మొయినాబాద్ రూరల్: చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందరరాజన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆలయాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నిజాం ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ దేవాదాయ, ధర్మదాయ క్రమబద్ధీకరణ ప్రకారం కీ.శే. శఠగోపాలచారి చిలుకూరు బా లాజీ దేవాలయానికి హక్కుదారునిగా ఉన్నా రని అన్నారు. తమ పూర్వీకుల నుంచి తరతరా లుగా తమ కుటుంబమే దేవాలయ నిర్వ హణ బాధ్యతలు చూస్తున్నామని గుర్తుచేశారు. దైవం అస్తిత్వాన్ని దెబ్బతీసే వారికి దేవాలయ నిర్వహణలో హక్కుకానీ దైవ సంబంధమైన అంశాలపై మాట్లాడే అర్హత కానీ లేవన్నారు.
ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందరరాజన్
Comments
Please login to add a commentAdd a comment