
Breadcrumb
ముగిసిన రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన
Feb 13 2022 2:36 PM | Updated on Feb 13 2022 8:16 PM

Live Updates
హైదరాబాద్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
ముగిసిన రాష్ట్రపతి పర్యటన
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. దీంతో బేగంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి బయలుదేరి వెళ్లారు. కాగా ముచ్చింతల్ చిన్న జీయర్ ఆశ్రమంలో సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా రామానుజాచార్యుల స్వర్ణ మూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు.
భక్తితో ముక్తి లభిస్తుందని వేయేళ్ల కిందటే నిరూపించారు: రాష్ట్రపతి

రామనుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ మేరకు 120 కిలలోల స్వర్ణ రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. రామానుజ విగ్రహం ఏర్పాటు చేసి చిన జీయర్ స్వామి చరిత్ర సృష్టించారని తెలిపారు. రామానుజ సహస్రాబ్ది సమరొహం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పీడిత వర్గాల కోసం రామానుజ చార్యులు వైష్ణవ ద్వారాలు తెరిచారని, మహాత్మ గాంధీపై రామనుజాచార్యుల ప్రభావం ఉందని ప్రస్తావించారు.
రామానుజాచార్యుల శిష్యులల్లో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాల వారేనని, రామానుజాచార్యుల సమానత్వ ఆలోచనలు మన రాజ్యాంగములో కనిపిస్తాయని రాష్ట్రపతి తెలిపారు. సమతా మూర్తి విగ్రహ స్పూర్తితో లోక కల్యాణం కోసం కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. భక్తితో ముక్తి లభిస్తుందని వేయేళ్ల కిందటే నిరూపించారని పేర్కొన్నారు. భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని రామానుజాచార్యులు నిర్ధేశించారని తెలిపారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన లైవ్
రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలోని ఆలయాలు, బృహన్ మూర్తి విగ్రహాన్ని సందర్శించారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువుదీరిన రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రామానుజుల విగ్రహాన్ని లోకార్పణం చేయనున్నారు. భగవద్రామానుజుల 120 సంవత్సరాల పరిపూర్ణ జీవనానికి ప్రతీకగా 120 కిలోల బంగారంతో ఈ విగ్రహాన్ని రూపొందించారు.
ముచ్చింతలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచ్చింతల్ చేరుకున్నారు. సమతా మూర్తి కేంద్రానికి చేరుకున్న రామ్నాథ్ కోవింద్ దంపతులకు చినజీయర్ స్వామి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంత్రి తలసాని స్వాగతం పలికారు.
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్

Statue of Equality: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆహ్వనం పలికారు. రామ్నాథ్ కోవింద్తో పాటుగా ఆయన సతీమణి సవితా కోవింద్ కూడా హైదరాబాద్ వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్రపతి కోవింద్ దంపతులు హెలికాఫ్టర్లో ముచ్చింతల్లోని చిన్నజీయర్ ఆశ్రమానికి బయలుదేరారు.
మచ్చింతల్లోని శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహంలో రాష్ట్రపతి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీంతోపాటు భద్రవేదిక దిగువ భాగంలో కొలువుదీరిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
Related News By Category
Related News By Tags
-
రేపు హైదరాబాద్కు రాష్ట్రపతి.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న (శనివారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్గా మంత్రి సితక్కను తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది....
-
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివసేనా రెడ్డి
సాక్షి, హైదరాబాద్: యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వనపర్తి జిల్లా పెద్దగూడేనికి చెందిన కొత్తకాపు శివసేనారెడ్డి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన అత్యధిక (59,997) ఓట్లు సాధించి యూ...
-
లక్ష్మణ్కే మళ్లీ బీజేపీ పగ్గాలు!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కె.లక్ష్మణ్ మళ్లీ కొనసాగుతారా? ప్రస్తుత రాజ కీయ పరిస్థితుల్లో ఆయనను మార్చి కొత్త నేతను నియమించడం ద్వారా అదనపు ప్రయోజనమేమీ ఉండబోదని, బీసీ వర్గానికి చెంద...
-
రాష్ట్రపతి పర్యటన ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్ర పర్యటన అధికారికంగా ఖరారైంది. ఈ మేరకు రాష్ట్రపతిభవన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవంలో ...
-
Hyderabad: వెలుగులోకి మరో ప్రీ లాంచ్ మోసం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. భారతీయ బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ అంటూ కోట్లాది రూపాయల ఘరానా మోసం బయటపడింది. ప్రీ లాంచ్ ప్రాజెక్ట్కు కోట్లు రూపాయలు చెల్లింపులు చే...