తెలంగాణకు కింగ్‌ఫిషర్‌ బీర్లు బంద్‌ | Ub Has Announced That It Is Stopping Supply Of Beers To Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు కింగ్‌ఫిషర్‌ బీర్లు బంద్‌

Jan 8 2025 3:58 PM | Updated on Jan 8 2025 8:18 PM

Ub Has Announced That It Is Stopping Supply Of Beers To Telangana

సాక్షి, హైదరాబాద్‌: పండుగ ముందర మద్యం ప్రియులకు చేదు వార్త.  తెలంగాణ బెవరేజస్‌ కార్పొరేషన్‌(TSBCL)కు బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌(యూబీ)ప్రకటించింది. దీంతో ఆ సంస్థ నుంచి రాష్ట్రానికి వచ్చే కింగ్‌ఫిషర్‌(King Fisher), హెనికిన్‌ బీర్ల సరఫరా ఆగిపోనుంది. 

తెలంగాణ బెవరేజస్‌ కార్పొరేషన్‌ నుంచి తమకు రూ.900 కోట్లు బకాయి ఉందని, పైగా 2019 నుంచి ధరలను సవరించకపోవడంతోనే యూబీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు సెబీకి లేఖ ద్వారా తెలిపింది.

కాగా, రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడయే బీర్‌ బ్రాండ్‌ కింగ్‌షిషరే. తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ యూబీ సంస్థకు ప్రతి 45 రోజులకోసారి బకాయిలు చెల్లించాల్సి ఉండగా, నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.

తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లపై 35 శాతం రేట్లు పెంచాలని బేవరేజ్ కార్పొరేషన్‌ను యునైటెడ్ బ్రూవరీస్‌ కోరింది. యునైటెడ్ బేవరేజస్‌ ప్రతిపాదనలపై గతంలోనే కమిటీని ప్రభుత్వం నియమించింది. రిటైర్డ్ జడ్జిలతో వేసిన కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. యునైటెడ్‌ బేవరేజస్ ప్రతిపాదనలతో మందు బాబులపై ఆర్థిక భారం పెరగనుంది. మద్యం ప్రియులపై భారం పడకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్కు బీర్ల సప్లై నిలిపివేత

ఇదీ చదవండి: ఫ్యూచర్‌ సిటీ.. పోలీసుల పోటీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement