Errabelli Dayakar rao
-
ఎర్రబెల్లి దయాకర్రావు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆరోపించారాయన. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘అధికార పార్టీకి చెందిన పాతిక మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. వాళ్లంతా సీఎం రేవంత్ను గద్దె దించేందుకు ఒక్కటయ్యారు. రేవంత్ పదవికి సొంత ఎమ్మెల్యేలతోనే ముప్పు పొంచి ఉంది’’ అని అన్నారాయన. అలాగే.. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.తెలంగాణ భవన్కు కేసీఆర్బీఆర్ఎస్ అధినేత ఎట్టకేలకు తెలంగాణ భవన్కు రానున్నారు. ఈ నెల 19వ తేదీన ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లో పార్టీ సిల్వర్జూబ్లీ వేడుకల నిర్వహణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. -
జమిలి ఎన్నికలపై ఎర్రబెల్లి ఆసక్తికర కామెంట్స్
సాక్షి,వరంగల్: బీఆర్ఎస్ దీక్షాదివస్ సందర్భంగా వరంగల్లో శుక్రవారం(నవంబర్ 29) జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని,కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని ఎర్రబెల్లి అనడం చర్చనీయాంశమైంది. ‘కేసిఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారు.పార్టీ శ్రేణులు,ప్రజలు అధైర్య పడొద్దు.వెయ్యి మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్న బలి దేవత సోనియాగాంధీ. రేవంత్ రెడ్డికి సిగ్గులేదు. సోనియాగాంధీని నాడు బలి దేవత అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు దేవత అంటున్నాడు.రేవంత్ రెడ్డి నీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసా?తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ చేసిన ఘనత కేసిఆర్ది. కాంగ్రెస్కు ఓటువేసిన ప్రజలంతా తప్పు చేశామని భావిస్తున్నారు’అని ఎర్రబెల్లి అన్నారు. -
రేవంత్ వ్యాఖ్యలకు ఎర్రబెల్లి స్ట్రాంగ్ కౌంటర్
-
రైతులను నట్టేట ముంచుతున్న రేవంత్ సర్కార్
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ మొదలవుతు న్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన రైతుభరోసా హామీని ఇప్పటికీ రేవంత్ ప్రభుత్వం అమలు చేయడం లే దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. రైతాంగం గొంతుకోయడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, రైతులను నమ్మించి నట్టేట ముంచుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మా ట్లాడుతూ, ఈ పాటికే రైతుబంధు డబ్బులు పడా ల్సి ఉందని, రైతుభరోసా పేరు చెప్పి రైతులను మో సం చేస్తున్నారని విమర్శించారు.రైతు భరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం వేసి జూలై 15 దాకా డెడ్ లైన్ పెట్టారని, అయితే అప్పటికే నాట్లు వేసే పని పూర్తవుతుందని, సీజన్ అయిపోయాక రైతు భరో సా ఇస్తారా? అని ప్రశ్నించారు. రైతు భరోసాకు అర్హులెవరో ఇప్పటి దాకా ఎందుకు తేల్చలేదని నిల దీశారు. కేసీఆర్ హయాంలో 68.90 లక్షల మందికి 11 విడతల్లో 72 వేల కోట్ల రూపాయలను రైతుబంధు కింద ఇచ్చినట్లు చెప్పారు.మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కొద్ది మందికే రైతు భరోసా ఇచ్చే కుట్రకు తెర లేపారని, రైతు భరోసాకు పట్టాదార్ పాస్ పుస్తకాలే ప్రామాణికం కావాలని అన్నారు. ఇదిలా ఉండగా రుణమాఫీ జరిగినట్టే కొన్ని మీడి యా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, డిసెంబర్ 9న రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇపుడు కేబినెట్లో చర్చిస్తారా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపడేశారు. -
కేసీఆర్ ను మళ్లీ సీఎంని చేస్తా
-
రైతు ప్రభుత్వం అనడానికి సిగ్గులేదా రేవంత్?: ఎర్రబెల్లి ఫైర్
సాక్షి, హైదరాబాద్: మీది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించటం లేదా రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని సీరియస్ అయ్యారు. అలాగే, తాను పార్టీ మారడంలేదని క్లారిటీ ఇచ్చారు.కాగా, ఎర్రబెల్లి దయాకర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుర్తించాలి. ఆరు నెలల్లో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. కరెంట్ లేదు, మోటార్లు కాలి పోతున్నాయి. రైతులు ఆగం అవుతున్నారు.. కుప్పకూలి పోతున్నారు ఇది నిజం.రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించటం లేదా రేవంత్ రెడ్డి?. ఆగస్టు 15 వరకు ఎలా రెండు లక్షల రుణమాఫీ చేస్తావు. ఇది మోసం.. బోగస్ మాటలు కాదా రేవంత్ రెడ్డి?. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు నిత్యం ఇచ్చాము. ఇప్పుడు రైతుబంధు లేదు, ఎరువులు లేవు, నీళ్ళు లేవు, కరెంట్ లేదు. పాత రోజులు మళ్ళీ వస్తున్నాయి.నేను పార్టీ మారటం లేదు. అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. ప్రస్తుతం నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేశాము. నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చాయి, పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నాం. అంతే తప్ప నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్లోనే ఉంటూ మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయడమే నా ధ్యేయం’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఎర్రబెల్లిపై ఫిర్యాదు కేసులో విచారణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, బంజారాహిల్స్కు చెందిన వ్యాపారి శరణ్ చౌదరి చేసిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ–మెయిల్ ద్వారా సీఎం రేవంత్రెడ్డి, డీజీపీ రవి గుప్తాలకు అందిన ఈ ఫిర్యాదులోని అంశాలపై పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఎర్రబెల్లి ఆదేశాలతో పోలీసు అధికారులు తనను బెదిరించి, తన పేరిట ఉన్న ఇంటిని బలవంతంగా ఆయన బంధువుల పేరిట రాయించారని శరణ్ చౌదరి ఆరో పించారు. ఓ వైపు ఎస్ఐబీ అధికారుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బయటకు వస్తుండగా, మరోవైపు ఆ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై శరణ్ చౌదరి ఫిర్యాదు చేయ డం కలకలం సృష్టిస్తోంది. ఇంటిని రాయించుకోవ డంతో పాటు బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేశారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. బూటు కాళ్లతో తన్నారు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న అప్పటి టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు.. దయాకర్రావు ఆదేశాలతో తనను బూటు కాళ్లతో తన్ని, పలుమార్లు చెంపదెబ్బలు కొడుతూ హింసించినట్టు కూడా శరణ్ చౌదరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘2023 ఆగస్టు 21న నేను నా కార్యాలయానికి వెళుతుండగా ప్రైవేటు కారులో సివిల్ డ్రెస్లో వచ్చిన పోలీసులు బలవంతంగా సీసీఎస్ ఆఫీస్కు తీసుకెళ్లారు. నా కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఎర్రబెల్లి దయాకర్రావు బంధువు విజయ్ పేరిట నా ఇంటిని రిజిస్టర్ చేయాలని అప్పటి హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వ రరావు బలవంతపెట్టారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నన్ను బూటు కాళ్లతో తన్నారు. రెండురోజులు అక్రమంగా నన్ను వారి కస్టడీలో పెట్టుకున్నారు. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులను డబ్బుల కోసం ఒత్తిడి చేశారు. అప్పుడు నా స్నేహితుడు రూ.50 లక్షలు పంపాడు. చివరకు నా ఇంటిని విజయ్ పేరిట రాసేందుకు అంగీకరించిన తర్వాత నన్ను బయటకు పంపించారు. తర్వాత న్యాయం కోసం నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే పోలీసులను నా ఇంటి మీదకు పంపారు. రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలని బెదిరించారు. ఏసీపీ ఉమామహేశ్వరావు ఒత్తిడి తట్టుకోలేక నేను నా రిట్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నా..’ అని శరణ్ చౌదరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్న రాజ కీయ పరిణామాలను అడ్డుపెట్టుకుని లబ్ధి పొందడానికే వడ్డేపల్లి శరణ్ చౌదరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శరణ్ చౌదరి, ప్రవాస భారతీయుడు విజయ్కు నడుమ జరిగిన వ్యాపార, రియల్ ఎస్టేట్ లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేద న్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఎర్రబెల్లి దయాకర్రావు మీడియాతో మాట్లాడారు. -
శరణ్ చౌదరి ఎవరో తెలియదు: ఎర్రబెల్లి దయాకర్రావు
సాక్షి, హైదరాబాద్: తనపై శరణ్ చౌదరి ఆరోపణలు చేశారని తన దృష్టికి వచ్చిందని.. ఆయన ఎవరో తెలియదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, శరణ్ చౌదరి బీజేపీలో ఉన్నాడని తెలిసింది. శరణ్ చౌదరి భూకబ్జాలకు పాల్పడ్డాడని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని ఎర్రబెల్లి అన్నారు. ‘‘దొంగ డాక్యుమెంట్లు సృష్టించి శరణ్ చౌదరి భూకబ్జాలకు పాల్పడ్డారు. ఎన్.ఆర్.ఐ.విజయ్కు, శరణ్ చౌదరి రెండు కోట్లు బాకీ వున్నారు శరణ్ చౌదరిపై చాలా కేసులు వున్నాయి. శరణ్ చౌదరి డబ్బులు ఇవ్వాల్సిన విజయ్ ఎవరో నాకు పరిచయం లేదు. శరణ్ చౌదరి, అతని భార్య పాస్ పోర్టులను పోలీసులు సీజ్ చేశారు. నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో వున్నా.. ఎక్కడా భూకబ్జాలకు పాల్పడలేదు’’ అని ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. బంజారాహిల్స్ పీఎస్ లో శరణ్ చౌదరి పై అనేక కేసులు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నన్నెందుకు లాగుతున్నారో అర్దం కావడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు నాకు సంబంధం లేదు. ప్రణీత్ రావు ఎవరో కూడా తెలియదు. ప్రణీత్ రావు వాళ్ల బంధువులు మా ఊర్లో ఉంటారని తెలిసింది. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు. నేను ప్రస్తుతం పార్టీ మారే ఉద్దేశ్యం లేదు. నేను పార్టీ మారను. పార్టీ మారాలని నాపై పై నుంచి ఒత్తిడులు వస్తున్నాయి’’ అని దయాకర్రావు తెలిపారు. ‘‘శరణ్ చౌదరి డబ్బులు ఇవ్వాల్సిన విజయ్ నాకు బంధువు అని అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను అనేక కేసులు ఎదుర్కొన్నాను. గతంలో ఓబుళాపురం అక్రమ మైనింగ్, బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ప్రజల కోసం జైలుకు వెళ్లాను’’ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు. -
‘ఫోన్ ట్యాపింగ్ తెలియదు.. వార్ రూమ్ తెలియదు’
హన్మకొండ: తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో ఎర్రబెల్లి కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఓ ఫేక్ అని స్పష్టం చేశారు. మంగళవారం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. ‘నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. ప్రణీత్ రావు ఎవరో కుడా తెలియదు. ఆయన అమ్మమ్మ ఊరు పర్వతగిరి. నా పేరు చెప్పాలని ప్రణీత్రావు మీద ఒత్తిడి తెస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ తెలియదు.. వార్ రూమ్ కూడా నాకు తెలియదు. చాలా మంది నాయకులు పార్టీ వీడి పోతున్నారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసేవారు అధికార పార్టీలోకి పోతున్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఆరు గ్యారంటిలు అమలు చేయలేరు. ఎన్నికల కోసమే డ్రామా చేశారు. కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా అమలు చేయట్లేరు. మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం సీఎం రేవంత్రెడ్డికి అలవాటే. నీళ్లు లేవు.. పంటలు ఎండిపోతున్నాయి. మండే వేసవిలో కూడా చెరువులు నింపిన మహానుభావుడు కేసీఆర్. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, నాయకులు పోయినంత మాత్రాన ఏమీ కాదు. కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెడితే మేము పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాం.. గెలుపు, ఓటములు సహజం. ఎన్టీఆర్ లాంటి నాయకునికి కూడా ఓటమి తప్పలేదు’అని ఎర్రబెల్లి అన్నారు. -
అత్త వ్యూహం.. కోడలు విజయం
పాలకుర్తి: ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందునుంచి ఊహించినట్లే పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లిపై కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో పాలకుర్తి సీటు ఎంపికలో ఆ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న హనుమాండ్ల ఝాన్సీరెడ్డి .. చివరి నిమిషంలో ఆమె కోడలు యశస్వినిని బరిలోకి దింపారు. అత్త వ్యూహం.. కోడలు విజయం పాలకుర్తి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బరిలో దిగుతారని అందరూ ఆశించారు. అయితే. చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఝాన్సీరెడ్డి కుటుంబ సభ్యురాలైన యశస్వినినికే కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. దీనిపై సర్వత్రా చర్చ కూడా జరిగింది. పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగులేని ఎమ్మెల్యేగా రాణిస్తూ మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్రావుకు చెక్పెట్టేలా టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అనూహ్యంగా ఎన్ఆర్ఐ ఝాన్సీలక్ష్మీరెడ్డిని రంగంలోకి దింపారు. ఇలాంటి తరుణంలోనే ఝాన్సీలక్ష్మీరెడ్డి భారత దేశ పౌరసత్వంపై వివాదం తలెత్తింది. వారం రోజుల వరకూ తనకు పౌరసత్వం వస్తుందనీ, ఏలాంటి అపోహాలకు గురికావద్దన్న ఝాన్సీరెడ్డి ప్రత్యామ్నయంగా తన కోడలును ఎన్నికల సమరంలో దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వాస్తవానికి హనుమాంఢ్ల ఝాన్సీరెడ్డి పౌరసత్వం అడ్డోస్తే దేవరుప్పుల మండలం మాధాపురంకు చెందిన ప్రముఖవైద్యులు, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణనాయక్ రావడం అనివార్యంగా బావించారు. కానీ పాలకుర్తి నుంచి కాంగ్రెస్ జెండా ఎగురవేసే లక్ష్యంగా ఇక్కడి ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన తన కుటుంబం తగ్గేదీలేదని ఎట్టకేలకు తన కోడలు యశస్వినికి రెండో విడతలో కాంగ్రెస్ టికెటు సాధించడంలో సఫలీకృతమయ్యారు ఝాన్సీరెడ్డి, అప్పటివరకూ తానొక్కతే ప్రచారంలో దూసుకపోతున్న క్రమంలో తోడుగా కోడలు రావడంతో కొంత పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొన్నప్పటీకీ డబుల్ ప్రచారంతో ప్రభుత్వ వ్యతిరేకతను కలిగిన ప్రజల్ని కూడగట్టుకొని చారిత్రాత్మక విజయం సాధించి ఝూన్సీరెడ్డి తనమార్కు నిలుపుకున్నారు. ఫలితంగా తొలిసారి పోటీ చేసి గెలుపును సొంతం చేసుకోవడంతో యశస్విని అరుదైన ఘనతసు సొంతం చేసుకున్నారు. ఆది నుంచి ఎర్రబెల్లే టార్గెట్.. ఎర్రబెల్లిని కచ్చితంగా ఓడించాలనే వ్యూహంతో ఆది నుంచి పావులు కదిపిన కాంగ్రెస్ తన వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేసింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది కాంగ్రెస్. యశస్విని కూడా తన ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లిపై పదునైన విమర్శలు చేసి ఓటర్లను ఆకర్షించింది. దానికి తోడు కాంగ్రెస్ జోష్ కూడా తోడవడంతో ఆమె గెలుపు సునాయాసమైంది. ఇక పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. .ఎర్రబెల్లికి ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. కానీ అది ఈసారి కలిసి రాలేదు. కాంగ్రెస్ జోరు ముందు ఎర్రబెల్లి పరాజయం చెందారు. మరొకవైపు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రామ్మోహన్రెడ్డ పెద్దగా ప్రభావం చూపలేదు. తొలి జాబితాలోనే సీటు దక్కించుకని ప్రచారాన్ని ఆదిలోనే ప్రారంభించినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం కాంగ్రెస్కే షిప్ట్ అయ్యింది. -
ఎర్రబెల్లికి నిరసన సెగ
-
TS: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది!
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. జిల్లా అంతటా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. ఒకే నియోజకవర్గం నుంచి ఎదిగి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ నియోజకవర్గం ఏదో చూద్దాం. అక్కడ నుంచి ఎదిగి చక్రాలు తిప్పిన ఆ నేతలపై ఓ లుక్కేద్దాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎన్నికల సమయంలోనే ఆ ప్రత్యేకతలు బయటకొస్తాయి. ప్రచారం పొందుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్థన్నపేట నియోజకవర్గం అలాగే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. ఓరుగల్లు జిల్లా అంతటా విస్తరించారు. అన్ని చోట్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రులయ్యారు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చక్రాలు తిప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు, ఎర్రబెల్లి వరదరాజేశ్వరరావు, ఎర్రబెల్లి ప్రదీప్రావు, బోయినపల్లి వినోద్కుమార్, కడియం శ్రీహరి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వన్నాల శ్రీరాములు...ఇలా చాలా మంది నేతలు వర్థన్నపేట నియోజకవర్గానికి చెందినవారే. వీరిలో పురుషోత్తమరావు, ఎర్రబెల్లి దయాకర్రావు, కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం పట్టణం, పల్లెలు కలిసి వరంగల్ మహానగరం చుట్టూ విస్తరించి ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం ఆధ్యాత్మిక, వాణిజ్య, వైద్య, విద్యరంగాల్లో పేరుగాంచింది. వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హనుమకొండ, ఖిలావరంగల్, కాజీపేట, హసన్పర్తి, వరంగల్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వర్ధన్నపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో జరిగిన పునర్విభజనలో వర్థన్నపేట ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండేటి శ్రీధర్ విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో తెరాస తరపున బరిలో నిలిచిన అరూరి రమేశ్ గెలుపొందారు. హ్యాట్రిక్ సాధిస్తానంటూ మూడోసారి ఆరూరి రమేష్ వర్థన్నపేట నుంచి బరిలో దిగారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉంటూ.. పాలకుర్తి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి 4వ సారి బరిలో నిలిచిన ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీఎంపి బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి పురుషోత్తమరావు స్వగ్రామం వర్థన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి. ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలోని ఐనవోలు మండలం పున్నేలు. ఇలా ఎందరో ప్రముఖ నాయకులను అందించిన గడ్డగా వర్థన్నపేట రాష్ట్రంలోనే పేరు పొందింది. ఇవి చదవండి: గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు! దొంగ వీడియోలు సృష్టిస్తే.. : బండి సంజయ్ -
నాపై పోటీకి అభ్యర్థులే లేరు
రాయపర్తి: ‘నాపై పోటీకి అభ్యర్థులే కరువయ్యారు.. అమెరికా నుంచి టూరిస్టులను తీసుకువచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టిండ్లు’ అని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు. శుక్రవారం మండలంలోని తిర్మలాయపల్లి, రాయపర్తి, గన్నారం, కొండూరు, బురహాన్పల్లి, కాట్రపల్లి, మొరిపిరాల, కిష్టాపురం, మహబూబ్నగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలినడకన ప్రజలను పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ అని తేల్చిచెప్పారు. తాను 60 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశా రు. సేవ చేశానే తప్ప అవినీతి పేరు తెచ్చుకోలేదు.. దయాకర్రావు హామీ ఇచ్చాడంటే చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉందన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేశాను.. కొత్తగా చేర్చిన హామీల ప్రకారం ప్రతి గ్రామంలో వంద డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తా.. పదివేల మంది మహిళలకు కుట్టుశిక్షణ ఇప్పించి సంగెం టెక్స్టైల్ పార్కులో ఉద్యోగ అవకాశం కల్పిస్తా.. తిర్మలాయపల్లి, తొర్రూరులో ఆయిల్పాం మిల్లు పెట్టిస్తున్నాను.. అందులో వెయ్యిమందికిపైగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. గ్రామాలను, ఆలయాలను అభివృద్ధి చేశాను.. కొడకండ్లలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయించాను.. గ్రామాల్లో ఉన్న కోతులను పట్టించి ఏటూరునాగారం అడవుల్లో వదలడమే కాకుండా అక్కడ కోతులకోసం పండ్ల మొక్కలను నాటించానని వివరించారు. ఆదరించి గెలిపిస్తే మీముందుకు వచ్చి మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్రావు, బీఆర్ఎస్ మండల ఎన్నికల ఇన్చార్జ్ గుడిపూడి గోపాల్రావు, మండల అధ్యక్షుడు మూనావత్ నర్సింహానాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్గౌడ్, పార్టీ అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఆకుల సురేందర్రావు, పూస మధు, వనజారాణి, ఎండీ.నయీం, గబ్బెట బాబు, సర్పంచ్, ఎంపీటీసీలు గారె నర్సయ్య, గజవెల్లి అనంత, రాధిక, ఐత రాంచందర్, కర్ర సరితరవీందర్రెడ్డి, కుక్కల భాస్కర్, గాదె హేమలత పాల్గొన్నారు. పద్మశాలి సంఘం మద్దతు కొడకండ్ల: బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావుకు మండల పద్మశాలి సంఘం మద్దతు తెలిపింది. అధ్యక్షుడు పసునూరి మధుసూదన్ ఆధ్వర్యంలో శుక్రవారం కులస్తులు మంత్రిని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సొంత గూటికి చేరిన కార్యకర్తలు పాలకుర్తి : మండలం నుంచి కాంగ్రెస్లో చేరిన పలువురు కార్యకర్తలు కళాకారుడు చిరుపాటి ఎల్ల్ల స్వామి, రాజు మరో 20 మంది తిరిగి బీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు శుక్రవారం వారిని మంత్రి దయాకర్రావు సతీమణి, ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదేవి స్వాగతించి కండువాలు కప్పారు. పాలకుర్తి వార్డు సభ్యుడు వీరమనేని హన్మంతరావు, ముదిరాజ్ సంఘం నాయకుడు మామిండ్ల శోభన్బాబు తదితరులు పాల్గొన్నారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు దేవరుప్పుల : పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు విజయం సాధించాలని కోరుతూ.. కామారెడ్డిగూడెం మసీదులో శుక్రవారం ముస్లింలు మతగురువు ఇనాయత్ రసూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఖాసీం, జాకీర్, ఖలీల్, షబ్బీర్, మీరాన్, అర్జుమాన్, మౌలానా, పాషా, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఆత్మగౌరవం మరోసారి నిలబెట్టాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఓటు వేయకపోతే ప్రజలు ఐదేళ్లపాటు శిక్ష అనుభవించాల్సి వస్తుందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం జనగాం జిల్లా పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు హాజరై కేసీఆర్ ప్రసంగించారు. పాలకుర్తి బహిరంగ సభలో కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై సెటైర్లు సంధించారు. ‘‘మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, కేసీఆర్కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన పన్నులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నడని అంటున్నడు. రైతు బంధు దుబారానా?.. రైతు బంధు ఉండాలా? వద్దా? ఉండుడు కాదు.. దయాకర్ను గెలిపిస్తే రైతు బంధు రూ.16వేలకు పెంచుతాం. అదే కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు మాయమైపోతది.. ..ఇంకోకాయన మాట్లాడుతున్నడు. ఆయన టీపీసీసీ చీఫ్. కేసీఆర్కు ఏం పని లేదు. 24 గంటలు ఇచ్చి వేస్ట్ చేస్తున్నడు అని. కరెంట్ ఎన్ని గంటలు అవసరం. 24 గంటలు అవసరం. కానీ, కాంగ్రెస్ గెలిస్తే అది జరగదు. చెప్పేటోళ్లు ఎల్లయ్య.. మల్లయ్య కాదు.. ఆ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అమెరికాలో చెప్పిండు, ఇక్కడా టీవీ ఇంటర్వ్యూల్లో బల్లగుద్ది చెబుతున్నారు. కేసీఆర్కు ఏం తెల్వది. 10 హెచ్పీ మోటర్తో నడిపిస్తే మూడు గంటల కరెంట్ చాలంటున్నడు. మనం ఇక్కడ వాడేది 3, 5 హెచ్పీ మోటర్లు. మరి 10హెచ్పీ మోటర్ మీ అయ్య కొనిస్తడా? అని రేవంత్ను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికలొస్తే ఇలాంటోళ్ల మాటలు విని గోల్మాల్కావడం కాదు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని కాంగ్రెస్ అడుగుతుంది. ఒక్కసారి కాదు 11, 12సార్లు అధికారం ఇచ్చిండ్రు. ఏం చేసిండ్రు. కడుపులో సల్ల కదలకుండా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటేయండి. ప్రలోభాలకు లోనై ఓటేయొద్దు. ప్రజలు గెలిస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది. అని సభకు హాజరైన ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారాయన. మంది మాటలు విని ఆగం కావొద్దు కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ధైర్యంగా పని చేసి అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే పని చేయలేదని నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఏది ఏమైనా కరెంటు సమస్య పరిష్కరించాలని స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం. సమస్యను పరిష్కరించి చూపించాం. గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచుకున్నాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా దళితులను ఆదుకుందా? కాంగ్రెస్ పాలనలో తాగు, సాగు నీరు, కరెంటు సంగతి మీకు తెలుసు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక హక్కు.. ఓటు. ఇది ఎలాపడితే అలా వేసేది కాదు. ఎన్నికలు అనగానే ఎందరో వస్తుంటారు.. ఏవేవో మాట్లాడుతుంటారు. నియోజకవర్గం బాగుపడాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మంది మాటలు విని ఆగం అయితే ఐదేళ్లపాటు కష్టాల పాలవుతాం. అందుకే ఓటు వేసే ముందు అన్ని ఆలోచించి వేయాలి. అభివృద్ధిలో రాష్ట్రం ముందుకు వెళ్లాలి... వెనక్కి పోవద్దు. తెలంగాణ ఆత్మగౌరవం మరోసారి నిలబెట్టాలని కోరుతున్నా. జానారెడ్డి సీఎం అవుతానని కలలు కంటున్నారు. గతంలో జనారెడ్డికి మీరు ఓటుతో బుద్ధి చెప్పారు. నాగార్జునసాగర్లో భగత్ను 70వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్లు 196 కేసులు వేశారు పదేళ్లుగా తెలంగాణలో సంక్షేమ పాలన అందించామని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ అన్నారు. ‘‘ఈసారి ఎన్నికలను మనం సీరియస్గా తీసుకోవాలి. ప్రజలు ఓటు వేసే ముందు.. పార్టీల చరిత్ర కచ్చితంగా చూడాలి. అభ్యర్థి గురించి ఆలోచించాలి. ఎవరి చేతిలో పెడితే రాష్ట్రం బాగుపడుతుందో ఆలోచన చేయాలి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ, పదేళ్లుగా రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించాం. విధివంచితులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. సామాజిక బాధ్యతలో భాగంగానే పింఛన్లు పెంచాం. మళ్లీ అధికారంలోకి రాగానే రూ.5వేల వరకు పింఛన్ పెంచుతాం. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేశాం. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు రావాలి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకొస్తే ఆపేందుకు కాంగ్రెస్ వాళ్లు 196 కేసులు వేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం వల్ల లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది’’ అని సీఎం కేసీఆర్ వివరించారు. -
నమ్మక ద్రోహి.. ఎర్రబెల్లి వల్లే జైలుకు వెళ్లాను: రేవంత్ రెడ్డి
సాక్షి, జనగామ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య మాటల యుద్ధం నెలకొంది. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి నామినేషన్ పురస్కరించుకొని నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మంత్రి ఎర్రబెల్లిపై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో ఈ రావుల పాలన పోవాలంటే ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించాలని రేంత్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో దొరల గడీలను పూడ్చివేద్దామన్నారు. పాలకుర్తి ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నారై ఝాన్సీ రెడ్డి అమెరికాలో డబ్బులు పోగుచేసి కృషి చేస్తుంటే.. ఇక్కడ సంపాదించిన వేలకోట్ల అక్రమ సంపాదనను మంత్రి దయాకర్ రావు అమెరికాలో పెట్టుబడులు పెడుతూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల దయాకర్ రావు రాజకీయంలో అక్రమ సంపాదనలే తప్ప.. ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఎర్రబెల్లికి బుద్ధి చెప్పాలి: రేవంత్ ఓటుకు నోటు కేసులో తాను జైలుకు పోవడానికి ఎర్రబెల్లినే కారణమని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో టీడీపీ బలహీన పడటానికి కూడా దయాకర్ రావునే కారణమని అన్నారు. ఎర్రబెల్లి వెన్నుపోటు పొడిచే వ్యక్తి, నమ్మక ద్రోహి అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, దయాకర్ రావు దొరల పాలనాలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ రోజు అడిగిన పరిస్థితి లేదని విమర్శించారు. చెన్నూరు రిజర్వాయర్ కోసం రూ. 360 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, ఎర్రబెల్లి దానిని రూ.7వందల కోట్లకు పెంచి, రూ.350 కోట్లు దోచుకున్న దొంగ అని ధ్వజమెత్తారు. ఓటు ద్వారా పాలకుర్తి ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పాలని కోరారు. రేవంత్ ఐటమ్ సాంగ్ లాంటోడు: ఎర్రబెల్లి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కౌంటర్ ఇచ్చారు. పాలకుర్తి ప్రజలను రేవంత్ రెడ్డి అవమానించారని మండిపడ్డారు. కాంగ్రెస్ సభ దగ్గరకు వచ్చిన వారిని రేవంత్ రెడ్డి కాళ్లతో తన్నాడని విమర్శించారు. పాలకుర్తి ప్రజలు కూడా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తన్ని తరిమేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ఐటమ్ సాంగ్ లాంటోడని, ఈ విషయం తాను టీడీపీలో ఉన్నప్పుడే చంద్రబాబుతో చెప్పానని పేర్కొన్నారు. చంద్రబాబు కూడా దీనిని అంగీకరించారన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు పేయింటర్గా పనిచేసేవాడని, బ్లాక్ మెయిల్ చేసి ఈ స్థాయికి వచ్చాడని ఎర్రబెల్లి దుయ్యబట్టారు. పది కోట్ల రూపాయలు తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని బయట రేవంత్ గురించి చర్చించుకుంటున్నారని అన్నారు. దందాలు, బ్రోకరిజం బంద్ చేయాలని రేవంత్ రెడ్డికి అప్పుడే చెప్పానని తెలిపారు. దయన్న లెక్క నీతి నిజాయితీతో ఉంటే బతకలేమని అప్పుడు రేవంత్ రెడ్డి అన్న సంగతి గుర్తు చేశారు. తాము తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తే రేవంత్ రెడ్డి చేయలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. పాలకుర్తి ప్రజలు నావెంటే ఉన్నారని స్పష్టం చేశారు. చదవండి: ఐటీ దాడులు.. పొంగులేటి అనుచరుడు ఆత్మహత్యాయత్నం -
పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్తో టుడేస్ లీడర్
-
అటు ఎర్రబెల్లి, ఇటు రేవంత్ రెడ్డి నామినేషన్స్
-
ఎర్రబెల్లికి ఎన్నారై ట్రబుల్ !
సాక్షి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను ఓడించే లక్ష్యంతో హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఓ ఎన్ఆర్ఐ మహిళను రంగంలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆమెకు పౌరసత్వ సమస్య అడ్డంకిగా మారింది. దీంతో ఆమె కోడలికి పాలకుర్తి టిక్కెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నాకు పౌరసత్వం సమస్యను సృష్టిస్తే..వారసత్వంతో కొడతా అంటోంది ఆ ఎన్ఆర్ఐ. ఎర్రబెల్లిని ఓడిస్తా అంటున్న ఆ ఎన్ఆర్ఐ ఎవరు? ఏమా కథ? ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పాలిటిక్స్ రక్తికట్టిస్తున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కంచుకోటగా ఉన్న పాలకుర్తిలో తాజా రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓటమి ఎరుగని నేతగా పేరున్న ఎర్రబెల్లిని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సరికొత్త అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దింపింది. ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి కోడలు యశస్విని రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం ముమ్మరం చేశారు. ఎర్రబెల్లికి ఉన్న రాజకీయ అనుభవంలో సగం వయస్సుకూడా లేని యువతి రాజకీయ అరంగేట్రం చేసి..ఎన్నికల బరిలో దిగడం ఇప్పుడు పాలకుర్తి రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రత్యర్థులిద్దరూ ఎత్తుకు పై ఎత్తులతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు. ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇప్పటి వరకు ఓ సారి ఎంపీగా, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది. తనపై పోటీ చేసి ఓటమి పాలైన రాజకీయ ప్రత్యర్ధులు మళ్ళీ పోటీకి ఆసక్తి చూపలేని పరిస్థితి తీసుకొచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం రాష్ట్రమంత్రిగా కొనసాగుతూ ఏడో సారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు పాలకుర్తి నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాజకీయంగా ఘనమైన చరిత్ర ఉన్న ఎర్రబెల్లిని ఎదుర్కునేందుకు పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పోటీకి సిద్ధమై మూడు మాసాల క్రితం అమెరికా నుంచి ఇండియాకు వచ్చేశారు. సొంతూరు పాలకుర్తికి రాగానే కాంగ్రెస్ లో చేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపారు. ఆమె రాకతో రాజకీయంగా కాస్త ఇబ్బంది పడ్డారు ఎర్రబెల్లి. సరైన అభ్యర్థి దొరికారని కాంగ్రెస్ సంబరపడుతుండగా ఝాన్సీరెడ్డి పౌరసత్వ సమస్య పోటీకి అడ్డంకిగా మారింది. అమెరికా పౌరసత్వం ఉన్న ఝాన్సీరెడ్డి ఇండియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సకాలంలో ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. ఇక ఎర్రబెల్లి పై పోటీకి సరైన అభ్యర్థి లేరని అందరూ అనుకుంటుండగా...రాజకీయ అనుభవం లేకున్నా.. ఎర్రబెల్లిని ఎదుర్కోవడమే కర్తవ్యంగా భావిస్తూ ఝాన్సీరెడ్డి తన కోడలు యశస్వినిరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపారు. కాంగ్రెస్ అభ్యర్థి కోడలు యశశ్వనిరెడ్డితో కలిసి అత్త నియోజకవర్గంలో ఎంట్రీతోనే సత్తా చాటారు. భారీ ర్యాలీతో గులాబీ గూటిలో గుబులు పుట్టించారు. రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకునే దశలో ఉన్న ఝాన్సీరెడ్డి పౌరసత్వం రాకుండా అడ్డుకుంటే వారసత్వంతో ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ప్రజాసేవ చేసేందుకు అమెరికాను వదిలి పురిటిగడ్డకు వచ్చిన బిడ్డలాంటి కోడలును ఆశీర్వదిస్తే సమ్మక్క సారక్క మాదిరిగా సేవలందిస్తామని పాలకుర్తి ప్రజల్లో జోష్ నింపారు. మంత్రి ఎర్రబెల్లికి చుక్కలు చూపేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎర్రబెల్లి మాత్రం ప్రత్యర్థులు ఎవరైనా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పారాచ్యూట్ నేతలకు పాలకుర్తిలో స్థానం లేదంటున్నారు. రాజకీయంగా ఝాన్సీరెడ్డి దూకుడు పెంచడంతో మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గం అంతా కాలుకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. పాలకుర్తిలో సర్వే రిపోర్ట్ లు సైతం ఆందోళన కలిగిస్తుండడంతో ఎర్రబెల్లి వినూత్న పద్ధతిలో ప్రచారం సాగిస్తూ ప్రజల మనిషిగా రికార్డు సృష్టించే పనిలో నిమగ్నమయ్యారు. రాజకీయ పరిణామాలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ఎర్రబెల్లి తోపాటు ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు సైతం రంగంలోకి దిగి సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకమై ప్రచారం సాగిస్తున్నారు. అటు కాంగ్రెస్ కేడర్తో ఝాన్సీరెడ్డి ఆమె కోడలు యశశ్వనిరెడ్డి.. ఇటు ఎర్రబెల్లి కుటుంబసభ్యులు, గులాబీ పార్టీ శ్రేణులు ఎత్తుకు పై ఎత్తులతో ప్రచారాన్ని హోరెత్తించి ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎర్రబెల్లికి ఎదురు లేదనుకున్న పాలకుర్తిలోఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డి రాకతో రాజకీయం అలజడి మొదలైంది. పోటాపోటీ ప్రచారాలతోపాటు ఇరుపక్షాలవారు వలస రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. నేతల మధ్య మాటల యుద్దం కొనసాగితే అనుచరులు మాత్రం వాట్సాప్ వేదికగా వార్ సాగిస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శలు శృతిమించి కేసుల వరకు వెళ్ళాయి. రాజకీయ వైరం రోజురోజుకు ముదురుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లి కి వణుకు పుట్టించే పరిస్థితి ఈసారి ఎన్నికల్లో వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని ఇలాంటి నాయకులను ఎంతో మందిని చూసిన ఎర్రబెల్లికి ఈ ఎన్నిక ఓ లెక్క కాదనే వాదనా వినిపిస్తోంది. మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. -
పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా హనుమాండ్ల యశశ్విని రెడ్డి
-
కేటీఆర్ను విమర్శించడానికి రేవంత్కు అర్హత లేదు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-
టార్గెట్ ఎర్రబెల్లి.. ఝాన్సీరెడ్డి బదులు యశస్వినీ!
సాక్షి, హన్మకొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం గడుస్తున్న కొద్దీ కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం మరోసారి హైలైట్ అయ్యింది. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్తో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో పాలకుర్తి విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. పాలకుర్తి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బరిలో దిగుతారని అందరూ ఆశించారు. అయితే. చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో స్క్రీనింగ్ కమిటీ ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి పౌరసత్వం విషయంలో సమస్య కారణంగా ఆమెకు బదులుగా ఝాన్సీ కోడలు యశస్వినీ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు స్క్రీనింగ్ కమిటీ యశస్వినీ పేరును ప్రతిపాదించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓటమి ఎరుగని నేతగా పేరుతెచ్చుకున్న ఎర్రబెల్లికి ఈసారి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ భారీ కసరత్తే చేస్తోంది. ఆయనను ఈసారి ఓడించేందుకు కాంగ్రెస్ ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబసభ్యులను బరిలోకి దింపనున్నారు. ఝాన్సీరెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతోపాటు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి సహకారం కూడా ఉంది. మంత్రి ఎర్రబెల్లికి సైతం జనం నుంచి వ్యతిరేక ఉండడంతో నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్కు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.. మీరా నీతులు చెప్పేదంటూ.. -
ఎర్రబెల్లిని ఎదిరించేదెవరు?
-
ఎమ్మెల్యేను కొట్టిన మంత్రి..
-
ప్రధాని మోడీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫైర్
-
ఇక మగాళ్ళ పని అయిపోయినట్లే..
-
మంత్రినైపోయా.. లేకుంటే కొట్టేవాడిని
సంగెం: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్ జిల్లా సంగెం మండలంలో బుధవారం కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన మాట్లాడిన మాటలు గురువారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. గవిచర్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ప్రతిపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు దుర్మార్గపు అబద్ధపు మాటలు చెబుతుంటే.. ఈడ్చి కొట్టాలని ఉన్నా.. మంత్రి పదవి అడ్డు వస్తోందని పేర్కొన్నారు. తనకు టీడీపీని వీడాలని లేదని.. చంద్రబాబు ఇక్కడ దుకాణం ఎత్తివేసి ఆంధ్రాకు వెళ్లడంతో.. ఇక్కడ పార్టీని ఎంత లేపాలని చూసినా లేవదు కాబట్టి.. కార్యకర్తలను కాపాడుకోవడానికే బీఆర్ఎస్లో చేరానని స్పష్టం చేశారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. -
రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి ఇచ్చిపడేసిండు
-
వీవోఏల గౌరవ వేతనం రూ.8 వేలకు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకులకు (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్–వీవోఏ) రక్షాబంధన్ కానుకగా వారి గౌరవ వేతనాలను పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వారి వేతనాలు నెలకు రూ. 8 వేలకు పెరగనున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 17,608 మంది ఐకేపీ మహిళా సంఘాల సహాయకులకు(వీవోఏ) లబ్ధి చేకూరనుంది. దీనికి సంబంధించి మంత్రులు, మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై నిర్ణయం ప్రకటించాలని మంత్రి హరీశ్రావును సీఎం ఆదేశించారు. దీంతో సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఉన్నతాధికారులు, పలువురు వీవోఏ మహిళా సంఘాల ప్రతినిధులతో హరీశ్రావు సమావేశమై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను తెలియజేశారు. ఆ ప్రకారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల కాపీని మహిళా సంఘాల ప్రతినిధులకు మంత్రులు అందజేయగా వారు మంత్రులకు రాఖీలు కట్టి కృతజ్ఞతలు తెలియజేశారు. పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అమల్లోకి రానున్నాయి. వేతన పెంపుదల ద్వారా ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.106 కోట్ల అదనపు భారం పడనుంది. కాగా, డ్రెస్ కోడ్ అమలు కోసం నిధులు విడుదల చేయాలన్న వీవోఏల అభ్యర్థన మేరకు ఏడాదికి రూ.2 కోట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సంఘాల సహాయకుల విధులకు సంబంధించి మూడు నెలలకోసారి చేసే రెన్యూవల్ విధానాన్ని ఇకపై ఏడాదికి చేసేలా సవరించాలని సీఎం నిర్ణయించారు. జీవిత బీమా కోసం విధివిధానాలు అధ్యయనం చేసి నివేదిక అందించాలని మంత్రి ఎర్రబెల్లిని ఆదేశించారు. జీతాల పెంపు ఇలా... ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లో పొదుపు సంఘాలుగా ఏర్పడిన మహిళలకు సహాయకులుగా పనిచేస్తూ సంఘాలకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు, ఇతర సమాచారాన్ని నమోదు చేసే విధులను వీవోఏలు స్వచ్ఛందంగా నిర్వహించేవారు. వారు సేవ చేస్తున్న మహిళా సంఘాల నుంచి మాత్రమే ‘గ్రూపు లీడర్లు’గా నెలకు రూ. 2 వేల గౌరవ వేతనం ఇచ్చేవారు. వీవోఏల కృషిని గుర్తించి కేసీఆర్ ప్రభుత్వం 2016 నుంచి వారికి నెలకు రూ. 3 వేల గౌరవ వేతనం అందిస్తోంది. ఇటీవలే పెంచిన పీఆర్సీని వీవోఏలకు కూడా వర్తింపజేయడంతో వారి గౌరవ వేతనం రూ. 3900కు పెరిగింది. దీంతో మహిళా సంఘాల నుంచి అందే రూ.2 వేల తోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే రూ. 3,900 కలిపితే వారి వేతనం రూ. 5,900కు పెరిగింది. అయితే వారి కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం మరోసారి వీవోఏలను ఆదుకోవాలని నిర్ణయించి రాఖీ పండుగ కానుకగా వేతనాలను రూ. 8 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఇది కూడా చదవండి: అంగన్వాడీల్లో సమ్మె సైరన్! 11 నుంచి నిరవధిక సమ్మె -
TS Election 2023: 'దిల్ ఖుష్గా'.. మంత్రి ఎర్రబెల్లి చిందులు..!
మహబూబాబాద్: ప్రజలు తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే రాష్ట్రంలో మరింత అభివృద్ధి పనులు జరుగుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం మంత్రి మండలంలోని అభివృద్ధి పనుల కార్యక్రమంలో భాగంగా హట్యాతండా, భీక్యానాయక్ తండా, పెద్దతండా, పెద్దతండా(కొండాపురం) టీఎస్కే తండాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పలువురు గిరిజనులతో మంత్రి నృత్యం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ 24 గంటలు విద్యుత్ కావాలా లేక మూడు గంటలే కావాలా అనే విషయాన్ని ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో రూ. 20 లక్షల వ్యయంతో కేటాయించిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగిరెడ్డి, జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మదార్, సహకార సొసైటీ చైర్మన్ అశోక్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల నుంచి ఆదివారం వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మెరుగు వెంకటయ్య ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ విజయానికి తోడ్పాటు అందించండి.. ప్రత్యేక రాష్ట్ర తరహాలో దేశ సమగ్రాభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చేందుకు బీఆర్ఎస్ అఖండ విజయానికి పాత, కొత్త క్యాడర్ తేడా లేకుండా తోడ్పాటు అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. ఆదివారం చిన్నమడూరులో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ మేడ సునిత సోమనర్సయ్య స్వగృహంలో ఓ కార్యక్రమానికి హాజరైన అనంతరం సింగరాజుపల్లిలో కాంగ్రెస్ నాయకులు భూమండ్ల వెంకన్న, ఐలయ్య, కర్రె స్వామి, జోగు భద్రయ్య, మహేందర్, పరశురాములు, కత్తుల సందీప్ తదితరులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, మండల సమన్వయకర్తలు పల్ల సుందర్రామిరెడ్డి, బస్వ మల్లేశం, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్, సర్పంచ్ మల్లేషం, మేకపోతుల నర్సింహులు, సోమిరెడ్డి పాల్గొన్నారు. దిల్ ఖుష్గా మంత్రి.. మండల కేంద్రంలో టీ పాయింట్ వద్ద పిచ్చపాటిగా మాట్లాడుతూ మంత్రి దిల్ఖుష్గా కనిపించారు. కామారెడ్డి గూడేనికి చెందిన మహేందర్ కార్యకర్త రేబాన్ అద్దాలతో కనిపించగా కళ్లకలకలా.. సోకద్దలా..? అంటూ తన పీఏలతో బ్లాక్ అద్దాలు తెప్పించుకొని తాను పెట్టుకొని బాగున్నాయంటూనే టీ తాగి వెళ్లిపోయారు. -
ఈ సారి పాలకుర్తి నియోజకవర్గ రాజకీయ చరిత్రను మలుపు తిప్పేది ఎవరు..? గత చరిత్ర ఇదే..
పాలకుర్తి నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో చెన్నూరు నియోజకవర్గం రద్దై పాలకుర్తి నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. పాలకుర్తిలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు మరోసారి విజయం సాదించడం ద్వారా ఆయన ఆరు సార్లు గెలిచినట్లయింది. 2014 ఎన్నికలలో టిడిపి పక్షాన గెలిచిన దయాకరరావు ఆ తర్వాత పరిణామాలలో టిఆర్ఎస్లో చేరిపోయారు. తిరిగి ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి జంగా రాఘవరెడ్డిపై 53053 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. తదుపరి ఎర్రబెల్లి ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. దయాకరరావు ఐదుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి టిఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి ఎమ్.పిగా కూడా నెగ్గారు. దయాకరరావుకు 117504 ఓట్లు రాగా, రాఘవ రెడ్డికి 64451 ఓట్లు వచ్చాయి.ఇక్కడ ఎస్.ఎఫ్ బి అభ్యర్ధిగా పోటీచేసిన ఎల్. విజయ్కు మూడువేలకు పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఎర్రబెల్లి దయాకరరావు 2014 ఎన్నికలనాటికి తెలంగాణ టిడిపి వర్కింగ్ అద్యక్షుడుగా ఉన్నారు. 2014 ఎన్నికలలో తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి, మాజీ ఎమ్మెల్యే డి.శ్రీనివాసరావును 4313 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుదాకరరావుకు 52253 ఓట్లు వచ్చాయి. దయాకరరావు అంతకుముందు వర్ధన్నపేటలో మూడుసార్లు గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో వర్దన్నపేట రిజర్వుడ్ కావడంతో పాలకుర్తికి మారారు. ఒకసారి లోక్సభకు (ఉపఎన్నికలో) గెలుపొందారు. దుగ్యాల శ్రీనివాస రావు గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ తరపున ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐకి మద్దతు ఇచ్చారు. శ్రీనివాసరావు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అనర్హతకు గురి అయిన తొమ్మిది మందిలో ఒకరుగా ఉన్నారు. అయితే తీర్పు రావడానికి ఒకరోజు ముందుగానే ఎమ్మెల్యే పదవికి దుగ్యాల రాజీనామా చేశారు. చెన్నూరు నియోజకవర్గం రద్దు కావడంతో దుగ్యాల పాలకుర్తిలో పోటీచేశారు. దయాకరరావు టిడిపి తరపున ప్రభుత్వ విప్గా గతంలో పనిచేశారు. సుధాకరరావు గతంలో టిడిపి ఎమ్మెల్యేగా ఒకసారి ఎన్నికయ్యారు. తదుపరి టిఆర్ఎస్లో చేరారు. పాలకుర్తి, అంతకుముందు ఉన్న చెన్నూరు నియోజకవర్గాలలో కలిపి పదమూడు సార్లు వెలమ సామాజికవర్గ నేతలు గెలుపొందితే, ఒకసారి మాత్రం రెడ్డి గెలిచారు. చెన్నూరు(2009లో రద్దు) రద్దయిన చెన్నూరు నియోజకవర్గానికి 12సార్లు ఎన్నికలుజరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి నాలుగుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి సోషలిస్టు ఒకసారి, పిడిఎఫ్ ఒకసారి గెలిచాయి. ఒక ఇండిపెండెంటు కూడా నెగ్గారు. రాష్ట్రంలో ఏడుసార్లు నెగ్గిన అతికొద్ది మంది నేతలలోఒకరైన ఎన్.యతిరాజారావు చెన్నూరు నుంచే గెలుపొందారు. ఒక ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత కూడా ఈయన పొందారు. ఈయన భార్య విమలాదేవి, కుమారుడు డాక్టర్ ఎన్. సుధాకరరావు కూడా ఒక్కోసారి గెలిచారు. యతిరాజారావు మరో కుమారుడు ప్రవీణ్రావు 2009లో ప్రజారాజ్యం పక్షాన పోటీచేసి ఓడిపోయారు. 1972లో ఇండిపెండెంటుగా గెలిచిన మధుసూధనరెడ్డి ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించింది. యతిరాజారావు గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో పనిచేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
‘రోడ్లు కాదు.. మా ఇళ్లు చూడండి’.. ఎర్రబెల్లికి చేదు అనుభవం
సాక్షి, హసన్పర్తి: ‘మంత్రి గారూ.. రోడ్లు కాదు.. మా ఇళ్లలోకి వచ్చి చూడండి. వరద తీవ్రత ఎలా ఉందో..’అంటూ మహిళలు నిరసన తెలిపారు. వరంగల్ 56వ డివిజన్ జవహర్ కాలనీలోని ముంపు ప్రాంతాన్ని శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఓట్లప్పుడు వచ్చి ఆ తరువాత ముఖం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇప్పటివరకు ఇళ్లులేవు.. జాగా లేదని అన్నారు. దీంతో మంత్రి అసహనానికి గురయ్యారు. ఇదేమిటంటూ కార్పొరేటర్ సునీల్ను ప్రశ్నించారు. కాగా ‘మునిగిన మా ప్రాంతాలను అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి చూస్తున్నారు.. పోతున్నారు.. కానీ సమస్య మాత్రం పరిష్కరించడం లేదు. దీనికి మీరు ఇక్కడి దాకా రావడం ఎందుకు?’అంటూ ఓ మహిళ కలెక్టర్ సిక్తా పట్నాయక్ను నిలదీసింది. ఆక్రమణలతోనే వరద ముంపు చెరువు శిఖాలు, నాలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడం వల్ల వరంగల్ నగరం వరద ముంపునకు గురవుతోందని ఎర్రబెల్లి అన్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి నాలాలు, చెరువు శిఖాల్లో నిర్మాణాలు చేపట్టారన్నారు. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇది కూడా చదవండి: పది రోజుల్లో నాలుగింతల వాన! -
24 గంటల్లో 31 కాన్పులు
జనగామ: జనగామ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) ప్రసవాల్లో మరో రికార్డు సృష్టించింది. 24 గంటల వ్యవధిలో 31 కాన్పులు చేసి.. వైద్యులు సర్కారు దవాఖానా సత్తా చాటారు. సాధారణ ప్రసవాలు–17, ఆపరేషన్లు 14 కాగా... ఇందులో 12మంది మగపిల్లలు, 19 మంది ఆడపిల్లలు జన్మించారు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్రాజు ఆధ్వర్యంలో అసిస్టెంటు ప్రొఫెసర్ డాక్టర్ స్రవంతి, డాక్టర్లు సౌమ్యారెడ్డి, సిరిసూర్య, సిబ్బంది సంగీత, విజయరాణి, సెలెస్టీనా ప్రసూతి కాన్పులు చేశారు. ఎంసీహెచ్ వైద్యుల అంకితభావంతో సర్కారు దవాఖానాలపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ట్వీట్ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా వీరిని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ సర్కారు దవాఖానాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
సీఎం కేసీఆర్తోనే ఆలయాలకు మహర్దశ.. అన్నారంషరీఫ్ దర్గాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పర్వతగిరి: సమైక్య పాలనలో ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థన మందిరాలు స్వరాష్ట్రంలో పూర్వవైభవం సంతరించుకుంటున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. అన్నారంషరీఫ్లోని హజ్రత్సయ్యద్ యాకూబ్షావలీ దర్గాలో మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ వేర్వేరుగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలు, కవులు, కళాకారులకు స్వరాష్ట్రంలో తగిన గౌరవం, గుర్తింపు దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకాన్ని వర్తింపజేస్తూ వెలుగులు నింపుతున్నారని, ఈ పథకం ద్వారా ఆలయ అర్చకులకు రూ.6 వేల నుంచి రూ.10 వేల గౌరవ వేతనం పెంచారని వివరించారు. ప్రభుత్వ కృషితో రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని 36 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. ఎంపీపీ లూనావత్ కమలపంతులు, జెడ్పీటీసీ సింగ్లాల్ పాల్గొన్నారు. పరిఢవిల్లుతున్న ఆధ్యాత్మిక శోభ తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని కల్లెడ, బూర్గుమల్ల గ్రామాల మధ్య స్వయంభూ భైరవ సమేత ఆంజనేయ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే అరూరి రమేష్తో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. ఆలయానికి కర్నాటకకు చెందిన మనోజ్రావు రూ.10 లక్షల విరాళం అందించనున్నట్లు ఆర్డీఎఫ్ అధినేత ఎర్రబెల్లి రామ్మోహన్రావు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ లూనావత్ కమలపంతులు, జెడ్పీటీసీ సింగ్లాల్, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ రతన్రావు, ఏకాంతంగౌడ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ జితేందర్రెడ్డి, బూర్గుమల్ల సర్పంచ్ ఏడుదొడ్ల ఇందిరాజితేందర్రెడ్డి, కల్లెడ సర్పంచ్ కొంపెల్లి శోభాపరమేశ్వర్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కవితకు తప్పిన ప్రమాదం
సాక్షి, యాదాద్రి: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు ప్రమాదం తప్పింది. వీరిద్దరూ మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అవడంతో పెద్దగుట్టపై అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలట్. వివరాల ప్రకారం.. మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ మాలోతు కవిత ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అయ్యింది. ఈ విషయం గుర్తించిన పైలట్ యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ను అత్యవసరం ల్యాండ్ చేశాడు. ఈ క్రమంలో హెలికాప్టర్ పెద్దగుట్టపై దాదాపు 20 నిమిషాల పాటు ఆగింది. అనంతరం, అక్కడ ఉన్న సిబ్బంది వ్యాన్లో ఇంధనం తీసుకురావడంతో హెలికాప్టర్లో ఇంధనం నింపారు. దీంతో, తిరిగి హెలికాప్టర్ హైదరాబాద్కు పయనమైంది. ఇక, ఎర్రబెల్లి, కవితకు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి -
కాంగ్రెస్ కసరత్తు.. ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడెవరు?
పాలకుర్తిలో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోందా? రాజకీయ జీవితంలో ఓటమి ఎరగని నేతకు చుక్కలు చూపించే ప్రయత్నం జరుగుతోందా? కర్నాటక ఫలితాలతో నూతనోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. గులాబీ గూటిలో గుబులు పుట్టించేలా పాలకుర్తిలో పావులు కదుపుతున్న నేతలు ఎవరు? మంత్రి ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకులు ఎక్కడున్నారు? ఓటమి ఎరగని నేతకు చుక్కలు చూపించేందకు రాజకీయాల్లో అపజయం ఎరుగని నేతగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా విజయం సాధించేవారు. ప్రజాభిమానం ఉన్నందునే ఎర్రబెల్లిని పార్టీలోకి ఆహ్వానించి కేబినెట్లో చోటు కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేసిఆర్ మాదిరిగానే ఓటమి ఎరగని నేతగా పేరున్న మంత్రి ఎర్రబెల్లికి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టిందని టాక్ నడుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయడానికి ఢోకా లేని మంత్రి ఎర్రబెల్లిని ఓడించడమే లక్ష్యంగా టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి బలమైన అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టారు. అమెరికాలో స్థిరపడ్డ పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులపై దృష్టి సారించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 30 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలానికి చెందిన హనుమాండ్ల ఝాన్సీరాజేందర్ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులు. అమెరికాలో స్థిరపడ్డ రాజేందర్ రెడ్డి కార్డియాలజిస్ట్గా పనిచేస్తుండగా, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఝాన్సీరెడ్డి కొనసాగుతున్నారు. గత 30ఏళ్ళుగా స్వగ్రామంతోపాటు పాలకుర్తి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వగ్రామం చెర్లపాలెంలో స్కూల్ భవనం నిర్మించారు. గ్రామపంచాయితీ కార్యాలయానికి స్థలం ఇవ్వడంతోపాటు స్వంత భూమి ఎకరం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కెటాయించారు. చదవండి: జీవో 111 రద్దు.. 80 శాతం భూములు కేసీఆర్ బినామీ చేతుల్లోనే: రేవంత్రెడ్డి ఝాన్సీ రెడ్డి దంపతులను కలిసిన రేవంత్రెడ్డి తొర్రూరులో పాతికేళ్ళ క్రితమే 30 పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించారు. పుట్టిన గడ్డ మీద పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల మన్ననలు అందుకుంటున్న ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యారు. ఇటీవల అమెరికా వెళ్ళిన టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ఝాన్సీరాజేందర్ రెడ్డి దంపతులతో మంతనాలు జరిపారట. వారి ఇంట్లోనే షెల్టర్ తీసుకున్న రేవంత్ రెడ్డి పార్టీలోకి అహ్వానించగా అందుకు వారు సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఇండియాకు రానున్న ఝాన్సీరాజేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని వచ్చే ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతారని వారి సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. రాహుల్తో భేటీ? ఈనెల 30న అమెరికాకు వెళ్ళనున్న రాహుల్ గాంధీతో సైతం ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు భేటి కానున్నారని సమాచారం. ఓటమి ఎరగని నేతగా రికార్డు సృష్టించిన మంత్రి ఎర్రబెల్లిని ఢీ కొట్టి కాంగ్రెస సత్తా చాటడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారట. ఝాన్సీరాజేందర్ రెడ్డి దంపతులకు స్థానికత, సేవా కార్యక్రమాలు వర్క్ అవుట్ అవుతాయని భావిస్తున్నారు. ఎర్రబెల్లి సైతం సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకం అవుతున్నప్పటికి ఆయన స్వగ్రామం వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉంది. దీంతో పాలకుర్తికి స్థానికేతరుడనే భావన కలుగుతుంది. ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఎర్రబెల్లికి కష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఝాన్సీరెడ్డి పాలకుర్తి నుంచి పోటీ చేస్తారనే ప్రచారంతో ఈ మధ్యన ఎర్రబెల్లి మరింత చురుగ్గా పార్టీ కార్యక్రమాలతో గడుపుతున్నారు. ఝాన్సీరెడ్డి వచ్చినా మరెవ్వరు వచ్చినా ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఎవ్వరికి లేదని గులాబీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఎర్రబెల్లికి దీటైన వ్యక్తిని బరిలో దింపి రికార్డును తిరగరాస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
జేపీఎస్ల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్/తొర్రూరు: జూనియర్/ ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్/ఓపీఎస్) నిరవధిక సమ్మెను విరమించారు. తమ డిమాండ్ల సాధనకు 16 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు శనివారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జేపీఎస్లను రెగ్యులరైజ్ చేస్తారనే సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆ ధీమాతోనే సమ్మెను విరమిస్తున్నట్లు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె శ్రీకాంత్గౌడ్, ఇతర జిల్లాల నాయకులతో కలిసి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వెల్లడించారు. అంతకుముందు వరంగల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును తెలంగాణ పంచాయత్ సెక్రటరీస్ ఫెడరేషన్ (టీపీఎస్ఎఫ్) అధ్యక్షుడు ఎ.శ్రీకాంత్గౌడ్ తదితరులు కలిశారు. ఈ క్రమంలో తొలుత సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలని వారికి మంత్రి సూచించినట్టు సమాచారం. ఆది లేదా సోమవారాల్లో టీపీఎస్ఎఫ్ ప్రతినిధులతో ఆయా అంశాలపై చర్చిస్తామని మంత్రి హామీనిచ్చిన మీదట సోమవారం నుంచి విధుల్లో చేరనున్నట్టు సంఘం ప్రకటించింది. – జేపీఎస్ల వ్యవస్థ సృష్టికర్త కేసీఆరే కాగా, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్తో 16 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక, శాంతియుత సమ్మె నిర్వహించామని, జేపీఎస్ల వ్యవస్థను సృష్టించిందే సీఎం కేసీఆర్ అని సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్గౌడ్ అన్నారు. జేపీఎస్ల వల్లే తెలంగాణకు కేంద్రం నుంచి 73 అవార్డులు వచ్చాయని, మున్ముందు సైతం అదే రీతిన పనిచేసి మంచి ఫలితాలు రాబడుతామని తెలిపారు. ఈనెల 15వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా విధుల్లో కొనసాగుతామని స్పష్టం చేశారు. సమ్మెకు సహకరించిన ప్రతి ఒక్క జూనియర్ పంచాయతీ కార్యదర్శికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ కఠిన వైఖరి ప్రభావంతోనే విరమణ? ప్రభుత్వం కఠినచర్యలకు దిగనున్నట్టు చేసిన ప్రకటన సమ్మె విరమణను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. శనివారంలోగా విధుల్లో చేరకుండా గైర్హాజరైన జేపీఎస్, ఓపీఎస్ల తొలగింపుతో పాటు వారి స్థానాల్లో తాత్కాలిక పద్ధతుల్లో నియామకాలు చేపట్టాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి దాకా సమ్మె కొనసాగించాలా వద్దా, విరమిస్తే పరిస్థితి ఏమిటి, కొనసాగిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే దానిపై టీపీఎస్ఎఫ్ రాష్ట్ర,జిల్లా కమిటీల్లో తీవ్రస్థాయిలో చర్చ సాగింది. సమ్మెలో ఉన్న జేపీఎస్లలోనూ పునరాలోచన మొదలైంది. దీనికి తగ్గట్టే శనివారం సాయంత్రానికి పలుజిల్లాల్లో పెద్దసంఖ్యలోనే జేపీఎస్లు విధుల్లో చేరినట్టు పీఆర్ కమిషనరేట్కు నివేదికలు అందాయి. ఇది సమ్మె విరమణ దిశగా ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం కూడా సమ్మె చేసిన జేపీఎస్ల పట్ల కొంత చూసీచూడనట్టు వ్యవహరించాలని భావిస్తున్నట్టు సమాచారం. జేపీఎస్ల సమ్మె విరమణ నేపథ్యంలో.. వారి స్థానంలో గతంలో జేపీఎస్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారి నియామకం, గ్రామాల్లో స్థానికంగా డిగ్రీ పాసై, కంప్యూటర్ పరిజ్ఞానమున్న వారిని నియమించే ప్రక్రియను కూడా నిలిపేసినట్టు తెలుస్తోంది. -
తెలంగాణ పంచాయతీలకు అవార్డుల పంట
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గ్రామ పంచాయతీలు అవార్డుల పంట పండించాయి. జాతీయస్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా ఎన్నికై రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాయి. మొత్తం 9 విభాగాలకుగాను 8 విభాగాల్లో విశేష ప్రతిభ కనబర్చి అవార్డులను సొంతం చేసుకొని రాష్ట్రపతితో ప్రశంసలు అందుకున్నాయి. జాతీయ పంచాయతీ అవార్డులు–2023లో భాగంగా కేంద్రం ప్రకటించిన మొత్తం 46 జాతీయ అవార్డుల్లో 13 అవార్డులను తెలంగాణ గెలుచుకుంది. 9 కేటగిరీల్లో అవార్డుల ఎంపిక జరగగా, 8 కేటగిరీల్లో పంచాయతీలు అవార్డులు సాధించాయి. దీంతో తెలంగాణను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞానభవన్లో సోమవారం జరిగిన పంచాయత్ అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అధికారులు అందుకున్నారు. నాలుగు కేటగిరీల్లో నాలుగు మొదటి ర్యాంకులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగంలో నాలుగు కేటగిరీల్లో నాలుగు గ్రామాలు మొదటి ర్యాంకులు సాధించగా, రెండు గ్రామాలు రెండో ర్యాంకులను, మరో రెండు గ్రామాలు మూడో ర్యాంకులను సాధించాయి. ఐదు నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలను తెలంగాణ కైవసం చేసుకుంది. అవార్డుల కార్యక్రమం అనంతరం మంత్రి ఎర్రబెల్లి తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వల్ల జరుగుతున్న పల్లెప్రగతి కార్యక్రమం, అది సాధించిన ఫలితాలను వివరించారు. దేశంలో తెలంగాణ మాత్రమే కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు పంచాయతీలకు సక్రమంగా అందజేస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనా పథంలో పనిచేస్తూ, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలపాలని అవార్డు గ్రహీతలకు సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ : 1) ఆరోగ్యకర పంచాయతీ: గౌతంపూర్– 1వ ర్యాంకు (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) 2) నీరు సమృద్ధిగా ఉన్న పంచాయతీ: నెల్లుట్ల– 1వ ర్యాంకు(జనగాం జిల్లా) 3) సామాజిక భద్రత పంచాయతీ: కొంగట్పల్లి– 1వ ర్యాంకు (మహబూబ్నగర్ జిల్లా) 4) మహిళలకు స్నేహపూర్వక పంచాయతీ: అయిపూర్–) 1 వ ర్యాంకు (సూర్యాపేట జిల్లా) 5) పేదరికంలేని మెరుగైన జీవనోపాధి పంచాయతీ: మన్దొడ్డి– 2వ ర్యాంక్ (జోగులాంబ గద్వాల్ జిల్లా) 6) సుపరిపాలన పంచాయతీ: చీమలదారి– 2వ ర్యాంక్ (వికారాబాద్ జిల్లా) 7) పరిశుభ్ర పంచాయతీ : సుల్తాన్పూర్–3వ ర్యాంకు (పెద్దపల్లి జిల్లా) 8) స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు ఉన్న పంచాయతీ: గంభీరావ్పేట– 3వ ర్యాంకు (రాజన్న సిరిసిల్ల జిల్లా) నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తం పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం... బెస్ట్ బ్లాక్ పంచాయతీ: తిమ్మాపూర్(ఎల్ఎండీ)– 2వ ర్యాంకు (కరీంనగర్ జిల్లా) బెస్ట్ డిస్ట్రిక్ట్ పంచాయతీ: ములుగు– 2వ ర్యాంకు గ్రామ ఊర్జా స్వరాజ్ ప్రత్యేక పంచాయతీ అవార్డు : ముక్రా– 3వ ర్యాంకు (ఆదిలాబాద్ జిల్లా) కార్బన్ న్యూట్రల్ ప్రత్యేక పంచాయతీ అవార్డు: కన్హా– 2వ ర్యాంకు (రంగారెడ్డి జిల్లా) గ్రామ ఊర్జా స్వరాజ్ ప్రత్యేక పంచాయతీ అవార్డు : ఎర్రవెల్లికి ప్రత్యేక ప్రశంస (సిద్ధిపేట జిల్లా) ఆ పంచాయతీలు రాష్ట్రానికి గర్వకారణం:– సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: పచ్చదనం, పరిశుభ్రతతోపాటు పలు అభివృద్ధి ఇతివృత్తాల విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలవడం రాష్ట్రానికే గర్వకారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. ‘దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామపంచాయతీలు పోటీపడగా అందులో కేవలం 46 గ్రామాలు అవార్డులు దక్కించుకున్నాయి. వాటిలో 13 అవార్డులు తెలంగాణకే వచ్చినయి. అంటే ప్రకటించిన మొత్తం జాతీయ అవార్డుల్లో 30 శాతం తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకున్నది. ఈ 13 ర్యాంకుల్లోంచి కూడా 4 ఫస్టు ర్యాంకులు తెలంగాణకే రావడం గొప్ప విషయం’అని పేర్కొన్నారు. -
కల్లు లొట్టి కతం పెట్టిన మంత్రి ఎర్రబెల్లి
-
సుప్రీంకు వెళితే తప్ప బిల్లులు పాస్ చేయరా?
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కితే తప్ప గవర్నర్ నుంచి బిల్లులు పాస్ కాని పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. శాసనసభ ఓకే చేసిన బిల్లుల విషయంలో మంత్రులు, సీఎస్ వెళ్లి వివరాలు తెలిపినా, సందేహాలను తీర్చినా కూడా.. గవర్నర్ ఏడు నెలలు ఉద్దేశపూర్వకంగా ఆపారని ఆరోపించారు. సోమవారం హరీశ్రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలంలో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు ట్రయల్ రన్ నిర్వహించారు. హరీశ్రావు ఈ సందర్భంగా గవర్నర్, కేంద్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా? కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇస్తామంటే.. ఆ బిల్లును ఏడునెలల పాటు ఆపి, ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపామని చెబుతున్నారు. మా పిల్లలకు ప్రొఫెసర్ చదువులు చెప్పొద్దా? పిల్లల భవిష్యత్ కంటే రాజకీయాలు ముఖ్యమా?’’అని ప్రశ్నించారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను పాస్ చేయకుండా గవర్నర్ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మిషన్ భగీరథకు నిధులేవి? ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథకు ప్రోత్సహకాలు ఇవ్వకుండా కేంద్రం పక్షపాతం చూపిస్తోందని హరీశ్రావు ఆరోపించారు. మిషన్ భగీరథకు రూ.13 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా.. కనీసం 13 పైసలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘‘తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తోంది. తెలంగాణ పథకాలు అద్భుతమని తీయటి మాటలు చెప్తారు, అవార్డులు కూడా ఇస్తారు. కానీ నయా పైసా నిధులు మాత్రం ఇవ్వరు’’అని విమర్శించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ పథకం చేపట్టామని, మల్లన్నసాగర్ నుంచి ఆరు జిల్లాల్లో 10 నియోజకవర్గాల పరిధిలోని 1,922 గ్రామాలకు తాగునీరు అందిస్తామని తెలిపారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలు తీర్చేలా ప్రాజెక్టును రూపొందించామన్నారు. భవిష్యత్లో హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నిధులు ఇవ్వకుండా మోసం: ఎర్రబెల్లి కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు డబ్బులిస్తూ.. తెలంగాణపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. -
Telangana: తెలంగాణ పల్లెలకు 13 జాతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి పురస్కారాల్లో తెలంగాణ పల్లెలకు అవార్డుల పంట పండింది. దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్కు సంబంధించి 8 పురస్కారాలతోపాటు నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్కు సంబంధించి 5 పురస్కారాలు సాధించి రాష్ట్రం సత్తా చాటింది. దీన్దయాళ్ పురస్కారాల్లో 9 కేటగిరీల్లోని 27 అవార్డులకుగాను 8 అవార్డులు సాధించి రాష్ట్రాలవారీగా అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో నాలుగు పంచాయతీలు తొలి ర్యాంకు సాధించగా మరో రెండు పంచాయతీలు రెండో ర్యాంకు, ఇంకో రెండు పంచాయతీలు మూడో స్థానంలో నిలిచాయి. అలాగే నానాజీ పురస్కారాల్లో 7 కేటగిరీలకుగాను ఐదు (వాటిలో ఒకటి ప్రథమ స్థానం) అవార్డులు లభించాయి. తెలంగాణ వివిధ కేటగిరీల్లో పురస్కారాలకు ఎంపికైన విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారు డాక్టర్ బిజయకుమార్ బెహరా ఓ లేఖ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి తెలియజేశారు. ఈ నెల 17న ఢిల్లీ విజ్ఞాన్భవన్లో జరిగే ‘నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్సెంటివైజేషన్ ఆఫ్ పంచాయత్స్ కమ్ అవార్డ్ సెర్మనీ’లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్కుల ఆధారంగా ర్యాంకులు.. ఏటా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు ప్రోత్సాహకంగా అవార్డులు అందిస్తోంది. జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా, ఆన్లైన్లో పంచాయతీల ద్వారా నామినేషన్లను తీసుకొని 9 అంశాల్లో (థీమ్లలో) ఉత్తమ గ్రామ పంచాయతీలకు మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఉత్తమ అవార్డులు ప్రకటిస్తోంది. అయితే ఈ ఏడాది నుంచి అవార్డులను 9 అంశాల్లో ఏ పంచాయతీలు ప్రగతిని సాధించాయో వాటికి మొదటి, రెండవ, మూడవ బహుమతులుగా అవార్డులు ఇస్తోంది. ఇందులో ప్రతి అంశానికి వంద మార్కులకు సూచికలను ప్రకటించింది. ఈ తొమ్మిది అంశాల్లో ప్రతి పంచాయతీ సాధించిన మార్కుల ఆధారంగా దేశంలో ఉత్తమ పంచాయతీలను ప్రకటిస్తోంది. మంత్రి ఎర్రబెల్లి, ఆయన బృందానికి అభినందనలు సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన పల్లెప్రగతి కార్యక్రమాల అమలు వల్లే రాష్ట్రానికి ఈ ఘనత లభించిందని, తెలంగాణను అవార్డులు వరించాయని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతోపాటు ఆయన బృందాన్ని ట్విట్టర్ వేదికగా అభినందించారు. ఇందుకు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలియజేశారు. అవార్డులు రావడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, సహకరించిన ప్రజలకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2023 ► ఉత్తమ బ్లాక్ (మండల) పంచాయతీ: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్.ఎం.డి (సెకండ్ ర్యాంకు) ► ఉత్తమ జిల్లా పంచాయతీలు: ములుగు జిల్లా (సెకండ్ ర్యాంకు) ► గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ (స్పెషల్ కేటగిరీ): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె. (థర్డ్ ర్యాంకు). ► కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కార్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా (సెకండ్ ర్యాంకు) ► గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ (స్పెషల్ కేటగిరీ–నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్–సర్టిఫికెట్): సిద్దిపేట జిల్లా మార్కూక్ ఎర్రవెల్లి (ఫస్ట్ ర్యాంకు) దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2023 ► ఆరోగ్యవంతమైన పంచాయతీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం గౌతంపూర్ (ఫస్ట్ ర్యాంకు) ► తాగునీరు సమృద్ధిగా ఉన్న పంచాయతీ: జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల (ఫస్ట్ ర్యాంకు) ► సామాజిక భద్రతగల పంచాయతీ: మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం కొంగట్పల్లి (ఫస్ట్ ర్యాంకు) ► స్నేహపూర్వక మహిళా పంచాయతీ: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూరు (ఫస్ట్ ర్యాంకు) ► పేదరికరహిత, జీవనోపాధి పెంచిన పంచాయతీ: గద్వాల జిల్లా రాజోలి మండలం మందొండి గ్రామం (సెకండ్ ర్యాంకు) ► సుపరిపాలనగల పంచాయతీ: వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం చీమల్దారి (సెకండ్ ర్యాంకు) ► క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ: పెద్దపల్లి జిల్లా ఎలిగాడ్ మండలం సుల్తాన్పూర్ (థర్డ్ ర్యాంకు) ► స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాలుగల పంచాయతీ: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం గంభీర్రావుపేట (థర్డ్ ర్యాంకు) చదవండి: హైదరాబాద్కు ప్రధాని మోదీ.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం -
రెండోరోజూ ‘బాలవికాస’పై ఐటీ దాడులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: బాలవికాస స్వచ్ఛంద సంస్థ, దాని అనుబంధ సంస్థలపై వరంగల్వ్యాప్తంగా రెండు రోజులుగా కొనసాగుతున్న ఐటీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. సుమారు 15–20 వాహనాల్లో బుధవారం తెల్లవారుజామున హనుమకొండకు చేరుకున్న ఐటీ అధికారులు.. సీఆర్పిఎఫ్ భద్రత మధ్య తనిఖీలు మొదలుపెట్టారు. కాజీపేట ఫాతిమానగర్, హనుమకొండ సిద్ధార్థనగర్లలో ఉన్న బాలవికాస కార్యాలయాలు, నిర్వాహకుల ఇళ్లలో గురువారం రాత్రి వరకు 15 బృందాలుగా ఏర్పడిన అధికారులు సోదాలు నిర్వహించారు. తొలిరోజు తనిఖీల్లో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, హార్డ్డిస్్కలతోపాటు కీలక ఉద్యోగులు, వ లంటీర్లకు చెందిన సె ల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సుమా రు నాలుగైదేళ్లకు సంబంధించిన బాలవికాస ఆదాయ వ్యయాల పత్రాలు, వార్షిక నివేదికలపై ఆరా తీసినట్లు తెలిసింది. కాగా, బాలవికాస సంస్థపై ఐటీ దాడులను జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, కుడా చైర్మన్ సుందర్రాజు ఖండించారు. 9 రాష్ట్రాలు, 7 వేల గ్రామాలకు సేవలు... భారత్లో సమాజాభివృద్ధి సేవల కోసం ఫ్రెంచ్–కెనడా జాతీయుడైన ఆండ్రే గింగ్రాస్, ఆయన సతీమణి బాలథెరిసా గింగ్రాస్ 1977లో కెనడాలో సోపర్ సంస్థను ప్రారంభించారు. సేవా కార్యకలాపాలను మరింత సమర్థంగా చేపట్టేందుకు వీలుగా సోపర్కు అనుబంధంగా కాజీపేటలోని ఫాతిమానగర్లో 1991లో బాలవికాస సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం బాలవికాసకు అనుబంధంగా 9 సంస్థలు పనిచేస్తున్నాయి. తెలంగాణ, ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తమిళనాడు, మధ్యప్రదేశ్లలోని 7 వేల గ్రామాలు, పలు స్వచ్ఛంద సంస్థలతో కలసి బాలవికాస సంస్థ తన సేవలు అందిస్తోంది. బాలవికాసలో సుమారు 300 మంది సిబ్బంది ఉండగా, క్షేత్రస్థాయిలో మరో 500 మంది పనిచేస్తున్నారు. గ్రామాల్లో నాణ్యమైన విద్య, సురక్షిత తాగునీరు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, మహిళా సాధికారత, ఆదర్శగ్రామాల ఏర్పాటు అంశాలు ప్రధాన లక్ష్యాలుగా 30 వేల మంది వలంటీర్లు బాలవికాస ద్వారా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 60 లక్షల మంది పేదలకు మేలు కలిగేలా కార్యక్రమాలు నిర్వహించారు. 2014లో ఘట్కేసర్ వద్ద సెంటర్ ఫర్ సోషల్ రెస్పాన్స్ బిజినెస్ సెంటర్ను ప్రారంభించారు. సామాజిక వ్యవస్థాపకత, బాధ్యతాయుతమైన వ్యాపారాన్ని ప్రోత్సహించే శ్రేష్టత కేంద్రాలుగా 30 వినూత్న సోషల్ స్టార్టప్లను బాలవికాస ఏర్పాటు చేసింది. 125 మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేసింది. -
తాటికల్లు మస్తుగుంది..!
వరంగల్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదివారం జనగామ జిల్లా కొడకండ్లలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా గీత కార్మికుల కోరిక మేరకు తాటికల్లు టేస్ట్ చూసి చాలా బాగుందని అభినందించారు. కల్లుతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నందున నీరా కేఫ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని మంత్రి తెలిపారు. -
కేసీఆర్ తర్వాత నేనే నంబర్ వన్: మంత్రి ఎర్రబెల్లి
సాక్షి, వరంగల్(పర్వతగిరి): ‘కేసీఆర్ తర్వాత రాజకీయాల్లో నేనే నంబర్–1.. నాకెవరూ సాటిలేరు’.. ఈ మాటన్నది ఎవరో కాదు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ఆయన ఆదివారం వరంగల్ జిల్లా పర్వతగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1987–88 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి సమితి అధ్యక్షునిగా పోటీ చేసినప్పుడు టాస్ వేసి కాంగ్రెస్ వారు ఓడించారని తెలిపారు. అలా రెండు సందర్భాల్లో ఆ పార్టీ వారు కక్ష గట్టడంతో కసితో టీడీపీలో చేరానని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని అన్ని నియోజకవర్గాల్లో ఓడించానని తెలిపారు. -
కేంద్రంపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది : ఎర్రబెల్లి దయాకర్
-
మంత్రి ఎర్రబెల్లికి వింత అనుభూతి.. అసలేం జరిగిందంటే?
సాక్షి, వరంగల్: వెరైటీ కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు వింత అనుభూతి ఎదురైంది. దేవుడి పెళ్లికి పోతే మొబైల్ ఫోన్ మాయమయ్యింది. కొద్దిసేపు అందరూ కంగారు పడ్డారు. కాసేపటికి భగవంతుడి మహిమతో దొరికిందని సంతోషపడ్డారు. జనగామ జిల్లా చిల్పూర్ గుట్ట శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ శ్రీధర్ రావుతో పాటు జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవుడి కల్యాణంలో పాల్గొని తిరిగి వెళ్తున్న క్రమంలో మంత్రి మొబైల్ ఫోన్ పోయింది. ఫోన్ కనిపించకపోయేసరికి అందరూ కంగారు పడ్డారు. ఎమ్మెల్యే రాజయ్య ఏకంగా మైక్ అందుకొని మంత్రి గారి ఫోన్ పోయింది.. ఎవరికైనా దొరికితే ఆలయ చైర్మన్ శ్రీధర్రావుకు అప్పగించాలని కోరారు. ఆ నోటా ఈనోట అందరూ మంత్రి గారు ఫోన్ పోయిందట... ఏమైందో ఏమో అంటూ గుసగుసలు పెట్టారు. మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికి ఆలయ అర్చకుడు రంగాచార్యులు మంత్రిగారి సెల్ ఫోన్ దొరికిందని సెలవిచ్చారు. మంత్రి సెల్ ఫోన్ను కారులోనే మరిచిపోయి వచ్చారట. అసలు విషయం తెలుసుకొని అందరూ నవ్వుకున్నారు. చదవండి: చేతిలో నుంచి జారి సల సల మరిగే నూనెలో పడ్డ ఫోన్.. తర్వాత ఏమైందంటే? -
స్వచ్ఛ భారత్లో మరోసారి తెలంగాణ సత్తా
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ప్రకటిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. రెండు వేర్వేరు విభాగాల్లో మొదటి మూడు స్థానాలకుగాను రెండు స్థానాలు సాధించి దేశంలోనే నంబర్వన్గా మళ్లీ నిలిచింది. 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి, స్వచ్ఛ భారత్ మిషన్ ఎంపిక చేసిన రెండు విభాగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. స్టార్ త్రీ విభాగంలో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా, జగిత్యాల జిల్లాలు దేశంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. మూడో స్థానంలో కేరళలోని కొట్టాయం జిల్లా నిలిచింది. స్టార్ ఫోర్ విభాగంలో తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, 2వ స్థానంలో మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా నిలవగా, 3వ స్థానాన్ని తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా దక్కించుకుంది. గతంలోనూ స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రకటించిన ప్రతి అవార్డు విభాగంలోనూ తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో నిలిచింది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అనేక అవార్డులు సాధించింది. మంగళవారం హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. నిధులు ఇవ్వకున్నా, అవార్డులు ఇస్తున్నందుకు కేంద్రానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. పల్లెప్రగతి వంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే ఈ అవార్డులు దక్కుతున్నాయన్నారు. ఈ అవార్డులు రావడంలో ఉన్నతాధికారుల నుంచి గ్రామ సిబ్బంది వరకు అందరి కృషి ఉందని కొనియాడారు. కాగా, అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె గ్రామ సర్పంచ్ మీనాక్షికి మార్చి 4న ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందజేస్తారని ఎర్రబెల్లి తెలిపారు. -
గిరిజనుల సంక్షేమం పట్టని కేంద్రం
పాలకుర్తి టౌన్/పాలకుర్తి: బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోఢ్, ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఆదివారం గిరిజ నుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాల్లో, రూ.2 కోట్లతో నిర్మిస్తున్న సేవాలాల్, మేరమయాడి ఆలయాల నిర్మాణ భూమిపూజలో మంత్రులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించని బహిరంగ సభలో మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ పాలకుర్తికి, గిరిజనులకు ఎంతో చరిత్ర ఉందని, సీఎం కేసీఆర్ చొరవతో ఈ ప్రాంతాన్ని అధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూ.100 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గిరిజనులు మా ట్లాడే భాషకు లిపి లేదని, ఎనిమిదో షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి గిరిజన భాషకు లిపి కల్పించడంతోపాటు గిరిజన భాషకు జాతీయ భాషగా గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో సేవాలాల్ మహరాజ్, కొమరం భీమ్ భవనాలు నిర్మించాలన్నారు. గిరిజన రిజర్వేషన్ల విషయంలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం, గత పాలకులు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. గిరిజనుల సంక్షేమానికి సేవాలాల్ తరహాలో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజనుల పాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో రూ.600 కోట్లతో 3,146 గిరిజన జీపీలకు నూతన భవనాలు నిర్మిస్తున్నామని, తండాల్లో రోడ్లు మౌలిక వసతుల కల్పనకు రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పాలకుర్తిలో రూ.1.50 కోట్లతో బంజారా భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించే పోతన, సరస్వతీ దేవి నమూనా విగ్రహలను క్యాంపు కార్యాలయంలో మంత్రులు పరిశీలించారు. తర్వాత మంత్రి దయాక్రావు జనగామ కలెక్టర్ శివలింగయ్యతో కలిసి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సేవాలాల్ మహరాజ్ పీఠాధిపతి బాపూ సింగ్ మహరాజ్, మహబూబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు శంకర్నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, అడిషన్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, సేవాలాల్ మందిర నిర్మాణ కమిటీ బాధ్యులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు పాలకుర్తి చౌరస్తా నుంచి గుడి నిర్మించే స్థలం వరకు లంబాడా సంప్రదాయ నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయపర్తిలో క్షుద్రపూజల కలకలం రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలోని బతుకమ్మ కుంట ప్రాంతంలో బాలుడిని ఖననం చేసిన గోతిపైన ఆదివారం క్షుద్రపూజలు చేసిన ఘటన వెలుగుచూసింది. స్థా నికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన ఓ నాలుగేళ్ల బాలుడు రెండు నెలల క్రితం మృతిచెందగా బతుకమ్మకుంట ప్రాంతంలో ఖననం చేశారు. ఈ క్రమంలో మూడు రోజులక్రితం గుర్తుతెలియని వ్యక్తులు మనిషి రూపంలో ఉన్న బొమ్మతోపాటు, పసుపు, కుంకుమను చల్లి పలు రకాల వస్తువులను సమాధిపై పెట్టి క్షుద్రపూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చోటుచేసుకోలేదని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రకటించారు. ప్రీతి మృతి బాధాకరమని, ప్రభుత్వపరంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆవేదన, విచారం వ్యక్తం చేశారని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారని వివరించారు. దోషులు ఎంతటి వారైనా సరే చట్టప్రకారంగా కఠినంగా శిక్షిస్తామని ఎర్రబెల్లి తెలిపారు. ప్రీతి ఘటన బాధాకరం: మంత్రులు ప్రీతి మృతి అత్యంత బాధాకరమని, ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం శక్తివంచన లేకుండా ప్రయత్నించిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కాగా.. ప్రీతి మృతి బాధాకరమని, ఆమె కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కౌశిక్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే దారుణం : బండి సంజయ్ ప్రీతిది ముమ్మాటికీ హత్యేనని, ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రీతి మరణం బాధాకరమన్నారు. ‘‘ఈ దారుణ ఘటనపై సీఎం ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు? మీరిచ్చే రూ.10 లక్షల సాయం ఆ తల్లిదండ్రుల గుండెకోతను చల్లార్చుతాయా? గిరిజన విద్యార్థిని కాబట్టి ఏమైనా ఫరవాలేదనే సీఎం స్పందించలేదా? కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుంటే క్రిమినల్స్ ఏం చేసినా చెల్లుతుందని ప్రీతి ఘటన నిరూపిస్తోంది’’అని విమర్శించారు. విచారణకు రేవంత్ డిమాండ్ ప్రీతి మరణంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. ప్రీతి మరణానికి గల కారణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖ పనుల గ్రౌండింగ్లో అధికారుల అలసత్వాన్ని సహించబోమని, నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై క్రమశిక్షణచర్యలు తప్పవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాను సారం వారంలోగా టెండర్ల ప్రక్రియ ముగించి అన్నిపనులకు గ్రౌండింగ్ పూర్తిచేయాలని ఆదేశించారు. శుక్రవారం టీఎస్ ఐఆర్డీలో పీఆర్ ఇంజనీరింగ్ విభాగం పనులతీరును మంత్రి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రూ.2,669.74 కోట్ల అంచనా వ్యయంతో 3,009 పనులు మంజూరు చేసినా ఇప్పటికీ 2,109 పనులకు మాత్రమే టెండర్లు వచ్చాయని, మిగిలిన 900 పనులకు టెండర్లు పిలిచి తొందరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఈఎన్సీ సంజీవరావు, సీఈ సీతారాములు, జిల్లా పీఆర్ ఎస్ఈఈలు, ఈఈలు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
ఎర్రబెల్లి ఇజ్జత్ తీసిన కొండా సురేఖ
-
పాలకుర్తి నుంచి మంత్రి దయాకర్రావుపై పోటీకి సిద్ధం: కొండా సురేఖ
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ అవకాశమిస్తే పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపై పోటే చేసేందుకు సిద్ధమని కొండా సురేఖ ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఈ విషయాన్ని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కొండా సురేఖ ఈమేరకు మాట్లాడారు. 'వరంగల్లో రేవంత్ సభ అనగానే మంత్రి దయాకర్రావుకు నిద్ర పట్టడం లేదు. పాలకుర్తిలో మీరన్నా పోటీ చేయాలి. లేదా మేమైనా పోటీ చేస్తాం. మీ లేదా మా చేతిలో దయాకర్రావు ఓడిపోవాలి అని చెబుతున్నాం’ అని రేవంత్రెడ్డితో మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ‘నేను ఒక్క తల్లి, తండ్రికి పుడితే టీడీపీని వీడను అని దయాకర్రావు.. అన్నడు. బీఆర్ఎస్లో ఎప్పుడు చేరాడో అప్పుడే సచ్చిపోయిండు. చంపిన పామును చంపాల్సిన అవసరం మాకు లేదు. ఇక వరంగల్ ఈస్ట్ విషయానికొస్తే.. మా హయాంలోనే కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశాం’ అని సురేఖ చెప్పుకొచ్చారు. మరోవైపు రేవంత్ ప్రసంగిస్తూ.. వైఎస్ హయాంలో ఎంత గుర్తింపు ఉందో.. రాబోయే ప్రభుత్వంలోనూ కొండా దంపతులకు అదే గుర్తింపు ఉంటుందని, ఇక్కడ సురేఖ గెలుపుతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వరంగల్ ఇన్చార్జ్ అంజనీకుమార్ యాదవ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, వేం నరేందర్రెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, కొండా సుస్మితా పటేల్, నమిండ్ల శ్రీనివాస్, ఎర్రబెల్లి స్వర్ణ, రవళిరెడ్డి, బట్టి శ్రీనివాస్, సుధాకర్గౌడ్, అయూబ్ఖాన్, మీసాల ప్రకాశ్, కూరతోట సదానందం, మడిపెల్లి కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రాకతో జోష్.. హాథ్ సే హాథ్ జోడో యాత్ర వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జోష్ నింపింది. నాయకులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో రేవంత్రెడ్డితో కలిసి ముందుకు సాగారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. స్థానిక నేతల పాలన తీరును విమర్శిస్తూ.. చురకలు అంటిస్తూ చేసిన ప్రసంగం కార్యకర్తలను ఉత్సాహపరిచేలా చేసింది. మంగళవారం సాయంత్రం 6.28 గంటలకు ఎంజీఎం చౌరస్తాకు చేరుకున్న రేవంత్రెడ్డి.. రాజీవ్గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నాయకులతో కలిసి పాదయాత్రను ప్రారంభించారు. చదవండి: భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. యువజన నేతపై దాడితో ఉద్రిక్తతలు -
‘డ్వాక్రా ఉత్పత్తులకు కామన్ బ్రాండింగ్’
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా తయారు చేస్తున్న నిత్యావసర, ఇతర వస్తువులకు ఇంకా ఆకర్షణీయంగా లేబిలింగ్, ప్యాకింగ్తోపాటు మంచి కామన్ బ్రాండింగ్ ఏర్పాటు చేయాలి. దీనికి తెలంగాణ ముద్ర ఉండేటట్టు చూడాలి. అప్పుడు ఈ వస్తువులకు డిమాండ్ మరింత పెరుగుతుంది’అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం పీఆర్ శాఖ ముఖ్యకార్యదర్శి, సెర్ప్ సీఈవో సందీప్కుమార్ సుల్తానియా, ఇతర అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఫ్లిప్కార్ట్ సంస్థతో ఒప్పందం కుదిరిందని, అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెటింగ్ వంటి సంస్థలతోనూ మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకొని మహిళా ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు విస్తృతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా అభివృద్ధి, సంక్షేమంలో మనకు సాటి లేదని, మహిళాసంఘాల అభివృద్ధి, పొదుపు రుణాల్లో దేశంలో తెలంగాణ నంబర్ వన్గా ఉంది. ఈ దశలో రాష్ట్రం పేరుప్రతిష్టలు ఇనుమడించేలా, మహిళా ఉత్పత్తులను సులువుగా, ఆకర్షణీయంగా అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముడుపోయేలా ఈజీగా, క్యాచీగా ఉండేట్లుగా బ్రాండింగ్ రూపొందించాలని మంత్రి సూచించారు. త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లి, వారి అనుమతితో కొత్త బ్రాండింగ్ చేయాలని, అందుకు తగ్గట్లుగా పలు పేర్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. -
బహిరంగ చర్చకు సిద్ధమేనా
సాక్షి, మహబూబాబాద్: ‘నేను మీపై చేసిన ఆరోపణలను అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తా.. మీ నిజాయితీని నిరూపించుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమేనా’? అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. షర్మిల పాదయాత్ర శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామ శివారునుంచి సాగింది. ఈ సందర్భంగా నెల్లికుదురు, మడిపెల్లిలో ఆమె మాట్లాడారు. వందల ఎకరాల భూమి ఎలా వచ్చిందని మంత్రిని ప్రశ్నించారు. ఆడదానివి కాబట్టి ఉపేక్షిస్తున్నారని మంత్రి అనడం విడ్డూరంగా ఉందన్నారు. అవుతాపురంలో వైఎస్ విగ్రహం ఏర్పాటుకు సహకరించిన వారిపై మంత్రి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని బెదిరించినట్లు తన దృష్టికి వచ్చిందని షర్మిల పేర్కొన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ తనయాత్రను అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం లేదని, ఆయన తనను అడ్డుకుంటే వైఎస్ఆర్ అభిమానులు తడాకా చూపిస్తారని అన్నారు. మార్చి 5న షర్మిల పాదయాత్ర ముగింపు సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర మార్చి 5వ తేదీన ముగియనున్నదని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ తెలిపారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నిత్యం జనం మధ్యలోనే ఉంటూ అనేక పోరాటాలు చేశారన్నారు. ఈ నెల 20న డోర్నకల్ నియోజకవర్గం మీదుగా షర్మిల పాదయాత్ర పాలేరులో అడుగుపెడుతుందన్నారు. ఆ నియోజకవర్గంలోని కూసుమంచిలో జరిగే సభతో పాదయాత్ర ముగుస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
రేవంత్, షర్మిల మాటలన్నీ అబద్ధాలే!
జనగామ: పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని రేవంత్రెడ్డి, వైఎస్ షర్మిల తనపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. లేకుంటే ఆ ఇద్దరూ రాజకీయ సన్యాసం తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా యశ్వంతాపూర్లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసం జైలుకు వెళ్లానే తప్ప.. అవినీతి, అక్రమాలు చేసికాదు’అని ఆయన అన్నారు. రేవంత్ మాత్రమే కాదు, ఆయన చుట్టూ ఉన్న చాలామందిపైన భూ దందా, కబ్జా కేసులు ఉన్నాయన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్.. ఇప్పటికీ చంద్రబాబు ఏజెంట్గా పనిచేస్తున్నారన్నారు. రేవంత్, షర్మిలకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని, స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం తాను పట్టుబట్టి చంద్రబాబుకు ఇష్టం లేకున్నా, తెలంగాణకు అనుకూలంగా ఆయనతో లెటర్ ఇప్పించానన్నారు. ‘ఇంటర్ వరకే చదువుకున్నా.. ప్రజల మనోభావాలను వందశాతం చదివినా.. వారి అవసరాలను తీరుస్తూ అభివృద్ధి చేస్తున్నా’అని చెప్పారు. ‘నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచాను.. ఒకేచోట రెండోసారి గెలుస్తాననే నమ్మకం లేని రేవంత్రెడ్డి తనతోపాటు సీఎం, ఎమ్మెల్యేలను చులకన చేసి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రేవంత్రెడ్డి ఏ పార్టీలో ఉన్నా.. ఐరన్లెగ్గా మారిపోతున్నారని సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో 5 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. తమ తాత, ముత్తాలకు 16 వందల ఎకరాల భూములు ఉండేవని.. ప్రజా సేవ కోసం అమ్ముకుంటూపోగా, ఇప్పుడు తమకు వంద ఎకరాలు కూడా లేవన్నారు. 500 మంది కిరాయి గూండాలతో కారులో తిరుగుతూ పాదయాత్ర పదాన్ని అపహాస్యం చేస్తున్నారని రేవంత్పై ఆయన ఫైర్ అయ్యారు. -
‘దయాకర్రావు ఎంతకు అమ్ముడుపోయారు’
సాక్షి, మహబూబాబాద్: ‘మంత్రి దయాకర్రావు టీడీపీలో ఉన్నప్పుడు.. కేసీఆర్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు అని మాట్లాడారు.. ఇప్పుడు ఆయన కేసీఆర్కు ఎంతకు అమ్ముడుపోయి ఆయన పార్టీలో చేరారు’అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గురువారం ఆమె మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవుతాపురంలో పాదయ్రాత కొనసాగించారు. 3,800 కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకుని నాంచారి మడూరు మీదుగా తొర్రూరు చేరుకున్నారు. సాయంత్రం తొర్రూరు బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఐదో తరగతి చదివిన దయాకర్రావు మంత్రి అయ్యారని, పీజీలు, పీహెచ్డీలు చేసిన బిడ్డలు నిరుద్యోగులుగా మిగిలి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీపరుడినని చెప్పే మంత్రి 680 ఎకరాల భూమిని ఎలా సంపాదించారని ప్రశ్నించారు. -
మాటకు మాట
-
డిగ్రీ కాలేజీ తెచ్చుకోనోడు మంత్రంట
పాలకుర్తి టౌన్/పాలకుర్తి: ‘పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ తెచ్చుకోనోడు మంత్రి అంట’అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఉద్దేశించి వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. టీడీపీలో ఉన్నప్పడు కేసీఆర్ను రాక్షసుడు అన్న మంత్రి దయాకర్రావు.. బీఆర్ఎస్లో చేరిన తర్వాత కేసీఆర్ దేవుడు అయితే మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ఇదే నియోజవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కూడా పాదయాత్ర చేస్తున్నారని, ఆయనది పాదయాత్ర కాదు కారుయాత్ర అని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్లో గెలిచిన వారందరూ కేసీఆర్కి అమ్ముడుపోయారని అన్నారు. కాగా, పాదయాత్రలో భాగంగా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం వద్ద కల్లుగీత కార్మికుడు గూడ రవిగౌడ్ కోరిక మేరకు షర్మిల నీరా రుచి చూశారు. -
ఎర్రబెల్లి ఓనమాలు రాస్తే నేను తప్పుకుంటా
పాలకుర్తి/పాలకుర్తిటౌన్/ దేవరుప్పుల/జనగామ: పాలకుర్తి చౌరస్తాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఓనమాలు, ఏబీసీడీలు రాస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. పౌరుషం గల ఈ గడ్డ మీద పలక బలపం ఇస్తే ఓనమాలు రాయనోడు ఎమ్మెల్యే అయ్యిండంటే విచారకరమని వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం నుంచి రేవంత్రెడ్డి జనగామ జిల్లా దేవరుప్పుల నుంచి పాలకుర్తి వరకు హాథ్ సే హాథ్ జోడో యాత్ర సాగించారు. యాత్రలో మిర్చి, పత్తి రైతులను పలకరించారు. రాత్రి పాలకుర్తి చౌరస్తాలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. డాక్టర్ సుధాకర్రావు ఉన్నప్పుడే బావ.. బావ అని తిరుగుతుంటే వెన్నుపోటు పొడుస్తడని చెప్పినా నమ్మలేదని, దీంతో డాక్టర్ సాబ్ కనుమరుగయ్యాడని విచారం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లికి చదువురాకున్నా చంద్రబాబు విప్గా ఇస్తే విస్మరించి కేసీఆర్ రాచరికపు పాలన కోసం పావుగా పనిచేసి ఈ రోజు మంత్రి అయ్యాడని, తెలుగుదేశాన్ని నట్టేట ముంచిన దుర్మార్గుడని దుయ్యబట్టారు. మేడారం అడవుల్లో కేసీఆర్, ఎర్రబెల్లిలకు పులి ఎదురైతే ఎర్రబెల్లి బూట్లు చదురుకుంటున్నట్లు నమ్మబలికి కేసీఆర్ను ఆ పులికి ఎరగా వేస్తాడని చమత్కరించారు. నాడు టీడీపీ తరహాలో నేడు బీఆర్ఎస్ను దయాకర్రావు బొందపెడతాడని, జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్కు హితవు పలికారు. చెన్నూరు రిజర్వాయర్ టెండర్ డబుల్ చేసి కమీషన్లు నొక్కాడని, ధరణితో బీఆర్ఎస్ నాయకులు భూ దందా చేసి మంత్రికి బినామీ ఆస్తులను కూడబెట్టుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ దుష్టపాలనకు చరమగీతం పాడండి సబ్బండ వర్గాలు సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని రాచరిపుక విధానాలతో ఏలుతున్న కేసీఆర్ దుష్టపాలనకు చైతన్యవంతులైన తెలంగాణ సమాజం చరమగీతం పాడాలని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణి ద్వారా దోపిడీ చేసిన భూదందాదారులను జైలుపాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మల్లు రవి, పొన్నం ప్రభాకర్, దొమ్మాటి సాంబయ్య, సిరిసిల్ల రాజయ్య, బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడితే సహించబోం హంగ్ పాలనపై ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. ఈ విషయమై అధిష్టానం అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ధర్మాపురం శివారులో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్తో కాంగ్రెస్కు పొత్తు ఉంటుందని పార్టీలోని సీనియర్ నాయకులు మాట్లాడినా చర్యలు తప్పవని, ఈ విషయాన్ని రాహుల్గాంధీ స్వయంగా చెప్పినట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికార ప్రభుత్వంపై విసుగు చెందిన ప్రజలు.. కాంగ్రెస్ పాలన వైపు ఎదురు చూస్తున్న సమయంలో పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడితే ఎంతటి వారైనా సంహించేది లేదని హెచ్చరించారు. -
ఉపాధి హామీ అమల్లో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకాన్ని అత్యధికంగా తెలంగాణ ఉపయోగించుకుంటుందన్న అక్కసు కేంద్రానికి ఉందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, నిరంజన్రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, మల్లా రెడ్డి విమర్శించారు. అందుకే అనేక నిబంధనలు పెట్టి నిధులు ఆపే కుట్ర చేస్తోందని ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో పీఆర్ మంత్రి ఎర్రబెల్లి అధ్యక్షతన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 8వ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ ఉపాధి హామీలో 10.66 కోట్ల పనిదినాలు పూర్తి చేశామని, మళ్లీ పనిదినాలు కావాలని అడిగితే కేంద్రం అనేక షరతులు పెట్టి 11 కోట్ల పనిదినాలు కలి్పంచిందన్నారు. ఎన్ని షరతులు పెట్టినా వాటన్నింటిని పాటి స్తూ కూలీలకు పనిదినాలు కలి్పస్తున్నామన్నారు. 12 కోట్ల పనిదినాలు కలి్పంచే లక్ష్యంతో కేంద్రాన్ని మరిన్ని పనిదినాలు కావాలని కోరినట్లు తెలిపారు. -
రేవంత్రెడ్డితో కాంగ్రెస్కు ముప్పు
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డిని నియమించుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి ముప్పు ఏర్పడిందని, ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నాశనమవుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. రేవంత్రెడ్డిని తెలంగాణ ప్రజలు ఐటెమ్ సాంగ్లా చూస్తారని, ఆయన వెంట పాదయాత్రలో కిరాయి మనుషులు తప్ప కాంగ్రెస్ నేతలు ఎవరూ లేరన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్తో కలిసి బుధవారం అసెంబ్లీలోని బీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి బ్రోకర్, జోకర్, బ్లాక్మెయిలర్ అని వ్యాఖ్యానించారు. ప్రగతిభవన్ను నక్సలైట్లు గ్రెనేడ్లతో పేల్చి వేయాలంటూ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎర్రబెల్లి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థాయిలేని వ్యక్తికి పీసీసీ పదవి.. స్థాయిలేని వ్యక్తికి పీసీసీ పదవి ఇచ్చారని రేవంత్ తన మాటలతో రుజువు చేసుకున్నారని, రేవంత్ నక్సలైట్ల భుజం మీద తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవాలని చూస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రేవంత్ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పకపోతే ఆయన పాదయాత్ర మానుకోట దాటదని హెచ్చరించారు. రేవంత్రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ పెట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. -
'రేవంత్ ఎక్కడ అడుగు పెడితే ఆ పార్టీ ఖతం'
హైదరాబాద్: ప్రగతి భవన్ను పేల్చేయాలి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. పాదయాత్రకు ఆదరణ కరువు కావడంతో అసంఘటిత శక్తులు మాట్లాడే మాటలు ఆయన మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్ను పేల్చాలని నక్సలైట్లకు పిలుపునివ్వడమేంటమని మండిపడ్డారు. 'రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఖండిస్తోంది. భట్టి విక్రమార్క రేవంత్ వ్యాఖ్యలను సమర్థిస్తారా? అది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమాలేక వ్యక్తిగతమా చెప్పాలి. కాంగ్రెస్ నైతిక బాధ్యత వహించాలి.' అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. బయట తిరగలేడు.. 'రేవంత్వి అన్ని అబద్ధాలే. వ్యవస్థ మీద ఆయనకు నమ్మకం లేదు. నక్సలైట్లను చర్చలకు పిలిచి కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ది. అనర్హుడికి పీసీసీ పదవి ఇచ్చారు. రేవంత్ ఇలాగే మాట్లాడితే బయట తిరగలేడు. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో తిరుగుతున్నావ్... ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ప్రజలకు, నక్సలైట్లకు క్షమాపణ చెప్పాలి' అని మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. ఐటెం సాంగ్.. 'రేవంత్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ పార్టీ ఖతం. తెలుగుదేశంలోకి వచ్చి ఆ పార్టీని నాశనం చేశారు. రేవంత్ను ప్రజలు ఐటెం సాంగ్ గానే చూస్తారు. ఆయన వెంట ఉండేవారు కిరాయివాళ్లే. నర్సంపేటలో పాదయాత్ర ఎందుకు చేయలేదు? అక్కడ తంతారనా? రేవంత్ ఓ బ్రోకర్. ఆయనకు ఇంగిత జ్ఞానం ఉందా? ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. మోదీ ఆఫీస్ను కూడా పేల్చేయాలని రాహుల్ గాంధీకి రేవంత్ ఎందుకు చెప్పలేదు? ఇలాగే మాట్లాడితే ప్రజలు తరిమి కొడతారు. నక్సలైట్ల ఎజెండా మంచిగానే ఉంటుంది. నాకు చదువు రాకపోతేనే ఏడు సార్లు గెలిచానా?' అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. చదవండి: రేవంత్ వ్యాఖ్యల దుమారం.. పీడీ యాక్ట్ పెట్టాలని ఫిర్యాదు! -
పాలకుర్తిలో ‘పవర్’ ఎవరికి?.. మంత్రి ఎర్రబెల్లి గెలుస్తారా?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం పాలకుర్తి. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. ఓటమి ఎరుగని నేత, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాలకుర్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతానికి ఎర్రబెల్లిని ఓడించగల నేత పాలకుర్తిలో లేరనే ప్రచారం సాగుతోంది. అందుకే ఆయన్ను ఓడించే వారి కోసం అటు కాంగ్రెస్, ఇటు కమలం పార్టీ భూతద్దాలు పెట్టుకుని వెతుకుతున్నాయి. మరి ఎర్రబెల్లి విజయానికి ఎవరైనా బ్రేకులు వేయగలుగుతారా? పోరాటాల పురిటిగడ్డ పోరాటాల పురిటిగడ్డ పాలకుర్తి నియోజకవర్గం వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించింది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎర్రబెల్లికి కంచుకోటగా మారింది పాలకుర్తి. నియోజకవర్గాల పునర్విభజనతో 2009 నుంచి రెండు సార్లు టిడిపి తరపున, ఒకసారి టిఆర్ఎస్ తరపున గెలిచారు. విపక్ష అభ్యర్థుల బలహీనతల్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఎర్రబెల్లి విజయం సాధిస్తారు. ఇప్పటికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపిగా గెలిచి ఓటమి ఎరుగని నేతగా రికార్డు సృష్టించారు. తెలంగాణాలో సీఎం కేసిఆర్ తర్వాత వరుస విజయాలు నమోదు చేసుకున్న వ్యక్తిగా ఎర్రబెల్లి ఉన్నారు. ఓటమి ఎరుగని నేతకు రాబోయే ఎన్నికల్లో చుక్కలు చూపేందుకు కాంగ్రెస్, బిజేపి కసరత్తు చేస్తున్నాయి. ఎర్రబెల్లిని ఎదుర్కునే బలమైన నేత కోసం వెతికే పనిలో ఆ రెండు పార్టీలు నిమగ్నమయ్యాయి. స్థానిక నాయకులను కాదని ఎన్ఆర్ఐలపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే పలువురితో సంప్రదింపులు జరిపారు. అయితే ఎర్రబెల్లిపై పోటీకి ఎన్ఆర్ఐలు ఎవరూ ఆసక్తి చూపడం లేదని సమాచారం. స్థానిక నేతలు మాత్రం చాలా మంది పోటీకి సై అంటున్నారు. ఎర్రబెల్లి వర్సెస్ కొండా ఎర్రబెల్లి దయాకరరావు మీద కాంగ్రెస్ నుంచి కొండా మురళీ పోటీ చేస్తారనే టాక్ నడుస్తోంది. మురళి.. ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య ఏనాటి నుండో రాజకీయంగా వైరం కొనసాగుతోంది. ఎర్రబెల్లిని ఓడించాలన్న పట్టుదలతో కొండా మురళి వున్నారు. అయితే మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కొడుకు రఘురాంరెడ్డిపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన పొంగులేటి శ్రీనివాస రెడ్డి వియ్యంకుడు. స్థానిక నాయకులు ముత్తినేని సోమేశ్వర్ రావు సైతం టిక్కెట్ ఆశిస్తున్నారు. ఎవ్వరనేది క్లారిటీ లేకపోయినప్పటికి ఎవరికి వారే పాలకుర్తి టిక్కెట్ తనదే అని ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నుండి గత ఎన్నికల్లో పెదగోని సోమయ్య పోటీ చేసి ఓడిపోయారు. ఎర్రబెల్లి సుధాకర్ రావు, యతి రాజారావు కుటుంబాల నుండి ఎవరో ఒకరు పోటీ చేయాలని భావిస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి బిజేపిలో చేరితే ఆయన వియ్యంకుడు రఘురాంరెడ్డిని కూడా చేర్చుకుని బరిలో నిలిపేందుకు కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రఘురాంరెడ్డి పాలకుర్తిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. మంత్రిగారికి మార్కెలెన్ని? పాలకుర్తి నియోజకవర్గం.. అభివృద్ది విషయంలో ఉమ్మడి జిల్లాలోనే ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఎన్నికల ముందు మంత్రి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. పాలకుర్తి మండల కేంద్రాన్ని, సోమేశ్వరాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పాలకుర్తి, బమ్మెర, వల్మిడి కారిడార్ను 62కోట్లతో అభివృద్ది చేస్తున్నారు. 150 కోట్లతో పాలకుర్తి చుట్టూ డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్దికి పెద్దపీట వేసి పాలకుర్తి రూపురేఖలే మార్చేశారు. నియోజకవర్గ కేంద్రంలో అనుకున్నదాని కంటే ఎక్కువగానే అభివృద్ది జరిగినప్పటికి.. ఇతర ప్రాంతాల్లో కొన్ని పనులు ఇంకా పెండింగ్ లో ఉండగా.. మరికొన్ని మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతున్నాయి. పాలకుర్తిలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేస్తామన్న హామీ అలానే మిగిలిపోయింది. కనీసం పోస్ట్ మార్టమ్ గది లేక జనగామకు వెళ్ళాల్సి వస్తోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పోస్ట్ మార్టమ్ గది ఏర్పాటుకు 2009లో ఇచ్చిన హామీ...హామీగానే మిగిలిపోయిందంటున్నారు స్థానికులు. నీళ్ల చుట్టూ రాజకీయాలు పాలకుర్తి ఏరియా మొత్తం మెట్టప్రాతం కావడంతో చాలా ప్రాంతాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా చెన్నూరు రిజర్వాయర్ను పాలకుర్తి రిజర్వాయర్ గా మార్చి నియోజకవర్గం రైతులకు సాగునీరు అందిస్తానని ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరక అసంతృప్తిలో పాలకుర్తి ప్రజలు ఉన్నారు. అయితే మంత్రి ఇటీవలనే మూడు జిల్లాల అధికారులతో సమావేశమై పనులపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే వేసవిలోపు రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండల కేంద్రాలకు సంబంధించి బాలికల జూనియర్ కళాశాల తెప్పిస్తానని.. అదేవిధంగా డిగ్రీ కళాశాల తెస్తానని 2009 నుండి ప్రజలకు హామీ ఇస్తున్నారు. అది కూడా పాలకుర్తి ప్రజలకు కలగానే మిగిలిపోయింది. డబుల్బెడ్ రూమ్ ఇళ్ళ కోసం లబ్డిదారులు ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్నా, ఫలితం కనిపించడంలేదు. ఎన్నికల్లో అభివృద్ధి పాత్ర ఎంత? నియోజకవర్గంలో ఏకైక మున్సిపాలిటి తొర్రూర్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయడంతో పాటు..పట్టణాన్ని 66కోట్లతో సర్వాంగసుందరంగా అభివృద్ది చేశారు. ఇచ్చిన హామీలే కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేస్తూ ప్రజల మనిషిగా పేరుతెచ్చుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రత్యర్థులు ఎవ్వరైనా సరే.. ప్రజలు తన వెంటే ఉంటారనే నమ్మకంతో ఉన్నారాయన. చదవండి: దుబ్బాకలో దుమ్ము రేపేదెవరు? నాడు వర్థన్నపేట అయినా.. ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గం అయినా.. ఏదైనా సొంత ఊరిలా భావిస్తూ అభివృద్ధి చేస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు. అందుకే ప్రజలు నుంచి దయాకర్ రావుకు పెద్దగా వ్యతిరేకత లేకపోయినప్పటికి మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపద్యంలో ఇంకాస్త కష్టపడక తప్పదనే భావన కలుగుతోంది. రాబోయే ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థులు బలమైనవారైతే...ప్రజల మూడ్ మారితే ఎర్రబెల్లి దయాకరరావుకు చుక్కలు కనిపిస్తాయనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
గవర్నర్ తమిళిసైకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కౌంటర్
సాక్షి, వరంగల్: తెలంగాణలో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్భవన్లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ఈ ఏడాది కూడా సీఎం కేసీఆర్, మంత్రులు డుమ్మా కొట్టారు. దీంతో, కేసీఆర్ ప్రభుత్వం తీరుపై గవర్నర్ తమిళిసై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. కాగా, మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గా పనిచేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి గవర్నర్కు కనిపించడం లేదా?. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంత అభివృద్ధి జరిగిందా?. గవర్నర్ వ్యవస్థను కించపరిచేలా తమిళిసై వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి గవర్నర్ను చూడలేదు. అంతపెద్ద సెక్రటేరియేట్ నిర్మాణం జరిగితే కనిపించడం లేదా.. అది అభివృద్ధి కాదా?. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ మంచి నీళ్లు ఇస్తున్నాము. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతోంది. రైతు సంక్షేమ తెలంగాణలో గవర్నర్కు ఆత్మహత్యలు కనిపిస్తున్నాయా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. -
80 సీట్లను బీఆర్ఎస్ ఈజీగా గెలుస్తుంది: మంత్రి ఎర్రబెల్లి
-
20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది: మంత్రి ఎర్రబెల్లి
-
మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు.. 20 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో రేపు (బుధవారం) జరిగే బిఆర్ఎస్ ఆవిర్భావ సభ నేపథ్యంలో పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలిపారు. అయితే 17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మార్చితే 100కు పైగా సీట్లలో బిఆర్ఎస్ గెలుస్తుందని స్పష్టం చేశారు. ఏ సర్వే అయినా, తాను వ్యక్తిగతంగా చేసిన సర్వేలు చూస్తే 80 నుంచి 90 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని తెలిసిందన్నారు. కేసీఆర్కు ఓటేస్తాం కానీ కొందరి ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. 15 నుంచి 20 స్థానాల్లో బీజేపీ, 20 నుంచి 25 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ ఉంటుందని 17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మార్చితే బీఆర్ఎస్ వందకు పైగా స్థానాలు గెలుస్తుంది అన్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ.. మరికొన్ని చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. చదవండి: ('కుటుంబం కంటే ఎక్కువగా ప్రజలను ప్రేమించడం చెవిరెడ్డికే సాధ్యం') -
క్రీడాకారులతో కబడ్డీ ఆడిన మంత్రి ఎర్రబెల్లి
సాక్షి, పాలకుర్తి: నిత్యం రాజకీయాల్లో బీజీగా ఉండే ఎర్రబెల్లి దయాకర్రావు కబడ్డీ, కబడ్డీ అంటూ కూతబెట్టి ఆట ఆడారు. పాలకుర్తి నియోజకవర్గం వావిలాల గ్రారమంలో మూడు రోజులపాటు జరిగే జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ పోటీల్లో పాల్గొనే 40 టీముల క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్ ఆటలలో కెప్టెన్గా ఉన్నానని.. ఆటలంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అందుకే ఆరోగ్యంగా ఉన్నానని, మీరు కూడా ఆటలను ఆడి.. ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రానికి పేరు తేవాలని వారిలో స్ఫూర్తిని రగిలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, సర్పంచ్ గంట పద్మ, భాస్కర్ తదితరులు ఉన్నారు. చదవండి: (పవన్లో స్పష్టంగా కనిపించిన అభద్రతా భావం.. సభ ఆద్యంతం ఆరు తిట్లు–మూడు విమర్శలు) -
ముఖరా కే గ్రామం పల్లెలకు ఆదర్శం కావాలి: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కే గ్రామం పల్లెప్రగతి విజయవంతంగా అమలు చేసి స్వయం సమృద్ధి గ్రామంగా అభివృద్ధి చెందుతోందని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. పల్లెప్రగతి ద్వారా సమకూర్చిన ట్రాక్టర్, అమలు చేస్తున్న తడి చెత్త, పొడి చెత్త విధానం, డంపింగ్ యార్డు నిర్వహణ, కంపోస్ట్ ఎరువు తయారీ ఇప్పుడు ఆ గ్రామానికి ఆదాయ మార్గంగా మారిందన్నారు. ఈమేరకు ఆదివారం మంత్రిని కలిసి సర్పంచ్ దంపతులు తమ గ్రామంలో తయారు చేసిన వర్మీకంపోస్ట్ను అందజేశారు. ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ, దాన్ని వర్మీకంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా ఈ గ్రామ సర్పంచ్ గాడిగె మీనాక్షి ఏడాదిన్నరలో రూ.7 లక్షల ఆదాయం సంపాదించారు. ఇందులో రూ.4 లక్షలతో సోలార్ లైట్లు, రూ.2 లక్షలతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఆర్గానిక్ కంపోస్ట్ తయారు చేయడమే కాకుండా దానిద్వారా వచ్చే లాభాలను రైతులకు వివరించడం ద్వారా వంద మంది ఆ గ్రామంలో ఆర్గానిక్ పంటలు పండిస్తున్నట్లు సర్పంచ్ వివరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి గ్రామ సర్పంచ్ను అభినందించారు. పల్లెప్రగతి స్ఫూర్తిని అర్థం చేసుకుని ప్రతి పల్లె స్వయం సమృద్ధంగా మారాలని, పరిశుభ్రంగా ఉంటూ, పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. -
రైతుగా మారిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
-
Video: హలం పట్టి.. పొలం దున్నిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
సాక్షి, వరంగల్: హలంపట్టి.. పొలం దున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ జిల్లా స్వగ్రామం పర్వత గిరిలోని సొంత పొలంలో జరుగుతున్న పనులను మంగళవారం పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రైతుగా అవతారమెత్తాడు. అరక చేత పట్టి ఎడ్లను అదిలిస్తూ పొలం దున్నారు. మహిళా కూలీలతో కలిసి..వారి పాటలకు గొంతు కలిపి నాట్లు వేశారు. -
రైతుగా మారిన ఎర్రబెల్లి దయాకర్ రావు
-
అశ్రునయనాలతో తుది వీడ్కోలు
రాయదుర్గం(హైదరాబాద్): అశ్రునయనాల మధ్య సినీనటుడు కైకాల సత్యనారాయణకు కుటుంబసభ్యులు, అభిమానులు తుదివీడ్కోలు పలికారు. ఆయన పార్థివదేహానికి రాయదుర్గంలోని మహాప్రస్థానంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో పోలీసు బందోబస్తు, లాంఛనాలతో ఆయన పార్థివదేహాన్ని మహాప్రస్థానానికి తీసుకొచ్చారు. సత్యనారాయణ చితికి ఆయన పెద్ద కుమారుడు రామారావు నిప్పు అంటించారు. అంత్యక్రియలకు బంధువులు, కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ నాయకులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జూబ్లీహిల్స్లోని కైకాల నివాసానికి వెళ్లి పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశం మేరకు కైకాల అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనాన్ని సమర్పించి గాలిలోకి మూడుసార్లు తుపాకులతో కాల్పులు జరిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు బాలశౌరి వల్లభనేని, టీటీడీ సభ్యుడు దాసరి కిరణ్, ప్రజాగాయకుడు గద్దర్, సినీనిర్మాత అల్లు అరవింద్తోపాటు పలువురు రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. కైకాల కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం... వైకుంఠ మహాప్రస్థానంలో కైకాల పార్థివదేహానికి నివాళి అర్పించిన అనంతరం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలు అనే తేడా లేకుండా అన్ని సినిమాల్లో దాదాపు ఆరు దశాబ్దాలపాటు నటించి ప్రేక్షకులను మెప్పించారని కొనియాడారు. ‘గుడివాడలో ఉన్న కైకాల కళాక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి చిరస్థాయిగా నిలిపే విధంగా కృషి చేస్తాను. ఆయన స్వగ్రామం కౌతవరంలో ఆయన పేరు మీద ఒక కమ్యూనిటీ హాలు నిర్మించటానికి సాయం చేస్తాను. గుడివాడలో కైకాల సత్యనారాయణ కళాక్షేత్రం అని ఉంది. ఆ కళాక్షేత్రాన్ని మరింతగా డెవలప్ చేసి ఆయన పేరును చిరస్థాయిగా నిలిపేవిధంగా ఒక పార్లమెంట్ సభ్యునిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’అన్నారు. -
TS: ప్రతి మండలంలో మహిళా వేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి మండలంలో మహిళా వేదికను నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. రైతుల కోసం రైతు వేదికలను నిర్మించినట్టే మండలానికి, వీలైతే కొన్ని గ్రామాలకు కలిపి మహిళా భవనాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని తెలిపారు. ఏపీమాస్, ఎనేబుల్, నాబార్డ్ల సంయుక్త ఆధ్వర్యంలో మూడు దశాబ్దాలుగా స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జీ)తో బ్యాంక్ లింకేజీ ప్రక్రియ విజయవంతంగా సాగుతున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని ఎంసీఆర్హెచ్ఆర్డీఐలో శుక్ర, శనివారాల్లో జాతీయస్థాయి సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన పలు రాష్ట్రాలకు చెందిన 17 మహిళా సంఘాలకు మంత్రి అవార్డులను అందజేశారు. అనంతరంమాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 17,978 మహిళా స్వయం సహాయక సంఘాలు కొనసాగుతున్నాయని, ఇందులోని సభ్యులందరికీ ఉపయోగపడేలా మహిళా భవనాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. స్వయం సహాయక బృందాల్లో స్త్రీనిధి ద్వారా ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.3 లక్షల రుణాలు తీసుకుంటున్నారని చెప్పారు. రుణాలు తీసుకున్న మహిళలు దురదృష్టవశాత్తు చనిపోతే వారి రుణాలను మాఫీ చేయాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు చెందిన కామారెడ్డి మండల మ్యూచువల్ ఎయిడెడ్ సహకార సమాఖ్యకు మొదటి బహుమతి, దక్షిణ భారతదేశ కేటగిరీలో హనుమకొండ జిల్లా బ్రహ్మదేవరపల్లి మండల మ్యూచువల్ ఎయిడెడ్ సహకార సమాఖ్యకు రెండో బహుమతి రావడంతో మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ సుల్తానియా పాల్గొన్నారు. -
గ్రామీణ రోడ్లకు మహర్దశ తేవాలి
సాక్షి, హైదరాబాద్/ ఏజీ వర్సిటీ: ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామీణ రోడ్లకు మహర్దశ తీసుకురావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖలను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, రాష్ట్రంలో 67వేల కి.మీ. మేర ఉన్న పీఆర్ రోడ్ల అభివృద్ధిలో ఇంజనీరింగ్ అధికారులు భాగస్వాములు కావాలన్నారు. టీఎస్ఐఆర్డీ పీఆర్ కార్యనిర్వాహక, పర్యవేక్షక ఇంజనీర్లకు రోడ్ల అభివృద్ధి, నిర్వహణపై శనివారం ఏర్పాటు చేసిన వర్క్షాప్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు తొలి ప్రాధాన్యత ఇస్తూ వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఇందుకోసం రూ.3 వేల కోట్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరో రూ.3 వేల కోట్లతో అవసరాన్ని బట్టి ప్రాధాన్యత గల కొత్త రోడ్లను గుర్తించి వచ్చే ఏడాదికీ ప్రతిపాదనలు ఇప్పటినుంచే సిద్ధం చేయాలని ఆదేశించారు. పంచాయితీరాజ్ శాఖ రీ ఆర్గనైజేషన్ కోసం అనుభవజ్ఞుల సూచనలు, సలహాలతో ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. అటవీ భూముల విషయంలో సమస్యలు గుర్తించి ఈఎన్సీ దృష్టికి తేవాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బీటీ రోడ్ల ఏర్పాటు కోసం ఇతర దేశాలకు వెళ్లి పరిశీలించాలని సూచించారు. బీటీ రోడ్లకు మెటీరియల్ను వైజాగ్ నుంచి రప్పించడంతో రవాణా ఖర్చు పెరుగుతున్నందున రాష్ట్రంలో స్టాక్ యార్డ్ ఏర్పాటును ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. పీఆర్, ఆర్డీ శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, గ్రామీణ రోడ్ల నిర్వహణకు ఈనెల 22లోగా ప్రతిపాదనలు సమర్పించాలని, వెంటనే పాలనాపరమైన అనుమతి మంజూరు చేస్తామని చెప్పారు. టెండర్ల ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేసి డిసెంబర్ 10 వరకు పనులు గ్రౌండ్ కావాలని ఇంజనీర్లకు సూచించారు. పెండింగ్ ఉపాధి వేతనాలు విడుదల చేయండి రాష్ట్రానికి పెండింగ్లో ఉన్న ఉపాధిహామీ కూలీల వేతనాలు రూ.110.35 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి గిరిరాజ్సింగ్కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విజ్ఞప్తిచేశారు. ఈమేరకు శనివారం ఆయన లేఖ రాశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి రాష్ట్రంలో ఉపాధిహామీ కూలీ పనులు చేసిన వారికి వేతనాలు విడుదల కాలేదని తెలిపారు. రెండు నెలలుగా 1.25 లక్షల మంది ఉపాధి కూలీలకు వేతనాలు అందకపోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఎర్రబెల్లి వివరించారు. -
స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి: ఎర్రబెల్లి
ఖైరతాబాద్: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. పేదరిక నిర్మూలన సంస్థ ‘సెర్ప్’ ఆధ్వర్యంలో గురువారం నెక్లెస్రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటుచేసిన సరస్ –2022 ఎగ్జిబిషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప్రతి మండలంలో, జిల్లా కేంద్రాలలో ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసి మహిళల ఉత్పత్తులను మరింత ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నెల 28 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 32 జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం 300 స్టాల్స్ను ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ రద్దుకు కేంద్రం కుట్ర
గన్ఫౌండ్రీ (హైదరాబాద్): గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుకు కేంద్రం కుట్ర చేస్తోందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. ఉపాధి హామీ పై కేంద్రం వైఖరిని నిరసిస్తూ సమష్టిగా జాతీ యస్థాయిలో పోరాటం చేస్తామన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ వ్యవ సాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు–సవాళ్లు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీజేపీయే తర రాష్ట్రాలపై కేంద్రం కక్ష సాధింపునకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఉద్దేశపూర్వ కంగానే రాష్ట్రాలకు కఠిన నియమాలు పెడు తూ వేధిస్తోందన్నారు. కేరళ మంత్రి ఎంబీ రాజేశ్ మాట్లాడుతూ.. కూలీల కోసం ఏ సౌక ర్యం కల్పించాలన్నా కేంద్రం అడ్డుపడుతోందని చెప్పారు. రాష్ట్రాలపై కేంద్రం అనుసరి స్తున్న తీరుకు నిరసనగా తెలంగాణ చేపట్టే అందోళనలకు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్ర మంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య, ప్రధాన కార్య దర్శి వెంకట్రాములు, మేట్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.ప్రసాద్తోపాటు సీపీఎం జాతీ య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ఎనిమిదేళ్లలో మోదీ ఏం చేశారు: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను పచ్చిగా మోసగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో బుధవారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బేతి సుభాష్రెడ్డి, ఎమ్మెల్సీలు గంగా ధర్గౌడ్, బండా ప్రకాశ్, ఎగ్గె మల్లేశంతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను విస్మరించడంతో పాటు రాష్ట్రానికి రావలసిన నిధులను ప్రధాని ఆపివేశారని ఆరోపించారు. వాటి సంగతి తేల్చిన తర్వాతే ప్రధాని రాష్ట్రంలో అడుగు పెట్టాలని కోరారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీకి సంబంధం లేనప్పుడు ఎందుకు కోర్టుకు వెళ్లిందని ప్రశ్నించారు. టీడీపీలో చంద్రబాబు కంటే తానే సీనియర్నని ఒక ప్రశ్నకు సమాధానంగా ఎర్రబెల్లి స్పష్టం చేశారు. -
ఆకుపట్టి.. కల్లు తాగిన మంత్రి.. టేస్ట్ సూపరుంది!
సాక్షి, పాలకుర్తి(జనగాం జిల్లా): రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కల్లు తాగారు. కుండతో కల్లు వంచుతుంటే.. మంత్రి ఆకుపట్టి కల్లు సేవించి సురాపానకం టేస్ట్ సూపరుందని గౌడ్ను అభినందించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి, అయ్యంగార్పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. సమస్యలు అడిగి తెలుసుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. దారిలో తాటివనం వద్ద గౌడ్ కులస్తులను చూసి కారు ఆపి చెట్ల కిందకు చేరారు మంత్రి. ఈత చెట్టు కింద కూర్చొని నీరాకల్లు సేవించారు. ప్రకృతి సిద్ధమైన ఔషధం నీరా కల్లు అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గౌడ సంక్షేమానికి నీరాకల్లును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే నీరా కల్లు ఇచ్చే ఈత చెట్లను అన్ని గ్రామాల్లో పెట్టిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో కొందరు చీడపురుగులు ఉంటారని, చేసింది చెప్పకుండా చేయంది ఏగేసి చెప్పడంతో ప్రజలు అదే నిజమని నమ్ముతారని తెలిపారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కరి బతుకులు బాగుపడ్డాయని, రైతుల కోసం 20 వేల కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ను ఎవరైనా విమర్శిస్తే రైతులే సరైన సమాధానం చెప్పాలని కోరారు. చదవండి: మునుగోడు ఫలితాలు.. లెక్క తప్పిందెక్కడ? -
అయ్యో ఇలా అయితే ఎలా.. ప్రకటించిన రోజే పార్టీ పేరు మార్చేస్తే..
సాక్షి, తొర్రూరు: సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ పేరును రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మరిచిపోయారు. బుధవారం రాత్రి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు దసరా ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పెట్టిన కొత్త పార్టీ ఏమిటని.. ప్రజలను ప్రశ్నించగా.. ఒకరు బీఎస్పీ అని సమాధానమిచ్చారు. మంత్రి సైతం బీఆర్ఎస్ బదులు బీఎస్పీ అని పలకడం విశేషం. ఆయన పార్టీ పేరు మరిచిపోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: (KCR BRS Party: 'బీఆర్ఎస్ అభ్యర్థులతో పోటీ చేయించబోం') -
వరంగల్ తూర్పులో టీఆర్ఎస్కు తప్పని తలనొప్పి.. పాలకుర్తిలో కొండా రెడీ?
ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రస్తుతం టిఆర్ఎస్ కోటగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఒంటెద్దు పోకడతో గులాబీ గూటిలో ముసలం పుట్టి గ్రూప్ రాజకీయాలతో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అధికార పార్టీ లోని గ్రూప్ రాజకీయాలను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మూడున్నరేళ్ళలో మారిన పరిణామాల కారణంగా.. నన్నపనేని నరేందర్ కి పోటీగా బస్వరాజ్ సారయ్య, గుండు సుధారాణి రేస్లో వుండే అవకాశం లేకపోలేదు. ఒకరంటే ఒకరికి పడక వర్గపోరు తీవ్రం అవుతుండడంతో టిఆర్ఎస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇటీవల పార్టీని వీడటం మరో ఇబ్బంది. సురేఖకు అదే ప్లస్! కాంగ్రెస్ పార్టీ నుండి ప్రస్తుతానికి కొండా సురేఖ ఒక్కరే పోటీలో కనిపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పద్మశాలి సామాజికవర్గం ఓట్లు ఎక్కువ ఉండడం కొండా సురేఖకి కలిసివచ్చే అంశం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం పాలయింది.వరంగల్ తూర్పుతో పాటు పరకాల, పాలకుర్తి నియోజకవర్గాలు తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కొండా ఫ్యామిలీ కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, టిఆర్ఎస్ లో వర్గ పోరు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 4 వేల ఓట్లకు పరిమితమైన బీజేపీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 45 వేల ఓట్ బ్యాంక్ సాధించుకోగలిగింది. తూర్పు ప్రజలు బీజేపీకి కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేకపోవడం ఆ పార్టీకి మైనస్ పాయింట్ గా మారింది. అయితే ఇది పూర్తిగా అర్బన్ ప్రాంతం కనుక బీజేపీకి కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. రంగంలో కొండా? పాలకుర్తి నియోజకవర్గం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు కంచుకోట. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే గా దయాకర్ రావు ను దీవించడం నియోజకవర్గ ప్రజలకు పరిపాటిగా మారింది. విపక్ష అభ్యర్థుల బలహీనతలను అనుకూలంగా మార్చుకుని ఎర్రబెల్లి జయకేతనం ఎగురవేస్తున్నారు. దయాకర్ రావును ఢీకొట్టే సరైన నాయకుడు ఇతర పార్టీల్లో లేకపోవడం ఆయనకు కలిసోస్తుందనే అభిప్రాయం వ్యక్త మవుతుంది. కానీ రాబోయే ఎన్నికల్లో మంత్రికి చుక్కలు చూపేందుకు రాజకీయ ప్రత్యర్ధి కొండా మురళి కాంగ్రెస్నుంచి బరిలో దిగుతారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ నుండి గత ఎన్నికల్లో పెదగోని సోమయ్య పోటీ చేసి ఓడిపోయారు. ఎర్రబెల్లి సుధాకర్ రావు , యతిరాజారావు కుటుంబం నుండి ఒకరు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎవరు పోటీ చేసినా బీజేపీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.