సమస్యను తీర్చండి సారూ’ అంటూ పెద్దకోట్ల గ్రామస్తులు కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్తో మొరపెట్టుకున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ఇటీవల నిర్మించిన సత్యసాయి నీటి సరఫరా సంపును ఆదివారం ఆయన పరిశీలించా రు. ఈ విషయం తెలుసుకున్న బీసీ కాలనీవాసులు తమ బాధలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన రాకకోసం వేచి ఉన్నారు. కలెక్టర్ రాగానే గ్రామస్తు లు ఆయన వాహనాన్ని అడ్డుకొని తమ బాధలు చెప్పుకొన్నారు.గతంలో తమ కాలనీ గుండా వెళుతున్న పైపులైను కనెక్షన్ తీసివేసి, కొత్త పైపులైన్కు అమర్చడంతో సమస్య ఏర్పడిందన్నారు. మూ డు, నాలుగు రోజులకు ఒకసారి నీరు వస్తోందన్నారు. పాత పైపులైన్కు కనెక్షన్ పునరుద్ధరించి తాగునీటి సమస్య తీర్చాలని కలెక్టర్కు విన్నవించారు. అలాగే కాలనీలో సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు. కలెక్టర్ సమాధానమిస్తూ విడుదల చేస్తున్న నీరు శుద్ధి చేసినదని, అందుకే కొత్త పైప్లైన్ ద్వారా పరిమితంగా విడుదల చేస్తున్నారన్నారు. నీటి సమస్య రాకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ డీఈ రాజ్కుమార్ను ఆయన ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ మద్దులచెరువు సమీపంలోని నల్లగుట్టపైన, సీబీఆర్ వద్ద రూ.80 కోట్లతో నిర్మించిన వాటర్ సంపులను పరిశీలించారు. శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మద్దులచెరువు సంపువద్ద మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రభాకర్రావు, ఎల్అండ్టీ ప్రతినిధులు సెల్వమురగన్, మోహన్దాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్మార్ట్ సిటీ వరంగల్’ విన్నపం అందింది: కమల్నాథ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పట్టణమైన వరంగల్ను ‘స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దాలన్న వినతి తమకు అందిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కమల్నాథ్ గురువారం రాజ్యసభకు తెలిపారు. అయితే జేఎన్ఎన్యూఆర్ఎం కింద ప్రస్తుత దశలో దీన్ని చేపట్టలేమని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్దన్రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కమల్నాథ్ ఈ విషయం చెప్పారు. కాగా, హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్ వద్ద 9.053 ఎకరాల స్థలంలో ఎయిర్ఫోర్స్ నావల్ హౌసింగ్ బోర్డు(ఎఎఫ్ఎన్హెచ్బీ) మూడోదశ గృహనిర్మాణ ప్రాజెక్టు 2006 చివరినాటికే పూర్తికావాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల 2012 డిసెంబర్ నాటికి కొలిక్కివచ్చిందని రక్షణ మంత్రి ఆంటోనీ.. పాల్వాయి అడిగిన మరో ప్రశ్నకు బదులిచ్చారు. కరీంనగర్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారుల బృందం గత జూన్లో రామగుండం మండలం పాలకుర్తిలో నిరుపయోగంగా ఉన్న ఎయిర్స్ట్రిప్ను పరిశీలించినట్లు విమానయానశాఖ సహాయమంత్రి కె.సి.వేణుగోపాల్ సమాధానం చెప్పారు.