
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు తెలంగాణ పోలీస్ శాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2009 నుంచి 2014 జూన్ రెండో తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసుల వివరాలు సమర్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమీషనర్లను తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఆదేశాలు జారీ చేశారు.
2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ రెండవ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల కేసులను ఎత్తివేయనుంది.
ఇది కూడా చదవండి: దింపుడు కళ్లెం ఆశలన్నీ ఆవిరి..!