ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినచర్యలు | Telangana Health Minister warns stern action if hotels supply unhygienic food | Sakshi
Sakshi News home page

ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినచర్యలు

Published Wed, Jun 12 2024 6:13 AM | Last Updated on Wed, Jun 12 2024 6:13 AM

Telangana Health Minister warns stern action if hotels supply unhygienic food

హోటల్‌ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి: మంత్రి దామోదర

సాక్షి, హైదరాబాద్‌: ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినంగా వ్యవ హరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఇటీవల ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడుల్లో అనేక హోటళ్లలో నాసిరకం, కల్తీ, చెడిపోయిన ఆహారం బయటపడటంతో దానిపై మంత్రి ఆరా తీశారు. మంగళవారం సచివాలయంలో అధి కారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, హైదరాబాద్‌ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వ్యాపారవేత్త ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫుడ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచుతున్నామని, హోటల్‌ యాజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

ప్రతి 6 నెలలకు వర్క్‌షాపు నిర్వహణ, అవగాహన సద స్సు నిర్వహిస్తామని, ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. హోటల్స్‌ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. సమావేశంలో రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ ఆర్‌ వీ కర్ణన్, డైరెక్టర్‌ ఫుడ్‌ సేఫ్టీ డాక్టర్‌ శివలీల, తెలంగాణ స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వెంకట్‌రెడ్డి, ఇండియన్‌ రెస్టారెంట్స్‌ అసోసియేష న్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement