ప్రజాభవన్ యాక్సిడెంట్‌ కేసులో కీలక మలుపు | Key Turning Point In Shakeel Son Car Road Accident Case In Front Of Praja Bhavan, Details Inside - Sakshi
Sakshi News home page

ప్రజాభవన్ యాక్సిడెంట్‌ కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు షాక్‌

Published Wed, Jan 17 2024 11:34 AM | Last Updated on Wed, Jan 17 2024 12:51 PM

Shakeel Son Car Road Accident Case In Front Of Praja Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాభవన్(పాత ప్రగతి భవన్‌) ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. తన కొడుకు సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌ దుబాయ్‌కు పారిపోయేందుకు షకీల్‌ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.

రోడ్డు ప్రమాద ఘటన తర్వాత..  సాహిల్‌ దుబాయ్‌ పారిపోయేందుకు మొత్తం పది ముంది సహాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. అందులో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇందులో షకీల్‌ కూడా తన కొడుకు కోసం సహకరించినట్లు గుర్తించారు.  ఇక.. ఇప్పటికే సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌పై లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు. అతన్ని దుబాయ్‌ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రజా భవన్‌ ముందు సాహిల్‌ గత నెల 23వ తేదీన కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌తో ప్రజాభవన్‌ ఎదుట బారీకేడ్లను తన కారుతో ఢీకొట్టాడు. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇక.. కారు ప్రమాద విజువల్స్‌ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన పోలీస్‌ సిబ్బందిపైనా వేటు వేశారు.

ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు కేసులో హై కోర్టు కీలక తీర్పు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement