Vikarabad District News
-
పన్ను వసూళ్లలో శ్రద్ధ తీసుకోవాలి
తాండూరు టౌన్: పన్ను వసూళ్లలో శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహా రెడ్డి పేర్కొన్నారు. మార్చి నెలాఖరు వరకు వందశాతం పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం మున్సిపల్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఉద్యోగులు, వార్డు ఆఫీసర్లు, ఆర్పీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్, నల్లా, ఆస్తి పన్నుల వసూళ్లలో మున్సిపాలిటీ వెనుకబడి ఉందన్నారు. పట్టణంలోని వార్డులన్నింటికీ వార్డు ఆఫీసర్లను నియమించామని, వారికి ఆర్పీలు సైతం సహకరిస్తారన్నారు. వార్డుల్లో కలియ తిరుగుతూ మార్చి నెలాఖరు వరకు వందశాతం పన్ను వసూళ్లను చేయాలని ఆదేశించారు. అలాగే వార్డుల్లోని పారిశుద్ధ్యం, ఇంటింటికి చెత్త సేకరణ తదితర విషయాలపై కూడా వార్డు ఆఫీసర్లు దృష్టి సారించాలన్నారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఆర్వో అశోక్, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహా రెడ్డి -
మూగజీవాల మృత్యు ఘోష!
దౌల్తాబాద్: ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవాలు బలవుతున్నాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు కంచెలు ఏర్పాటు చేయకపోవడంతో షాక్కు గురై మృత్యువాత పడుతున్నాయి. వీటిపైనే ఆధారపడిన రైతులు జీవనోపాధి కోల్పోతున్నారు. మండలంలో 33గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సుమారు 300వరకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో ప్రధాన రహదారులు, వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాల్లోని ఆయా కూడళ్లలో ట్రాన్స్ఫార్మర్లకు ఇప్పటి వరకు కంచెలు ఏర్పాటు చేయలేదు. ఈ విషయంలో అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. దీంతో అటుగా వెళ్తున్న మూగజీవాలు విద్యుత్షాక్కు బలవుతున్నాయి. దౌల్తాబాద్ గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన ఎద్దు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తాకి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ రైతు రూ.60వేలు నష్టపోయాడు. మూడున్నరేళ్లు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందలేదని బాధిత రైతు వాపోయాడు. తాజాగా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఓ రైతు గేదె ట్రాన్స్ఫార్మర్కు తగిలి మృతి చెందింది. గతేడాది గోకఫసల్వాద్ గ్రామానికి చెందిన రైతువి రెండు ఎద్దులు ట్రాన్స్ఫార్మర్కు తగిలి మృత్యువాత పడ్డాయి. కొన్నింటికి మాత్రమే కంచె.. గతంలో కంచెలేని ట్రాన్స్ఫార్మర్లపై పత్రికల్లో కథనాలు రావడంతో స్పందించిన ప్రభుత్వం ఇనుప కంచెలను మంజూరు చేసింది. మిగతా వాటికి ఎప్పుడు ఏర్పాటు చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో అత్యవసర పరిస్థితుల్లో ట్రాన్స్ఫార్మర్ల వద్దకు పోలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. విద్యుత్ షాక్తో చనిపోతున్న పశువులు ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు చేయకపోవడంతోనే ఘటనలు జీవనోపాధి కోల్పోతున్న పాడి రైతులు పట్టించుకోని అధికారులు కంచెలు ఏర్పాటు చేయిస్తాం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే కంచె ఏర్పాటు చేయిస్తాం. మంజూరైన వాటికి ఏర్పాటు చేయించాము. కొన్నింటికి మంజూరు కాలేదు. నిధులు మంజూరైతే ఏర్పాటు చేయిస్తాం. రైతులు పశువులపై జాగ్రత్తలు వహించాలి. మృతి చెందిన వాటికి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు కొన్నింటికి నష్టపరిహారం అందజేశాం. – మహిపాల్, ఏఈ, దౌల్తాబాద్ -
వైభవంగా శివపార్వతుల కల్యాణం
తాండూరు రూరల్: మండల పరిధిలోని బెల్కటూర్ గ్రామంలో మల్లికార్జున దేవాలయంలో శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఆలయంలో స్వామివారికి సుప్రబాత సేవ, ధ్వజారోహణం, కలశపూజ, గణపతిపూజలు చేశారు. కల్యాణంలో అల్లిపూర్ వెంకటేష్–భాగ్యశ్రీ, పట్లోళ్ల శంకర్–అనిత, గాండ్ల సంగప్ప, శివలక్ష్మీ, సంతోష్–అన్నపూర్ణదేవి, సుధీర్–సుశీల దంపతులు పాల్గొన్నారు. మఠం రాజేశ్వరయ్య ఆధ్వర్యంలో కల్యాణాన్ని నిర్వహించారు. బెల్కటూర్ గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, శివస్వాములు కల్యాణాన్ని తిలకించారు. శివస్వాముల భజన పాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం స్వామివారికి నైవేద్యం, అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో మల్లికార్జున దేవాలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బెల్కటూర్, చిట్టిఘనాపూర్, చంద్రవంచ, కరన్కోట్, ఓగిపూర్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పూజలు బెల్కటూర్లో నిర్వహించిన శివపార్వతుల కల్యాణంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జున దేవాలయ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేను శివస్వాములు కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్రెడ్డికి భక్తులు, శివస్వాములు శాలువా కప్పి, పూలమాల వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగప్ప, నాయకులు నారాయణరెడ్డి, గాండ్ల సంగప్ప, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మనోహర్రెడ్డి బెల్కటూర్లో ఆధ్యాత్మిక వాతావరణం -
ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు
తాండూరు టౌన్: ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగని వాసవి మహిళా సంఘం తాండూరు అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం పాత తాండూరులోని ప్రభుత్వ నంబర్ 2 పాఠశాలలోని పదోతరగతి విద్యార్థులకు సంఘం తరుఫున పరీక్ష ప్యాడ్లు, జామెట్రీ బాక్సు తదితర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, సంఘం సభ్యులతో కలిసి పాఠఽశాల ఆవరణలో మొక్క నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆడపిల్లలు చదువుకుంటే కుటుంబంలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తారన్నారు. చిన్ననాటి నుంచే అత్యున్నత లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య సాధనకోసం కృషి చేయాలన్నారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున ఏకాగ్రత, పట్టుదలతో చదివి ఉత్తమ మార్కులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి మంకాల్ స్వప్న, కోశాధికారి సింగంశెట్టి శోభ, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు నాగలక్ష్మి -
అంతారం అర్బన్పార్కులో తనిఖీలు
అటవీశాఖ పనులపై ఆరా తాండూరు రూరల్: తాండూరు మండలం అంతారంగుట్ట సమీపంలోని అంతారం అర్బన్పార్కును అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. శుక్రవారం అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్, డీఎఫ్ఓ శ్రీనివాస్ రావు, రేంజ్ ఆఫీసర్ విష్ణు, బీట్ ఆఫీసర్లు శ్రీకాంత్, నగేష్ బృందంతో అర్బన్ పార్కును చేరుకుని అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అర్బన్ పార్కులో వాకింగ్ పాత్, కమాన్ పనులతో పాటు పార్కు చుట్టు ఫెన్షింగ్పనులు కూడా పరిశీలించారు. అభివృద్ధి పనుల విషయమై గతంలో ఆరోపణలు రావడంతో అప్పట్లో అటవీశాఖ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేయడంతో అటవీశాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఈ కార్యక్రమంలో తాండూరు రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి సరస్వతి, సెక్షన్ ఆఫీసర్ ఫిర్యానాయక్, సెక్షన్ ఆఫీసర్ మల్లయ్యలతో పాటు అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. పశువుల ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం షాబాద్: పశువుల ఆరోగ్యం పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని రేగడి దోస్వాడ పశువైద్యాధికారి చంద్రశేఖర్రెడ్డి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని పోతుగల్ గ్రామంలో పశువుల వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో 12 పాడి ఆవులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు చేశారు. 26 పశువులకు చూడి పరీక్షలు నిర్వహించి, 30 దూడలు, గేదెలకు నట్టల నివారణ మందులు తాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సకాలంలో పశువులకు వైద్యం అందిస్తే అధిక పాల దిగుబడి వస్తుందని తెలిపారు. మేలు రకం పశువుల ఎంపిక ద్వారా ఆదాయం పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో గోపాలమిత్ర విద్యాసాగర్, వైద్య సిబ్బంది శ్రీనివాస్, సుధాకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
బంట్వారం: మర్పల్లి వ్యవసాయ మార్కెట్ను జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఏఎంసీ చైర్మెన్ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బంట్వారం మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేఽశంతో కలిసి మేకల సంతను ప్రారంభించి మాట్లాడారు. ఎకరానికి పైగా ప్రభుత్వ స్థలంలో సంతను ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. త్వరలోనే ఫెన్సింగ్ వేయిస్తానన్నారు. జీవాలకు తాగు నీటి తొట్టీలు కట్టించి సంతలో సీసీ రోడ్డు నిర్మిస్తానన్నారు. పూర్తి స్థాయిలో అవసరమైన వసతులు కల్పిస్తానన్నారు. వ్యాపారులు కొనుగోలుదారులు, అమ్మకందార్లు మేకల సంతను సద్వినియోగం చేసుకోవాలని మహేందర్రెడ్డి సూచించారు. అలాగే తొర్మామిడిలో రూ.1.50 కోట్లతో రైతు గోడౌన్ నిర్మించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేశం, ఏఎంసీ వైస్ చైర్మెన్ మల్లేష్యాదవ్, మర్పల్లి సొసెటీ వైస్ చైర్మెన్ ఫసియోద్దీన్, పార్టీ సీనియర్ లీడర్ మొగులయ్య, డైరెక్టర్లు యాదగిరి, శాకం నర్సింలు, ఇసాక్, గాండ్ల నర్సింలు, హరీశ్వర్రెడ్డి, రాములు, శ్రీనివాస్రెడ్డి, ఎన్.నర్సింలు, మున్నాబాయ్, అజీమ్, గౌస్, అరుణ్, పి.వెంకటయ్య, సుదర్శన్, పాండునాయక్, శంకర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మెన్ మహేందర్రెడ్డి -
విద్యార్థులకు అల్పాహారం అందజేత
కుల్కచర్ల: రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నర్సింలు యాదవ్ విద్యార్థులకు వారానికి ఒకసారి అల్పాహారం అందజేస్తున్నారు. శుక్రవారం ఉదయం పాఠశాల విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాఠశాల ప్రారంభ సమయంలో విద్యార్థులకు అల్పాహారం అందజేయడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు. విద్యార్థుల ఉన్నతికి ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. కొనసాగుతున్న కబడ్డీ పోటీలు అనంతగిరి: వికారాబాద్ పట్టణం గౌలికార్ ఫంక్షన్ హాల్లో ప్రారంభమైన సబ్జూనియర్ అంతర్జిల్లాల కబడ్డీ బాలబాలికల చాంపియన్ షిప్ పోటీలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని ఆయా జిల్లాల నుంచి వచ్చిన కబడ్డీ క్రీడాకారులు శుక్రవారం లీగ్ మ్యాచ్లు ఆడారు. క్రీడాకారులు తమ ఆటలో నైపుణ్యాన్ని ప్రదర్శించి తమ సత్తాను చాటుతున్నారు. శనివారం నాకౌట్ దశకు చేరుకుంటాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పరుశరాం, వినోద్లు తెలిపారు. మాతృభాష తల్లివంటిది కుల్కచర్ల: మాతృభాష తల్లివంటిదని కస్తూర్బాగాంధి బాలికల ఆశ్రమ పాఠశాల ప్రత్యేకాధికారి దేవి అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని కేజీబీవీలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతీ ఒక్కరికి సొంత భాషపై అభిమానం ఉంటుందని, సొంత భాషను తమ ఇంటిలా భావిస్తారని పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా, ఇతర ప్రాంతాలకు వెళ్లినా తమ భాష వచ్చిన వారు కలిస్తే తమ బంధువులు కలిసినట్లుగా అనిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు దోమ: అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం దోమ మండల పరిధిలోని శివారెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామంలోని పేద ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో సీఎం రేవంత్రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదువందల ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఐదేళ్ల లోపు 20 వేల ఇళ్లు నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం ఏ పేదవాడికి ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెందిన అభ్యర్థులను గెలిపించుకునేలా ప్రజలు సంసిద్ధం కావాలన్నారు. రూ.25కోట్లు కేటాయించాలి బొంరాస్పేట: పోలేపల్లి ఎల్లమ్మ ఆలయాభివృద్ధికి ప్రభుత్వం రూ.25కోట్లు కేటాయించాలని శుక్రవారం విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం హకీంపేటలో విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ఆలయ అభివృద్ధికి, డబుల్రోడ్డు, తదితర సౌకర్యాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అతిపెద్ద జాతరగా గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విష్ణువర్ధన్రెడ్డి, చాంద్పాషా, శేరినారాయణరెడ్డి, యాదగిరి, నెహ్రూనాయక్,వెంకట నరేందర్ పాల్గొన్నారు. -
నిరుపయోగం.. రైతువేదికలు!
దౌల్తాబాద్: మండలంలోని రైతులకు పంటల సాగులో అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఉపయోగకరంగా ఉంటాయన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతువేదికలు నిర్మించింది. ఈ వేదికలకు సరైన నిర్వహణ లేక పలు క్లస్టర్ గ్రామాల్లో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఈ విషయంలో పట్టించుకునే వారు కరువయ్యారు. ఉన్నతాధికారులు స్పందించి రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన రైతు వేదికలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని మండలంలోని రైతులు కోరుతున్నారు. ఒక్కో రైతువేదికకు రూ.22లక్షల వ్యయం మండలంలోని దౌల్తాబాద్, నందారం, కుదురుమళ్ల, చల్లాపూర్, గోకఫసల్వాద్, దేవర్ఫసల్వాద్, బాలంపేట, బిచ్చాల క్లస్టర్ గ్రామాల్లో రూ.12లక్షలతో ఉపాధి హామీ పథకం కింద, రూ.10లక్షలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్కో రైతువేదిక నిర్మాణానికి రూ.22లక్షలు ఖర్చు చేశారు. బిచ్చాల, దౌల్తాబాద్, గోకఫసల్వాద్ గ్రామాల్లో ఊరికి దూరంగా నిర్మించడంతో వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా... గ్రామాలకు దూరంగా ఉన్న రైతువేదికల వద్ద పలు అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. చీకటి పడిన వెంటనే మద్యం ప్రియులు రైతువేదికల వద్దకు వెళ్లి మద్యం తాగుతున్నారు. కంపౌండ్ వాల్ నిర్మించకపోవడంతో ఇలాంటి పరిస్థితి దాపురిస్తుందని రైతులు వాపోతున్నారు. బిచ్చాల క్లస్టర్ రైతువేదిక గ్రామానికి దూరంగా ఉండడంతో అక్కడ ప్రతి రోజు మద్యం ప్రియులు మద్యం సేవిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోంది. గోకఫసల్వాద్ గ్రామంలో కూడా రైతువేదిక నిర్వహణ లేక అధ్వానంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి రైతువేదికలకు అవసరమైన ఫర్నీచర్తో పాటు విద్యుత్ వసతి, మూత్రశాలలు, మంచినీటి సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు. మండలంలో రూ.1.76 కోట్ల ఖర్చుతో నిర్మాణం రైతులకు చేకూరని ప్రయోజనం ఆందోళన కలిగిస్తున్న నిర్వహణ లోపం పట్టించుకోని అధికారులు రైతుల అవసరాలకే.. మండలంలో నిర్మించిన రైతువేదికలను రైతుల అవసరాలకే వినియోగిస్తున్నాం. క్లస్టర్ స్థాయి ఏఈఓలు రైతువేదికల వద్ద రైతులను సమీకరించి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రైతువేదికల వద్ద ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తాం. – లావణ్య, ఏఓ, దౌల్తాబాద్ -
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
కుల్కచర్ల: నిరుపేద బడుగుబలహీనవర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన రాజుకు సీఎం సహాయ నిధి చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అనారోగ్య సమస్యలు తలెత్తిన సందర్భంలో ఆరోగ్యశ్రీ క్రింద పరిగణలోకి రాని వైద్యచికిత్సలు, ఆస్పత్రి సంబంధిత ఆర్థిక ఖర్చులను పరిగణన లోకి తీసుకుని పేద ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతనిస్తుందన్నారు. వైద్యం కోసం ఇబ్బందులకు గురయ్యే వారికి ప్రభుత్వం తోడుగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జోగు వెంకటయ్య, ఆనందం, తమ్మలి రాంచంద్రయ్య, రాజు, ఎల్లయ్య, వెంకటేష్, నరహరి, శ్రీను, మురళీ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి
దోమ: ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలని ఎంఈఓ వెంకట్ పేర్కొన్నారు. శుక్రవారం దోమ మండల పరిధిలోని రాకొండ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పరిసరాలను చూసి, ఆ తర్వాత రికార్డులను పరిశీలించారు. తదనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారిలో ఉన్న ప్రతిభను పరీక్షించేందుకు ప్రశ్నలు అడుగుతూ బోర్డుపై జవాబులను రాయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పాఠశాలలో తరగతుల వారీగా విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎఫ్ఏ1, ఎఫ్ఏ2, ఎస్ఏ1, ఎస్ఏ3 ఆన్లైన్లో ఎంట్రీ చేయాలన్నారు. బడీడు పిల్లల సమాచారం సేకరించి నెల నుంచి రాని విద్యార్థులను బడికి రప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో టాయిలెట్స్, కంపౌండ్ వాల్, కిచన్షెడ్ లేని వాటిని గుర్తించి వాటి నివేదికలు ఇవ్వాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ సీఆర్పీ తదితరులు పాల్గొన్నారు. ఎంఈఓ వెంకట్ -
తీరని దాహం
మేతకు వెళ్లిన పశువుల దాహార్తి తీర్చేందుకు పొలాలు, బంజరు భూముల్లో నీటి సౌకర్యం కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈజీఎస్(ఉపాధిహామీ పథకం)లో లక్షలాది రూపాయలు వెచ్చించి నీటి తొట్లను నిర్మించింది. వీటి నిర్మాణ బాధ్యతలను ప్రజాప్రతినిధులకు అప్పగించారు. ఇదే అదనుగా భావించిన కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు వారికి ఇష్టమొచ్చిన చోట నిర్మించారు. కొన్ని చోట్ల నాసిరకంగా నిర్మించడంతో మూణ్నాళ్ల ముచ్చటగా మారి శిథిలావస్థకు చేరాయి. వీటిని నిర్మించే సమయంలో నీటి వసతి ఉందో లేదో గమనించలేదు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. మరికొన్ని చోట్ల నీరున్నా.. పైపులైన్ కనక్షన్ లేకపోవటం తదితర కారణాలతో వినియోగంలోకి తీసుకురాలేకపోయారు. దీంతో నీటితొట్ల నిర్మాణ లక్ష్యం నెరవేరలేదు. ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లు ఆరేళ్ల క్రితం ఉపాధిహామీ పథకంలో భాగంగా 18 మండలాల్లో 617 నీటి తొట్లు నిర్మించాలని నిర్ణయించారు.ఒక్కో తొట్టి నిర్మాణానికి రూ.18 వేల చొప్పున రూ.1.39కోట్ల నిధులు మంజూ రు చేసింది. 400 పైచిలుకు తొట్లు నిర్మించి మిగిలినవి వదిలేశారు. వీటిని కాంట్రాక్టర్లే నిర్మించా లనే నిబంధనలున్నప్పటికీ చాలా వరకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులే నిర్మించారు. ఏనా డు వాటిని నీటితో నింపిన దాఖలాలు కనిపించలేదు. జిల్లా వ్యాప్తంగా 6,23,000 మూగజీవాలున్నట్లు పశుసంవర్ధక శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. వాటి దాహార్తి తీర్చకపోగా లక్షలాది రూపాయల నిధులు నిరపయోగం చేశారని పశుపోషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న వాటిలోనైనా నీరు నింపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమన్వయలోపం.. జీవాలకు శాపం పశువులకు నీటి సౌకర్యం కల్పించడానికి ఏర్పాటుచేసిన తొట్లు వినియోగంలోని తెచ్చేందుకు పశుసంవర్ధకశాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అనే చందంగా తయారైంది. తొట్లకు నీటి సరఫరా చేసే విషయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం చర్యలు తీసుకోవాలి. ఇందుకు గ్రామస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ సహకరించాలి. ఈ ప్రక్రియను పశుసంవర్ధకశాఖ పర్యవేక్షించాల్సి ఉంది. వీరిమధ్య సమన్వయలోపం కారణంగా పశువులకు గుక్కెడు నీరు లభించడం కష్టంగా మారింది. కనీసం గ్రామ ప్రజాప్రతినిధులైనా స్పందించి నీటితొట్లను వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. పశువుల దాహార్తిని తీర్చేందుకు గత ప్రభుత్వం ఆరేళ్ల క్రితం నీటి తొట్ల నిర్మాణానికి పూనుకుంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా వీటిని నిర్మించారు. ఒక్కో నీటితొట్టి నిర్మాణానికి రూ.18 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేశారు. ఓ వైపు పశువులు తాగేందుకు నీరు లేక అల్లాడుతున్నా తొట్లను నింపడం లేదు. జిల్లాలోని ఎన్నో గ్రామాల్లో ఇదే పరిస్థితి దాపురించింది. మరి కొన్ని గ్రామాల్లో నేలమట్టం చేసిన దుస్థితి. – వికారాబాద్ రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన నీటి తొట్లు నిర్వహణ లేక నిరుపయోగంగా మారిన వైనం గుక్కెడు నీళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్న మూగజీవాలు -
యాప్రాల్లో దాడికి కుట్ర
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్పై దాడి చేసి, కస్టడీలో ఉన్న వీర రాఘవరెడ్డి విచారణ ముగిసింది. దాడికి సంబంధించిన కీలక విషయాలను పోలీసులు ఆయననుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. 14 రోజుల జుడీషియల్ రిమాండ్లో ఉన్న నిందితుడిని కోర్టు అనుమతితో పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. విచారణ చివరిరోజైన గురువారం ఉదయం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి వీర రాఘవరెడ్డిని నగరంలోని యాప్రాల్కు తీసుకెళ్లారు. రంగరాజన్పై దాడికి ముందు రెండు రోజులపాటు రామరాజ్యం సైన్యంతో యాప్రాల్లోని ఓ ఇంట్లో వీర రాఘవరెడ్డి సమావేశం నిర్వహించాడు. అక్కడే దాడికి కుట్ర జరిగిందనే విషయాలను నిందితుడి నుంచి రాబట్టారు. రెండు రోజుల సమావేశంలో ఏయే అంశాలపై చర్చ జరిగింది? అనే విషయాన్ని పోలీసులు ఆరా తీశారు. రామరాజ్య స్థాపనలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకోసం పనిచేయాలని.. అందుకు సహకరించనివారి అడ్డు తొలగించుకోవాలని వీరరాఘవరెడ్డి సైన్యంతో ప్రతిజ్ఞ చేయించినట్లు సమాచారం. అక్కడి నుంచి నిందితుడిని మణికొండలోని తన నివాసానికి తీసుకెళ్లి పరిశీలించారు. ఇంట్లో పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. అనంతరం రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయానికి తలరించారు. డీసీపీ శ్రీనివాస్, వీర రాఘవరెడ్డిని పలు ప్రశ్నలు అడిగి కీలక విషయాలను రాబట్టారు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చి రంగరాజన్పై దాడి చేయడానికి ముందు ఏం జరిగిందనే విషయాలను తెలుసుకున్నారు. మూడు రోజుల విచారణలో రాబట్టిన కీలక విషయాలతో నివేదిక రూపొందించారు. గురువారం కస్టడీ ముగిసిన నేపథ్యంలో శుక్రవారం అతన్ని కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను సైతం శుక్రవారం కోర్టులో సమర్పించనున్నారు. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ కోసంపనిచేయాలని ప్రతిజ్ఞ రామరాజ్య స్థాపనకు సహకరించని వారిని అడ్డు తొలగించాలని దిశానిర్దేశం పోలీసుల విచారణలో వెల్లడించిన వీర రాఘవరెడ్డి? ముగిసిన మూడు రోజుల కస్టడీ నేడు కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు -
‘ఉపాధి’ని వినియోగించుకోండి
కేశంపేట: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ శ్రీలత సూచించారు. గురువారం మండల పరిధిలోని సంతాపూర్, బోధునంపల్లి, చౌలపల్లి, నిర్ధవెళ్లి గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన నర్సరీలు, ఫార్మేషన్ రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ఉపాధి పనుల్లో కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూ చించారు. నిబంధనల ప్రకారం పనిచేస్తే రోజు కూలీ రూ.300 పొందే అవకాశం ఉందని తెలిపారు. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వన మహో త్సవాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన మొక్కలను అందుబాటులో ఉంచాలని ఆదేశించా రు. ఆమె వెంట ఏపీడీ శ్రీచరణ్, జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ సంధ్య, ఎంపీడీఓ రవిచంద్రకుమార్రెడ్డి, ఎంపీఓ కిష్టయ్య, ఏపీఓ అజీజ్, టీఏ నీలకంఠబాబు తదితరులు ఉన్నారు. అంతకుముందు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన ‘ఆరోగ్యం– పోషకాహారం’ శిక్షణ సదస్సులో పీడీ ప్ర సంగించారు. డీఆర్డీఏ పీడీ శ్రీలత -
రాజీ మార్గమే రాజమార్గం
అనంతగిరి: జాతీయ లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం వికారాబాద్లోని కోర్టు ఆవరణలో ఆయన జిల్లా పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుగా ఠాణాల వారీగా రాజీకి సిద్ధంగా ఉన్న కేసుల వివరాలపై ఆరా తీసి కేసులు పరిష్కరించాలన్నారు. చిన్న చిన్న తగాదాలు, మోటార్ వాహనాల కేసులు, ఇతర రాజీపడే కేసుల విషయంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి చొరవ తీసుకోవాలన్నారు. రాజీ మార్గమే రాజమార్గమనే విషయాన్ని తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిషోర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్, పీపీలు దీపారాణి, అన్వేష్సింగ్, సమీనాబేగం, జిల్లా ఆబ్కారీ శాఖ అసిస్టెంట్ సూపరిడెంట్ శ్రీనివాస్రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, మోమిన్పేట ఎస్ఐ అరవింద్, సంబంధిత అధికారులు, తదితతరులు పాల్గొన్నారు. -
క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం
● స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ● శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పోటీలను నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్లో 34వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి బాలబాలికల చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తోంది. గురువారం స్పీకర్ ప్రసాద్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు క్రీడలు, వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పెంపొందుతుందన్నారు. ప్రతిభగల క్రీడాకారులకు తమ ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పేందుకు పూనుకున్నారన్నారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి హన్మంత్రావు, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పరుశురాంనాయక్, ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, ఉపాధ్యక్షుడు ఆనంద్, డీసీసీబీ డైరక్టర్ కిషన్నాయక్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు రత్నారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, మురళి, వెంకట్రెడ్డి, పీడీలు, పీఈటీలు, నాయకులు, యువజన నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా గడ్డ మైసమ్మ జాతర
అనంతగిరి: మున్సిపల్ పరిధిలోని దన్నారం గ్రామంలో గడ్డ మైసమ్మ జాతర గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు శాసన సభ స్పీకర్ ప్రసాద్కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు వచ్చిన భక్తులు, బంధుమిత్రులతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఉత్సవాలకు హారైన స్పీకర్ ప్రసాద్కుమార్ ఆలయం వరకు రూ.30లక్షల నిధులు నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. పూజల అనంతరం ఆలయ కమిటీ స్పీకర్ను ఘనంగా సన్మానించంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సుధాకర్రెడ్డి, కిషన్నాయక్, రాంచంద్రారెడ్డి, రత్నారెడ్డి, సత్యనారాయణ, మైపాల్రెడ్డి, చిగుళ్లపల్లి రమేష్కుమార్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ధన్నారంలో భక్తుల కిటకిట ఉత్సవాలకు హాజరైన స్పీకర్ ప్రసాద్ కుమార్ -
అమ్మవారి పాటను ఆవిష్కరించిన కలెక్టర్
బొంరాస్పేట: జగజ్జనని పోలేపల్లి ఎల్లమ్మ ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులు నిర్వహించే ఉత్సవంలో తొలి రోజు కోనేరు లో అమ్మవారి చక్రస్నానం నిర్వహించి డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ పల్లకీసేవ చేపట్టారు. ఉదయంనుంచే భక్తులు పెద్దఎత్తున హాజరై పూజలు చేశారు. నేడే సిడె జాతరలో ప్రధాన ఘట్టమైన సిడె ఉత్సవం శుక్రవారం సాయంత్రం జరగనుంది. సిడె అనే కొయ్యకు నిమ్మకాయలు, పూలతో అలంకరించిన ఊయల కడతారు. ఇందులో అందంగా అలంకరించిన అమ్మవారి ఉత్సవమూర్తిని ఉంచి ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తారు. ఈ సమయంలో భక్తులు అమ్మవారిపై గవ్వలు చల్లుతూ ఎల్లమ్మ తల్లి సల్లంగా చూడమ్మా అంటూ వేడుకుంటారు. ఈ కార్యక్రమానికి లక్షకు పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ఇప్పటికే ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు సిద్ధం చేశామని ఆలయకమిటీ చైర్మన్ జయరాములు, ఈఓ రాజేందర్రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రాక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం తన సొంత నియోజకవర్గంలోని పోలేపల్లి ఎల్లమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని ఎస్పీ నారాయణరెడ్డి వెల్లడించారు. డీఎస్పీలు, సీఐ, పలువురు ఎస్ఐలు, ఇతర కానిస్టేబుళ్లు, ప్రత్యేక బలగాలు జాతరలో మోహరించాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ జాతర ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలు, భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ప్రతీక్జైన్, మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణరెడ్డి, కడా అధికారి వెంకట్రెడ్డి పర్యవేక్షించారు. ముగిసిన చక్రస్నానం, పల్లకీసేవ నేడు ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు భారీగా మోహరించిన పోలీసులు కలెక్టర్, ఐజీ, ఎస్పీల పర్యవేక్షణబ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ చైర్మన్ జయరాములు రూపొందించిన పోలేపల్లి ఎల్లమ్మ దేవత పాటను కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆవిష్కరించారు. ‘ఎల్లు ఎల్లమ్మ రావే’.. అనే పాట భక్త జనాన్ని ఆకట్టుకుంటుందని రచయిత, గాయకుడిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ట్రెయినీ కలెక్టర్ ఉమాహారతి, సింగర్ నర్సింహ, నాయకులు శ్రీనివాస్రెడ్డి, మల్లేశ్, రాంచంద్రారెడ్డి, నర్సింలునాయుడు తదితరులున్నారు. -
రైతు సేవకు మరో అవకాశం
ధారూరు: మరో ఆరు నెలల పాటు మండల రైతులకు సేవ చేసే అవకాశం లభించిందని ధారూరు పీఏసీఎస్ చైర్మన్ వై.సత్యనారాయణరెడ్డి అన్నారు. గురువారం ధారూరు పీఏసీఎస్ కార్యాలయంలో పాలకవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పాలకవర్గ పదవీకాలన్నా మరో ఆరు నెలలు పొడిగించిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, స్పీకర్ ప్రసాద్కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మాణం చేసిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మరో అవకాశంతో పీఏసీఎస్ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. సంఘం ఆధ్వర్యంలో కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయాలని పాలకవర్గం తీర్మాణించిందని చెప్పారు. అనంతరం పాలకవర్గ సభ్యులను సీఈఓ నర్సింలు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు ఎం.శివకుమార్, కె.గోపాల్రెడ్డి, జరీనాబేగం, మల్లమ్మ, రవీందర్, అబ్దుల్కరీం పాల్గొన్నారు. ధారూరు పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి -
ఉపాధిహామీ పనులు ప్రారంభించండి
షాద్నగర్రూరల్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను జిల్లా వ్యాప్తంగా వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య కోరారు. గురువారం పట్టణంలోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలు ఖాళీగా ఉంటున్నారన్నారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉండటంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు పనులను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో చేసిన ఉపాధి పనుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.86 వేల కోట్లను మాత్రమే కేటాయిందన్నారు. ఈ పరిమితిని పెంచాలన్నారు. ఉపాధి కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా రోజూ రూ.700 ఇవ్వాలని, రెండు వందల రోజుల పని దినాలను కల్పించాలని డిమాండ్ చేశారు. టెంట్లు, మంచినీళ్లు, గడ్డపార, పార, రవాణా సౌకర్యం తదితర ఏర్పాట్లను ప్రభుత్వం కల్పించాలన్నారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య, నాయకుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య -
గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్
తాండూరు రూరల్: గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్ అని తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్నాయక్ అన్నారు. గురువారం పెద్దేముల్ మండలం కందనెల్లి తండా సమీపంలోని యాడి బాపుగుట్టపై జాగో బంజార సమాజ్ వ్యవస్థాపకుడు సురేందర్నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఠల్నాయక్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలన్నారు. సొంత ఖర్చుతో సురేందర్ నాయక్ ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. గుట్టపై బోరు వేయించి తనవంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం సురేందర్నాయక్ మాట్లాడుతూ.. రూ.2 కోట్లతో గుట్టపై శివాలయం, జగదాంబ మాత, ఎల్లమ్మ తల్లి ఆలయంను నిర్మిస్తున్నామన్నారు. తన వంతుగా రూ.40లక్షల విరాళం అందజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జాగో బంజార వ్యవస్థాపకులు రమావత్ శాంతిదేవి, గిరిజన బంజార కన్వీనర్ పాండు నాయక్, విద్యుత్ ఏడీ శంకర్నాయక్, మాజీ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్చారి, మదనంతాపూర్ మాజీ సర్పంచ్ లక్ష్మణ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్నాయక్ -
దైవచింతనతో మానసిన ప్రశాంతత
కేశంపేట: దైవ చింతన కలిగి ఉంటేనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని అలివేలుమంగ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అంతర్రాష్ట్ర రెండెద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేర్వేరుగా పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పోటీలను తిలకించారు. అనంతరం గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి మాట్లాడుతూ... గ్రామస్తులు ఐకమత్యంగా వేడుకలు జరపడం ఆనందంగా ఉందన్నారు. పోటీల్లో మొదటి బహుమతి వైపీఆర్ బుల్స్, ఎల్చల ప్రసన్నరెడ్డి, నాదర్గుల్(హైదరాబాద్), రెండో బహుమతి కుందురు రాంభూపాల్రెడ్డి, గంపరమన్నుదిన్నే(నంద్యాల), మూడో బహుమతి కేవీఆర్ బుల్స్, కటకం వెంకటేశ్వర్లు, ఇనిమెట్ల(పల్నాడు జిల్లా), నాలుగో బహుమతి షేక్ మహ్మద్, షేక్ ఫరీద్, బలికురవ(బాపట్ల జిల్లా), ఐదో బహుమతి పావులూరి వీరస్వామి చౌదరి, బలికురవ(బాపట్ల జిల్లా) ఎద్దులు పోటీల్లో ప్రతిభ చూపాయి. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు తాండ్ర విశాల శ్రావణ్రెడ్డి, నాయకులు వీరేష్, వెంకట్రెడ్డి, సురేష్రెడ్డి, జగదీశ్వర్, శ్రీధర్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, అంజిరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి కేశంపేటలో అంతర్రాష్ట్ర రెండెద్దుల బండలాగుడు పోటీలు -
మాదకద్రవ్యాలతో అనర్థాలు
పహాడీషరీఫ్: నేరాల పట్ల అవగాహన పొంది వాటికి దూరంగా ఉండాలని మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి సూచించారు. బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో బుధవారం రాత్రి ఇన్స్పెక్టర్ సుధాకర్తో ఆయన కలిసి విజిబుల్ పోలీసింగ్లో భాగంగా స్థానికులకు నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఆదేశానుసారం నిత్యం ఏదో ఒక బస్తీలో విజిబుల్ పోలీసింగ్ చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్, గంజాయి లాంటి వాటికి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. వాటితో కలిగే నష్టాలను ఈ సందర్భంగా వివరించారు. సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన లింక్లను ఓపెన్ చేయరాదని సూచించారు. రహదారి నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉండాలన్నారు. సెల్ఫోన్లు విరివిగా వాడుతూ దుష్ప్రభావాలకు లోనుకారాదన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మి శాంతి భద్రతల భంగం కలిగించేలా వ్యవహరించకూడదని సూచించారు. కార్యక్రమంలో ఎస్సైలు యూసుఫ్ జానీ, శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి -
తప్పని తాగునీటి కష్టాలు!
తాండూరు రూరల్: వేసవికాలం రాకముందే పల్లెల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. పెద్దేముల్ మండలం ఆత్కూర్ గ్రామంలో గ్రామస్తులు తాగునీటికి తండ్లాడుతున్నారు. వారం రోజులుగా మిషన్ భగిరథ నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. సంగమేశ్వర ఆలయం వద్ద బోరు మోటారు నుంచి గ్రామానికి తాగునీటి పైప్లైన్ ఉంది. ఈ పైప్లైన్ తరచూ లీకేజీలకు గురువుతుంది. తాగునీటి నీటి సమస్యను పట్టించుకునే వారు కరువయ్యారు. ఈ క్రమంలో మళ్లీ కొన్ని రోజుల నుంచి పైప్లైన్ లీకేజీతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. అటు మిషన్ భగిరథ నుంచి నీరు సక్రమంగా రాకపోవడంతో, ఇటు పైప్లైన్ మరమ్మతులకు గురికావడంతో ఆత్కూర్లో తాగునీటి కష్టాలు తప్పడం లేదు. గ్రామంలో ఉన్న సింగిల్ ఫేజ్ మోటార్ల వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామని గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఒక వేళ కరెంట్పోతే ఆ నీరు కూడా పట్టుకోవడం కష్టమౌతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే మూడు నెలలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు దృష్టిసారించి తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పైప్లైన్ లీకేజీతో ఆత్కూర్లో అవస్థలు రెండు రోజులుగా నిలిచిపోయిన నీటి సరఫరా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు పట్టించుకోని అధికారులు సమస్య పరిష్కరిస్తాం... ఆత్కూర్లో నెలకొన్న తాగునీటి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. గ్రామ సమీపంలోని బ్రిడ్జి నుంచి మొయిన్రోడ్డు వరకు కొత్త పైప్లైన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి రూ.2 లక్షలు మంజూరు చేశారు. కాంట్రాక్టర్ ఎవరూ కూడా ముందుకు రావడంలేదు. ఊరు లోతట్టు ప్రాంతంలో ఉండటంతో మిషన్ భగిరథ నీటి సరఫరా ఇబ్బందికరంగా మారింది. కొత్త పైప్లైన్ వేస్తే గ్రామానికి శాశ్వితంగా తాగునీటి సమస్య పరిష్కరించొచ్చు. – అర్చన, పంచాయతీ కార్యదర్శి, ఆత్కూర్ -
డిమాండ్ల సాధనకు సమష్టి కృషి
షాద్నగర్: డిమాండ్ల సాధనకు బీసీలందరూ ఐక్యంగా ముందుకు సాగాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ సూచించారు. గురువారం పట్టణంలోని ఓ హోటల్లో బీసీ సేన జిల్లా అధ్యక్షుడు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన బర్క కృష్ణ మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలు మరింతగా రాణించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల ఐక్యత, సామాజిక న్యాయ సాధనకు తమ సంస్థ అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. హక్కుల పరిరక్షణకు అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగుతూ డిమాండ్లను నెరవేర్చుకోవాలన్నారు. ముఖ్యంగా బీసీ యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో రాణించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం బీసీ సేన నియోజకవర్గ అధ్యక్షుడిగా చంద్రశేఖరప్పను ఎన్నుకున్నారు. సమావేశంలో నాయకులు బాబయ్య, సత్యం, లక్ష్మణ్, రాజు, చందులాల్, శంకరయ్య, జగదీష్ గౌడ్, మల్లేశ్గౌడ్, శివకుమార్, రవి, రాఘవేందర్, రమేశ్, వరప్రసాద్, చందు, సత్యం, హరీశ్కుమార్, నరేశ్, సాయి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ -
ప్రణాళికాబద్ధ్దంగా చదవాలి
జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పరిగి: ప్రతీ విద్యార్థి ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి ఉత్తీర్ణత సాధించొచ్చని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పేర్కొన్నారు. పట్టణ కేంద్రంలోని నంబర్ 1 ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. పదోతరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ఫ్రీఫైనల్ పరీక్షల విధానాలను పరిశీలించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదోతరగతి విద్యార్థులు కష్టపడి చదివి, మంచి ఫలితాలు తీసుకురావాలన్నారు. ఉన్నత చదువులకు పదోతరగతి పునాది లాంటిదన్నారు. కావున చదవుపై ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు కనీసం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు సూచనలు, సలహాలు అందించాలన్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేషించుకుని వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని అన్నారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉన్నత విద్యలో మంచి అవకాశాలు అందుతాయన్నారు. ప్రతీ విద్యార్థికి పదో తరగతి ఎంతో ముఖ్యమన్నారు. చదువులో ఎలాంటి సందేహాలు ఉన్న వెంటనే ఉపాధ్యాయుని సలహాలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను గ్రూపులుగా చేసి చదివిస్తే మంచి ఉత్తీర్ణత సాధించొచ్చన్నారు. ఉపాధ్యాయులు పదోతరగతి విద్యార్థుల పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్ తదితరులు పాల్గొన్నారు. బంట్వారంలో.. బంట్వారం: విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలంటూ ఎంఈఓ చంద్రప్ప ఆకాంక్షించారు. గురువారం ఆయన కోట్పల్లి మండలంలోని రాంపూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో పాఠాలు చదివించారు. ప్రాథమిక స్థాయినుంచే బాగా చదువుకోవాలన్నారు. ప్రశ్నించే తత్వం ఇప్పటి నుంచే అలవర్చుకోవాలన్నారు. పాఠ్యాంశాల్లో ఏమైనా అర్థం కాకుంటే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. చదువుతోపాటు ఆటలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. ప్రతిరోజు దినపత్రికలు, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. ఉపాధ్యాయురాలు మానసకు పలు సూచనలు చేశారు. -
కృత్రిమ ఇసుక తయారీదారుల రిమాండ్
కడ్తాల్: కృత్రిమంగా ఇసుక తయారు చేస్తున్న నలుగురిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించామని సీఐ శివప్రసాద్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి ముద్వీన్ గ్రామ సమీపంలో గల వాగు నుంచి మట్టిని తీసి, కృత్రిమ ఇసుకను తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఈ నెల 14న ఇసుక ఫిల్టర్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకులు మహేశ్, శ్రీశైలం, శేఖర్, జంగయ్య పరారు కాగా.. జేసీబీతో పాటు, ఐదు మోటార్లు, ఐదు స్టార్టర్ బాక్స్లు, పదిబోరు పైపులు, నాలుగు చొప్పున ఇసుక, మట్టి దిబ్బలను సీజ్ చేశారు. గురువారం విశ్వసనీయ సమాచారం మేరకు ముద్వీన్లో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. పరారీలో ఉన్న నిందితులు పట్టుబడ్డారు. ఈ మేరకు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. అనుమతులు లేకుండా ఇసుక తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. -
మహిళల అభ్యున్నతికి పెద్దపీట
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం వికారాబాద్లోని ధర్మ విద్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో ఉచితంగా కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న నియోజకవర్గానికి చెందిన 105 మంది మహిళలను ఆయన అభినందించారు. వారికి కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. అందుకు జీవనోపాధి అవకాశాలు పెంపొందించుకోవాలన్నారు. ప్రస్తుతం టైలరింగ్కు మంచి డిమాండ్ ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తుందన్నారు. మహిళ సంఘాల బలోపేతానికి ప్రభుత్వం తగిన చొరవ తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎస్సీల అభివృద్ధి కోసం రూ.21,874 కోట్లు కేటాయించిందన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు నిధులు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్నాయక్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, నాయకులు రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్, మురళీ, రాజ్కుమార్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ -
ఆర్టీసీ బస్సు ఢీకొని ఏడేళ్ల బాలుడి మృతి
బషీరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాకీతండాలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన రాథోడ్ వెంకటేశ్ కుమారుడు రాథోడ్ శ్రీరామ్(7) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం ఇంటిపక్కనే రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా తాండూరు నుంచి క్యాద్గీరా వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిరక్ష్యంతో బాలుడిని ఢీకొట్టాడు. దీంతో కిందపడిపోయిన శ్రీరామ్ ఛాతి, తలకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు 108లో హుటాహుటినా తాండూరు ఎంసీహెచ్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని సూచించగా.. కాసేపటికే బాలుడు మృతిచెందాడు. అల్లారుముద్దుగా చూసుకుంటున్న కొడుకు అకాల మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆడుతు పాడుతూ కనిపించే శ్రీరామ్ను విగత జీవిగా చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును పోలీసులు బషీరాబాద్ పోలీస్టేషన్కు తరలించారు. డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు బషీరాబాద్ టాకీతండాలో విషాదం -
పోలీసుల్లో అతడే బాస్!
రెండు దశాబ్దాల్లో నలుగురేవికారాబాద్: ఆధునిక భారత నిర్మాణానికి మహిళా శక్తి కొండంత అండ. వారు అనేక రంగాల్లో తమ ప్రతిభ చూపుతూ దేశాభివృద్ధిలో కీలకంగా మారారు. ఇంత చేస్తున్నా కొన్ని రంగాల్లో జెండర్ పరమైన చిన్నచూపును ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని పోలీసు శాఖలో మహిళా ఎస్ఐల విషయంలో వివక్ష కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వీరికి ఎస్హెచ్ఓలుగా బాధ్యతలు అప్పగించడానికి ఉన్నతాధికారులు ఆసక్తి చూపటం లేదు. విధి నిర్వహణలో అన్ని రకాల బాధ్యతలు అప్పగిస్తున్నా ఎస్హెచ్ఓ(స్టేషన్ హౌస్ ఆఫీసర్)లుగా మాత్రం చాన్స్ ఇవ్వడం లేదు. జిల్లాలో ప్రస్తుతం ఆరుగురు మహిళా ఎస్ఐలు ఆయా ఠాణాలు, హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిన్నారు. వీరిలో ఒక్కరిని కూడా ఎస్హెచ్ఓగా నియమించకపోవడం పోలీసు శాఖలో కొనసాగుతున్న వివక్షకు రుజువుగా నిలుస్తోంది. ఈ ఆరుగురు లా అండ్ ఆర్డర్లో అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారు. కేసుల విచారణ మొదలుకుని బందోబస్తులు, నైట్ డ్యూటీలు, పరేడ్ తదితర అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారిని ఎస్హెచ్ఓలుగా మాత్రం తీసుకోవడం లేదు. పైరవీల సంస్కృతితో అడ్డు జిల్లాలో మొత్తం 22 పోలీస్ స్టేషన్లు ఉండగా ఇందులో మూడు చోట్ల(వికారాబాద్, వికారాబాద్ మహిళా, తాండూరు) ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులు ఎస్హెచ్ఓలుగా కొనసాగుతున్నారు. మిగిలిన 19 పోలీస్ స్టేషన్లలో సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ) ర్యాంకు అధికారులు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒక్కరు కూడా మహిళలు లేకపోవడం గమనార్హం. అన్ని ఠాణాల్లో పురుషాధిక్యమే రాజ్యమేలుతోంది. ప్రతి పోస్టింగ్ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫార్సులతో జరుగుతుందనేది బహిరంగ రహస్యమే. అయితే డిపార్ట్మెంట్లో విధులు నిర్వహించే పురుషుల పైరవీల నేపథ్యంలో మహిళా పోలీసులు వెనుకబడుతున్నారు. దశాబ్దాల తరబడి ఉద్యోగకాలం మొత్తం ఎస్హెచ్ఓలుగా విధులు నిర్వహించకుండానే అదనపు ఎస్ఐలుగా, లూప్లైన్ డ్యూటీల్లో విధులు నిర్వహించాల్సి వస్తోందని మహిళా ఎస్ఐలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు కాకముందు నుంచే పశ్చిమ రంగారెడ్డి జిల్లా పరిధిలోని 20 ఠాణాలతో వికారాబాద్లో ఎస్సీ కార్యాలయం కొనసాగుతోంది. అయితే గడిచిన రెండు దశాబ్దాల్లో జిల్లాలో నలుగురికి మాత్రమే ఎస్హెచ్ఓలుగా బాధ్యతలు అప్పగించారు. ఇందులో లక్ష్మీమాధవి నవాబుపేట, వికారాబాద్ ఎస్హెచ్ఓగా పురుషులకు దీటుగా బాధ్యతలు నిర్వర్తించి శభాష్ అనిపించుకున్నారు. అనంతరం హర్షభార్గవి ధారూరు ఎస్హెచ్ఓగా బాధ్యతలు నిర్వహించారు. వీరిద్దరు మాత్రమే జనరల్ పోలీస్ స్టేషన్లలో ఎస్హెచ్ఓలుగా బాధ్యతలు నిర్వహించగా, మరో ఇద్దరు ప్రమీలా, రేణుకారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్ బాధ్యతలు చేపట్టారు. మొత్తంగా గడిచిన ఇరవై ఏళ్లలో నలుగురు మాత్రమే స్టేషన్ బాధ్యతలు చక్కబెట్టారు. ప్రస్తుత ఎస్పీ నారాయణరెడ్డి తమకు ఎస్హెచ్ఓలుగా అవకాశం కల్పిస్తారని మహిళా ఎస్ఐలు ఆకాంక్షిస్తున్నారు. ఎస్హెచ్ఓలుగా అవకాశం దక్కని మహిళా ఎస్ఐలు జిల్లాలో ఆరుగురు ఉన్నా అన్ని చోట్లా అదనపు ఎస్ఐలుగానే సకల బాధ్యతలు నిర్వహిస్తున్నా చిన్నచూపు తగదంటూ ఆవేదన -
భారతి సిమెంట్కు తిరుగులేదు
పరిగి: నాణ్యతకు మారో రూపమే భారతి సిమెంట్ అని సంస్థ టెక్నికల్ మేనేజర్ సునీల్ అన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలోని శ్రీ రాజేశ్వరి ట్రేడర్స్ డీలర్ షాప్లో తాపీమేసీ్త్రల సమావేశం నిర్వహించి 25 మందికి రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ చాలా నాణ్యమైందన్నారు. దీంతో నిర్మించిన నిర్మాణాల నాణ్యత ప్రామాణాలు ఉన్నతమైనవన్నారు. ఈ సిమెంట్ను ఎక్కువ శాతం నిర్మాణ రంగాల్లో స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారులకు సరైన ఎంపిక అన్నారు. భారతి అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు సంస్థ నుంచి ఉచిత సాంకేతికసాయం అందిస్తామన్నారు. స్లాబ్ కాంక్రీట్ సమయంలో ఇంజనీర్లను సైట్ వద్దకు వచ్చి నిర్మాణంలో సహాయపడుతారన్నారు. కార్యక్రమంలో భారతి సిమెంట్ బృందం మార్కెటింగ్ మేనేజర్ సతీష్రాజు, అసిస్టెంట్ మేనేజర్ వీరాంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంస్థ టెక్నికల్ మేనేజర్ సునీల్ -
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
అనంతగిరి: చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో జిల్లా మహిళ సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో పది సంవత్సరాల వేడుకల్లో భాగంగా వికారాబాద్ నియోజకర్గంలోని కేజీబీవీ పాఠశాలల విద్యార్థినులకు కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఆడ, మగ తారతమ్యం లేకుండా అన్ని అవకాశాలు కల్పించాలన్నారు. అమ్మాయిలు సాధించలేనిది ఏది లేదన్నారు. విద్యతోనే అన్ని సాధ్యమన్నారు. ఈ పోటీల్లో ధారూర్ కేజీబీవీ విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనంలో నిర్లక్ష్యం వహించొద్దు
వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర కుల్కచర్ల: విద్యార్థులకు అందించే భోజనంలో నిర్లక్ష్యం వహించరాదని వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర సూచించారు. బుధవారం మండలంలోని బండవెల్కిచర్ల గ్రామ పరిధిలోని గిరిజన గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొన్నిరోజుల వరకు చికెన్ను పెట్టవద్దని సూచించారు. ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సమయానుకూలంగా భోజనాన్ని అందించాలని పేర్కొన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో కుల్కచర్ల డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఎస్పీ నారాయణరెడ్డి యాలాల: కాగ్నానది నుంచి ఎవరైనా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె.నారాయణరెడ్డి హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని కోకట్ గ్రామ శివారులోని కాగ్నానది పరివాహక ప్రాంతాన్ని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా కాగ్నా నదిలో అధికారులు గుర్తించిన ఇసుక రీచ్లను పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఇసుక రవాణాకు ఆటంకం లేకుండా చూడాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు. ప్రభుత్వ అనుమతులు పొంది ఇతర ప్రాంతాలకు తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి కబడ్డీ పోటీలు వికారాబాద్లో రాష్ట్రస్థాయి క్రీడలు అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని గౌలికార్ ఫంక్షన్ హాల్లో గురువారం నుంచి ఈ నెల 23 వరకు రాష్ట్రస్థాయి కబడ్డీ సబ్ జూనియర్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పరుశురాంనాయక్, ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, ఉపాధ్యక్షుడు ఆనంద్ తెలిపారు. బుధవారం క్రీడా పోటీల నిర్వహణ ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ పోటీల్లో 33 జిల్లాల నుంచి బాలురు, బాలికలు పాల్గొంటారన్నారు. పోటీలను అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ ప్రారంభిస్తారని చెప్పారు. పోటీలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వికారాబాద్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. వీటిని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్రెడ్డి, సద్దాం, నరేందర్ నాయక్, నరసింహనాయక్, రఘు, కలిమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ‘ఫ్యూచర్’ భద్రతకు ఠాణా ఏర్పాటు యాచారం: ప్యూచర్ సిటీ భద్రతను దృష్టిలో పెట్టుకుని కొత్తగా పోలీస్స్టేషన్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించందని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. ఇందుకు మర్లకుంటతండా సమీపంలోని 330 అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు పక్కనే టీజీఐఐసీకి చెందిన మూడు ఎకరాల స్థలంలో ‘హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ’ పేరుతో ఠాణా ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. బుధవారం ఆమె.. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజుతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏ మార్గం గుండా వెళ్తోందనే విషయాలను తెలుసుకున్నారు. -
మదర్ డెయిరీ సంస్థ నిర్వాకం వలన పాడి రైతులు గోస పడుతున్నారు.నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో.. డబ్బుల కోసం అధికారులను ప్రాధేయ పడుతున్నారు. అయినాస్పందన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలను నేలపై పారబోసి నిరసన వ్యక్తంచేశారు.
● రెండు నెలలుగా పాడి రైతులకు అందని బిల్లులు ● పారబోసి నిరసన వ్యక్తం చేసిన వైనం ● స్పందించని డెయిరీ యాజమాన్యం యాచారం: మండల పరిధి కుర్మిద్ద గ్రామంలో 90 మంది రైతులు 25 ఏళ్లుగా మదర్ డెయిరీకి పాలు పోస్తున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం రెండు పూటలా 1,700 లీటర్ల పాలను సంస్థకు విక్రయిస్తున్నారు. నాణ్యతను బట్టి గేదె పాలు లీటరు రూ.46, ఆవు పాలు లీటరుకు రూ.31 వరకు సంస్థ చెల్లిస్తుంది. ఇదిలా ఉండగా.. ఆరు నెలలుగా రైతులకు డెయిరీ యాజమాన్యం సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. రూ.45 లక్షలకు పైగా.. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫ్రిబవరి నెల బిల్లులు రూ.45 లక్షలకు పైగానే అందాల్సిన ఉంది. వారం క్రితం బిల్లుల పెండింగ్పై రైతులు గ్రామంలోని మదర్ డెయిరీ సంస్థ కేంద్రం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ మహేందర్రెడ్డిని నిలదీశారు. ఇదే విషయాన్ని చైర్మన్ సంస్థ ఉన్నతాధికారులకు తెలిపారు. బిల్లులు అందజేయాలని కోరారు. అయినప్పటికీ.. సంస్థ నుంచి స్పందన లేకపోవడంతో బుధవారం డెయిరీ ఎదుట పాలు పారబోసి నిరసన వ్యక్తంచేశారు. పశువులను సాకడం కోసం రూ.వేలు ఖర్చు చేసి దాణా, పశుగ్రాసం కొనుగోలు చేసి, నెల మొత్తం కష్టపడితే బిల్లులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పశు పోషణతో పాటు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని వాపోయారు. రెండు, మూడు రోజుల్లో బిల్లులు మొత్తం చెల్లించాలని, లేని పక్షంలో నల్గొండ జిల్లాలో ఉన్న మదర్ డెయిరీని ముట్టడిస్తామని హెచ్చరించారు. పాలు పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు -
హెలిపాడ్ పరిశీలించిన ఎస్పీ
పోలేపల్లి ఎల్లమ్మ జాతరలో పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం ఆయన జాతర ప్రాంగణం, ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తజనానికి సహకరించాలన్నారు. జాతరలో దొంగతనాలు, గొడవలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అప్రమత్తతతో మెలగాలని పోలీసు సిబ్బందికి సూచించారు. సీఎం రేవంత్రెడ్డి రాక నైపథ్యంలో హెలిపాడ్ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ జయరాములు, కమిటీ సభ్యులు, మేనేజర్ రాజేందర్రెడ్డి, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత : ఎంపీ అరుణ
కొందుర్గు: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడుచుకోవాలని సూచించారు. యువత దురలవాట్లకు చేరువ కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబయ్య, మండల అధ్యక్షుడు లక్ష్మీకాంత్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివారెడ్డి, మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో పడి వృద్ధురాలి మృతి
కేశంపేట: మతిస్థిమితం లేని వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంజాయి జంగమ్మ(65) గ్రామంలో పాచి పనులు చేసుకుంటూ జీవించేది. గ్రామంలో జరుగుతున్న జాతరకు వెళ్లింది. ఈ క్రమంలో గ్రామ శివారులోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఉన్న చెరువులో పడి మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. చెరువులో నుంచి మృతదేహాన్ని బయటికు తీశారు. మృతురాలి కుమారుడు కృష్ణయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరహరి తెలిపారు. -
ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత : ఎంపీ అరుణ
కొందుర్గు: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడుచుకోవాలని సూచించారు. యువత దురలవాట్లకు చేరువ కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబయ్య, మండల అధ్యక్షుడు లక్ష్మీకాంత్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివారెడ్డి, మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
భారతి సిమెంట్కు తిరుగులేదు
పరిగి: నాణ్యతకు మారో రూపమే భారతి సిమెంట్ అని సంస్థ టెక్నికల్ మేనేజర్ సునీల్ అన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలోని శ్రీ రాజేశ్వరి ట్రేడర్స్ డీలర్ షాప్లో తాపీమేసీ్త్రల సమావేశం నిర్వహించి 25 మందికి రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ చాలా నాణ్యమైందన్నారు. దీంతో నిర్మించిన నిర్మాణాల నాణ్యత ప్రామాణాలు ఉన్నతమైనవన్నారు. ఈ సిమెంట్ను ఎక్కువ శాతం నిర్మాణ రంగాల్లో స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారులకు సరైన ఎంపిక అన్నారు. భారతి అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు సంస్థ నుంచి ఉచిత సాంకేతికసాయం అందిస్తామన్నారు. స్లాబ్ కాంక్రీట్ సమయంలో ఇంజనీర్లను సైట్ వద్దకు వచ్చి నిర్మాణంలో సహాయపడుతారన్నారు. కార్యక్రమంలో భారతి సిమెంట్ బృందం మార్కెటింగ్ మేనేజర్ సతీష్రాజు, అసిస్టెంట్ మేనేజర్ వీరాంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంస్థ టెక్నికల్ మేనేజర్ సునీల్ -
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
బషీరాబాద్: ఇంట్లో దూలానికి ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని నీళ్లపల్లి గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హరిజన్ సాగర్(25) తాపీమేసీ్త్రగా పనిచేస్తూ తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే ఈ నెల 17న అతడి తల్లి నర్సమ్మ బంధువులకి ఆరోగ్యం బాగలేదని పరామర్శకు తాండూరు ఆస్పత్రికి వెళ్లింది. మంగళవారం ఇంట్లో సాగర్ ఒక్కడే ఉన్నాడు. బుధవారం ఉదయం తలుపులు తెరవడక పోవడంతో చుట్టుపక్కల వాళ్లు కిటికీ నుంచి చూడగా ఉరివేసుకొని కనిపించాడు. విషయం తెలుసుకున్న నర్సమ్మ ఇంటికి చేరుకొని బోరున విలపించింది. ఇంకా పెళ్లికూడా కాని చెట్టంతా కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లడిల్లింది. తన కొడుకు తరచూ కడుపు నొప్పితో బాధపడేవాడని, తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుంటాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు జిల్లా ఆస్పత్రిలో శవపరీక్ష చేయించి బంధువులకు అప్పగించారు. నీళ్లపల్లిలో వెలుగులోకి ఘటన -
కల్వకుర్తి అభివృద్ధే లక్ష్యం
ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో రూ.250 కోట్లతో బీటీరోడ్ల నిర్మాణం చేపట్టామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. విపక్షాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా అభివృద్ధిపైనే తమ దృష్టి అని పేర్కొన్నారు. తలకొండపల్లి మండల పరిధి గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే పర్యటించారు. మండల కేంద్రంలో రూ.15 లక్షలతో సీసీరోడ్లు, మురుగు కాల్వలు, అంతారంలో రూ.15 లక్షలతో సీసీరోడ్లు, వెంకటాపూర్లో రూ.25 లక్షలతో సీసీరోడ్లు, మురుగు కాల్వలు, వెల్జాలలో రూ.20 లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీరోడ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. విద్య, వైద్యం, రవాణా అభివృద్ధికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తుందని, ప్రజాపాలన చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు సర్కార్పై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో ఆయా పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పనున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో పీసీసీ కిసాన్సెల్ రాష్ట్ర నాయకుడు మోహన్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అంజయ్య, అజీం, వెంకట్రెడ్డి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, యాదగిరి, నర్సింహ, రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రూ.250 కోట్లతో బీటీరోడ్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
రైతు భరోసా గందరగోళం
ధారూరు: ఎకరా, రెండు, మూడు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని ప్రభుత్వం ప్రకటిస్తే క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంది. రైతుల భూ విస్తీర్ణం ఎకరాల్లో ఉంటే డబ్బులు మాత్రం గుంటల్లో జమ అవతున్నాయని రైతుల్లో అయోమయం నెలకొంది. కొందరు రైతులకు అసలే డబ్బులు పడలేదు. ఇదేంటని వ్యవసాయశాఖ అధికారులను ప్రశ్నిస్తే తాము వాస్తవ జాబిత పంపించాం, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందని పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద జమ చేసిన డబ్బులు అందరికీ కాకుండా కొందరికి అన్నట్లుగా పడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ధారూరు మండలంలోని నాగసమందర్, ధారూరు, కేరెళ్లి, మున్నూరుసోమారం, నాగారం, మోమిన్కలాన్, తరిగోపుల గ్రామాలతో పాటు చాలా గ్రామాల్లో రైతు భరోసా డబ్బులు జమకావడం లేదు. కొందరికి అసలే పడలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జీరో చూపించడం అందరిని విస్మయానికి గురిచేసింది. మండల పరిధిలోని చౌట బాలప్పకు ఎకరా 15 గుంటల పొలం ఉంది. కాని అతనికి కేవలం రూ. 750లు మాత్రమే పడ్డాయి. వాస్తవానికి అతనికి రూ. 8,250 జమ కావాలి కాని అలా జమకాలేదు. మరో రైతుకు 3 ఎకరాల పొలం ఉంటే కేవలం రూ.500 మాత్రమే పడ్డాయి. ఇలా పలువురి రైతులకు భూ విస్తీర్ణం ఎక్కువ ఉంటే తక్కువ డబ్బులు పడుతున్నాయని, మరి కొంరికి తక్కువ భూమి ఉన్నా అసలు డబ్బులే పడలేవు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా సక్రమంగా పడ్డాయని, ప్రస్తుతం ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి సబ్మీటెడ్ ఇన్ బిల్స్అని డీబీటీ స్టేటస్లో చూపింస్తుందని వారు విచారం వ్యక్తం చేశారు. తమకు రైతు భరో సా డబ్బులు ఇప్పించాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఆర్ఓఆర్, 1బి రికార్డుల్లో భూముల విస్తీర్ణం, ధరణిలో వ్యత్యాసం ఉంటే వాస్తవ విస్తీర్ణం ప్రకారం డబ్బులు జమ అయినట్లు తెలుస్తుందని ఏఈఓలు చెబుతున్నారు. రైతుల డీబీబీస్టేటస్లో టుబీ ప్రాసెస్, సబ్మిటెడ్ బిల్స్ అని ఉన్న రైతులకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని, మిగిలిన రైతు లు రెవెన్యూ అధికారులను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు. అందరికి వేసినట్లు ప్రచారం ఎకరాల్లో భూములు...గుంటల్లో డబ్బుల జమ ఆందోళన చెందుతున్న రైతులు -
నాటుసారాపై ఉక్కుపాదం
బొంరాస్పేట: ఆబ్కారీ అధికారులు ఎట్టకేలకు తండాలపై దాడులు నిర్వహించారు. బుధవారం 120 లీటర్ల నాటుసారా పట్టివేశారు. కొడంగల్ ఆబ్కారీ సీఐ వెంకటేశ్వం మండల పరిధిలోని పాలబావితండా, మేడిచెట్టుతండా, బోడబండతండా, బాపల్లితండాల్లో పోలీసులతో విస్తృతంగా సోదాలు చేశారు. నాటుసారా తయారీదారులైన నలుగురిపై కేసులు నమోదు చేశారు. అలాగే కల్తీకల్లు, గంజాయిలాంటి మత్తు పదార్థాలు కలిగి ఉన్నా, తయారుచేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి వ్యవహారంపై 8712658751ను ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని ఆబ్కారీ సీఐ సూచించారు. ఈ దాడుల్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సీఐ బాల్రాజ్, డీటీఎఫ్ సీఐ శ్రీనివాస్, పరిగి, డీటీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్సైలు, 20మంది సిబ్బంది ఉన్నారు. ● 120 లీటర్ల పట్టివేత ● గిరిజన తండాల్లో ఆబ్కారీ అధికారుల సోదాలు -
క్రీడల్లో గెలుపోటమలు సహజం
అనంతగిరి: క్రీడల్లో గెలుపోటములు సహజమని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ధన్నారంలోని డీఏఆర్ గ్రౌండ్లో స్వర్గీయ గడ్డం శైలజ స్మారక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ తన సతీమణి శైలజపై అభిమానంతో క్రికెట్ పోటీలను ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, డీసీసీబీ డైరక్టర్ కిషన్నాయక్, రాంచంద్రారెడ్డి, సతీష్రెడ్డి, మల్లేశం, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. కారు ఢీ.. ఒకరి మృతి మొయినాబాద్: కారు ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మలక్పేట్కు చెందిన ఇమ్రాన్(40) బండ్లగూడలో టెంట్హౌస్ నిర్వహిస్తున్నాడు. బుధవారం మొయినాబాద్కు వెళ్లిన ఇమ్రాన్.. తిరిగి వెళ్తూ భోజనం చేయడం కోసం జేబీఐటీ కళాశాల ఎదుట రోడ్డు పక్కన చిన్న హోటల్ సమీపంలో తన కారును ఆపి, నడుచుకుంటూ హోటల్కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అదే సమయంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంతో వచ్చి ఇమ్రాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ.. ఢీకొట్టిన కారు అలాగే ముందుకు దూసుకుపోయి మరో బులెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇమ్రాన్ను చికిత్స నిమిత్తం ఉస్మానియాకు, స్వల్పగాయాలైనవారిని స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇమ్రాన్ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీ రైతు మృతి చేవెళ్ల: పొలం పనులు ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న రైతును గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో అతను మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన ప్రకారం.. చేవెళ్ల మండల పరిధి అల్లవాడ గ్రామానికి చెందిన యాలాల పెద్ద వెంకట్రెడ్డి(65) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే పొలానికి వెళ్లిన అతను.. రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా గ్రామ బస్స్టేజికీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రైతును గుర్తించిన స్థానికులు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం పట్నం మహేందర్రెడ్డి హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం బుధవారం కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరేసుకొని బిహార్వాసి ఆత్మహత్య
పూడూరు: అనుమానాస్పదంగా ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని మృతి చెందిన సంఘటన చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పెద్ద ఉమ్మెంతాల్ నుంచి కంకల్ వెళ్లే దారిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా బిహార్ రాష్ట్రానికి చెందిన చోటు మంజు అని గుర్తించారు. వివరాలు తెలిస్తే చన్గోముల్ పోలీస్స్టేషన్ను సంప్రదించాలని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. లేబర్ కమిషనర్ వద్దకు ‘సీసీఐ’ పంచాయితీ కార్మికులకు చెల్లించాల్సిన గ్రాడ్యూవిటిపై చర్చ తాండూరు రూరల్: కరన్కోట్ గ్రామ శివారులోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీ వ్యవహారం డిప్యూటీ లేబర్ కమిషనర్ వద్దకు చేరింది. కంపెనీలో రైల్వే కాంట్రాక్టు కార్మికులుగా పని చేసి కొంత మంది కార్మికులు ఉద్యోగ విరమణ చేశారు. సీసీఐ యాజమాన్యం నుంచి రావా ల్సిన గ్రాడ్యూవిటి చెల్లించాలని కార్మిక సంఘం నేత శరణప్పతో పాటు పలువురు హైదరాబాద్లో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ రాఘవేంద్రనాయక్ను వేడుకున్నారు. ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు గ్రాడ్యూవిటి చెల్లించే విధంగా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ విషయమై మార్చి 26వ తేదీన మరోసారి యాజమాన్యం, కార్మికులతో చర్చలు నిర్వహిస్తానని లేబర్ కమిషనర్ తెలిపారన్నారు. కరన్కోట్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ శరణు బసప్ప తన బృందంతో డిప్యూటీ లేబర్ కమిషనర్ వద్దకు వెళ్లి సీసీఐ యాజమాన్యం గ్రాడ్యూవిటి చెల్లించే క్రమంలో కార్మిక సంఘం నేత శరణప్ప కార్మికులను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ కార్మికులకు మాత్రం న్యాయం జరగాలని వారు కోరుతున్నారు. కుక్కల దాడిలో నెమలికి గాయాలు ఇబ్రహీంపట్నం: వీధికుక్కల దాడిలో నెమిలి గాయపడింది. ఈ సంఘటన బుధవారం ఉదయం ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక చెరువు కట్టపై నాలుగైదు కుక్కలు జాతియ పక్షి నెమలిని వెంటాడుతున్నాయి. వాకింగ్కు వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్గౌడ్, మరో ఇద్దరు యువకులు కుక్కల బారి నుంచి నెమలిని కాపాడారు. గాయపడిన నెమలిని చెరదీసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వచ్చిన ఆ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్రెడ్డికి నెమలిని అప్పగించారు. అనంతరం స్థానిక పశువైద్యశాలలో మయూరానికి చికిత్స చేయించారు. ప్రాణాపాయస్థితి నుంచి కొలుకున్న పక్షిని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు, యువకులను అటవీశాఖ అధికారులు అభినందించారు. -
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
అనంతగిరి: చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో జిల్లా మహిళ సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో పది సంవత్సరాల వేడుకల్లో భాగంగా వికారాబాద్ నియోజకర్గంలోని కేజీబీవీ పాఠశాలల విద్యార్థినులకు కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఆడ, మగ తారతమ్యం లేకుండా అన్ని అవకాశాలు కల్పించాలన్నారు. అమ్మాయిలు సాధించలేనిది ఏది లేదన్నారు. విద్యతోనే అన్ని సాధ్యమన్నారు. ఈ పోటీల్లో ధారూర్ కేజీబీవీ విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
పోదాం పోలేపల్లి
నేటి నుంచి రేణుకాఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం రేపు సీఎం రేవంత్రెడ్డి రాక బొంరాస్పేట: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు వైభవంగా జరగనున్న జాతరకు ఆలయం ముస్తాబైంది. అమ్మవారి గుడితోపాటు పరశురాముడి గుడి, కోనేరు, ప్రాంగణమంతా రంగులతో కనువిందు చేస్తున్నాయి. జాతరలో ప్రధాన ఘట్టమైన సిడెను వీక్షించేందుకు రాష్ట్రంతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకోనున్నారు. అందుకు తగినట్లు అధికార యంత్రాంగం ఏర్పాట్లను సిద్ధం చేసింది. కలెక్టర్ ప్రతీక్జైన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈసారి ప్రత్యేకం ఏటా కనుల పండువగా జరిగే పోలేపల్లి ఎల్లమ్మ ఉత్సవాల్లో ఆలయ కమిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. రూ.10 లక్షలతో సిడెను, రూ.14 లక్షలతో కొత్త తేరును(రథం) సిద్ధం చేశారు. గురువారం రాత్రి గ్రామవీధుల్లో పల్లకీ సేవ, శుక్రవారం సాయంత్రం జల్దిబోనం, సిడె కార్యక్రమం నిర్వహిస్తారు. రథానికి ఒక పొడవాటి దుంగను కడతారు. దాని చివరన ఒక తొట్టెను ఏర్పాటు చేసి, అందులో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఉంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఈ సమయంలో పసుపు బండారు భక్తులపైకి విసురుతూ అమ్మవారికి జేజేలు పలుకుతారు. శనివారం సాయంత్రం తేరు, రథోత్సవం, ఆదివారం ప్రత్యేక పూజలు, 24న గ్రామంలో పల్లకీ ఊరేగింపు ఉంటుంది. హాజరుకానున్న ప్రముఖులుపోలేపల్లి గ్రామంలో స్వయంభుగా వెలసిన ఎల్లమ్మ మాత జాతరలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి 21న రానున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిడెను తిలకించనున్నారు. సీఎం మధ్యాహ్నం తర్వాత దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ జయరాములు తెలిపారు. ఇందుకోసం అధికారులు హెలిపాడ్ సిద్ధం చేశారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ డీకే అరుణ, ఎనుముల తిరుపతిరెడ్డి, జిల్లా కలెక్టర్తోపాటు ప్రముఖులు దర్శించుకోనున్నారు. భక్తులకు ఆరోగ్యం, భద్రత కోసం వైద్య సిబ్బందితో శిబిరాలు, పోలీసు బందోబస్తుతో ప్రత్యేక నిఘాను ఉంచారు. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లు సిద్ధం రాష్ట్రంలో అతిపెద్ద జాతరైన మేడారం మాదిరిగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. సీఎం ప్రత్యేక శ్రద్ధతో ఈసారి జాతరను వైభవంగా నిర్వహిస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాం. మొబైల్ మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానాల గదులు, తాగునీరు వంటివి ఏర్పాటు చేశాం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దానికి తగ్గట్లు అధికారులతో సమన్వయం చేసుకుంటాం. – జయరాములు, ఆలయ కమిటీ చైర్మన్, పోలేపల్లి దేవస్థానం -
పసిడి పతకాల ప్రణవి
తలారి ప్రణవి చిరుతలా పరుగెడుతోంది. బరిలో దిగితే చాలు ఎంతమంది ప్రత్యర్థులున్నా పసిడి పతకాన్ని ఒడిసి పడుతోంది. ఇటీవల కేవలం 12 సెకన్లలోనే 100 మీటర్ల లక్ష్యాన్ని చేరుకుని రాష్ట్రస్థాయి రికార్డు నెలకొల్పింది. మూడేళ్ల కాలంలో జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని సుమారు యాభైకి పైగా స్వర్ణ, కాంస్య పతకాలు సాధించింది. తాజాగా హైదారాబాద్లో 11వ రాష్ట్ర యూత్ అథ్లెట్ చాంపియన్షిప్ పోటీల్లో ట్రై అథ్లీన్ విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. బషీరాబాద్: మండల పరిధిలోని మంతట్టి గ్రామానికి చెందిన తలారి సురేష్, శ్రీదేవి దంపతుల రెండో కూతురు ప్రణవి హైదరాబాద్ గచ్చిబౌలి ఎస్సీ గురుకులంలో పదో తరగతి చదువుతోంది. అథ్లెట్ విభాగంలో ఈబాలిక ప్రతిభను గుర్తించిన ప్రిన్సిపాల్ ఆమెను గచ్చిబౌలి స్పోర్ట్స్ అకాడమీలో చేర్పించించారు. ఇండియా అథ్లెటిక్ చీఫ్ హెడ్ కోచ్ నాగ్పూరి రమేశ్ వద్ద నాలుగేళ్లుగా శిక్షణ ఇప్పిస్తున్నారు. చదువుతో పాటు రోజు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మరో ఇద్దరు సహాయక కోచ్లు నాగరాజ్, షాజి అథ్లెటిక్స్లో ఆమెకు మెలకువలు నేర్పిస్తూ రాటుతేల్చారు. రన్నింగ్, జంపింగ్ విభాగాల్లో.. వివిధ జిల్లాల్లో జరిగిన అనేక అండర్– 14 జోనల్ పోటీల్లో పాల్గొన్న ప్రణవి చిరుతలా పరుగెడుతూ కేవలం 12 సెకండ్లలో 100 మీటర్ల లక్ష్యాన్ని చేరుకుంంది. ఈ క్రమంలో సీఎం కప్, స్వేరో ఒలింపిక్స్, గురుకులాల అథ్లెటిక్, రాష్ట్ర స్థాయి అథ్లెట్ పోటీల్లో రన్నింగ్, జంపింగ్ విభాగాల్లో బోలెడు బంగారు పతకాలు సాధించింది. రన్నింగ్, జంపింగ్లో బోలెడు పసిడి పతకాలు సాధించింది. పాఠశాలలో ఉపాధ్యాయులు, కోచ్లు అందరూ ప్రేమగా ప్రణవిని పరుగుల రాణిగా సంబోధిస్తూ జాతీయ అథ్లెటిక్ పోటీలకు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 17 నుంచి ఉస్మానియా యునివర్సిటీలో జరుగుతున్న 11వ రాష్ట్ర యూత్ అథ్లెటిక్ చాంపియన్షిప్ అండర్– 14లో ట్రై అథ్లీన్ విభాగంలో మరో గోల్డ్ మెడల్ సాధించి సత్తాచాటింది. ఇంటి నిండా పతకాలే.. ప్రణవికి చిన్ననాటి నుంచి ఆటలు ఎంతో మక్కువ. 5వ తరగతి నుంచే అథ్లెట్ గేమ్స్లో పతకాల వేట ప్రారంభించింది. ముఖ్యంగా రన్నింగ్, జంపింగ్లో తనకుతానే సాటి అన్నట్లు ప్రతిభ కనబరుస్తోంది. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో నిర్వహించిన అథ్లెట్ గేమ్స్లో 50కి పైగా బంగారు , కాంస్య పతకాలు, చాంపియన్ ట్రోఫీలు సొంతం చేసుకుంది. ఆమెకు వచ్చిన పతకాలు, ప్రశంస పత్రాలతో ఓ గది నిండిపోయిందంటే అతిశయోక్తి కాదు. చిరుతలా పరుగెడుతున్న గురుకుల విద్యార్థిని 12సెకన్లలో 100 మీటర్ల లక్ష్యం చేరుకుని రికార్డ్ నాలుగేళ్లలో 50కి పైగా బంగారు, కాంస్య పకతాలు రాష్ట్ర స్థాయి అండర్– 14 ట్రై అథ్లీన్ విభాగంలో మరో గోల్డ్ అంతర్జాతీయ అథ్లెట్ కావడమే లక్ష్యమంటున్న మంతట్టి బాలిక అంతర్జాతీయ అథ్లెట్ కావడమే లక్ష్యం తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కోచ్ల మార్గదర్శంలో రాష్ట్ర స్థాయిలో ఆడుతున్నా. నా ప్రతిభను చూసి గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి నాపై ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. కోచ్లు నాగ్పూరి రమేష్, నాగరాజు, షాజి, ప్రిన్సిపాల్ సుజాత ప్రతీరోజు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్లో చాపియన్గా నిలువాలన్నదే నా లక్ష్యం. ఆ దిశగా సాధన చేస్తున్నా. పదో పరీక్షలకు సిద్ధమవుతున్నా. మా నాన్నే నాకు ఆదర్శం. – ప్రణవి, క్రీడాకారిణి -
లారీ, ట్రాక్టర్ ఢీ
చేవెళ్ల: హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయిన లారీ.. అదుపు తప్పి అదే ట్రాక్టర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధి ముడిమ్యాల సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వస్తున్న లారీ.. ఓవర్టేక్ చేయబోయి ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ఎగిరి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రోడ్డు పనులు చేసేందుకు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్లో.. డ్రైవర్ వెంకన్న, కూలీలు వెంకటేశ్, శ్రీను, నవీన్లతో పాటు, లారీ డ్రైవర్ భాను ప్రసాద్కు స్వల్పగాయలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి పోలీసులకు, 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి, పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదుపు తప్పి.. మండల పరిధి పామెన బస్స్టేజీ సమీపంలో ఓ లారీ అతివేగంగా వస్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం నుంచి చేవెళ్ల మీదుగా షాద్నగర్ వైపు మైనింగ్ లోడ్తో లారీ వెళ్తోంది. చేవెళ్ల దాటిన తరువాత ముంబయి లింక్ హైవేపై లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న 33/11కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోల్ విరిగిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. లారీ డ్రైవర్ స్వల్పగాయాలతో బయట పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. కేసు దర్యాప్తులో ఉంది. ● ఐదుగురికి గాయాలు ● లారీ ఓవర్టేక్ చేయబోతుండగా ఘటన ● మరో ప్రమాదంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ -
చెరువులో పడి వృద్ధురాలి మృతి
కేశంపేట: మతిస్థిమితం లేని వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంజాయి జంగమ్మ(65) గ్రామంలో పాచి పనులు చేసుకుంటూ జీవించేది. గ్రామంలో జరుగుతున్న జాతరకు వెళ్లింది. ఈ క్రమంలో గ్రామ శివారులోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఉన్న చెరువులో పడి మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. చెరువులో నుంచి మృతదేహాన్ని బయటికు తీశారు. మృతురాలి కుమారుడు కృష్ణయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరహరి తెలిపారు. -
కేంద్ర బడ్జెట్ను సవరించాలి
పరిగి: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా ఉందని, దీన్ని సవరించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య పేర్కొన్నారు. బుధవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను సవరించాలని అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరించి బడ్జెట్ను రూపొందించిందన్నారు. పేద ప్రజలకు ఉపయోగం లేకుండా బడ్జెట్ను రూపొందించారని ఆయన విమర్శించారు. పెట్టుబడిదారులపై విధించే పన్నును 22శాతం నుంచి 15శాతానికి తగ్గించారన్నారు. పేద మధ్యతరగతుల ప్రజలు ఉపయోగించే వస్తువులపై 200శాతం పన్నులు పెంచుతూ దేశ ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ధనికులపై వారసత్వ పన్ను విధిస్తున్నారన్నారు. కానీ మనదేశంలో ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను సవరించేంత వరకు పోరాటం చేస్తునే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు హబీబ్, సత్తయ్య, మహిపాల్రెడ్డి, రఘురాం తదితరులు పాల్గొన్నారు.సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య -
నాబార్డు నిధుల కరదీపిక ఆవిష్కరణ
అనంతగిరి: నాబార్డు 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్(పీఎల్పీ) కరదీపికను అడిషనల్ కలెక్టర్ సుధీర్ ఆవిష్కరించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ప్రాధాన్యతారంగానికి రూ.7432.51 కోట్లుగా ఆర్థిక అంచనా వేసిందని చెప్పారు. బ్యాంకులు చురుగ్గా రుణాలు అందజేసి వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డీడీఎం అకిల్పున్నా, ఎల్డీయం యాదగిరి, డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి, జిల్లా మత్య్స శాఖ అధికారి వెంకయ్య, ప్రభుత్వ అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజలతో మమేకమవ్వాలి ఎస్పీ నారాయణరెడ్డి అనంతగిరి: ప్రజలతో మమేకమై పనిచేయాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సిబ్బందికి సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్స్టేషన్ల వారీగా నమోదయిన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎటువంటి ఫైల్స్ పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లోనూ ఫైల్స్ పెండింగ్ పెట్టొద్దన్నారు. ప్రతీ పోలీస్ అధికారి ఫంక్షనల్ వర్టికల్స్పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. కోర్టు డ్యూటీ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కన్వెక్షన్ శాతాన్ని పెంచాలని చెప్పారు. పీఎస్ల వారీగా ప్రతీ శనివారం సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. డయల్ 100కు వచ్చే ఫోన్ కాల్స్పై నిర్లక్ష్యం చూపొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ హనుమంతరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడుదాం అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు యాదయ్య కుల్కచర్ల: యాదవులు హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు జింకల యాదయ్య అన్నారు. మంగళవారం చౌడాపూ ర్ మండలం పుర్సంపల్లిలో యాదవ సంఘం మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కర్ణాకర్, ఉపాధ్యక్షులుగా రమేశ్, సత్తయ్య, కమిటీ సభ్యులుగా నరేష్, శ్రీనివాసులు, వెంకట్రాములు, రాజేష్, శేఖర్, కృష్ణయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా మండల కమిటీలను బలోపేతం చేస్తామన్నారు. నందనవనం హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు సాక్షి, రంగారెడ్డి జిల్లా: సరూర్నగర్ మండలం నందనవనం మండల ప్రజా పరిషత్ పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు రజితపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా స్కూల్ ఆవరణలో మాజీ కార్పొరేటర్, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటినందుకు గానూ ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సుశీందర్రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీజీసీఎస్ – 1964 ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేపట్టడానికి వీల్లేదని అన్నారు. ఈ మేరకు ఒక రాజకీయ నాయకుడి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొన్నారు. -
‘నక్ష’.. శాశ్వత రక్ష
ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలకు భద్రత ప్రతీ స్థలానికి యూనిక్ నంబర్ అణువణువూ డిజిటల్ రూపంలో నిక్షిప్తం పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్ మున్సిపాలిటీ కొడంగల్: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 152 మున్సిపాలిటీల్లో పైలెట్ ప్రాజెక్టుగా నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ (నక్ష) కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకు రాష్ట్రంలోని పది మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. అందులో వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నియోజకవర్గం కావడంతో తొలిదశలో కొడంగల్ను ఎంపిక చేశారు. మంగళవారం కొడంగల్లో నక్ష పైలెట్ ప్రాజెక్టు సర్వేను జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ సుధీర్, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రాంరెడ్డి, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ సభ్యుడు సుధీర్ గోలి, సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసర్ సమీరుద్దీన్, డిప్యూటీ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఉమా మహేశ్వర్రావు, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, తహసీల్దార్ విజయ్కుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి తదితరులు పాల్గొని సర్వేను అధికారికంగా ప్రారంభించారు. మూడు పద్ధతుల్లో ఏరియల్ సర్వే ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఇళ్లు భవనాలు ఇతర నిర్మాణాల పూర్తి వివరాలను జియో స్పేషియల్ సాంకేతితతో సేకరిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలోని ప్రతీ స్థలంలోని అణువణువు డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేయనున్నట్లు చెప్పారు. ఇండ్లు భవనాల విస్తీర్ణం, ఎత్తు, సర్వే నంబర్, యజమాని పేరు, ఇతర వివరాలతో ప్రాపర్టీ కార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. పక్కాగా రెవెన్యూ రికార్డులు, ఆస్తి పన్ను నిర్ణయం, వసూళ్లలో పారదర్శకత ఉంటుందన్నారు. ఇళ్లు, స్థలాల వివాదాలకు పరిష్కారం చూపనున్నట్లు చెప్పారు. భవిష్యత్లో అభివృద్ధి ప్రణాళికలకు ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. హెలికాఫ్టర్ ఏరియల్ సర్వే సిబ్బంది మాట్లాడుతూ.. మూడు పద్ధతుల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లు, చిన్న పాటి విమానాలకు ప్రత్యేక కెమెరాలను అమర్చి సర్వే చేయడానికి అనుమతి ఉందన్నారు. కొడంగల్లో హెలికాఫ్టర్ ద్వారా సర్వే చేయనున్నట్లు చెప్పారు. గాలిలో ఎగురుతూ హెలీకాఫ్టర్ ద్వారా ఫొటోలు తీస్తామని వివరించారు. ప్రతి ఫొటోకు ఐడెంటిటీ నంబర్ ఉంటుందని.. ఈ సర్వేలో భూమిపైన ఉన్న నిర్మాణాలకు సంబంధించిన వివరాలు ఆన్లైన్ ద్వారా అందుతాయని చెప్పారు. సర్వే నంబర్, ఇంటి నంబర్, విస్తీర్ణం, యజమాని పేరు తదితర వివరాలతో ఫొటోలు వస్తాయన్నారు. ఈ సమాచారం మేరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంబంధిత స్థలాల వద్దకు వెళ్లి విచారణ జరిపిస్తారని, తదనంతరం యజమానికి ప్రాపర్టీ కార్డు వస్తుందన్నారు. రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించేందుకు ఇళ్ల స్థలాల వివాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేకు ఆదేశించిందని వివరించారు. అనంతరం సర్వే సిబ్బంది మున్సిపల్ పరిధిలో సర్వే చేయడానికి హెలికాఫ్టర్లో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. -
ఆడపిల్లలు ఉన్నతంగా రాణించాలి
తాండూరు రూరల్: ఆడపిల్లలు సైతం అన్నిరంగాల్లో రాణించాలని కేజీబీవీ ప్రత్యేకాధికారి ఆశాలత అన్నారు. మంగళవారం మండల పరిధిలోని జినుగుర్తి గేట్ వద్ద ఉన్న కేజీబీవీ హాస్టల్లో ‘బేటీ బచావో– బేటీ పడావో’దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యార్థినులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశాలత మాట్లాడుతూ.. ప్రస్తుతం మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని.. పైలెట్లుగా, నౌకాదళాల్లోనూ ఉద్యోగాలు సాధిస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను ఉన్నతంగా చదివించాలని సూచించారు. అనంతరం పెద్దేముల్, తాండూరు, యాలాల, బషీరాబాద్ కేజీబీవీ జట్లు కబడ్డీ, ఖోఖో పోటీల్లో తలపడ్డాయి. ఈ పోటీల్లో యాలాల ప్రథమ స్థానం సాధించగా, పెద్దేముల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమంలో మహిళ సాధికారిత కేంద్ర అధికారులు వరలక్ష్మి, రాందాస్, ప్రత్యేకాధికారులు రాజేశ్వరి, మంగమ్మ, పీడీలు అనంత య్య, బుగ్గప్ప, రాము, పీఈటీ వసుంధర, గోపిక, రజిత, శ్రీలత, బాలమణి, నందు పాల్గొన్నారు. కేజీబీవీ ప్రత్యేకాధికారి ఆశాలత -
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని చదవాలి
హయత్నగర్: విద్యార్థులు గొప్ప లక్ష్యాన్ని ఎంచుకుని, సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని, ఇందుకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేఎల్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇన్స్ప్రేషన్ అండ్ ఇగ్నేషన్ కార్యక్రమంలో భాగంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మునుగనూరులోని మహాత్మా జ్యోతీరావు పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో మంగళవారం నిర్వహించిన వ్యక్తిత్వ వికాస శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో ఉన్న అనేక మంది ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకున్నవారేనని గుర్తు చేశారు. విద్యార్థులు ప్రపంచ మేధావులుగా ఎదిగేందుకు ప్రయత్నం చేయాలన్నారు. చదువుతో పాటు ఆరో గ్యం, క్రమశిక్షణ అవసరమని గ్రహించిన ప్రభుత్వం ఇటీ వలే మెస్ చార్జీలు పెంచిందని తెలిపారు. కేఎల్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యాలయాలను నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు, కాంగ్రెస్ నాయకులు ముద్ద గోని రామ్మోహన్గౌడ్, జేఆర్పీ గురుకుల విద్యాలయాల సెక్రెటరీ సైదులు, జాయింట్ సెక్రెటరీ తిరుపతి, పాఠశాల ప్రిన్సిపాల్ జానకి రాములు తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేయాలి
● మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యకొత్తూరు: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్(పాలిథిన్) ఉత్పత్తుల నిషేధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య కోరారు. ఇందులో భాగంగా మంగళవారం పాత మున్సిపల్ కార్యాలయంలో తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంతో జరిగే అనర్థాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతకు వ్యాపారులు, ప్రజలు పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇళ్లు, ఖాళీ ప్రాంతాల్లో చెత్తను పారబోయకుండా ప్రజలు శుభ్రతను పాటించాలన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం చిన్న చిన్న ఫంక్షన్ల(శుభకార్యాలు)తో పాటు పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం చాలావరకు పెరిగిందన్నారు. నాణ్యతలేని ప్లాస్టిక్ ఉత్పత్తుల కారణంగా పర్యావరణంతో పాటు మానవ ఆరోగ్యాలకు చాలావరకు ముప్పు ఉందన్నారు. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. దీనికితోడు తడి, పొడిచెత్తను వేరుచేసి సిబ్బందికి అందించాలని ప్రజలు, వ్యాపారులను కోరారు. నాణ్యతలేని ప్లాస్టిక్ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారులకు జరిమానాలు విధిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ బాలాజీ, కౌన్సిలర్ సోమ్లానాయక్, నాయకులు సుదర్శన్గౌడ్, దేవేందర్ముదిరాజ్, మహిళా సంఘాల సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జోష్
బీఆర్ఎస్ ● రైతు దీక్షకు తరలివచ్చిన జనం ● ఆమనగల్లులో కేటీఆర్ భారీ ర్యాలీ ● విజయవంతమైన కార్యక్రమం ● పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం ఆమనగల్లు: కాంగ్రెస్ ప్రభుత్వ రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆమనగల్లు పట్టణంలో మంగళవారం నిర్వహించిన రైతు దీక్ష సక్సెస్తో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజీవ్ చౌరస్తా నుంచి దీక్ష శిబిరం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో కేటీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వేదికపైకి చేరుకోగానే సీఎం.. సీఎం అంటూ నినాదాలు హోరెత్తాయి. దీక్షలో అరగంటపాటు మాట్లాడిన ఆయన తన వాగ్ధాటితో ఆకట్టుకున్నారు. సమస్యలు పట్టించుకోవడం లేదు పాలమూరు జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు తప్పితే రాష్ట్ర సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాతే పాలమూరు జిల్లాకు సాగునీరు అందిందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గంప వెంకటేశ్, దశరథ్నాయక్, పత్యానాయక్, జీఎల్ఎన్రెడ్డి, ఎడ్మ సత్యం, నాలాపురం శ్రీనివాస్రెడ్డి, సీఎల్ శ్రీనివాస్యాదవ్, నిర్మల శ్రీశైలంగౌడ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న కళాప్రదర్శనలు బీఆర్ఎస్ ర్యాలీలో ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డప్పు, డోలు కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించారు. వేదిక వద్ద కళాకారుల ఆటపాటలు హోరెత్తించాయి. కేటీఆర్కు అభిమానులు నాగలి, సేవాలాల్ చిత్రపటాలను బహూకరించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని మంగళవారం మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మాజీ మంత్రులు వి.శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, గువ్వల బాలరాజ్, మర్రి జనార్దన్రెడ్డితో కలిసి కేటీఆర్ మైసమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో స్నేహలత, ఆలయ ఫౌండర్ ట్రస్టీ శిరోలి పంతునాయక్లు కేటీఆర్ను ఘనంగా సన్మానించారు. ఒగ్గుడోలు ప్రదర్శన -
ఉన్నత భవిష్యత్కు మార్గాలు చూపించాలి
చేవెళ్ల: విద్యార్థుల భవిష్యత్కు ఉన్నతమైన మార్గాలను వేసే బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులదేనని పెద్దపల్లి మాజీ ఎంపీ బి.వెంకటేశ్ నేత అన్నారు. మండలంలోని వివేకానంద ఇంటర్నేషనల్ పాఠశాల రెండో వార్షికోత్సవాన్ని పాఠశాల చైర్మన్ కె.నరేశ్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి మాజీ ఎంపీ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పాఠశాలలో వివిధ విభాగాల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ కె. లావణ్య, డైరెక్టర్ హనుమంత్రావు, డీన్ మౌనిక, ప్రిన్సిపాల్ డాక్టర్ అర్చన, వైస్ ప్రిన్సిపాల్ బి.వేణుకుమార్, మేనేజర్ అర్. నరేశ్, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, మండల విద్యాధికారి పురన్దాస్, సీఐ భూపాల్ శ్రీధర్ పాల్గొన్నారు. ● పెద్దపల్లి మాజీ ఎంపీ బి.వెంకటేశ్ నేత -
శ్రీశైలానికి పాదయాత్రగా శివస్వాములు
దోమ: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి శివస్వాములు మంగళవారం పాదయాత్రగా బయల్దేరారు. మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామానికి చెందిన పలువురు శివస్వాములు స్థానిక శివాలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో గురుస్వాముల ఆధ్వర్యంలో ఇరుముడులు కట్టుకొని శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రగా పయనమయ్యారు. శివస్వాములను సాగనంపేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇప్పాయిపల్లిలో.. కుల్కచర్ల: మండలంలోని ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన శివస్వాములు శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. మంగళవారం స్థానిక శివాలయంలో శివస్వాములు ఇరుముడులు కట్టుకొని పాదయాత్రగా బయలుదేరారు. స్థానికులు పెద్దఎత్తునకార్యక్రమానికి తరలివచ్చారు. -
నీటి ఎద్దడికి అడ్డుకట్ట
అనంతగిరి: వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. మంగళవారం ఆమె హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. తాగు, సాగు నీరు, నిర్మాణరంగానికి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా, రైతు భరోసా, యాసంగికి సాగునీటి సరఫరా, యూరియా కొరత, రేషన్ కార్డుల జారీ, రెసిడెన్షియల్ పాఠశాలల సందర్శన అంశాల్లో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. అడిషనల్ కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ.. తాగు, సాగుకు నీటి సరఫరాకు సరైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యుత్ వినియోగంపై అధికారులతో సమీక్షిస్తూ విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూస్తున్నామని వివరించారు. అర్హులకు రైతు భరోసా అందేలా చూస్తున్నామన్నారు. రేషన్ కార్డులకు ప్రజా పాలన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి వెంటనే అర్హులకు అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ప్రత్యేక కార్యాచరణ తయారు చేస్తున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో తాండూరు సబ్–కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ట్రెయినీ కలెక్టర్ ఉమాహారతి, డీఆర్ఈఏ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, సివిల్ సప్లై అధికారి మోహన్బాబు, విద్యుత్ ఎస్ఈ లీలావతి, మిషన్ భగీరథ ఈఈ చల్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ సుధీర్ -
విద్యార్థుల చదువులో నిర్లక్ష్యం తగదు
దోమ: విద్యార్థులకు అందిస్తున్న చదువులో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించరాదని ఎంఈఓ వెంకట్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో తరగతుల వారీగా ఎఫ్ఏ1, ఎఫ్ఏ2, ఎస్ఏ1, ఎస్ఏ3 కంప్యూటరీకరించాలని చెప్పారు. పాఠశాలలో టాయిలెట్స్, కంపౌండ్ వాల్, కిచెన్షెడ్ లేని వాటిని గుర్తించి వాటి నివేదికలు ఇవ్వాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తూ వాటి బిల్లులను ఎప్పటికప్పుడు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పదిలో మంచి ఫలితాలు రాబట్టేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. కార్యక్రమంలో కిష్టాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లాల్యనాయక్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ సీఆర్పీలు రెడ్యా, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. ఎంఈఓ వెంకట్ -
ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు
చేవెళ్ల: మండల కేంద్రంలోని కొనగట్టు శివాలయంలో గత మూడురోజుల పాటు జరిగిన ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. చివరిరోజు ఆలయం వద్ద ఆలయ ధర్మకర్తలు సున్నపు వసంతం, మానిక్యప్రభు, అర్చకుడు సురేశ్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో పునఃపూజ, రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్రహోమం, పూర్ణాహుతి, భజన కార్యక్రమాలు కొనసాగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఆలయం వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు అత్తెల్లి అనంత్రెడ్డి సహకారంతో చేపట్టిన గోశాలను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు. -
ఆంజనేయస్వామి ఆలయంలో చందన గణేశుడు
తాండూరు రూరల్: మండల పరిధిలోని చంద్రవంచ గేటు వద్ద ఉన్న పల్లెగూడ ఆంజనేయస్వామి ఆలయంలో వినాయకుడి విగ్రహం మంగళవారం ప్రత్యక్షమైంది. స్థానికుల కథనం ప్రకారం... ఆంజనేయస్వామి ఆలయంలో 40 ఏళ్ల నుంచి స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. నిత్యం చందనం పూసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ క్రమంలో మిగిలిన చందనాన్ని గర్భగుడిలో ఓ మూలన ఉన్న రాయికి పూసేవారు. రెండు రోజుల క్రితం రాతికి చందనం పూస్తుండగా పెచ్చులూడాయి. అందులోనుంచి వినాయకుడి ఆకృతి బయటకు వచ్చింది. దీంతో భక్తులు అక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 24న మల్లికార్జున ముత్యాస్వామితో ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో లింగప్రతిష్ఠాపన నిర్వహించనున్నారు. ఇంతలోనే వినాయకుడి విగ్రహం బయటకు రావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
హామీల అమలులో నిర్లక్ష్యం
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జంగయ్య కొందుర్గు: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జంగయ్య అన్నారు. మంగళవారం జిల్లేడ్ చౌదరిగూడ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావొస్తున్నా ఏ ఒక్క పథకం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఇంతవరకు దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తికాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేదంటే పేదల పక్షాన సీపీఐ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి వెంకటేశ్, నాయకులు బాలరాజ్, రత్నయ్య, బాలమ్మ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే చొరవతో రోడ్లకు మహర్దశ
కుల్కచర్ల: గ్రామీణ ప్రాంత రహదారుల అభ్యున్నతికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, బ్లాక్ బీ అధ్యక్షుడు భరత్కుమార్ అన్నారు. మంగళవారం కుల్కచర్లలో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో బీటీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో రహదారులు బాగునప్పుడే మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆనందం, నాయకులు ఎల్లయ్య, శ్రీనివాస్, నరహరి, బాబు, బాలకృష్ణ, భీమయ్య, వెంకట్, భాను, రమేష్, మురళీ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. శివాజీ విగ్రహానికి భూమిపూజ బంట్వారం: కోట్పల్లి మండలంలోని కంకణాలపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం కోసం మంగళవారం భూమి పూజ చేశారు. త్వరలోనే విగ్రహం ఏర్పాటు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో నర్సింగ్నాయక్, కరుణాకర్రెడ్డి, మధుసుదన్రెడ్డి, రాజేందర్రెడ్డి, మల్లేశం, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై విగిరిపడిన చెట్టు ధారూరు: వికారాబాద్–తాండూరు మార్గంలో మండల పరిధి అల్లిపూర్ బస్టాప్ సమీపంలో ప్రధాన రోడ్డుపై మంగళవారం ఓ చెట్టు విరిగిపడింది. దీంతో వికారాబాద్ వైపు నుంచి తాండూరు వెళ్లే వాహనదారులకు అంతరాయం కలిగింది. డబుల్ రోడ్డు కావడంతో వాహనదారులు కంగారుపడ్డారు. కొన్ని వాహనాలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. ఈ విషయం తెలిసిన ఆర్అండ్బీ వర్క్ ఇన్స్పెక్టర్ ఎల్లయ్య అక్కడికి చేరుకుని రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రాకపోకలు సాఫీగా జరిగేలా చేశారు. శ్మశానవాటికలో మౌలిక వసతులు కల్పిస్తాం మర్పల్లి: మండల కేంద్రంలోని శ్మశాన వాటికలో మౌలిక వసతుల కల్పన కోసం తన వంతు కృషి చేస్తానని మర్పల్లి మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గూడెం మల్లేశ్యాదవ్ చెప్పారు. మంగళవారం మండల కేంద్రంలోని శ్మశాన వాటికలో బోరు మోటారును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాములుయాదవ్తో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్మశాన వాటికల్లో పేరుకుపోయిన ముళ్ల పొదలను తొలిగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఫసియొద్ధీన్, మిషన్ భగీరథ ఏఈ ప్రమోద్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్, కాంట్రాక్టర్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్టడీ మెటీరియల్ అందజేత మర్పల్లి: పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవాలని మండలంలోని ఘణాపూర్ జెడ్పీ పాఠశాల హెచ్ఎం అశోక్ సూచించారు. మంగళవారం విద్యార్థుల కోసం వేదాంత పబ్లికేషన్, సరస్వతి బుక్స్టాల్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ అందించారు. విద్యార్థులు ఓ ప్రణాళికబద్ధంగా చదువుకొని 100 శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకు రావాలని హెచ్ఎం ఆకాక్షించారు. -
వందకోట్లతో అండర్పాస్ల నిర్మాణం
షాద్నగర్: ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.100 కోట్లతో షాద్నగర్పరిధిలోని బైపాస్ జాతీయ రహదారిలో మూడుచోట్ల అండర్పాస్లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. మంగళవారం పట్టణంలోనిక్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. షాద్నగర్ పరిధిలో కొత్తూరు, పెంజర్ల, జేపీ దర్గా, మేకగూడ, చటాన్పల్లి, బూర్గుల గ్రామాల వద్ద జాతీయరహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణకు అండర్పాస్లు నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి నేషనల్ హైవే అథారిటీ పీడీని కోరినట్లు తెలిపారు. దీనికి స్పందించిన ప్రభుత్వాలు జేపీ దర్గా, చటాన్పల్లి వద్ద, బూర్గుల గేటు వద్ద అండర్పాస్ల నిర్మాణాలకు రూ.100 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఒక్కో అండర్పాస్ నిర్మాణం సుమారు కిలోమీటర్ మేర నిర్మించనున్నట్లు, ఇందుకు సంబందించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందన్నారు. ఈ నిర్మాణ పనులు మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభిస్తామని వెల్లడించారు. అండర్ పాస్ల నిర్మాణం పూర్తయితే ప్రయాణం సులభంగా మారుతుందని, ప్రమాదాలు జరిగే అవకాశమే ఉండదన్నారు. అదేవిధంగా రెండో విడతలో కొత్తూరు నుంచి కర్నూల్ వరకు ఉన్న బెంగుళూరు జాతీయ రహదారిని ఆరులేన్లుగా విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయన్నారు. చటాన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని వై ఆకారంలో నిర్మిస్తామని, బ్రిడ్జి నిర్మాణానికి అదనంగా నిధులు మంజూరు చేయాలని సీఎం కోరినట్లు తెలిపారు. త్వరలో నిధులు మంజూరు కానున్నాయని, పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మామిడి శ్యాంసుందర్రెడ్డి, నాయకులు కొంకళ్ల చెన్నయ్య, శివశంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
నిరుపేదల సంక్షేమమే ధ్యేయం
మొయినాబాద్ రూరల్: నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ గౌతమ్కుమార్ అధ్యక్షతన షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దశల వారీగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నిరుపేదల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సంధ్య, డిప్యూటీ తహసీల్దార్ వినయ్సాగర్, ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు షాబాద్ దర్శన్, చేవెళ్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎలిగేపల్లి శ్రీనివాస్యాదవ్, మాజీ సర్పంచ్లు పట్లోళ్ల జనార్ధన్రెడ్డి, మంజులరవియాదవ్, నాయకులు గడ్డం వెంకట్రెడ్డి, రాంరెడ్డి, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని అమ్డాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రక్తమైసమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ పూజలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హోమం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా గణపతి ప్రార్థనశాల, ధ్యానాధివాసం, అభిషేకాలు, విగ్రహ పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి పాల్గొని పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు షాబాద్ దర్శన్, ఎలిగెపల్లి శ్రీనివాస్యాదవ్, మోత్కుపల్లి రాములు, అమ్డాపూర్ గ్రామ నాయకులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ● చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
ప్రణాళికతో ప్రగతి
● లాభాల బాటలో నావంద్గీ సొసైటీ ● రూ.1.20 కోట్ల వార్షిక ఆదాయం ● వాణిజ్యపరమైన సేవలతో ఆర్థిక తోడ్పాటు బషీరాబాద్: పాలకవర్గం ప్రణాళికబద్ధంగా చేస్తున్న వ్యవసాయ సేవలతో పాటు వాణిజ్యపరమైన నిర్ణయాలతో మండల కేంద్రంలోని నావంద్గీ సొసైటీ పటిష్ట స్థితికి చేరుకుంది. 2023–2024 ఆర్థిక సంవత్సరానికి గాను కమర్షియల్ బిజినెస్తో రూ.1.20 కోట్లు ఆర్జించింది. ఈ నిధులతో సొసైటీకి ఆర్థిక వనరులు చేకూర్చే నిర్మాణాలను చేపట్టి ఆదర్శంగా నిలుస్తుంది. ఇందులో 4,400 మంది రైతుల సభ్యత్వంతో రూ.కోటి షేరింగ్ నిధులతో పాటు రూ.3.50 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను సొంతం చేసుకుంది. అన్నదాతలకు సకాలంలో పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఇచ్చి అండగా ఉంటుంది. అలాగే వ్యవసాయ సేవల్లో భాగంగా రైతులకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారు. పండించిన ధాన్యం కొనుగోళ్లు చేస్తూ రైతులకు సహకారం అందిస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. వ్యవసాయ ఆధారిత సేవలతో పాటు వాణిజ్యపరమైన వ్యాపారాలపై కూడా దృష్టి పెట్టింది. బంగారంపై తక్కువ వడ్డీకి రుణాలు, ఇంటి, వాహనాలపై రుణాలు ఇస్తుంది. దీంతో ఏడాదిలో రూ.1.20కోట్ల లాభాలను ఆర్జించి పటిష్టమైన ఆర్థిక సొసైటీగా నిలిచింది. పెట్రోల్ బంక్, రైస్మిల్ నిర్మాణాలు సొసైటీ సొంత నిధులతో పాటు రూ.2 కోట్ల నాబార్డు రుణాలు తీసుకొని పెట్రోల్ బంక్, రైస్ మిల్ నిర్మాణాలు చేపట్టింది. ఇప్పటికే రైస్మిల్ పూర్తికాగా, పెట్రోల్ బంక్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అలాగే 1500 మెట్రిక్ టన్నులు, వెయ్యి మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసే రెండు భారీ గోదాంల నిర్మాణ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. వాణిజ్యపరమైన పెట్రోల్ బంక్, రైస్మిల్ సేవలు అందుబాటులోకి వస్తే వార్షిక ఆదాయం నాలుగు రెట్లు పెరుగుతుందని పాలకవర్గం అంచనా వేస్తుంది. అలాగే ధాన్యం నిల్వల సామర్థ్యం 2500 మెట్రిక్ టన్నులకు చేరనుంది. నావంద్గీ సొసైటీ కార్యాలయం సమష్టి కృషితో లాభాలు రైతులు, పాలకవర్గం సభ్యుల సహకారంతో పాటు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తోడ్పాటుతో సొసైటీని లాభాల బాట పట్టించామని సొసైటీ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. రైతులకు వ్యవసాయ ఆధారిత సేవలందిస్తూనే వాణిజ్యంపై దృష్టి పెట్టామన్నారు. సొసైటీకి సొంతంగా ఆర్థిక వనరులు అందించే పెట్రోల్ బంక్, రైస్మిల్ వంటి నిర్మాణాలు చేపట్టామన్నారు. త్వరలోనే వాటి సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. -
నేడు ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ
తాండూరు రూరల్: మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో బుధవారం ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు శివాజీ యువజన సంఘం సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి హాజరవుతారని తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం పరిగి: విద్యుత్ సరఫరాకు బుధవారం అంతరాయం కలుగుతుందని ఏఈ హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని మాధారం, పేటమాధారం, రంగాపూర్, బసిరెడ్డిపల్లి, నజీరాబాద్, న్యామత్నగర్లతో పాటు సన్సిటీ, జయంతినగర్, కెఆర్ఆర్ కాలనీ, ఎన్ఆర్ఐ కాలనీ, మధురనగర్ కాలనీ, లక్ష్మీనగర్, ఆర్టీసీ కాలనీ, వెంకటేశ్వరకాలనీలలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, వినియోగదారులు సహకరించాలని కోరారు. సీఎంఆర్ఎఫ్తో పేదలకు మేలు మర్పల్లి: పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేశ్ సూచన మేరకు కొత్లాపూర్ గ్రామానికి శ్రీకాంత్కు రూ.80 వేల ఎల్ఓసీ అందజేశారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా స్పీకర్ ఆదుకుంటారని తెలిపారు. శ్రీకాంత్ కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లగా సీఎంఆర్ఎఫ్ కింద ఆదుకున్నారన్నారు. ఇద్దరికి డీఎస్సీ పోస్టింగ్లు మర్పల్లి: ఇటీవల డీఎస్సీ 2008 పోస్టింగ్లలో మండలానికి చెందిన ఇద్దరికి పోస్టింగ్ ఇచ్చారు. మండల పరిధిలోని గుండ్లమర్పల్లి పీఎస్ పాఠశాలలో మహబూబ్అలీ, కొంషేట్పల్లి ఉర్దూ మీడియం పాఠశాలలో నూరోద్దీన్ మంగళవారం విధుల్లో చేరినట్లు వారు తెలిపారు. ఆయా పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులకు స్వాగతం తెలిపారు. కేటీఆర్కు ఘన స్వాగతం కందుకూరు: ఆమనగల్లులో నిర్వహిస్తున్న రైతు దీక్ష కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డికి మంగళవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీఎత్తున స్వాగతం పలికారు. భారీ గజమాలతో సత్కరించి జేసీబీ యంత్రాలతో గులాబీ పూలను చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కందుకూరు చౌరస్తాతో పాటు దెబ్బడగూడ గేట్ వద్ద పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కంచారు. అనంతరం ఆయన వెంట రైతుదీక్షకు తరలివెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు జి.లక్ష్మినర్సింహారెడ్డి, గణేశ్రెడ్డి, కార్యదర్శి మహేందర్రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అర్హుల వివరాలు
నియోజకవర్గం రైతులు జమ చేయాల్సిన నిధులుకొడంగల్ 56,417 రూ.72 కోట్లు పరిగి 68,697 రూ.80 కోట్లు తాండూరు 54,428 రూ.79 కోట్లు వికారాబాద్ 79,520 రూ.95 కోట్లు చేవెళ్ల(నవాబుపేట) 16,451 రూ.16 కోట్లు జమ చేసిన వివరాలు నియోజకవర్గం రైతులు డీబీటీ సక్సెస్ కొడంగల్ 33,965 రూ.28 కోట్లు పరిగి 44,071 రూ.33 కోట్లు తాండూరు 30,936 రూ.26 కోట్లు వికారాబాద్ 50,421 రూ.39 కోట్లు చేవెళ్ల(నవాబుపేట) 10,990 రూ.77 కోట్లు -
అర్హులందరికీ సంక్షేమం
● పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ● చెంచుపల్లిలో ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ పూడూరు: అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలో అంగడి చిట్టెంపల్లి, పూడూరు, మిర్జాపూర్, ఎన్కేపల్లి, చెంచుపల్లి, పెద్ద ఉమ్మెంతాల్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. రూ.3.20 కోట్లతో నిర్మించిన గోదాములను ప్రారంభించారు. అనంతరం పూడూరు మండల కేంద్రంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో రైతులకు స్ప్రింక్లర్లను పంపిణీ చేశారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఎన్కేపల్లి అనుబంధం గ్రామంలో చెంచుపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ సత్తయ్య, కాంగ్రెస్ పూడూరు మండల అధ్యక్షుడు సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ సతీశ్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆనందం, వెంకటేశ్వర్ రెడ్డి శ్రీనివాస్ గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, పెంటయ్య, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనివాస్, అజీమ్ పటేల్, షకీల్, అబ్రహం, పూడూర్ పీఏఐసీఎస్ వైస్ చైర్మన్ వీరయ్య గౌడ్, డైరెక్టర్లు శ్రీశైలం గౌడ్, చెన్నయ్య గౌడ్, రాములు నాయక్, సురేష్, నరసమ్మ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు -
అంబేడ్కర్ విగ్రహం తొలగింపు
కొడంగల్ రూరల్: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా సోమవారం అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు విగ్రహాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో భద్రపర్చినట్లు అంబేడ్కర్ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు యూ.రమేష్బాబు, పట్టణ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ ఎం.కృష్ణంరాజు తెలిపారు. పనులు ముగిశాక విగ్రహాన్ని అక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి రమేష్, కార్యదర్శి రాము, వెంకటేశం, జి.జగన్మోహన్, డీవీఎంసీ మెంబర్ దస్తప్ప, జి.రాములు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా నేతల నిర్ణయం ఎంపీడీఓ కార్యాలయానికి తరలింపు పనులు పూర్తయ్యాక అక్కడే ఏర్పాటు చేస్తామని వెల్లడి -
రైతుల ఖాతాల్లోకి భరోసా
బషీరాబాద్: యాసంగి పంటకు ‘రైతు భరోసా’నిధులను సర్కారు కర్షకుల ఖాతాల్లో జమ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వానాకాలం పంటకు రైతు భరోసా అందలేదు. ఈ ఏడాది జనవరి 26న ప్రభుత్వం నూతనంగా నాలుగు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. తొలుత మండలానికి ఒక పైలెట్ గ్రామానికే ‘భరోసా’అందింది. వారం రోజులుగా ఎకరం రైతు మొదలుకొని మూడు ఎకరాల వరకు భరోసా సాయం ఖాతాల్లో జమ అవుతున్నాయి. జిల్లాలో 2,75,513 రైతులకు చెందిన 1,14,492 ఎకరాల సాగు భూమికిగాను రూ.344,66,23,099 పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. 1,70,383 రైతులకు రూ.136,48,29,701 నిధులు డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విజయవతం అయిందని అధికారులు వివరించారు. మార్చి చివరి నాటికి అర్హులైన అన్నదాతల అన్ని ఖాతాల్లో భరోసా నిధులు జమచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. 1.70 లక్షల మంది అకౌంట్లలో నగదు జమ మార్చి చివరి నాటికి పూర్తి -
ఎండలు ‘మండే’న్!
బషీరాబాద్: ఇంక శివరాత్రి రాలేదు.. మార్చి మొదలే కాలేదు.. కానీ సూర్యుడి వేడిమి సుర్రుమంటోంది. ఫిబ్రవరి రెండో వారంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళన కలిగిస్తున్నాయి. వారం రోజులుగా ఉదయం 10గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. సోమవారం మర్పల్లి మండల కేంద్రంలో 37.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. కనిష్టంగా దుద్యాలలో 23 డిగ్రీలు రికార్డయింది. జిల్లాలోని మర్పల్లి, బంట్వారం, మోమిన్పేట, ధారూరు, పూడూరు, వికారాబాద్, యాలాల, కోట్పల్లి, పెద్దేముల్, తాండూరు, దౌల్తాబాద్, నవాబ్పేట, బషీరాబాద్ మండలాల్లో 40 డిగ్రీల లోపు ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 మండలాల్లోని 18 ప్రాంతాల్లో జిల్లా వాతావణ శాఖ అధికారి అశోక్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. చిన్నారులు, వృద్ధులు మధ్యాహ్నం రోడ్లమీదకు రావద్దని సూచిస్తున్నారు. ఎండల తీవ్రతకు జనం శీతల పానియాలకు ఎగబడుతున్నారు. మరోవైపు ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. బోరుబావుల్లో ఐదు ఫీట్ల వరకు భూగర్భ జలాలు దిగిపోయాయి. సోమవారం నమోదైన ఉష్ణోగ్రతలుప్రాంతం గరిష్టం కనిష్టం (డిగ్రీల్లో) (డిగ్రీల్లో) మర్పల్లి 37.9 26.5 బంట్వారం 37.6 27.1 మోమిన్పేట 37.4 27.9 ధారూరు 36.8 27.6 పూడూరు 36.6 29.3 వికారాబాద్ 36.4 24.0 యాలాల 35.8 24.4 కోట్పల్లి 35.8 23.5 పెద్దేముల్ 35.6 24.8 తాండూరు 35.5 24.4 దౌల్తాబాద్ 35.3 26.5 నవాబుపేట 35.2 25.7 బషీరాబాద్ 35.1 21.2 ఉదయం పది గంటలకే భానుడి భగభగలు పడిపోతున్న భూగర్భ జలాలు 13 మండలాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లా వాతావరణ శాఖ -
జాతర ఏర్పాట్ల పరిశీలన
బొంరాస్పేట: మినీ మేడారం జాతరగా పేరుగాంచి పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సోమవారం కలెక్టర్ ప్రతీక్జైన్ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లపై ఆలయ కమిటీ చైర్మన్ జయరాములు, కమిటీ సభ్యులతో చర్చించారు. తాగునీరు, స్నానపు గదులు, మరుదొడ్ల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సీఎం రాకకు సిద్ధం ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిడే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పలువురు మంత్రులు రానున్న నేపథ్యంలో హెలీపాడ్, వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్జైన్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఎల్పీఓ శంకర్నాయక్, డీఎస్పీ శ్రీనివాస్, కడా అధికారి వెంకట్రెడ్డి, ఆలయకమిటీ సభ్యులు వెంకటయ్యగౌడ్, రాములు, యాదయ్య ఉన్నారు. పనులు వేగవంతగా పూర్తి చేయాలి కలెక్టర్ ప్రతీక్జైన్ -
నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
అనంతగిరి: గుట్టుగా నకిలీ పత్తి విత్తనాలను విక్రయించే వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. సుమారు రూ.10లక్షల విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారంతో పెద్దేముల్లో ఆదివారం టాస్క్ఫోర్స్, పోలీసులు తనిఖీలు చేస్తుండగా అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఓ వ్యక్తి నాలుగు ప్లాస్టిక్ సంచులతో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. వెంటనే అతడిని అడ్డుకొని సంచులను పరిశీలించగా వాటిలో ఎలాంటి లేబుల్స్, ల్యాబ్, బ్యాచ్ నంబర్ లేకుండా పత్తి విత్తనాల ప్యాకెట్లు ఉన్నాయి. వీటిని మండల వ్యవసాయాధికారి పవన్ప్రీతం పరిశీలించి నకిలీవని నిర్ధారించారు. కర్ణాటక నుంచి సరఫరా సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఏపీలోని బాపట్ల జిల్లా మర్టూరు మండలం, కోనంకి గ్రామానికి చెందిన ఉప్పలపాటి వసంత్రావుగా గుర్తించారు. ఆయన 15 ఏళ్లుగా కర్ణాటక రాష్ట్రం గుర్మిట్కల్ తాలుకాకు చెందిన గాజుర్కోట్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అక్కడి నుంచి నకిలీ విత్తనాలను తెచ్చి అమ్మడానికి పెద్దేముల్ వచ్చారని తెలిపారు.మొత్తం నాలుగు సంచులలో సుమారు రూ.2.70 లక్షల విలువ కలిగిన 150 కిలోల నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. అనంతరం తాను నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లి తనిఖీలు చేయగా అక్కడ సుమారు రూ.7.20లక్షల విలువైన 4 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిపై పెద్దేముల్ పీఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా కరణ్కోట సీఐ నగేష్, పెద్దేముల్ ఎస్ఐ శ్రీధర్రెడ్డి, టాస్క్ఫోర్స్ ఎస్ఐ ప్రశాంత్వర్ధన్, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సుమారు రూ.10 లక్షల విలువ పెద్దేముల్లో అరెస్టు చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ నారాయణరెడ్డి -
ప్రజావాణికి 98 ఫిర్యాదులు
అనంతగిరి: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా మొత్తం 98 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన ప్రతీ దరఖాస్తును పరిశీలించాలని, తమ పరిధిలో ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలి టెలికాం డీజీఎం ప్లానింగ్ అధికారులకుచేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి వినతి బంట్వారం: వికారాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న బీఎస్ఎన్ఎల్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చేవేళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్ టెలికాం డీజీఎం ప్లానింగ్ అధికారులను కలిసి కోట్పల్లి, వికారాబాద్ మండలాలకు సంబంధించిన బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ నియోజకవర్గంలోని మోత్కుపల్లి, మైలార్ దేవరాంపల్లి, పీలారం, ధర్మపురం, కంకణాలపల్లి, నర్సాపూర్, బార్వాద్, కరీంపూర్, జిన్నారం, బీరోల్ తదితర గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సమస్యతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులకు వివరించారు. సమస్యను సత్వరమే పరిష్కరించి వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ విషయంపై అధికారులు సానుకూలంగా స్పందించారు. యాలాల ఎంఈఓ బాధ్యతల స్వీకరణ యాలాల: నూతన మండల విద్యాధికారిగా జుంటుపల్లి జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రమేశ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఎంపీడీఓ పుష్పలీలకు తాఖీదులు అందజేసిన ఆయన ఎమ్మార్సీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా విద్యాభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ యాదయ్య, తహసీల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. సన్మానం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశంలో నూతన ఎంఈఓ రమేశ్, యాలాల కాంప్లెక్స్ హెచ్ఎం సిద్దరామేశ్వర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మీకాంతరావు, జిల్లా బాధ్యులు నరహరిరెడ్డి చంద్రశేఖర్, జనార్దన్రెడ్డి, హన్మప్ప, భారతి, శ్రీశైలం, నరేశ్, గోపాల్, శశిధర్, సతీదేవి, శాంతి ఉన్నారు. నేటి నుంచి ల్యాడర్ సర్వే కొడంగల్ రూరల్: సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ పరిధికి సంబంధించి అధికారులు మార్కింగ్ వేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయ్కుమార్ మాట్లాడుతూ.. మున్సిపల్కు సంబంధించి నక్ష ఏర్పా టు చేసేందుకు ల్యాడర్ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం నుంచి చేపట్టనున్న సర్వేలో మున్సిపల్కు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. భారతదేశంలో 152 పట్టణ సంస్థలు(యూఎల్బీ) పైలెట్ టౌన్ సర్వే ప్రోగ్రాంకు ఎంపికయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో పది పట్టణ స్థానిక సంస్థలు ఎంపిక కాగా ఇందులో కొడంగల్ ఒకటి అని చెప్పారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రతీ అంగుళం భూమిని జియో కార్డినేట్స్ సాయంతో సర్వే చేయున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
కదలని ఖాకీలు
బదిలీలకు తాండూరు: తాండూరు సబ్ డివిజన్ పరిధిలో మూడు నెలలుగా నేరాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వరుస దొంగతనాలు, తగాదాలతో శాంతిభద్రతలు లోపించాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పట్టణంలో వరుస దొంగతనాలు జరిగి పదిరోజులు గడిచినా ఒక్క కేసును ఛేదించకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ చోరీల్లో అరకోటికి పైగా విలువైన బంగారు ఆభరణాలు, నగదు అపహరణకు గురైంది. మరోవైపు తాండూరు సబ్ డివిజన్ పరిధిలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐలపై అవినీతి ఆరోపణలు రావడంతో ఐజీ బదిలీ ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో ఒక సీఐ మినహాయిస్తే మిగిలిన ముగ్గురు తాండూరు సబ్ డివిజన్ పరిధిలోనే విధులు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా ఇక్కడే.. తాండూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు ఇసుక అక్రమ రవాణా కట్టడి, రేషన్ బియ్యం అక్రమ రవాణాల అరికట్టకపోవడం.. వీటి వెనుక పోలీసు అధికారుల ప్రత్యక్ష, పరోక్ష సహకారం ఉందని ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. గతేడాది అక్టోబర్ 3న ఐజీ వి.సత్యనారాయణ వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తాండూరు రూరల్ సీఐ అశోక్కు స్థానచలనం కల్పించగా.. టౌన్ సీఐ సంతోశ్ మాత్రం ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. యాలాల ఠాణాలో విధులు నిర్వహిస్తున్న శంకర్ను బషీరాబాద్ పీఎస్కు, పెద్దేముల్ ఎస్ఐ గిరిని యాలాల పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. తాండూరు పట్టణ ఠాణాలో రెండు నెలల క్రితం విధుల్లో చేరిన ఎస్ఐ భరత్ రెడ్డి నెలరోజులకే ఎస్హెచ్ఓ కోసం దుద్యాల పీఎస్కు బదిలీ చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో బషీరాబాద్ ఎస్ఐగా పనిచేస్తున్న రమేశ్పై వచ్చిన ఆరోపణల మేరకు ఆయన్ను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ప్రస్తుతం తాండూరు టౌన్ ఎస్ఐగా బాధ్యతలు అప్పగించారు. దీంతో సబ్ డివిజన్ పరిధిలో నలుగురు ఎస్సైలు వివాదాలను ఎదుర్కొంటున్నవారే ఉన్నారనే చర్చలు వినిపిస్తున్నాయి. నిద్దరోతున్న నిఘా నేత్రం తాండూరు టౌన్ పీఎస్ పరిధిలో శాంతి భద్రత పరిరక్షణకు ఏడాదిన్నర క్రితం ప్రభుత్వం సీడీపీ నిధుల నుంచి రూ.25 లక్షలు మంజూరు చేసి సీసీ కెమెరాలు, సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేయించింది. వీటి నిర్వహణ విషయంలో పోలీసు అధికారులు అలసత్వం ప్రదర్శించారనే విమర్శలున్నాయి. మూడేళ్ల క్రితం ఇక్కడ విధులు నిర్వహించిన పోలీసులు అధికారులు మేము సైతం, నేను సైతం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లోనూ ఏర్పాటు చేయించారు. కానీ చోరీకి పాల్పడిన దొంగలు చిక్కక పోవడంతో అసలు నిఘానేత్రాలు పనిచేస్తున్నాయా లేదా అనే అనుమానాలకు తావిస్తోంది. సరిపడా లేని సిబ్బంది అవినీతి ఆరోపణల నేపథ్యంలో ట్రాన్స్ఫర్స్ ఉత్తర్వులు వచ్చినా సబ్ డివిజన్ పరిధిలోనే విధులుపది రోజులు గడిచినా నిందితులను పట్టుకోని వైనంమరోవైపు వరుస చోరీలుతాండూరు సబ్ డివిజన్ పోలీసు అధికారులపై సర్వత్రా విమర్శలుతాండూరు సబ్ డివిజన్ పరిధిలో తాండూరు పట్టణం, తాండూరు రూరల్ సర్కిలున్నాయి. పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక సీఐ ఉండగా రూరల్ పరిధిలోని కరన్కోట్ పోలీస్ స్టేషన్లో మరో సీఐ విధులు నిర్వహిస్తున్నారు. రూరల్ సర్కిల్ పరిధిలో పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, కరన్కోట్ పోలీస్ స్టేషన్లకు ఎస్హెచ్ఓలుగా ఎస్ఐలు కొనసాగుతున్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్కు రెండు చొప్పున ఎస్ఐ పోస్టులుండగా ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు కానిస్టేబుల్స్ పోస్టులు సైతం ఖాళీగానే ఉన్నాయి. -
ఇంటి నిర్మాణాలకు అనుమతి తప్పనిసరి
యాలాల: పంచాయతీల్లో ఇంటి నిర్మాణాలు చేపడుతున్న వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఎంపీఓ గాలి యాదయ్య సూచించారు. సోమవారం ఆయన మండల పరిధిలోని తిమ్మాయిపల్లిలో ఇంటి నిర్మాణదారులు వద్ద అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయమై పరిశీలించారు. ఈ సందర్భంగా ఒకరు ఎలాంటి అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేస్తున్నట్లు గుర్తించారు. మరొకరు ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేస్తున్నట్లు గుర్తించి పనులను నిలిపివేయించారు. ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాల విషయంలో స్థానిక పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు అనుమతి అంశాలను పరిశీలించాలని సూచించారు. అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేపడితే విద్యుత్, నల్లా కనెక్షన్ల తదితర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు. ఎంపీఓ యాదయ్య -
సంత్ సేవాలాల్ సేవలకు సలాం
తెలంగాణకు పున్నమి చంద్రుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు సోమవారం వికారాబాద్లో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మొక్కలు నాటారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని ధన్నారం వద్ద యజ్ఞ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భారీ కేక్ కట్చేశారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చీకటిలో ఉన్న తెలంగాణకు పున్నమి చంద్రుడు ఆత్మగల్ల కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. – అనంతగిరిఅనంతగిరి: బంజారాలను చైతన్యం చేయడంలో సంత్ సేవాలాల్ చేసిన సేవలు మరువ లేనివని కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంత్యుత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్జైన్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సేవాలాల్ బోధనలు పాటిస్తూ సమాజ సేవకకు తోడ్పాటునందించాలన్నారు. జంతు బలి నిషేధాన్ని ప్రచారం చేసిన గొప్ప అహింసావాది అని కొనియాడాదరు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ట్రెయినీ కలెక్టర్ ఉమా హారతి, డీఎండబ్ల్యూఓ కమలాకర్ రెడ్డి, డీఆర్డీఓ శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ -
సెక్యూరిటీగార్డు ఆత్మహత్యాయత్నం
తాండూరు టౌన్: పురుగు మందు తాగి ఓ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన నర్సింలు 20 ఏళ్లుగా స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రిలో వినాయాక ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఏజెన్సీ నిర్వాహకులు నెల నెల జీతాలు సరిగా చెల్లించక కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం పెండిగ్లో పెట్టిన జీతంతో పాటు పీఎఫ్ను వెంటనే జమచేయాలని ఏజెన్సీ నిర్వాహకుడిని కోరగా అతడు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో మనస్తాపానికి గురైన నర్సింఉలు పురుగు మందుతాగాడు. గమనించిన స్థానికులు యాన్ను హుటాహుటిన తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా కుటుంబ సభ్యులు ఏజెన్సీ నిర్వాహకుడిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ పీఎఫ్, ఈఎస్ఐ జమచేయండి ఔట్ సోర్సింగ్ విధానంలో జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, పేషెంట్ కేర్ స్వీపర్లకు జీతాలు సరిగా ఇవ్వకుండా, పీఎఫ్ జమచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వినాయక ఏజెన్సీ తీరుకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. పెండింగ్లో పెట్టిన పీఎఫ్, ఈఎస్ఐని వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వారికి రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలన్నారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వినాయక ఏజెన్సీ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలన్నారు. వేతనాలు పెండింగ్లో పెడుతున్న వినాయక ఏజెన్సీపై చర్యలకు డిమాండ్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన