తెలంగాణ విద్యాశాఖ తీరు వివాదాస్పదం.. ఓటు హక్కు లేదని వివక్ష.. ! | Telangana Education Dept In Case Of SGT Spouse | Sakshi

తెలంగాణ విద్యాశాఖ తీరు వివాదాస్పదం.. ఓటు హక్కు లేదని వివక్ష! ‘పిల్లలను చెరొకరం పంచుకున్నాం’

Jan 28 2023 1:22 AM | Updated on Jan 28 2023 10:47 AM

Telangana Education Dept In Case Of SGT Spouse - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్పౌజ్‌లుగా ఉన్న ఎస్‌జీ­టీల విషయంలో విద్యాశాఖ అనుసరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్కూల్‌ అసిస్టెంట్లకు ఓటు హక్కు ఉండబట్టే వారికి అవకాశం ఇచ్చారని, తమకు లేదంటూ వివక్ష చూపుతున్నారని ఎస్‌జీటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 317 జీవో కారణంగా జరిగిన బదిలీల్లో భార్యా­భర్తలను వేర్వేరు ప్రాంతాలకు పంపారు.

దీనిపై ఏడాదిగా పోరాటాలు నడుస్తున్నాయి. తాజాగా జరుగుతున్న బదిలీల్లో స్కూల్‌ అసిస్టెంట్స్‌ 615 మందికి సొంత జిల్లాలకు వెళ్ళేందుకు అనుమతించారు. కానీ 1,585 మంది ఎస్‌జీటీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారిలో నిరసన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా తమ గోడు వినాలని వారు కోరుతున్నారు.

మా ఇద్దరి మధ్య 250 కి.మీ. దూరం
నేను మహబూబా­బాద్‌­లో, నా భర్త సిద్దిపేటలో పనిచే­స్తున్నాం. ఇద్దరు పని­చేసే ప్రాంతాల మధ్య దూరం 250 కిలోమీ­టర్లు. దీంతో ఇద్దరు పిల్లలను చెరొకరం పంచుకున్నాం. తీవ్రమైన మానసిక వ్యథతో 13 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నాం. తల్లిగా ఓడిపోతున్నాను. భర్తకు దూరమవుతున్నాను. ఈ బదిలీల్లోనైనా న్యాయం జరుగుతుందనే ఆశ కన్పించడం లేదు. 
– ఎస్‌.మమత (ఎస్‌జీటీ, మహబూబాబాద్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement