![Telangana More Than 12000 Crore Rupees Given To Women Self Help Groups - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/28/shg.jpg.webp?itok=JWm4HHp-)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: 2021–22 ఏడాదికి గ్రామీణ దారిద్య్ర నిర్మూలన మిషన్ (సెర్ప్) ద్వారా 3,80,162 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.12,070 కోట్ల బ్యాంక్ లింకేజీ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా సంక్షోభంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సీఎం కేసీఆర్ రూ.200 కోట్లు మొదటి విడతగా మంజూరు చేశారని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
మహిళా సంఘాలు తీసుకునే వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందని, అందులో భాగంగానే ఈ మొత్తాన్ని సీఎం విడుదల చేసినట్లు చెప్పారు. గతంలో మహిళలు ప్రతి చిన్న ఖర్చుకు భర్తపై ఆధారపడే పరిస్థితినుంచి డ్వాక్రా సంఘాలు ఏర్పడిన తర్వాత వారు ఆర్థికంగా అభివృద్ధి చెందారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment