
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్లో దివంగత మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట వ్యవహరాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, చైర్మన్లు దామోదర్ రాజనర్సింహ, మహేశ్వర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్కుమార్, మహేశ్కుమార్ పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు.