తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ .. లిస్ట్‌లో మీ పేరు లేదా? | Uttam Kumar Reddy Comments On New Ration Card In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డ్‌లు.. లిస్ట్‌లో మీ పేరు లేదా? అయితే ఈ పని చేయండి

Published Mon, Jan 20 2025 8:04 PM | Last Updated on Tue, Jan 21 2025 10:15 AM

Uttam Kumar Reddy Comments On New Ration Card In Telangana

సాక్షి,హైదరాబాద్‌ : కొత్త రేషన్ విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారం చేస్తున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కొత్త రేషన్‌ కార్డుల పంపణీ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. ఆహార భద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణలో 2 కోట్ల 81 లక్షల మందికి...90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో 60వేలు మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారు. కొత్త, పాత ప్రక్రియ పూర్తి అయ్యాక 40లక్షల మంది రేషన్ లబ్ధి జరుగుతుందని మా అంచనా.

రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి కాగానే ప్రతీ వ్యక్తికి ఆరు కిలోల రేషన్ కూడా సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. సన్న బియ్యం పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.11వేల కోట్ల భారం పడుతుంది. ప్రజా పాలన, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తున్నాం. లిస్ట్‌లో పేర్లు రాని వాళ్ళు ప్రజావాణి, గ్రామ సభల్లో దరఖాస్తులు చేసుకోవాలి.

హరీష్ రావు దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు బీఆర్‌ఎస్‌ మోసం చేసింది. ఇప్పుడు మేము చేస్తుంటే అడ్డుకుంటున్నారు.
కృష్ణ ట్రిబ్యునల్‌ అంశంపై బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హరీష్‌ రావు  చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.

నీళ్ల వారాల్లో కేసీఆర్,హరీష్ రావు లిఖిత పూర్వకంగా సంతకాలు పెట్టారు. పోతిరెడ్డి పాడు, రాయసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కళ్లు మూసుకుని ఉన్నారు. కేసీఆర్‌ పాలనలో కృష్ణా జలాల నీటి వాటాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. 298 టీఎంసీలకు సంతకాలు చేసిన డాక్యుమెంట్స్‌ ఉన్నాయని’ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement