గండి దాటితేనే బడి | students suffer with Jayapuram gandi canal | Sakshi
Sakshi News home page

గండి దాటితేనే బడి

Published Tue, Sep 10 2024 11:28 AM | Last Updated on Tue, Sep 10 2024 11:28 AM

students suffer with Jayapuram gandi canal

 నర్సింహులపేట: భారీ వర్షాలకు మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం శివారు అన్నస్వామి కుంటకు గండి పడింది. దీంతో బక్కతండా, పోట్యాతండా, బండమీదితండాకు చెందిన విద్యార్థులు గండి దాటి 5 కిలోమీటర్ల దూరంలోని నర్సింహులపేట, 2 కిలోమీటర్ల దూరంలోని జయపురం పాఠశాలలకు రావాలి. 

దాదాపు 40 మంది విద్యార్థులు పాఠశాలలకు వచ్చి వెళ్తున్నారు. ఇందులో బాలికలు ఎక్కువగా ఉన్నారు. కాగా, గండి లోతుగా పడటంతో వరద నీటిలో సైకిళ్లను ఎత్తుకొని దాటాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి గండి దాటిస్తున్నారు. గండిని త్వరగా పూడ్చాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement