Praja Bhavan
-
కాసేపట్లో ప్రజా భవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం
-
రుణమాఫీ చేస్తున్నాం.. హరీష్ రాజీనామాకు సిద్ధమా?: సీఎం రేవంత్
Updates..టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..👉ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని చెప్పాం. చెప్పిన దాని కంటే ముందే చేస్తున్నాం. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్తే ఇది అసాధ్యం అని చాలామంది మాట్లాడారు. చిత్తశుద్ధి ఉంటే అన్ని సాధ్యమని నిరూపించాం. 👉60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారు. సోనియా గాంధీ కుటుంబం గౌరవం కాపాడాలి. దేశానికి ఆదర్శ పాలన మనం ఎందుకు చేయకూడదు.👉వ్యవసాయం దండుగ కాదు పండుగ. రైతులకు రుణమాఫీ చేయడం నా జీవితంలో మర్చిపోలేనిది. రేపటి రాజకీయ భవిష్యత్తు రుణమాఫీతో ముడిపడి ఉంది. రేపు సాయంత్రం రైతుల ఖాతాలో డబ్బు పడుతుంది. ఆగస్టు 15వ తేదీ లోపల మరో లక్ష రూపాయలు వేస్తాం అని చెప్పుకొచ్చారు. 👉రుణమాఫీపై జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలి. పార్లమెంటు సభ్యులు రుణమాఫీపై నేషనల్ మీడియాలో చెప్పాలి. భారతదేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని తెలంగాణ ప్రభుత్వం చేసింది. రుణమాఫీ మోదీ హామీ కాదు. ఇది రాహుల్ గాంధీ హామీ. దివంగత మహానేత వైఎస్సార్ ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్ల గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. అలాగే, రుణమాఫీ గురించి కూడా 20 ఏళ్లపాటు చెప్పుకోవాలి.👉విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్లు, వేల కోట్ల అప్పులు ఉన్నవాళ్లకి కూడా ఏం కాదు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పడానికే రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం. దీనిపై గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో ప్రచారం చేయాలి. ఓట్లు అడగడానికి గ్రామాలకు వెళ్ళాం. ఇపుడు రుణమాఫీ చేశామని గ్రామాల్లో చెప్పండి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్.. 👉‘ఆగస్టు దాటకుండానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ అమలుకు నిద్రలేని రాత్రులు గడిపాం. అర్హులైన అందరికీ రైతు రుణమాఫీ చేస్తాం. రూ.7లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టినప్పటికీ రూ.2లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేసేందుకు శ్రీకారం చుట్టాం. రేషన్కార్డులు లేని ఆరు లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలు అమలు చేస్తున్నాం. అయితే, అనుకున్నంతగా ఈ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదు. 👉 సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. 👉 కాగా, రేపు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. 👉 కాసేపట్లో ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరుగనుంది.👉పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. 👉ఇక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత చోటుచేసుకుంది.👉ప్రజాభవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ గాంధీభవన్ నుంచి నేతలందరికీ సమాచారం పంపారు.👉మరోవైపు ఈరోజు భేటీలో ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ నేతల మధ్య సమన్వయంపై చర్చ జరుగనుంది. అలాగే, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్పై పార్టీ నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు.👉ఈ సమావేశంలో రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. పంద్రాగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ హామీ అమలు కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చిస్తారు.👉అలాగే, రుణమాఫీ సందర్భంగా రైతుల సమక్షంలో నిర్వహించాల్సిన సంబురాలకు సంబంధించిన కార్యాచరణ గురించి సమావేశం పిలుపునిస్తుందని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.👉ఇటీవలి రాజకీయ పరిణామాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రైతు భరోసా అమలు, విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ విషయంలో సుప్రీం ఆదేశాల పర్యవసానాలు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. -
ప్రజాభవన్లో వైభవంగా బోనాలు
లక్డీకాపూల్: ఆషాడ మాసం సందర్భంగా ఆదివారం తెలంగాణ ప్రజాభవన్లోని నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ప్రజాభవన్కి విచ్చేసిన సీఎం, మంత్రులకు భట్టి దంపతులు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భట్టి దంపతులు బోనాలకు, మహంకాళి అమ్మవారి ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత నల్ల పోచమ్మ అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేశా రు. అనంతరం మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, ఎమ్మెల్యే ఎన్ ఉత్తమ్ పద్మావతి, పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు బోనమెత్తారు. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మహంకాళి అమ్మవారి ఘటాన్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చి జోగిని తలపై ఎత్తారు.డిప్యూటీ సీఎం నివాసం నుంచి ప్రజాభవన్ ఆవరణలోని నల్ల పోచమ్మ దేవాల యం వరకు డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యా సాల మధ్యన బోనాలను ఎత్తుకెళ్లారు. అనంతరం అమ్మవారికి భట్టి విక్రమార్క దంపతులు బోనంలో ఉన్న నైవేద్యాన్ని సమరి్పంచారు. నల్ల పోచమ్మ దేవాలయంలో భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో విలసిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. -
ప్రజాభవన్ లో వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్
-
ప్రజాభవన్ లో బాబు, రేవంత్
-
తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ.. చర్చించిన అంశాలివే
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నరకుపైగా సమావేశం కొనసాగింది విభజన చట్టంలో ఆస్తులు, అప్పులపై సీఎంలు చర్చించారు. ఏపీ నుంచి చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్ధన్రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. కాగా, సీఎంల భేటీకి ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. పవన్ ఎందుకు హాజరుకాలేదంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది.విభజన చట్టంలో ఉన్న ఆస్తులు, అప్పులపై చర్చిస్తూ.. హైదరాబాద్లో కొన్ని భవనాలు ఏపీకి ఇవ్వాలని చంద్రబాబు కోరగా.. హైదరాబాద్లో ఉన్న స్థిరాస్తులు మొత్తం తెలంగాణకే చెందుతాయని రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు. కావాలంటే ఢిల్లీలో ఏపీ భవన్ తరహాలో భవనం కట్టుకునేందుకు పర్మిషన్ ఇస్తామని తెలంగాణ సర్కార్ చెప్పింది.భద్రాచలంలో నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల్లోని ఐదు గ్రామాలను తెలంగాణ ప్రభుత్వం అడిగింది. కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరోసారి సీఎస్ల స్థాయిలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. విభజన సమస్యలపై రెండు కమిటీలు ఏర్పాటుకు నిర్ణయించగా, మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయనున్నారు. షెడ్యూల్ 9,10లోని ఆస్తుల పంపకం, ఏపీ రావాల్సిన 7,200 కోట్ల విద్యుత్ బకాయిలు, ఉమ్మడి సంస్థలపై షీలా భిడే కమిషన్ సిఫార్సుల అమలు, ఫైనాన్స్ కార్పొరేషన్, ఉద్యోగుల విభజన అంశాలు, లేబర్ సెస్ పంపకాలపై చర్చ జరిగింది.ముఖ్యమంత్రుల భేటీ.. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు:రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలుపబడ్డ 7 మండలాలు తిరిగి తెలంగాణలో చేర్చాలిఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000కి.మీ మేర విస్తారమైన తీరప్రాంతం (Coastal Corridor) ఉంది. తెలంగాణకు ఈ తీరప్రాంతంలో భాగం కావాలితెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వేంకటేశ్వరస్వామి. తెలంగాణకు కూడా టీటీడీలో భాగం కావాలికృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్ మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీ నీటిని కేటాయింపు చేయాలితెలంగాణ విద్యుత్ సంస్థలకు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు రూ.24,000 కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలి. దానిలో భాగంగా ఆంధ్రాకు ఏమైనా చెల్లించాల్సి ఉంటే, వాటిని చెల్లించడం జరుగుతుందితెలంగాణకు ఓడరేవులు లేవు. అందువల్ల విభజనలో భాగంగా ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలి -
ప్రగతి భవన్ కు బాంబు బెదిరింపు నిందితుడు అరెస్ట్
-
ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రజా భవన్ బాంబ్ బెదిరింపు కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. 24 గంటలోనే నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుడిని గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తించారు.కాగా మంగళవారం ఉదయం ప్రజాభవన్లో, నాంపల్లి కోర్టులో బాంబ్ పెట్టినట్లు కంట్రోల్ రూమ్కు ఫోన్చేసిన రామకృష్ణ.. అధికారును కంగారు పెట్టించాడు. అయితే రామకృష్ణ భార్యతో గొడవ పడి మధ్యనికి బానిసగా మారినట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్య దూరం అవ్వడంతో ఆమె లేదని బాధలో ఫోన్ చేసినట్లు పోలీసులు తేల్చారు.అసలేం జరిగిందంటే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్ లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్ కు చేరుకొని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసిపి మనోహర్ కుమార్ సంఘటన స్థలానికి తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను అణువణువునా డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు. అదేవిధంగా భట్టి విక్రమార్క కాన్వాయ్, కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.ఆ తర్వాత ప్రజాభవన్ లో ఉన్న అమ్మవారి ఆలయం లో తనిఖీలు చేశారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో దాదాపు మూడు గంటలపాటు తనిఖీలు సాగాయి. అనంతరం ఫేక్ కాల్గా తేలడంతో ప్రజాభవన్ నుంచిబాంబ్ స్క్వాడ్ ,డాగ్ స్క్వాడ్ సిబ్బంది.. ప్రజాభవన్ నుంచి బయటకు వచ్చారు. -
ప్రజాభవన్లో బాంబు కలకలం
పంజగుట్ట: ‘‘ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో బాంబు పెట్టాం.. మరో కొద్దిసేపట్లో అది పేలబోతుంది..’’ అంటూ ఒక అగంతకుడు పోలీస్ కంట్రోల్రూం డయల్ 100కు ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెట్టారు. సుమారు నాలుగు గంటలపాటు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ మొత్తం తనిఖీ చేసి ఎలాంటి బాంబు లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. మంగళవారం మధ్యాహ్నం 12:06 నిమిషాలకు పోలీస్ కంట్రోల్రూం 100కు ఓ అగంతకుడు ఫోన్ చేసి ప్రజాభవన్లోని మల్లు భట్టి విక్రమార్క ఇంటివద్ద బాబు పెట్టామని ఫోన్ చేశాడు. కంట్రోల్రూం సిబ్బంది 12:15కు పంజగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇంటలిజెన్స్ సెక్యురిటీ వింగ్, సిటీ సెక్యురిటీ వింగ్ అధికారులను రంగంలోకి దింపారు. హుటాహుటిన నాలుగు డాగ్ స్క్వాడ్ బృందాలు, 10 బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ బృందాలు రంగంలోకి దిగాయి. పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ నేతృత్వంలో అణువణువూ తనిఖీ చేశారు.ఇకపై అక్కడ భారీ బందోబస్తు..: భట్టి ఇంటితోపాటు మంత్రి సీతక్క ఇంటిని, పరిసర ప్రాంతాలనూ చెక్ చేశారు. తరువాత ప్రజాభవన్ లోపల, పక్కనే ఉన్న మరోభవనం, అమ్మవారి ఆలయం సహా అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుమారు 4 గంటలకు పైగా తనిఖీలు చేసి ఎక్కడా ఏమీ లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై ప్రజాభవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు.. సందర్శకులను క్షుణంగా పరిశీలించాలని సిబ్బందికి ఆదేశించారు. కాగా, ప్రజాభవన్లో బాంబు ఉందని ఫోన్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు
-
ప్రజా భవన్లో ముగిసిన తనిఖీలు..
హైదరాబాద్, సాక్షి: ప్రజా భవన్లో తనిఖీలు ముగిశాయి. మూడు గంటల పాటు అన్ని సముదాయాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. మంత్రి సీతక్క ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సముదాయాలతో పాటు గార్డెనింగ్ జిమ్ స్విమ్మింగ్ పూల్ సెక్యూరిటీ ప్లేసెస్ అన్ని ప్రాంతాలను పరిశీలించారు. తనిఖీలు ముగియడంతో ప్రజాభవన్ నుంచిబాంబ్ స్క్వాడ్ ,డాగ్ స్క్వాడ్ సిబ్బంది.. బయటకు వచ్చారు. అసలేం జరిగిందంటే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్ లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్ కు చేరుకొని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసిపి మనోహర్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను అణువణువునా డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు. అదేవిధంగా భట్టి విక్రమార్క గారి కాన్వాయ్, కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాలను పోలీసులు క్షున్నంగా పరిశీలించారు. ఆ తర్వాత ప్రజాభవన్ లో ఉన్న అమ్మవారి ఆలయం లో తనిఖీలు చేశారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు సాగాయిప్రజాభవన్లో బాంబు ఉన్నట్లు ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. సెల్ఫోన్ సిగ్నలింగ్ ఆధారంగా కనిపెట్టే పనిలో పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. ఫోన్ చేసిన వ్యక్తి ఆకతాయి లేక కావాలని ఉద్దేశపూర్వకంగానే ఫోన్ చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాభవన్ లో బాంబు ఉందని ఫోన్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయం ప్రచారం మాధ్యమాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది. -
పంజాగుట్ట కేసులో మరో ట్విస్ట్.. మాజీ ఎమ్మెల్యే షకీల్కు షాక్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట ప్రమాదం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలో డీసీపీ విజయ్ కుమార్ కీలక విషయాలను వెల్లడించారు. ఈ కేసు విషయమై తాజాగా డీసీపీ విజయ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. పంజాగుట్ట ప్రమాదం కేసులో తన కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించాడు. రాహిల్తో పాటుగా షకీల్ కూడా దుబాయ్కి పారిపోయాడు. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట ఇన్స్పెక్టర్తోపాటుగా బోధన్ సీఐని కూడా అరెస్ట్ చేశాం. నిందితుడికి పోలీసులు సహకరించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశాం. ఈ కేసులో మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’ అని వెల్లడించారు. ప్రజాభవన్ వద్ద హల్చల్.. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 23న హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందు ఉన్న బారికేడ్లను.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహెల్.. కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. పోలీస్ స్టేషన్ నుంచి ప్రధాన నిందితుడైన సాహెల్ను తప్పించి.. అతని డ్రైవర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే.. సాహెల్ను తప్పించటంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని సిబ్బంది సహకరించినట్టు ఆరోపణలు రావటంతో.. ఉన్నతాధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అప్పటికే.. సాహెల్ దుబాయ్ పారిపోగా.. అతనిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. సీఐ దుర్గారావు అరెస్ట్ మరోవైపు.. ఆ ప్రమాదం జరిగిన సమయంలో సీఐ దుర్గారావు డ్యూటీలో ఉన్నట్టు.. అతనే నిందితున్ని తప్పించటంతో కీలకంగా వ్యవహరించినట్టు దర్యాప్తులో తేలటంతో.. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న దుర్గారావును వెతుకుతున్న క్రమంలో.. అనంతపురం గుంతకల్ రైల్వే స్టేషన్లో పట్టుబడ్డాడు. సోమవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు దుర్గారావును హైదరాబాద్ తీసుకొచ్చారు. వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో దుర్గారావును పోలీసులు విచారిస్తున్నారు. -
పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు అరెస్ట్
హైదరాబాద్, సాక్షి: ప్రజాభవన్ రోడ్డు ప్రమాద కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును ఎట్టకేలకు పోలీసులు ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేశారు. గుంతకల్లు రైల్వే స్టేషన్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రజాభవన్ దగ్గర రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావు నిందితుడు(ఏ11). బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను దుర్గారావే తప్పించినట్లు అభియోగం నమోదు అయ్యింది. ఈ వ్యవహారంపై గతంలోనే నగర కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి దుర్గారావును సస్పెండ్ చేసిన సంగతీ తెలిసిందే. అయితే.. విచారణకు హాజరు కాకుండా ఆయన పారిపోయారు. అప్పటి నుంచి ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా.. గుంతకల్లు రైల్వే పోలీసుల సాయంతో దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరుడు అబ్దుల్వాహె, నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్ను పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 23న అర్ధరాత్రి షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సాహిల్ను తప్పించేందుకు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ను పంజాగుట్ట ఠాణాకు పంపి కేసు నమోదు చేయించారు. ఇందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. -
ప్రజాభవన్ ఎదుట రోడ్డుప్రమాదం కేసులో దర్యాప్తు ముమ్మరం
-
TS: ప్రజాభవన్లో రిపేర్లకు అంత ఖర్చా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ కాస్త ప్రజా భవన్గా మారింది. ప్రజా సందర్శనకు అనుమతి ఇస్తూ.. వాటి ముందు ఉన్న బారికేడ్లను సైతం తొలగించారు. ఆపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ప్రజా భవన్ను కేటాయించారు. అయితే కేసీఆర్ హయాంలో దుబార జరిగిందని.. కాబట్టి హంగులు ఆర్బాటాలకు పోకుండా ఉంటామని ప్రకటించుకుంది రేవంత్ సర్కార్. కానీ, ప్రజా భవన్ రిపేర్ల కోసం చేస్తున్న ఖర్చుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రజా భవన్లో టాయిలెట్ల రిపేర్లు కోసం.. అలాగే దోమ తెరల కోసం రూ.35 లక్షలకు టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచినట్లు తెలుస్తోంది. మరో టెండర్లో భాగంగా జిమ్ రూంలో పొడుగు అద్దాలు, గన్మెన్ రూముల కోసం రూ.28.70 లక్షలకు టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతుల పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఈ ప్రచారంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
‘రోడ్డు ప్రమాదం’ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని ప్రజాభవన్ ఎదురుగా గత నెల ఆఖరివారంలో చోటు చేసుకున్న ‘బీఎండబ్ల్యూ కారు ప్రమాదం’కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమీర్ నిందితుడిగా మారారు. కుమారుడు రహీల్ అమీర్ను ఈ కేసు నుంచి తప్పించేందుకు చేసిన కుట్రకు ఆయనే సూత్రధారని దర్యాప్తు అ«ధికారులు తేల్చారు. ఈ ‘ఎస్కేప్ ఎపిసోడ్’లో మాజీ ఎమ్మెల్యే సహా పదిమంది పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అసలేం జరిగిందంటే.. రహీల్ అతడి స్నేహితుడితో పాటు ఇద్దరు యువతులతో కలిసి గత నెల 24వ తేదీ తెల్లవారుజామున బీఎండబ్ల్యూ కారులో (టీఎస్ 13 ఈటీ 0777) బేగంపేట వైపు నుంచి పంజగుట్ట వైపు వస్తున్నారు. ఆ సమయంలో కారును రహిల్నే నడుపుతున్నాడు. తెల్లవారుజామున 2.45 గంటల ప్రాంతంలో ఈ కారు ప్రజాభవన్ ఎదురుగా ఉన్న ఫ్లై ఓవర్ వద్ద బారికేడ్లను మితిమీరిన వేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు, బారికేడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎయిర్బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్న నలుగురూ సురక్షితంగా బయటపడ్డారు. అక్కడకు చేరుకున్న పంజగుట్ట పోలీసులు రహీల్ను ఠాణాకు తీసుకువచ్చారు. ఈలోపు విషయం ఫోన్ ద్వారా దుబాయ్లో ఉన్న తండ్రి షకీల్కు రహీల్ చెప్పాడు. ఆయన రంగంలోకి దిగి తన కుమారుడి స్థానంలో తన ఇంట్లో డ్రైవర్ అబ్దుల్ ఆరిఫ్ను ఉంచాలని పథకం వేశారు. దీన్ని అమలులో పెట్టడం కోసం రహీల్ స్నేహితులైన అర్బాజ్, సాహిల్తో పాటు మరి కొందరిని రంగంలోకి దింపారు. అర్బాజ్, సోహైల్లు మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంటికి వెళ్లి అక్కడున్న ఆరిఫ్ను తీసుకుని పంజగుట్ట ట్రాఫిక్ ఠాణా వద్దకు వచ్చారు. పోలీసులూ సహకరించడంతో అప్పటికే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం రహీల్ స్థానంలో ఆరిఫ్ను ఉంచారు. సీసీ ఫుటేజ్తో అసలు వాస్తవం వెలుగులోకి ఈ అంశంపై అనుమానాలు వ్యక్తం కావడంతో కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన వెస్ట్జోన్ డీసీపీ ఎం.విజయ్కుమార్ సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అసలు కథ వెలుగులోకి వచ్చి పంజగుట్ట ఇన్స్పెక్టర్గా పని చేసిన దుర్గారావుపై సస్పెన్సన్ వేటు పడింది. ఆరిఫ్ను అప్పుడే అరెస్టు చేసి రహీల్పై అదనపు సెక్షన్ల కింద ఆరోపణలు చేర్చారు. ఈ ఎస్కేప్ వ్యవహారం దర్యాప్తు నేపథ్యంలో షకీల్తో పాటు అర్బాజ్, సాహిల్, మరో ఏడుగురి పాత్ర తాజాగా వెలుగులోకి వచి్చంది. దీంతో అర్బాజ్, సోహైల్ను సోమవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఈ కేసులో షకీల్ను నిందితుడిగా చేరుస్తూ కోర్టుకు సమాచారం ఇచ్చారు. నిందితులపై అదనపు సెక్షన్లతో కేసులు ఇప్పటికే రహీల్పై లుక్ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ అయి ఉంది. తాజాగా షకీల్తో పాటు రహీల్ ఎస్కేప్కు సహకరించి, దుబాయ్ పారిపోయిన మరో ఇద్దరి పైనా బుధవారం జారీ చేశారు. తొలుత పంజగుట్ట పోలీసులు ఆరిఫ్పై మూడు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తులో వెలుగులోకి వచి్చన అంశాల నేపథ్యంలో నిందితులపై ఐపీసీ, ఎంవీ యాక్ట్ల్లోని మరో 14 సెక్షన్లను జోడించారు. -
ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు
-
ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్(పాత ప్రగతి భవన్) ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. తన కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ దుబాయ్కు పారిపోయేందుకు షకీల్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాద ఘటన తర్వాత.. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు మొత్తం పది ముంది సహాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. అందులో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇందులో షకీల్ కూడా తన కొడుకు కోసం సహకరించినట్లు గుర్తించారు. ఇక.. ఇప్పటికే సాహిల్ అలియాస్ రాహిల్పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అతన్ని దుబాయ్ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజా భవన్ ముందు సాహిల్ గత నెల 23వ తేదీన కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్తో ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను తన కారుతో ఢీకొట్టాడు. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇక.. కారు ప్రమాద విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపైనా వేటు వేశారు. ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో హై కోర్టు కీలక తీర్పు -
సరైన మార్గంలో కొత్త ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో సాధించిన విజయాన్ని గుర్తుచేస్తోంది. తెలంగాణ పాలనలో కూడా రాజశేఖర రెడ్డి స్ఫూర్తి కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే ‘కక్ష సాధింపు ధోరణులు ఉండవు’ అన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఆసుపత్రిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పరామర్శించిన తీరూ, ఎన్నికల సమయంలో తమ పార్టీ చేసిన ఆరు గ్యారెంటీల వాగ్దానంతో పాటు తాము ప్రజా స్వామ్యబద్ధంగా పాలన చేయనున్నామనే వాగ్దానాన్నీ ఏడో గ్యారెంటీగా ఇస్తున్నామనీ పేర్కొనడం ప్రజల్లో ఆశను రేకెత్తిస్తున్నఅంశాలే! రేవంత్ రెడ్డి తీరు దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నైజాన్నీ, ఆయన స్వభావాన్నీ తలపి స్తున్నది. ఒకరకంగా తెలంగాణ నేటి ముఖ్య మంత్రి.. ఆ మహానేతచే ప్రభావితమయ్యా రేమో అనిపిస్తోంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్ మీద తొలి సంతకం చేశారు. ‘ప్రజా దర్బారు’ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ప్రజల్లో ఉండే పాల నను కొనసాగించారు. అనుచిత రాతలను మాత్రమే ఖండిస్తూ ప్రతికా స్వేచ్ఛను గౌర వించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినవెంటనే ప్రగతి భవన్ చుట్టూ ఆరడగుల ఎత్తులో పాతుకుపోయిన ఇనుపకంచెను తొల గించేశారు. ప్రగతి భవన్ను ‘ప్రజా భవన్’గా మార్చారు. ‘ప్రజల సమస్యలు తెలుసుకోని పాలన ఏంటీ? ప్రజా వాణి వినని ప్రజా స్వామ్యం ఏంటని’ రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవచ్చని ‘ప్రజా వాణి’ పేరుతో ప్రజా దర్బా రును పునః ప్రారంభించారు. తామిచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచడం అనేరెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చారు. లక్ష ఉద్యోగాల హామీకీ కసరత్తు మొదలు పెట్టారు. రూ. 500కు సిలిండర్, కుటుంబానికి ఆర్థిక బాసటగా ఉన్న మహిళలకు నెల నెలా 2,500 రూపాయలు ఇవ్వడం వంటి హామీలకూ తెల్లరేషన్ కార్డుల వెరిఫై,మంజూరు వంటి ఎక్స్ర్సైజులు మొదలై పోయాయి. వీటన్నిటి కంటే ముందు... నాడు తెలుగుదేశం ఉప్పెనలో మిణుకు మిణుకు మంటూ ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రె స్కి ఎలాగైతే రాజశేఖర రెడ్డి తన పాద యాత్రతో ఊపిరి పోసి మళ్లీ అధికారంలోకి తెచ్చారో... అలాగే తెలంగాణలో రేవంత్కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. ఎన్నికల సమయంలో సీనియర్ లీడర్లందరికీ సము చిత గౌరవం, బాధ్యతలూ ఇచ్చి మంచి ఫలి తాలు రాబట్టారు. నాడు పాదయాత్రతో రాష్ట్ర అవసరాల మీద ఒక అంచనాకు వచ్చి ఎలా గైతే రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు.. అభి వృద్ధి ప్రణాళికలను రచించారో.. అలాగే రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల కంటే ముందే రాష్ట్ర సమస్యల మీద ఒక అవగాహన ఏర్ప రచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతటా తిరిగి ఆ అవగాహన మీద ఒక స్పష్టతను తెచ్చుకున్నారు. నిండు అసెంబ్లీలో ‘మేం పాలకులం కాం సేవకులం’ అంటూ ఆయన చూపిన వినమ్రత, విజ్ఞతే ఆయన ప్రజాస్వామ్యయుత పాలనా నిబద్ధతకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ మాటను చెప్పడమే కాదు.. ఆ బాటలో నడుస్తున్నారు కూడా. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ శాఖ మొదలు శాఖ లన్నిటిలోని అవకతవకల మీద దృష్టి పెట్టారు. తద్వారా ఏ ప్రభుత్వమైనా తమ చర్యల పట్ల ప్రజలకు జవాబుదారీగా ఉండా లని చెబుతూ పాలనలో పారదర్శకత తీసు కొస్తున్నారు. డ్రగ్స్ వంటి వాటిని రాష్ట్రంనుంచి తరిమికొట్టేందేకు ఆయన పడుతున్న తాపత్రయం మన యువత పట్ల ఆయనకున్న కన్సర్న్ను చూపెడుతోంది. రాష్ట్ర అభివృద్ధి... పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం సమష్టి బాధ్యతగా భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనా దక్షత, విజన్తో తెలంగాణను 5 లక్షల కోట్ల రూపాయల రుణం నుంచి విముక్తం చేసి అభివృద్ధి పథంలో నడిపిస్తారని యావత్ తెలంగాణ విశ్వసిస్తోంది. - డా‘‘ వర్రె వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ -
‘ప్రజాభవన్’ ఘటనలో కొత్త కోణం
హైదరాబాద్, సాక్షి: బేగంపేట ప్రజాభవన్ వద్ద ఈ నెల 23న చోటుచేసుకున్న ర్యాష్ డ్రైవింగ్ కేసులో.. ప్రధాన నిందితుడు సాహిల్ను తప్పించి మరొకరిని నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఉదంతంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడిని ఎలా తప్పించారనే విషయం ఇప్పుడు వెలుగు చూసింది. ప్రమాదం జరిగిన రోజున రాత్రి విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ దుర్గారావు.. ఘటనాస్థలం నుంచి సాహిల్ను కారులో పంజాగుట్ట ఠాణాకు తీసుకొచ్చారు. కానిస్టేబుల్కు అప్పగించి, పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్స్టేషన్కు బ్రీత్ఎనలైజర్ పరీక్ష కోసం పంపారు. ఈక్రమంలో నిందితుడు తప్పించుకొని, అప్పటికే బయటున్న కారులో ఇంటికి వెళ్లాడు. తమ డ్రైవర్ను తన స్థానంలో పంజాగుట్ట పోలీస్స్టేషన్కు పంపాడు. అతడితో ప్రమాద సమయంలో తానే కారు నడిపినట్టు వాంగ్మూలం ఇప్పించేలా పురిగొల్పాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగు చూశాక కూడా ఉన్నతాధికారులకు ఇన్స్పెక్టర్ అసలు విషయం చెప్పకుండా గోప్యత పాటించినట్టు తేలింది. నిందితుడు తప్పించుకొని ముంబయికి, అక్కడి నుంచి దుబాయ్ పారిపోయేందుకు సహకరించినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. దర్యాప్తును పక్కదారి పట్టించడంలో ఇన్స్పెక్టర్ కీలకంగా వ్యవహరించినట్టు పంజాగుట్ట ఠాణా సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారాలు సేకరించారు. ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు గుర్తించాకనే.. ఇన్స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేసినట్టు సమాచారం. ఈవ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయమై ఆరా తీస్తున్నారు. ఇదీ చదవండి: మోస్ట్వాంటెడ్గా నాడు షకీల్.. నేడు సాహిల్!! -
ప్రజాభవన్: ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్.. సీఐ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావు సస్పెండ్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసులో నిర్లక్ష్యం వహించినందుకు దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా, ర్యాష్ డ్రైవింగ్ చేసి వ్యక్తులన బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సొహైల్ మార్చేసిన విషయం తెలిసిందే. వివరాల ప్రకారం.. ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసును పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా ర్యాష్ డ్రైవింగ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ అని నిర్ధారించారు. ప్రధాన నిందితుడిగా సోహైల్ను చేర్చటమే కాకుండా.. అతనిపై 17 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్వాకం బయటపడింది. ప్రమాదం తర్వాత సోహైల్ను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. సోహైల్ను అదుపులోకి తీసుకోవడంతో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు పీఎస్కు వచ్చారు. షకీల్ కొడుకును విడిపించుకుపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీంతో, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ.. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గరావును సస్పెండ్ చేశారు. Panjagutta Inspector B. Durga Rao suspended for negligence in former MLA Shakeel's son Sohail case. #Telangana pic.twitter.com/qvq11aSRNC — Mubashir.Khurram (@infomubashir) December 26, 2023 ఘటన జరిగిన రోజున (డిసెంబర్ 24న) నైట్ డ్యూటీలో సీఐ దుర్గారావుతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది.. సోహైల్ను తప్పించి వేరే వ్యక్తి పేరును చేర్చారంటూ.. పెద్ద ఎత్తున ఆరోపణలు రావటంతో.. అధికారులు వారిపై విచారణ చేపట్టారు. వెస్ట్ జోన్ డీసీపీ పూర్తి స్థాయిలో విచారిస్తున్న క్రమంలో దుర్గారావు అస్వస్థతకు గురయ్యారు. బీపీ డౌన్ కావటంతో.. దుర్గారావు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో దుర్గారావు వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదం వ్యవహారంపై రాజకీయపరంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావటంతో.. సమగ్ర దర్యాప్తు జరిపి తనకు నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించడంతో.. పోలీసుల నిర్వాకం బయటపడింది. ఇక, పరారీలో ఉన్న సొహైల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్వాకం బయటపడింది. ప్రమాదం తర్వాత సోహైల్ను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. సోహైల్ను అదుపులోకి తీసుకోవడంతో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు పీఎస్కు వచ్చారు. షకీల్ కొడుకును విడిపించుకుపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సోహైల్కు బదులు మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో పనిమనిషి అబ్దుల్ అసిఫ్ను కేసులో పోలీసులు చేర్చారు. ప్రమాద సమయంలో కారు అబ్దుల్ నడిపినట్లు కేసు నమోదు చేశారు. దుబాయ్ నుంచి షకీల్ ఈ వ్యవహారం అంతా నడిపినట్లు తెలుస్తోంది. మరోవైపు పంజాగుట్ట సీఐ దుర్గారావుకు అస్వస్థతకు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు వ్యవహారంలో సీఐ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఐను బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రికి తరలించారు సీఐ, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. సోహైల్తో రాత్రి ఫోన్ మాట్లాడిన స్నేహితులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. కాగా షకీల్ కొడుకు కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నెల 23న ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. అయితే సోహైల్ను తప్పించి మరొకరు డ్రైవ్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ప్రమాద విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ విచారణకు ఆదేశించారు.షకీల్ కొడుకు సోహైల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. షకీల్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేసింది షకీల్ కొడుకు సోహైల్గా తేల్చారు. అయితే ఎఫ్ఐఆర్లో మరొకరి పేరు చేర్చారు. దీంతో నిందితుడు సోహైల్కు సహకరించిన పోలీసులు ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ప్రమాద సమయంలో సోహైల్తోపాటు ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎందుకు చేయలేదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సోహైల్కు సహకరించి తప్పుడు కేసు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
కారు డ్రైవ్ చేసింది షకీల్ కొడుకే: డీసీపీ విజయ్
సాక్షి, హైదరాబాద్: ర్యాష్ డ్రైవింగ్తో ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీ కొట్టిన కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్ పేరును కూడా చేర్చినట్లు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. కేసులో మాజీ ప్రజాప్రతినిధి తనయుడ్ని తప్పించారని ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో.. డీసీపీ సాక్షి ద్వారా స్పందించారు. ‘‘ప్రజా భవన్ వద్ద న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యారికేట్స్ ను అతివేగంగా వచ్చి ఓ బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టింది. కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారు. వీళ్లంతా స్టూడెంట్స్. కారు డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. మిగతా వారిని అదుపులోకి తీసుకున్నాం’’ అని డీసీపీ విజయ్కుమార్ సాక్షికి తెలిపారు. ఆపై షకీల్ ఇంట్లో డ్రైవర్గా పని వేసే వ్యక్తి.. తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్కు వచ్చాడు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు. కానీ, సీసీ ఫుటేజీ, ఘటన దర్యాప్తు ద్వారా రహిల్ వాహనం నడిపినట్లు నిర్ధారించుకున్నాం. రహిల్పై గతంలో జూబ్లీహిల్స్లో ఓ యాక్సిడెంట్ కేసు నమోదు అయ్యింది (ఆ కేసులో ఓ బాలుడు కూడా మృతి చెందాడు). ఆ కేసు పూర్వాపరాలను కూడా గమనిస్తాం. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల్ని కోర్టులో ప్రవేశపెడతాం అని డీసీపీ సాక్షితో అన్నారు.