తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు..
👉గాంధీ భవన్లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ వీహెచ్, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, సహా పలువురు పాల్గొన్నారు.
👉నేడు తెలంగాణవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పాలన దినోత్సవం నిర్వహించనున్నారు. ఇక, సెప్టెంబర్ 17వ తేదీ సందర్భంగా ఇక ప్రతీ సంవత్సరం ప్రజా పాలన దినోత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
👉తెలంగాణలో జాతీయ జెండా ఎగురవేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్.
👉కాగా, ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం, మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. మరోవైపు.. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి సీఎం నివాళులు అర్పించనున్నారు.
👉ఇక, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారమే అసెంబ్లీలో జాతీయ జెండాను ఎగురవేశారు.
ప్రజా పాలనా దినోత్సవంగా గెజిట్ విడుదల..
తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంగా సెప్టెంబరు 17వ తేదీని ప్రకటిస్తూ సోమవారం గెజిట్ జారీ చేసింది. 1948, సెప్టెంబరు 17న రాచరిక పాలన ముగిసి భారత సమాఖ్యలో భాగమై ప్రజాస్వామిక యుగంలోకి ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలనా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు గెజిట్లో ప్రభుత్వం పేర్కొంది.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు.#TelanganaNews #PrajaPalana @TelanganaCMO @revanth_anumula @V6News. pic.twitter.com/MlfqUHy8Es
— Danasari Seethakka (@meeseethakka) September 17, 2024
ఇది కూడా చదవండి: తెలంగాణలో రేషన్.. పరేషాన్!
Comments
Please login to add a commentAdd a comment