Vikarabad District News
-
రైతులకు ప్రభుత్వం అండ
● కలెక్టర్ ప్రతీక్జైన్ ● హకీంపేట్ రైతులతో సమావేశం ● ఒకే విడతలో పరిహారం అందజేస్తామని వెల్లడి అనంతగిరి: పారిశ్రామిక పార్కు కోసం భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఒకే విడతలో పరిహారం అందజేస్తుందని కలెక్టర్ ప్రతీక్జైన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ సభ్యులు దుద్యాల్ మండలం హకీంపేట్ రైతులతో సమావేశమయ్యారు. భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన 114 మంది రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హకీంపేట్లో 146.34 గుంటల పట్టాభూమి ఉందని తెలిపారు. భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే రైతులతో అగ్రిమెంట్ చేసుకొని ముందుకెళ్తామన్నారు. జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ నిర్ణయం ప్రకారం పరిహారం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఎకరాకు రూ.20 లక్షలు, 150 గజాల ఇంటి స్థలంలో ఇందిరమ్మ ఇల్లు, అర్హత ఆధారంగా ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) లింగ్యానాయక్ , తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్రెడ్డి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శారద, అసిస్టెంట్ జోనల్ మేనేజర్ అజీమ సుల్తానా, దుద్యాల్ మండలం తహసీల్దార్ కిషన్, హకీంపేట రైతులు పాల్గొన్నారు. -
నూతన కమిటీ ఏకగ్రీవం
కొడంగల్ రూరల్: కొడంగల్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ నూతన కమిటీని మంగళవారం ఎలక్షన్ ఆఫీసర్ పీ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా పి.వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా బసవరాజు, జనరల్ సెక్రటరీగా బి.వెంకటయ్య, జాయింట్ సెక్రటరీగా కె.రమేష్, కోశాధికారిగా శ్రీనివాస్ ఆనంద్, లైబ్రేరియన్ కార్యదర్శిగా బి.కృష్ణయ్య, కల్చరల్ కార్యదర్శిగా కె.రాము లు, స్పోర్ట్స్ కార్యదర్శిగా ఎస్డీ.మొహీద్, లేడీ రిప్రజెంటేటివ్గా భాగ్యలతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మర్పల్లి తైబజార్ వేలం రూ.5 లక్షలకు దక్కించుకున్న నాగేష్ మర్పల్లి: మర్పల్లి తైబజార్కు మంగళవారం వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన నలుగురు వేలం పాటలో పాల్గొన్నారు. తలారి నాగేష్ రూ.5లక్షల 11 వేలకు తైబజార్ దక్కించుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. గ్రామసభలో నిర్ణయించిన ప్రకారం వ్యాపారుల నుంచి ఏడాది పాటు రుసుం వసూలు చేసుకోవచ్చని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రుసుం వసూలు చేస్తే తైబజార్ లైసెన్స్ రద్దు చేసి వేలం పాటలో రెండో వ్యక్తిగా నిలిచిన వారికి అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాములు యాదవ్, మాజీ సర్పంచ్ పాండు నాయక్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శేఖర్ యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షడు జగదీశ్, జిల్లా ఉపాధ్యక్షుడు గణేశ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు సర్వేశ్, స్థానిక నాయకులు నర్సింలు యాదవ్, మారుతి, శివ, భరత్, వీరేశం, సీహెచ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. దుకాణాలకు వేలం ధారూరు: ధారూరు గ్రామ పంచాయతీకి చెందిన దుకాణాలకు మంగళవారం గ్రామ కార్యదర్శి అంజానాయక్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. 2025–26 సంవత్సరానికి గాను 8 దుకాణాలకు బహిరంగ వేలం వేశారు. మొదటి దుకాణాన్ని రూ.40 వేలకు మహబూబ్ఖాన్, రెండో దుకాణాన్ని రూ.48 వేలకు ఇ బ్రహీం, మూడో దుకాణాన్ని రూ.48,500 లకు దావూద్,4వ దుకాణం రూ.48 వేలకు ఇబ్రహీం, పాత దుకాణాల్లో 5వ షాపును రూ.28 వేలకు మహబూబ్ఖాన్, 6వ దుకాణం రూ.23 వేలకు మహ్మద్ ఉస్సేన్, 7వ దుకాణం రూ.7,500 లకు అబ్దుల్ నబీ, 8వ దుకాణం రూ.32 వేలకు ఫెరోజ్ ఖురేషి దక్కించుకున్నారు. నేడు వాహనాల వేలం అనంతగిరి: ఎకై ్సజ్ శాఖ పరిధిలో ఆయా కేసు ల్లో పట్టుబడిన మూడు బైక్లకు బుధవారం వేలం నిర్వహించనున్నట్లు వికారాబాద్ ఎకై ్సజ్ సీఐ రాఘవీణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు తమ కార్యా లయం ఆవరణలో వేలం ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల వారు వేలం పాటలో పాల్గొన వచ్చిని ఆమె తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 8712658755లో సంప్రదించాలని సూచించారు. బాల్య వివాహాలను అరికడదాం అనంతగిరి: బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి బాధ్యత తీసుకోవాలని బాల రక్షణ భవన్ కోఆర్డినేటర్ కాంతారావు అన్నారు. మంగళవారం వికారాబాద్లోని సీ్త్ర శక్తి భవనంలో సాధన సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. బాల్య వివాహాలను ఎవరూ ప్రోత్సహించరాదని అన్నారు. బాల్య వివాహా లు జరుగుతున్నట్లు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సాధన సంస్థ డైరక్టర్ మురళీమోహన్, సీడీపీఓ వెంకటేశ్వరమ్మ, ఏహెచ్టీయూ ఇన్చార్జ్ అలీ మొద్దీన్, సాధన కోఆర్డినేటర్ నర్సింలు, సిబ్బంది యాదయ్య, జ్యోతి, రాములు, అంజయ్య, సఖి కోఆర్డినేటర్ యశోద, భరోసా ఇన్చార్జ్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
వారానికి 40 నిమిషాలు
ఏఐ ఆధారిత బోధనకు ఎంపికైన పాఠశాలలకు కంప్యూటర్లు, ప్రింటర్లు అందజేశారు. వారానికి 40 నిమిషాల చొప్పున బోధన చేస్తున్నారు. 20 నిమిషాల చొప్పున రెండు సెషన్స్ ఉంటాయి. మొదట తెలుగు, ఆ తర్వాత మ్యాథమెటిక్స్ బోధించాల్సి ఉంటుంది. అయితే కొన్ని పాఠశాలల్లో మ్యాథ్స్ ప్రోగ్రాం అందుబాటులోకి తీసుకరాకపోవడంతో ఉపా ధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. తెలుగు, ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడేందుకు, గణితంపై పట్టు సాధించేందుకు ఏఐ ఎంతగానో దోహదపడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఐ బోధన సక్సెస్ అయితే మిగతా స్కూళ్లలో అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
అప్రమత్తతే రక్ష
● అగ్గి రాజుకుంటే బుగ్గే.. ● పరిశ్రమల్లో తరచూ అగ్నిప్రమాదాలు ● వేసవి వేళ జాగ్రత్తలు ముఖ్యం ● ఎప్పటికప్పుడు తనిఖీలు చేసుకోవాలి: అగ్నిమాపక సిబ్బంది షాద్నగర్: వేసవి కాలం ప్రారంభమైంది.. అగ్ని ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. అప్రమత్తంగా ఉండకుంటే భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అగ్నిమాపక కేంద్రాలు ఉన్నా సంఘటనా స్థలానికి చేరుకునేలోపు ఉన్న ఆస్తి కాస్తా అగ్నికి ఆహుతయ్యే అవకాశం ఉంది. వేసవి నేపథ్యంలో పరిశ్రమల వర్గాలు, వ్యాపారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. తరచూ ప్రమాదాలు షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని కొత్తూరు, నందిగామ, షాద్నగర్ ప్రాంతాల్లో సుమారు 350కి పైగా పరిశ్రమలు ఉన్నాయి. 50 వేలకు పైగా కార్మికులు పని చేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు ముఖ్యంగా కాటన్, జిన్నింగ్, ఆయిల్, హెర్చల్ పరిశ్రమల్లో అధికంగా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయల ఉత్పత్తులు, యంత్రాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. పరిశ్రమల్లో పని చేసే కార్మికులు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో పని చేయాల్సి వస్తోంది. 11 నెలల క్రితం నందిగామలో పాత జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న అలైన్ ఫార్మా హెర్బల్ పరిశ్రమలో వెల్డింగ్ చేస్తుండగా నిప్పు రవ్వలు స్పాంజ్, థర్మాకోల్ షీట్లపై పడటంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఐదు నెలల క్రితం అన్నారం గ్రామ శివారులోని ఆయిల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి భారీ నష్టం వాటిల్లింది. ఇటీవల బైపాస్ రోడ్డులో వ్యర్థాలకు గుర్తు తెలియని వారు నిప్పంటించారు. గతంలో మొగిలిగిద్ద గ్రామ శివారులో రబ్బర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. షాద్నగర్ శివారులోని బైపాస్ జాతీయ రహదారిపై వెళ్తున్న కారు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటనలు ఉన్నాయి. భారీ ప్రమాదాలు జరిగితే షాద్నగర్ ఉన్న అగ్నిమాపక శకటాలతో పాటు,శంషాబాద్, రాజేంద్రనగర్, జడ్చర్ల తదితరప్రాంతాల నుంచి శకటాలను రప్పించి మంటలను ఆర్పేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి వేసవి కాలం ప్రారంభం కావడంతో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. పరిశ్రమ ల్లో, వ్యాపార సముదాయాల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. పరిశ్రమల నిర్వాహకులు, వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ వారు సూచిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు విధిగా మంచినీటిని అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చాలా పరిశ్రమల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. యంత్రాలకు సంబంధించిన విద్యుత్ వైర్లు సరిగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చూసుకోవాలని చెబుతున్నారు. -
విజ్ఞాన సాధన
వినూత్న బోధనప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త తరహా బోధనకు అడుగులు పడ్డాయి. ప్రాథమిక స్థాయి నుంచే ఏఐ ఆధారిత బోధన జరుగుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వర్చువల్ రియాలిటీ విధానంలో బోధన చేసేలా విద్యాశాఖ ముందడు వేసింది. పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని ఆరు పాఠశాలలను ఎంపిక చేయగా వాటిలో మూడు స్కూళ్లు దోమ మండలంలోనే ఉన్నాయి. ఏఐ ఆధారిత బోధన విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. దోమ: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ ఏఐ)కు ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఈ విధానంలో బోధన చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆరు పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధనను గత నెల 24నుంచి ప్రారంభించింది. జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 5న బెంగళూరుకు చెందిన ఎక్స్టెప్ ఫౌండేషన్ ప్రతినిధులు మండలంలో ఏఐ బోధనా తీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను తెలుసుకున్నారు. పిల్లలు అనర్గళంగా మాట్లాడటం, చదవడం చూసి అభినందించారు. ఇటీవల హైదరాబాద్లో ఏఐపై జరిగిన సదస్సులో జిల్లాలోని బొంపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఆదిత్య అనే విద్యార్థి చక్కటి ప్రతిభ కనబరిచి బెస్ట్ స్టూడెండ్గా ఎంపికయ్యారు. సామర్థ్యాల పెంపే లక్ష్యం విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడం, సామర్థ్యాల మదింపు, మార్గనిర్దేశం చేయడమే ఏఐ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఈ తరహా బోధన సాగుతోంది. పాఠ్యాంశాలను ప్రోగ్రామ్గా రూపొందించి అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయుడు పాఠం చెప్పిన తర్వాత ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు ప్రశ్నలు పంపుతారు. వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒక వేళ జవాబులో తప్పులుంటే సరి చేసుకునే వరకు ఏఐ టెక్నాలజీ సూచనలు చేస్తూనే ఉంటుంది. 60మంది విద్యార్థులకు.. జిల్లాలో ఏఐ ఆధారిత బోధనకు బొంపల్లి, గడిసింగాపూర్, కొడంగల్, ఎన్నారం, పుల్మామిడి, సాయిపూర్ ప్రాథమిక పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఒక్కో పాఠశాల నుంచి 20 మంది చొప్పున ఆరు స్కూళ్ల నుంచి 120 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఏఐలో తొమ్మిది లెవెల్స్ ఉంటాయి. ప్రతి విద్యార్థీ ఒక్కో లెవల్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని అంచెలు పూర్తి చేసిన వారికి బెస్ట్ స్టూడెంట్ సర్టిఫికెట్లు అందజేస్తారు. ఇటీవల బొంపల్లి పాఠశాలలో ఏఐ ఆధారిత బోధనను పరిశీలిస్తున్న బెంగళూరు టీం సభ్యులు పైలెట్ ప్రాజెక్టు కింద ఆరు పాఠశాలల ఎంపిక సమర్థవంతంగాఅమలు చేస్తున్న ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయిలో సత్తాచాటిన బొంపల్లి విద్యార్థి భవిష్యత్తులో మరిన్ని స్కూళ్లలోఅమలయ్యే అవకాశం -
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
పేదల తిరుపతిగా పేరుగాంచిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి అంకురార్పణ చేశారు. శ్రీవారి ఆలయం నుంచి ఉత్సవమూర్తులను శాంతినగర్ కాలనీలోని పారువేట మంటపం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్ట మన్ను సేకరించారు. పుట్ట మన్నును ఉత్సవమూర్తుల వద్ద ఉంచి శుద్ధి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. బుధవారం సాయంత్రం 6గంటలకు ధ్వజారోహణం, తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 9నుంచి 11 గంటల వరకు దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను పెద్ద శేష వాహనంపై ప్రతిష్ఠించి ఆలయ మాఢవీధుల్లో భక్తుల దర్శనార్థం ఊరేగింపు నిర్వహిస్తారు. –కొడంగల్ -
గత పాలకులతోనే వరద ముప్పు
● అసెంబ్లీ సమావేశాల్లోతాండూరు సమస్యలపై గళం వినిపించిన ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తాండూరు: గత పాలకుల నిర్లక్ష్యం వల్లే తాండూరు మున్సిపాలిటీ చిన్నపాటి వర్షానికే ముంపునకు గురవుతోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఆయనకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా తాండూరు సమస్యలను వినిపించారు. 1953లో తాండూరు మున్సిపాలిటీగా ఏర్పడిందన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మూడు సిమెంట్ కర్మాగారాలు, నాపరాతి గనులు, పరిశ్రమలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూలీలు, ప్రజలు వచ్చి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గత పాలకులు మున్సిపాలిటీలో జనాభాకు తగ్గట్లు అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. చిన్నపాటి వర్షం వచ్చినా పట్టణ పరిధిలోని సాయిపూర్, శాంతినగర్, హైదరాబాద్ మార్గంలోని ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నాయని సభ దృష్టికి తెచ్చారు. చిలుక వాగును ప్రక్షాళన చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధిత శాఖ మంత్రులు నిధులు కేటాయించాలని కోరారు. తాండూరు ప్రాంతానికి నాగర్ కర్నూల్ జిల్లా నుంచి మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతోందని.. చాలా దూరం నుంచి నీటి సరఫరా చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. తాండూరుకు పక్కనే ఉన్న కగ్నానదిలో 1965లో తాగునీటి కోసం పంప్హౌస్ నిర్మించారని.. తరచూ మోటార్లు కాలిపోతున్నాయని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. స్పందించిన మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే చెప్పిన వివరాలను నోట్ చేసుకోన్నట్లు పేర్కొన్నారు. -
స్నేహితుల వద్దకు వెళ్తూ మృత్యువాత
మోమిన్పేట: ఇద్దరు మిత్రులు కలిసి హైదారాబాద్లో ఉంటున్న తమ స్నేహితుల వద్దకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన బైకని నరేష్(21), మంగలి మనోజ్కుమార్(19) హైదరాబాద్లో ఉన్న తమ మిత్రులను కలిసేందుకు సోమవారం రాత్రి బైక్పై బయల్దేరారు. 11 గంటల సమయంలో మోమిన్ పేట సమీపంలోని మొరంగపల్లి కార్తికేయ ఫ్యాక్టరీ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు 108కు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న సిబ్బంది అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ అరవింద్ వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మనోజ్కుమార్ తుఫాన్ డ్రైవర్గా పనిచేసేవాడు. నరేశ్ వ్యవసాయంలో తండ్రికి సాయపడేవాడు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బైక్ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం అక్కడికక్కడే ఇద్దరు యువకుల దుర్మరణం రొంపల్లిలో విషాదఛాయలు -
నడి రోడ్డుపై మృత్యుపాశాలు!
తాండూరు పట్టణంలోని అంతారం మార్గంలో 6 నెలల క్రితం రోడ్డుపై నిలిచి ఉన్న లారీపై విద్యుత్ తీగ తెగి పడటంతో పూర్తిగా దగ్ధమైంది. మరో ఘటనలో చించోళి మార్గంలోని శివాజీ చౌక్ వద్ద వేగంగా వచ్చిన లారీ ట్రాన్స్ఫార్మర్ దిమ్మెను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరుపాదదారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి సంఘటనలు తాండూరులో నిత్యకృత్యంగా మారాయి. ప్రధాన రోడ్డును విస్తరించినా విద్యుత్ స్తంభాలను తొలగించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాండూరు: పట్టణంలోని ప్రధాన జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టినా విద్యుత్ స్తంభాలను తొలగించలేదు. దీంతో నాలుగేళ్లుగా ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నడి రోడ్డుపైనే ట్రాన్స్ఫార్మర్లు ఉండటంతో రెండుసార్లు వాటి దిమ్మెలను వాహనాలు ఢీకొన్నాయి. మరోవైపు మున్సిపల్ పరిధిలోని శివాజీ చౌక్ నుంచి సీతారాంపేట్ పాండురంగ స్వామి దేవాలయం వరకు మార్గంలో నడిరోడ్డుపై విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. పాత తాండూరు ప్రాంతంలోనూ అదే పరిస్థితి నెలకొంది. రూ.1.92 కోట్లతో ప్రతిపాదనలు తాండూరు మున్సిపల్ పరిధిలో ప్రధాన రోడ్లపై ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి మరోచోట నాటేందుకు రూ.1.92 కోట్ల నిధులు అవసరముంది. అందుకోసం గతేడాది విద్యుత్ శాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. శివాజీ చౌక్ నుంచి ముర్షద్ దర్గా మార్గంలో విద్యుత్ స్తంభాలను తొలగించేందుకు 30 పోల్స్ అవసరమవుతాయి. తీగలు, విద్యుత్ పరికరాలకు మొత్తం కలిపి రూ.22.44 లక్షల నిధులు కావాల్సి ఉంది. అయితే ఈ రోడ్డు పురపాలక సంఘం ఆధీనంలోకి రావడంతో మున్సిపల్ అధికారులను నిధుల కోసం కోరితే వారం రోజుల క్రితం రూ.8 లక్షల నిధులను విద్యుత్ శాఖ ఖాతాలో జమ చేశారు. మరోవైపు పాత తాండూరులో రూ.1.45 కోట్లు, అంతారం రోడ్డుపై ఉన్న స్తంభాల తొలగింపునకు రూ.24.25 లక్షల నిధులు వెచ్చించాలి. ఆర్అండ్బీ శాఖ ఆఽధీనంలో ఉండటంతో నిధులను సమకూర్చాలని విద్యుత్ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించి ఏడాది దాటినా ఎలాంటి స్పందన లేదు. రహదారి విస్తరించినా.. తొలగించని కరెంట్ స్తంభాలు నిధులు లేవంటూ కాలయాపన చేస్తున్న విద్యుత్శాఖ తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు -
అన్నదాతకు ‘అకాల’ నష్టం
కూలిన గూడుబొంరాస్పేట: అకాల వర్షంతో ఇల్లు కూలి ఓ దళిత బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. మండల పరిధిలోని వడిచర్లకు చెందిన గడ్డపు లాలమ్మది దళిత నిరుపేద కుటుంబం. తన కోడలు మొగులమ్మతో పాటు చిన్నారులతో కలిపి ఇంట్లో ఎనిమిది మంది ఉంటున్నారు. గత సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఇల్లు కూలిపోయింది. ఈ విషయాన్ని మంగళవారం గ్రామ కార్యదర్శి సువర్ణకు తెలియజేశారు. రేకుల తలుపుతో కాలం గడుపుతున్న తమను ఆదుకోవాలని, అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. దుద్యాల్: రెండు రోజులుగా మండలంలో కురిసిన వడగళ్లు, అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హస్నాబాద్, ఆలేడ్, కుదురుమల్ల, దుద్యాల్, అల్లిఖాన్పల్లి, చెట్టుపల్లితండా, చిలుముల మైల్వార్, ఈర్లపల్లి, లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల్లో కురిసిన వడగండ్ల వాన చేతికొచ్చిన పంటలకు నష్టం కలిగించింది. అసలే అరకొరగా కాచిన మామిడి కాయలు నేల రాలాయి. వడ్లు సైతం రాలిపోవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. చిలుముల మైల్వార్ గ్రామంలో నర్సింలు, రాజు, వడ్ల ఈశ్వరయ్య గౌడ్, శేఖరయ్యగౌడ్ తదితరులకు చెందిన సుమారు వంద ఎకరాలకు పైగా పొలంలో వడ్లు రాలిపోయాయి. హస్నాబాద్లో మామిడి తోటలకు ఎక్కువగా నష్టం జరిగింది. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు. వరి, మామిడి పంటలపై తీవ్ర ప్రభావం నేల రాలిన కాయలు, వడ్లు పరిహారం అందించాలని రైతుల అభ్యర్థన -
రాయితీలను అందిపుచ్చుకోవాలి
అనంతగిరి: రైతులు లాభదాయక పంటలు వేయడానికి ముందుకు రావాలని ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను, పథకాలను అందిపుచ్చుకోవాలని వికారాబాద్ నియోజకవర్గ ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి వైజయంతి కల్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయ పరిశోధన కేద్రం, వికారాబాద్ ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మదనపల్లి గ్రామంలో మహిళా దళిత రైతులకు దుంప పంటల సాగులో అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో చామగడ్డ, మొరంగడ్డ ముఖ్యమైనవని అన్నారు. అవీ రంగారెడ్డి జిల్లాలో మాత్రమే సాగు చేయబడుతుందని చెప్పుకొచ్చారు. వికారాబాద్ పట్టణ పరిసరప్రాంతాల్లోని అత్వెల్లీ, కొంపల్లి, మదనపల్లి, ఎర్రవల్లి, ఫులమద్ది గ్రామాల్లోని భూములు ఈ దుంప పంటలకు అనుకూలం. హైదరాబాద్ సమీపాన ఉండతో కూరగాయల సాగు చేపట్టవచ్చని చెప్పారు. అనంతరం శ్రీ కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా.సురేశ్ మాట్లాడుతూ చామగడ్డ, మొరం గడ్డ సాగు, యాజమన్య పద్ధతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కూరగాయ పరిశోధన కేంద్రం ఏఈవోలు ప్రశాంత్, కుమార్, అధికారులు, రైతులు హన్మంతు, అశోక్, రైతులు పాల్గొన్నారు. -
పంటల నష్టం అంచనా వేయాలి
మర్పల్లి: ఇటీవల కురిసిన వర్షానికి పాడైన పంటల నష్టాన్ని అంచన వేయాలని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని మల్లికార్జునగిరి, బిల్కల్ గ్రామాలలో పాడైన పంటలను ఏఓ శ్రీకాంత్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడారు. ఉల్లి, జొన్న, మొక్కజొన్న, కూరగాయ పంటలతో పాటు మామిడికి అపార నష్టం జరిగినట్లు రైతులు కంటతడి పెట్టారు. వ్యవసాయ శాఖ అధికారులు రెండు రోజుల్లో వచ్చి పంటనష్టం అంచన వేస్తారని ప్రభుత్వం నుంచి పరిహారం అందేవిధంగా కృషి చేస్తానని మహేందర్రెడ్డి రైతులకు భరోస కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ జోస్న, ఆయా గ్రామాల రైతులు అశోక్, ప్రమోధ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. సుమారు 200 ఎకరాల్లో పంట నష్టం.. మల్లికార్జునగిరి, బిల్కల్ గ్రామాలలో 80 ఎకరాల్లో ఉల్లి, 30 ఎకరాల్లో జొన్న, 40 ఎకరాల్లో మొక్కజొన్న, మరో 50 ఎకరాల్లో కూరగాయలు, మామిడి తోటలకు నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమిక అంచన వేసినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారు. పంటలు పరిశీలించిన అనంతరం మర్పల్లి వ్యవసాయ మార్కెట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచన వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపితే స్పీకర్ ప్రసాద్కుమార్ దృష్టికి తీసుకుపోయి పంట నష్టం జరిగిన ప్రతీ రైతుకు ఎకరాకు రూ.10వేలు అందేవిధంగా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములుయాదవ్, ఏఓ శ్రీకాంత్, ప్రభాకర్రెడ్డి, మల్లికార్జునగిరి అశోక్, ప్రమోధ్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి -
కేంద్ర మంత్రి బండిపై ఫిర్యాదు
అనంతగిరి: బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్పై నిరాధారమైన ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి బండిసంజయ్పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం వికారాబాద్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బండి సంజయ్ కేసీఆర్పై చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి ఆధారాలున్నా బయటపెట్టాలన్నారు. అవాస్తవ మాటలతో బీఆర్ఎస్ కార్యకర్తలను, కేసీఆర్ అభిమానులను మా మనస్సును గాయపరిచారన్నారు. ఇలా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్, మండల అధ్యక్షుడు మైపాల్రెడ్డి, నాయకులు అశోక్, అనిల్, రాజేందర్, అనిల్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ధారూరు: కేంద్రమంత్రి బండి సంజయ్పై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ధారూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం కేసీఆర్పై నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. పార్టీ అభిమానులుగా మా మనోభావాలు దెబ్బతిన్నాయని, బండిసంజయ్పై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు ఎస్ఐ అనితకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ధారూరు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, పార్టీ నాయకులు చిన్నయ్యగౌడ్, జైపాల్రెడ్డి, రహమతుల్లాఖాన్, విజయకుమార్, మహేశ్, పాల్గొన్నారు. -
ఆలయ కమిటీ ఎన్నికకు దరఖాస్తు చేసుకోండి
మర్పల్లి: మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల నియామకానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కాపీని ఎండోమెంట్ అధికారి కృష్ణప్రసాద్ మంగళవారం మర్పల్లి ఆంజనేయస్వామి ఆలయంలో గ్రామస్తులకు అందజేశారు. అనంతరం నోటీస్ బోర్డుపై అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరవై రోజుల్లో ఆలయ చైర్మన్, పాలక మండలి సభ్యుల ఎన్నిక కోసం ఎండోమెంట్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ (బొగ్గులకుంట, తిలక్రోడ్డు, హైదరాబాద్) కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూజారి వినోద్శర్మ, గ్రామస్తులు రాములు యాదవ్, సర్వేశ్, నర్సింలు యాదవ్, జగదీశ్, రాచన్న, రంజిత్, రంగారెడ్డి, వీరేశం ఉన్నారు. ఆటో బైక్ ఢీ.. ఇద్దరికి గాయాలు పరిగి: ఆటో బైక్ ఢీకొనడంతో ఇద్దరికి గాయాలైన సంఘటన పట్టణ కేంద్రంలోని కృష్ణవేణి స్కూల్ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బందయ్య, అంజమ్మ పరిగి నుంచి ఇంటికి వెళ్తుండగా కొడంగల్ వైపు నుంచి వస్తున్న ఆటో బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 సహాయంతో పరిగి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నగరానికి తరలించినట్టు సమాచారం. ఈ రోడ్డు ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం బంట్వారం: మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని కోట్పల్లి ఎస్ఐ అబ్దుల్ గఫార్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో మహిళా సమాఖ్య సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లలు అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం చేరవేయాలన్నారు. సైబర్ నేరాలు, సీసీ కెమెరాలు, ఫొటో మార్ఫింగ్స్, పోక్సో చట్టం తదితర అంశాలపై ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శివయ్య, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నిర్మల, సీసీలు గణేష్, హన్మంత్రెడ్డి, సునీత, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. పాస్టర్ మృతిపై ఆందోళన పరిగి: తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మత ప్రచారకుడైన పాస్టర్ ప్రవీణ్ పడగాల మృతి ఆందోళన కల్గించే అంశమని వికారాబాద్ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షుడు క్రిష్ణ మంగళవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతిపై ఎన్నో అనుమాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. -
బకాయిలు వసూలు చేయాలి
కొడంగల్ రూరల్: మున్సిపాలిటీకి రావాల్సిన పన్ను బకాయిలను పూర్తిగా వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్ పేర్కొన్నారు. మార్చి మొదటి వారం నుంచి చివరి తేదీ వరకు పన్ను వసూలు చేయాలని టార్గెట్గా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో ఆయా కాలనీలలో తిరుగుతూ పన్ను వసూలుకు కృషిచేస్తున్నారు. ప్రజలకు పన్నులు సకాలంలో చెల్లించి అభివృద్ధికి తోడ్పడాలని కమిషనర్ బలరాంనాయక్ అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 75శాతం పూర్తి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు 75శాతం పన్ను వసూలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మార్చి నెలలో మిగిలిన 6రోజుల్లో రెండు రోజులు సెలవు దినాలు. మిగిలిన 4రోజుల్లో బకాయి వసూలుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషిచేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్అభివృద్ధికి సహకరించాలి మున్సిపల్ పరిధిలోని పట్టణంతో పాటు గ్రామాల్లో సిబ్బంది తిరుగుతూ పన్ను బకాయిలు వసూలు చేస్తూ, అభివృద్ధికి సహకరించాలని అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 75శాతం పన్ను వసూలయ్యాయి. మిగిలిన బకాయి వసూలుకు కృషిచేస్తున్నాం. – బలరాంనాయక్, మున్సిపల్ కమిషనర్ -
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి
మోమిన్పేట:ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. అంరాధికలాన్ గ్రామానికి చెందిన ఈర్లపల్లి కుమార్(42) కుటుంబ అవసరాల కోసం, రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొడుకుకు చికిత్స చేయించేందుకు అప్పు లు చేశాడు. ఇవి తీరే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై గత ఆదివా రం ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగాడు. గమ నించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఉస్మానియాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మూగజీవి నరక యాతన యాలాల: చెట్టు కొమ్మ విరిగి పడటంతో ఓ కాడెద్దు కదల్లేని స్థితిలో నరక యాతన అనుభవిస్తోంది. యాలాలకు చెందిన గడ్డం సత్యప్పకు చెందిన ఎద్దును పొలం సమీపంలోని వేపచెట్టు కింద కట్టేశాడు. సోమవారం సా యంత్రం ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు రావడంతో పెద్ద కొమ్మ విరిగి ఎద్దు నడుము పై పడింది. దీంతో లేచినిలబడలేక విలవిల్లా డుతోంది. జీవనాధారమైన ఎద్దు పరిస్థితిని చూసిన రైతు కన్నీటి పర్యంతమవుతున్నాడు. గిర్దావర్ శివచరణ్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సంచార పశు వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చి, వైద్యం అందించాలని రై తుకు సూచించారు. ఎద్దు విలువ రూ.90వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. -
నేడు శాస్త్రవేత్తలతో రైతుల ముఖాముఖి
ధారూరు: మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతుల ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కోతులు, అడవి పందుల బెడద వాటి నివారణ, పంటల యాజమాన్యం, వానాకాలం, యాసంగి పంటల సాగు మెళకువలను రైతులకు శాస్త్రవేత్తలు వివరంచనున్నారు. గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తాండూరు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొంటారని, ధారూరు రైతు క్లస్టర్ పరిధిలోని రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైతు నాయకులు తెలిపారు. రుణాలు సకాలంలో చెల్లించండి కొడంగల్: ప్రాథమిక సహకార సంఘంలో రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలని పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పీఏసీఎస్ సహకార సంఘం ద్వారా రైతులకు వ్యవసాయ రుణాలు, పంట రుణాలు, స్పల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. మార్చి 31 లోపు పంట రుణాలను రెన్యూవల్ చేయించుకోవాలన్నారు. రెన్యూవల్ చేయించని ఎడల ఏడు శాతం, సకాలంలో రుణాలు చెల్లించని వారికి 13 శాతం వడ్డీ పడుతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడికి సన్మానం అనంతగిరి: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన మా శారద ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఐఎంఏ ప్రతినిధులు ఆయనను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు సాధు సత్యనాథన్, కార్యదర్శి శ్రీకాంత్, మధుసూదన్రెడ్డి, పవన్కుమార్, శాంతప్ప, శ్రవణ్, జయంతిక, ఆశాజ్యోతి, రమ్య, గిరీష, సుఖప్రద తదితరులు పాల్గొన్నారు. కుక్కల దాడిలో జింక మృత్యువాత దోమ: కుక్కల దాడిలో జింక మృత్యువాత పడింది. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. ఆదివారం స్థానిక చెరువులో నీరు తాగేందుకు వచ్చిన జింకను చూసిన వీధి కుక్కలు వెంబడించి దాడి చేయడంతో జింక మృత్యువాతపడింది. గమనించిన గ్రామస్తులు పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో అటవీ ప్రాంతంలో జంతువులకు సమృద్ధిగా తాగునీరు ఏర్పాటుచేయకపోవడం వల్లనే వన్యప్రాణులు జనసంచారంలోకి వచ్చి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం–హైదరాబాద్ రహదారిని విస్తరించండికడ్తాల్: శ్రీశైలం– హైదరాబాద్ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలని స్థానిక బీజేపీ నాయకులు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి విన్నవించారు. ఈ మేరకు ఆదివారం పార్టీ రాష్ట్ర నాయకుడు ఆచారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి (ఎన్హెచ్765) రద్దీగా మారిందని, తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. విస్తరణతో రద్దీని, ప్రమాదాలను నివారించొచ్చని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే రోడ్డుకు సంబంధించి డీపీఆర్ పూర్తయిందని, త్వరలోనే టెండర్లు పిలిచి రోడ్డు విస్తరణ పనులు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిలాల్నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్దోనాదుల, కౌన్సిల్ సభ్యుడు శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తీవ్రంగా నష్టపోయా
రెండు ఎకరాల్లో ఉల్లి, రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశా. ఉల్లి సాగుకు రూ.80వేల పెట్టుబడి పెట్టా. ఊట దశలో ఉంది. ఆకు పూర్తిగా తూట్లు పడి పోయింది. మొక్కజొన్న కంకులు వచ్చే దశలో ఉంది. ఆకులు పూర్తిగా రాలిపోయాయి. అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయా. వ్యవసాయాధికారులు సర్వే చేసి ప్రభుత్వం పంట పరిహారం అందిచేలా చర్యలు తీసుకోవాలి. – మెట్టు రాములు, రైతు, ఏన్కతల పరిహారం ఇవ్వాలి వడగళ్ల వానకు పంటలు పాడయ్యాయి. ఎక్కువగా ఉద్యాన పంటలుండడంతో రైతులు కోలుకునే పరిస్థితి లేదు. రూ.లక్షల్లో పెట్టుబడిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ హయాంలో వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చాం. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి తాత్సారం చేయకుండా ఎకరాకు రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి. – ఆనంద్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు -
15 నెలల్లోనే అభివృద్ధి మార్కు
తాండూరు: పదేళ్లుగా కుంటుపడిన అభివృద్ధిని 15 నెలల్లోనే పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని క్లాసిక్ గార్డెన్లో నియోజకవర్గ ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థికంగా సుస్థిర పరుస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా నియోజకవర్గంలో గ్రామా ల్లో కోట్ల నిధులు వెచ్చించి రోడ్ల అభివృద్ధి పనులు పూర్తి చేశామని వివరించారు. ఆరు గ్యారంటీల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. త్వరలోనే నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నా రు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందజేస్తామని వివరించారు. ఇందిరమ్మ కమిటీల పనితీరుపైనే ఎన్నికల ఫలితా లు ఆధారపడి ఉంటాయని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పనులు దండిగా కొనసాగే అవ కాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేశ్ మహరాజ్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమి టీ చైర్మన్లు బాల్రెడ్డి, మాధవరెడ్డి, అంజయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు సురేందర్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల, నాయకులు మురళీకృష్ణాగౌడ్, భీమయ్య, అజయ్ప్రసాద్, నర్సింహులుగౌడ్, కావలి సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. ఏడాది కాలంలో నియోజకవర్గంలో రోడ్డు పనులు పూర్తి ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి -
సీఎంను కలిసిన పద్మశాలీసంఘం నాయకులు
ఆమనగల్లు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆదివారం ఆమనగల్లు పట్టణానికి చెందిన పద్మశాలీసంఘం నాయకులు కలిశారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో ఆయనను ఆమనగల్లు భక్తమార్కండేయ దేవస్థాన కమిటీ అధ్యక్షుడు ఎంగలి బాలకృష్ణయ్య, పద్మశాలీసంఘం నాయకులు అప్పం శ్రీనివాస్, మసున మురళీధర్, యాదగిరి కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమనగల్లు భక్త మార్కండేయస్వామి దేవాలయ ఆవరణలో కమ్యునిటీహాలు, వసతిగృహం నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయాలని సీఎంకు వినతిపత్రం అందించారు. లేబర్ అడ్డాల వద్ద సౌకర్యాలు కల్పించాలి ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు మొయినాబాద్: భవన నిర్మాణ కార్మికుల లేబర్ అడ్డాల వద్ద ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు డిమాండ్ చేశారు. మున్సిపల్ కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లేబర్ అడ్డాల వద్ద మౌలిక సదుపాయాలు లేక కార్మికులు గంటల తరబడి రోడ్లపైనే పనికోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. తాగునీరు, టాయిలెట్స్ లేక మహిళా కార్మికులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. బడా నిర్మాణ సంస్థలు తక్కువ కూలీ ఇచ్చి 12–14 గంటలు పనిచేయించుకుంటున్నాయని ఆరోపించారు. ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతే ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే సొంత ఊళ్లకు పంపిస్తున్నారని.. ఇలాంటి ఘటనలు జిల్లాలో చాలానే వెలుగుచూశాయన్నారు. ఇలాంటి సమస్యలన్నింటిపై భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల్లో చర్చించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 21, 22తేదీల్లో శంషాబాద్లో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని.. ఈ మహాసభలను విజయవంతం చేయాలన్నారు. ఏప్రిల్ 21న శంషాబాద్లో జరిగే ర్యాలీ, బహిరంగ సభకు భవన నిర్మాణ కార్మికులంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కె.రామస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్రెడ్డి, కార్యదర్శి సత్యానారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూ రాద్ధ్దాంతం చేస్తున్నారు..
యాలాల: మండలంలోని కోకట్ పరిధిలో గల సర్వే నంబరు 60/40లోని ఎకరా అసైన్డ్ భూమిలో 60 ఏళ్లుగా కాస్తులో ఉన్నామని, భూ విషయంలో కొందరు గొడవ చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఆదివారం పట్టాదారు మహమూదాబేగం, ఆమె కుమారుడు సర్వర్ మాట్లాడుతూ.. అసైన్డ్ భూమి తాత మహబూబ్సాబ్, బడేసాబ్ల నుంచి తమకు వారసత్వంగా అందిందని తెలిపారు. భూమిని సాగు చేస్తున్నామని చెప్పారు. 2005లో రాజీవ్ స్వగృహ కోసం భూములు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు సూచించినా, నిరాకరించామని పేర్కొన్నారు. మా భూమి పక్కనే రెవెన్యూ అధికారులు ఆటోనగర్కు స్థలం కేటాయించారని, రక్షణగా మా భూమికి కంచె వేసుకున్నామని వెల్లడించారు. భూమికి సంబంధించిన పాస్బుక్, పహాణీలను రెవెన్యూ అధికారులకు అందజేశామని చెప్పారు. అయినా కొందరు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇదే విషయంలో హైకోర్టును ఆశ్రయించామని, ఇక నుంచైనా తమపై వేధింపులు ఆపాలని కోరారు. -
వ్యక్తి దారుణ హత్య
డబ్బు విషయంలో తలెత్తిన ఘర్షణ కందుకూరు: డబ్బుల విషయంలో జరిగిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సరస్వతిగూడకు చెందిన మొలగాసి సుధాకర్(34) వ్యత్తిరీత్యా డ్రైవర్. అదే గ్రామానికి చెందిన సల్ల శమంత అలియాస్ శశికళకు అవసరాల నిమిత్తం కొన్ని రోజుల క్రితం ఆయన డబ్బును అప్పుగా ఇచ్చాడు. తిరిగి తీసుకోవడానికి శనివారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో శశికళతో పాటు ఆమె తమ్ముళ్లు శేఖర్, వినయ్లతో సుధాకర్కు గొడవ జరిగింది. దీనిపై ఆమె కందుకూరు పీఎస్లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న సుధాకర్ తన తల్లి వసంతతో కలిసి పీఎస్లో ఫిర్యాదు చేయడానికి అదే రోజు సాయంత్రం బైక్పై బయలుదేరాడు. గమనించిన శశికళ తమ్ముడు వినయ్ అతని బైక్ను అనుసరిస్తూ స్కూటీపై వస్తుండగా, లేమూరు గ్రామం దాటిన తర్వాత మరో తమ్ముడు శేఖర్ కాపు కాశాడు. అక్కడికి రాగానే సూధాకర్పై ఇద్దరు కలిసి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అడ్డు వచ్చిన అతని తల్లిపై కూడా దాడి చేశారు. తీవ్రంగా గాయపడి సుధాకర్ మృతిచెందాడని భావించి పరారయ్యారు. క్షతగాత్రుడిని తల్లి స్థానికుల సహాయంతో తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం అతడు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఆమె లేని జీవితం వ్యర్థం
షాద్నగర్రూరల్: ప్రియురాలు చనిపోయిందని మనస్తాపం చెందిన ప్రియుడు.. ఆమె లేని జీవితం వ్యర్థమని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం షాద్నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన చందు.. షాద్నగర్ పట్టణంలోని మహబూబ్నగర్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర కళాశాల వసతిగృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల పరీక్షలు ముగిసినప్పటికీ ఇంటికి వెళ్లలేదు. రెండు రోజులు తరువాత వెళ్తానని హాస్టల్ అధికారులకు తెలిపాడు. ఇదిలా ఉండగా.. చందు ప్రేమించిన యువతి నెల రోజులు క్రితం చనిపోయింది. దీంతో మానసిక వేదనకు గురైన అతను.. తొలుత వసతిగృహం గదిలో ఉరి వేసుకునేందుకు ఫ్యాన్కు బెడ్ షీట్ను కట్టాడు. ఏమైందో ఏమోకాని.. ఆ తరువాత హాస్టల్ భవనం రెండో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే హాస్టల్ అధికారులకు, ఇతర విద్యార్థులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గాయాలతో పడున్నచందును చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. యువకుడి ప్రాణాలకు ప్రమాదం లేదని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎడమ చేయి విరిగిందని తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్సకోసంచందును.. కుటుంబీకులు ప్రైవేట్ హాస్పిటల్కుతరలించారు. ప్రేమించిన యువతి మరణంతో మనస్తాపం చెంది, ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, పరీక్షలు సరిగా రాయలేదని చందు సోదరుడు విష్ణు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భవిష్యత్ ఆగం చేసుకోవద్దు ప్రేమ పేరుతో భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. ఇంటర్ విద్యార్థి చందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చందును ఆయన ఆదివారం పరామర్శించి మాట్లాడారు. తల్లితండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని పిల్లలను చదివిస్తారని, వారి ఆశలను వమ్ము చేయకుండా.. వారి కలలను సాకారం చేసేందుకు విద్యావంతులుగా ఎదగడానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం వసతిగృహాన్ని పరిశీలించారు. ● ప్రియురాలు చనిపోయిందనిప్రియుడి ఆత్మహత్యాయత్నం ● గాయాలతో చికిత్స పొందుతున్నయువకుడు -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
షాబాద్: చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని శంషాబాద్ ఎస్ఎస్ స్కేటింగ్ అకాడమీ కోచ్ శంకర్నాయక్ అన్నారు. ఆదివారం నగరంలోని అండర్ 10 కాంపిటేషన్ ఎస్ఎస్ రోలర్ స్కెటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో షాబాద్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థి లంబాడి నవీష్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు, కోచ్ నవీష్ను అభినందించారు. అనంతరం కోచ్ మాట్లాడుతూ.. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏమీ లేదన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అందుకు సహకరిస్తున్న వారి పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. -
తెల్ల కుసుమ సాగు చేస్తున్నాం
తెల్ల కుసుమ నూనె ఆరోగ్యానికి మంచిది. రెండేళ్లుగా సాగు చేస్తున్న. గ్రామంలో చాలామంది రైతులు ఈ పంటలనే సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. తెల్ల కుసుమలను గానుగ ఆడించి నిల్వ చేసిన నూనెను ఏడాది పొడవునా వినియోగిస్తాం. బంధువులకు పంపిస్తుంటాం. 15 లీటర్ల డబ్బాను రూ.5 వేలకు విక్రయిస్తున్నాం. – పర్వేద మల్లేశ్, రైతు, బొబ్బిలిగామ కల్తీ నూనెతో అనారోగ్యం మార్కెట్లో ఎక్కువగా కల్తీ నూనె లభిస్తోంది. దీనిని వాడిన ప్రజలు ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఆరోగ్యానికి తెల్ల కుసుమ, నల్ల కుసుమ, నువ్వులు, పల్లి నూనె మంచిది. రైతులు నూనె గింజల సాగు చేసి, ఇంటి నూనె వినియోగించుకోవాలి. ప్రజలు ఎక్కువగా తెల్ల కుసుమ నూనె కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్చి, ఏప్రిల్, మే మూడు నెలల పాటు కుసుమ నూనె పట్టిస్తారు. – గోవుల అంజయ్య, రైతు, మక్తగూడ సాగు విస్తీర్ణం పెరిగింది ఈ యాసంగిలో నూనె గింజల పంటలు తెల్ల కుసుమ, పొద్దు తిరుగుడు, వేరు శనగ సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో అందరూ జొన్న, మొక్కజొన్న పంటలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. కాగా నియంత్రిత సాగు వ్యవసాయ విధానం నుంచి మొక్కజొన్న పంటలు వేసే రైతులు.. ఇతర పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ సారి లాభసాటికానున్నాయి. – వెంకటేశం, ఏఓ, షాబాద్ ● -
నూనె గింజల సాగు.. బాగు
షాబాద్: మార్కెట్లో వంట నూనె ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డిమాండ్ నేపథ్యంలో నూనె గింజల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నా రు. మండల పరిధి ముద్దెంగూడ, రేగడిదోస్వాడ, తిర్మలాపూర్, బొబ్బిలిగామ, కొమరబండ, గోల్లూరుగూడ తదితర గ్రామాల రైతులు.. ఈ సంవత్సరం తెల్ల కుసుమ, పొద్దు తిరుగుడు, వేరు శనగ తదితర పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. పత్తి, మొక్కజొన్న, తదితర పంటలు పలు కారణాలతో నష్టాలను తెచ్చిపెడుతుండటం, నూనె గింజల పంటలకు మద్దతు ధరతో పాటు ఆదాయం వస్తుండటంతో సాగుకు సిద్ధమవుతున్నారు. వేలాది ఎకరాల్లో తెల్ల కుసుమ గతంలో మండల పరిధిలో ఎక్కడా తెల్ల కుసుమ, పొద్దు తిరుగుడు పంటలను సాగు చేసిన దాఖలాలు లేవనే చెప్పాలి. కానీ ప్రత్యామ్నాయపంటలు వేసుకోవాలనే ప్రభుత్వ సూచన మేరకు.. ఈ యాసంగి సీజన్లో 1,048 ఎకరాలకు పైగా పొద్దు తిరుగుడు, 2,814 ఎకరాలకు పైగా తెల్ల కుసుమ సాగు చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. కనువిందు చేస్తున్న పొద్దుతిరుగుడు షాబాద్ మండల పరిధిలోని ముద్దెంగూడ, కొమరబండ, బొబ్బిలిగామ, తిర్మలాపూర్, లక్ష్మారావుగూడ, తాళ్లపల్లి, తిమ్మారెడ్డిగూడ, రేగడిదోస్వాడ, ఏట్ల ఎర్రవల్లి తదితర గ్రామాల శివారుల్లో చెరువులు, బోరు బావుల కింద రైతులు నూనె గింజల పంటలు వేశారు. పొద్దు తిరుగుడు పంట పూత దశలో ఉండి ఆకర్షిస్తోంది. గతేడాది మండలంలో పొద్దు తిరుగుడు 254 ఎకరాల్లో సాగు చేయగా, ప్రస్తుతం 1,048 ఎకరాలు సాగవుతోంది. వేరుశనగ 68 ఎకరాలు కాగా.. ఇప్పుడు 218 ఎకరాలు,తెల్ల కుసుమ 1,542 ఎకరాలు కాగా.. ప్రస్తుతం 2,814 ఎకరాల్లో సాగు చేశారు. జొన్న, శనగఅంతర పంటగా 317 ఎకరాలు సాగు చేయగా, ప్రస్తుతం 624 ఎకరాల వరకు సాగవుతున్నట్లు వ్యవసాయ అధికారుల అంచనా. వాణిజ్య పంటలు ఏపుగా పెరుగుతుండటంతో.. మద్దతు ధరపై రైతుల ఆశలు చిగురిస్తున్నాయి.రోజురోజుకూపెరుగుతున్న ఆయిల్ ధరలు పత్తి, మొక్కజొన్న సాగుకురైతులు స్వస్తి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు తెల్ల కుసుమ, పొద్దు తిరుగుడు,వేరు శనగ పంటలపై ఆసక్తి -
నూతన పంచాంగం ఆవిష్కరణ
కొడంగల్ రూరల్: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. ఆదివారం నగరంలోని తన నివాసంలో విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ధూప దీప నైవేద్య అర్చక సంఘం(డీడీఎన్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. డీడీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థాచారి నేతృత్వంలో జిల్లాలోని అర్చక బృందం హాజరైంది. కార్యక్రమంలో కిట్టు స్వామి(విజయకృష్ణ జ్యోషి) తదితరులున్నారు. భక్తి భావంతో మెలగాలి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిగి: ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలగాలని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి 38వ బ్రహ్మోత్సవాలు ముగిసిన నేపథ్యంలో ఆదివారం ఆయన.. పలువురిని సన్మానించి, ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరి సహకారంతోనే స్వామివారి కార్యక్రమం పూర్తయిందన్నారు. స్వామివారికి సేవ చేయడమంటే.. పూర్వజన్మ సుకృతమేనని, ఏటేటా ఉత్సవాలను మరింత బ్రహ్మాండగా జరుపుకొందామని సూచించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ పార్థసారథి, కమిటీ సభ్యులు గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉరి వేసుకొనివ్యక్తి ఆత్మహత్య బంట్వారం: జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం కోట్పల్లి మండలంలోని ఎన్కెపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కోట్పల్లి ఎస్ఐ అబ్దుల్ గఫార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్కెపల్లికి చెందిన బోయిని అశోక్(33), వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించే వాడు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య నవనీత కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం రాత్రి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం స్థానికులు గమనించి, భార్య నవనీతకు సమాచారం అందించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక అదృశ్యం పహాడీషరీఫ్: ఆడుకునేందుకు వెళ్లిన ఓ బాలిక అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పప్పుయాదవ్ యాదవ్ కుటుంబం నాలుగేళ్ల క్రితం వలస వచ్చి దేవేందర్ నగర్ కాలనీలో నివాసం ఉంటోంది. అతని కుమార్తె కాజల్(11) 3వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఈ నెల 22న మధ్యాహ్నం 12.30 గంటలకు ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి.. తిరిగి రాలేదు. దీంతో బాలిక కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఇంట్లో మందలించడంతో చిన్నారి బయటకు వెళ్లిందని, తెలుగు, హిందీలో మాట్లాడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివరాలు తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్, లేదా 87126 62367 నంబర్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
పరిగి: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి ఇబ్రాహింపూర్ చెరువులో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రాహీంపూర్ మత్స్యసహకర సంఘం సభ్యుడు రాఘవపురం నర్సింహులు(35), వృత్తి పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం చెరువులో చేపలు పట్టేందుకు వల వేయగా.. ప్రమాదవశాత్తు వల చుట్టుకుని చెరువులో పడి పోయాడు. పక్కనే ఉన్న మత్స్యకారులు గమనించి కాపాడేందుకు ప్రయత్నించగా.. నీటిలో మునిగిపోయాడు. రాత్రి 8గంటల వరకు వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం 8గంటలకు శవం పైకి తేలింది. మృతుడికి భార్య సరిత, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐసంతోష్కుమార్ తెలిపారు. -
రెక్కీ నిర్వహించి.. భారీగా దోచేసి
ఇబ్రహీంపట్నం రూరల్: రావిర్యాల ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసులో ఆదిబట్ల పోలీసులు పురోగతి సాధించారు. మార్చి ఒకటో తేదీ ఆదివారం అర్ధరాత్రి నాలుగు నిమిషాల్లో ఏటీఎం నుంచి రూ.29 లక్షలు అపహరించిన హర్యానా దుండగులు.. ఎట్టకేలకు రాజస్థాన్లో ఆదిబట్ల పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. ఫ్లైట్లో స్నేహితులను రప్పించి ఏటీఎం చోరీ కేసులో ప్రధాన నింధితుడు 2023లో నగరంలోని జేసీబీ షెడ్డులో పని చేసేవాడు. అనివార్య కారణాల వలన హైదరాబాద్ నుంచి హర్యానాకు వెళ్లిపోయాడు. అనంతరం గత నెల 21న నగరానికి కారులో వచ్చాడు. ఏదైనా పెద్ద దోపిడీ చేయాలని పక్కా స్కెచ్ వేసుకున్నారు. ఆటోలో భువనగిరి, బీబీనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడ అనుకూలంగా లేకపోవడంతో రావిర్యాల ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. మార్చి 1న హర్యానా నుంచి మరో నలుగురు స్నేహితులను ఫ్లైట్లో రప్పించుకున్నాడు. అదే రోజు అర్ధరాత్రి రావిర్యాల ఎస్బీఐ ఏటీఎంలోకి చొరబడినగదును అపహరించారు. అనంతరం మైలార్దేవరపల్లిలో మరో ఎస్బీఐ ఏటీఎం దోచే క్రమంలో.. వేరే వ్యక్తుల అలజడితో అక్కడి నుంచి ఆదే రాత్రి స్విఫ్ట్ కారులో పటాన్చెరువు మీదుగా హర్యానా, రాజస్థాన్కు పారిపోయారు. నగరంలోనే షల్టర్.. దోపిడీకి ముందు ప్రధాన నిందితుడు హైదరాబాద్తో పాటు పటన్చెరువు ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు తెలిసింది. ఓ మజీద్లో పని చేసే వ్యక్తి షెల్టర్ ఇచ్చాడని, అతను బీహార్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. చోరీ చేసేందుకు అక్కడే గ్యాస్ కట్టర్లు, గ్లౌజ్లు, ఇనుపరాడ్లు, గ్యాస్ తదితర సామగ్రి కొనుగోలు చేసినట్లు తెలిసింది. పహాడీ వీరికి అడ్డా.. కర్ణాటక, ఒడిస్సా, కడప, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ఈ హర్యానా గ్యాంగే ఏటీఎంలను కొల్లగొట్టి నట్లు సమాచారం. రావిర్యాలలో అపహరించిన సొత్తుతో నేరుగా రాజస్థాన్లోని వారి అడ్డా అయిన మేవాడ్ ప్రాంతంలోని పహాడీ పోలిస్స్టేషన్ పరిధి లో తలదాచుకుంటారు. అక్కడే వాళ్ల రాజ్యం. స్థాని క ప్రజాప్రతినిధులు, పోలీసులు కలిసే సెటిల్మెంట్ చేసుకుంటారని తెలుస్తోంది. వాళ్లను పట్టుకోవడం కూడా చాలా కష్టమని, అక్కడి ప్రజాప్రతి నిధులను పట్టుకొని మధ్యవర్తిగా వ్యవహరించిన వారికి ముడుపులు ఇస్తే కాని.. సహకరించరన్నట్లు తెలుస్తోంది. 20 రోజులుగా ఆదిబట్ల పోలీసులు నాలుగు బృందాలుగా హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో ఆపరేషన్ చేసి నిందితులను గుర్తించినట్లు సమాచారం. పోలీసుల అదుపులో దొంగలు ఆదిబట్ల సీఐ రాఘవేందర్రెడ్డి నేతృత్వంలో.. పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నట్లు సమాచారం. రాజస్థాన్లో తలదాచుకున్న నిందితులు ఇద్ద రు, వారికి షెల్టర్ ఇచ్చిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారి నుంచి కొంత సొమ్ము రికవరీ చేసినట్లు, మరో నిందితుడిని ఇక్క డి పోలీసులకంటే ముందే వైజాగ్ పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏదీ ఏమైనా.. క్షణాల్లో ఏటీఎంలను కొల్లగొట్టే దొంగల ముఠాను తక్కువ తక్కువ కాలంలోనే పట్టుకొని పోలీసులు శభాష్ అనిపించుకున్నారు.ఏటీఏం చోరీ కేసులో పురోగతి రాజస్థాన్లో పట్టుబడిన హర్యానా గ్యాంగ్ ఆదిబట్ల పోలీసుల అదుపులోఐదుగురు నిందితులు! -
ఊపిరి తీస్తున్న ‘క్షయ’
● జిల్లాలో రెండేళ్లలో4,270 కేసులు నమోదు ● ఏటా పెరుగుతున్న టీబీ రోగులు ● జిల్లాలో కొరవడిన వైద్య సేవలు ● నగరంలోని గాంధీ, చాతి ఆస్పత్రులకు పరుగు తాండూరు: క్షయ మనిషి ఊపిరి తీస్తోంది. కోరలు చాస్తున్న టీబీతో మరణాలు సంభవిస్తున్నాయి. గతంలో అనంతగిరిలో టీబీ సానిటోరియం ఆస్పత్రి ద్వారా వ్యాధి గ్రస్తులకు వైద్య సేవలు అందించే వారు. ఆస్పత్రిని మూసి వేయడంతో జిల్లాలో టీబీ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. నేడు ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. నగరానికి పరుగు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి టీబీ సానిటోరియం.. దశాబ్దాల కాలం పాటు వేలాది మంది వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను అందించి ఆరోగ్యంగా మార్చింది. దీంతో రోగుల పాలిట సంజీవని అనంతగిరి అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందింది. తర్వాత నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రభుత్వం పూర్తిగా సానిటోరియం.. సేవలను నిలిపి వేసింది. దీంతో జిల్లాలో టీబి వైద్య సేవలు అందించే ఆస్పత్రులు కరువయ్యాయి. వ్యాధి తీవ్రత అధికమైతే నగరంలోని గాంధీ, లేదా ఎర్రగడ్డలోని చాతి ఆస్పత్రికి రోగులు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతానికి జిల్లాలోని తాండూరు, కొడంగల్, వికారాబాద్, పరిగి, మర్పల్లి హాస్పిటల్లో టీబి నిర్ధారణ పరీక్షా కేంద్రాల ద్వారా వ్యాధి గ్రస్తులను గుర్తిస్తున్నారు. వ్యాధి సోకిన వారికి మందులు ఇచ్చిపంపిస్తున్నారు. ఎలా సోకుతుంది క్షయ క్రిముల వలన వ్యాపిస్తుంది. ఇతరులు ఎవరైనా దగ్గితే.. వారి నుంచి బ్యాక్టీరియా మరొకరికి సోకుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గిన సమయంలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అంటు వ్యాధి కావడంతో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ టీబి బారిన పడే ప్రమాదం ఉంది. పూర్వికుల నుంచి సోకే వ్యాధి కాదు. గాలి ద్వారా ఊపిరి తిత్తులకు దగ్గు ద్వారా వ్యాపించే ప్రాణాంతకరమైన వ్యాధి క్షయ. ఇది గాలి ద్వారా ఊపిరి తిత్తులకు సోకుతుంది. అక్కడి నుంచి మెదడు, కిడ్నీ ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఊపిరి తిత్తులకు ఇన్ఫెక్షన్ వస్తుంది. దానికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. మైక్రో బ్యాక్టీరియం, ట్యూబర్కులోసిస్ వ్యాధి సోకుతుంది. మద్యం ఎక్కువగా తీసుకునే వారికి, హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వారు త్వరగా క్షయ బారిన పడతారు. నివారణకు అందుబాటులో మందులు ఉన్నాయి. క్రమం తప్పకుండా వాడితే వ్యాధి నుంచి బయట పడవచ్చు. 27 నెలల్లో 4,250 కేసులు జిల్లాలోని 20 మండలాల్లోని ప్రజలు అత్యధికంగా టీబి బారిన పడ్డారు. 2023లో 1,964 కేసులు, 2024లో 1,946, ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 340 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు ధృవీకరించారు. ఇదిలా ఉండగా.. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. గతేడాది ప్రతి నెల ఒక్కో రోగికి రూ.500 చెల్లించేది. ప్రస్తుతం గతేడాది నవంబర్ నుంచి రూ.1,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తోంది. జిల్లాలో వ్యాధిగ్రస్తులు ఏటా ముగ్గురు మరణిస్తున్నారు. అవగాహన పెంచుతున్నాం క్షయ వ్యాఽధిపై జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. వ్యాధి సోకిన వారికి అధికంగా దగ్గు రావడం, రాత్రి జ్వరం, తెమడతో కూడిన దగ్గు, నోట్లో నుంచి రక్తం పడటం జరుగుతుంటుంది. అలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. –డాక్టర్,రవీంద్రనాయక్,డిప్యూటీ డీఎంహెచ్ఓ -
పెండింగ్ పనులు పూర్తి చేయండి
అనంతగిరి: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పెండింగ్లో ఉన్న పనులను సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని అన్ని వసతి గృహ వార్డెన్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి మంచి వాతావరణంలో విద్యార్థులు చదువుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే భవన లీకేజీలు, కిటికీలు, తలుపులను బాగు చేయించినట్లు చెప్పారు. అనంతరం హాస్టళ్ల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్డీఏ శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి మల్లేశం, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఉపేందర్, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్జైన్ -
6 హెచ్పీతో టీబీకి చెక్
తాండూరు టౌన్: హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు టీబీ నుంచి ఉపశమనం పొందేందుకు నూతన ఔషధం అందుబాటులోకి వచ్చిందని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవీంద్ర యాదవ్ తెలిపారు. 6 హెచ్పీ (600 మిల్లీ గ్రాములు) ఔషధాన్ని 28 రోజుల పాటు వాడితే వారికి జీవితంలో టీబీ సోకదన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఏఆర్టీ సెంటర్లో ఈ ఔషధాన్ని పలువురు హెచ్ఐవీ వ్యాధి గ్రస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్ఐవీ వ్యాధి గ్రస్తులు టీబీ సోకకుండా గతంలో ఆరు నెలల పాటు మందులు వాడేవారన్నారు. కొత్తగా వచ్చిన 6 హెచ్పీ ఔషధాన్ని 28 రోజుల పాటు వాడితే సరిపోతుందన్నారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు ఈ ఔషధాన్ని తప్పకుండా వాడాలన్నారు. కార్యక్రమంలో డాక్టర సమీవుల్లా, ఫార్మసిస్ట్ రమేష్, రవికుమార్, నర్సులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. హెచ్ఐవీ వ్యాధి గ్రస్తుల కోసం కొత్త ఔషధం ప్రారంభించిన డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవీంద్ర యాదవ్ -
పల్లె దవాఖానా.. పశువుల కొట్టమా!
దౌల్తాబాద్: మండల పరిధిలోని ఈర్లపల్లిలో నిర్మించిన ఆరోగ్య కేంద్ర భవనం పశువుల కొట్టంలా మారింది. 2009లో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దీన్ని ప్రారంభించారు. కొద్ది రోజుల పాటు ఇక్కడ సేవలు అందించిన వైద్యారోగ్య శాఖ అధికారులు.. వసతులు లేవని, ఊరికి దూరంగా ఉందనే కారణాలతో భవనాన్ని వదిలేశారు. అనంతరం గ్రామంలోని ఓ అద్దె గదిలో సేవలు కొనసాగించారు. ఇటీవల ప్రభుత్వం గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మార్చింది. ఈ క్రమంలో అధికారుల ఆదేశం మేరకు ఈర్లపల్లిలోని ఉప కేంద్రానికి పల్లె దవాఖానా అని బోర్డు పెట్టారు. కానీ ఈ భవనంలో స్థానిక ఏఎన్ఎం కానీ వైద్యాధికారి కానీ ఏనాడూ సేవలందించిన దాఖలాలు లేవు. భవనానికి చెందిన కిటికీలు, తలుపులు చోరీకి గురయ్యాయి. ప్రస్తుతం ఇందులో పశువులను కట్టేస్తున్నారు. వైద్య సేవలు ఎక్కడ అందిస్తున్నారో స్థానికులకు కూడా తెలియని దుస్థితి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పదహారేళ్లుగా భవనం నిరుపయోగం చోరీకి గురైన కిటికీలు, తలుపులు వైద్య సేవలు అందక ప్రజల అవస్థలు -
అవినీతి జలగలపై సమగ్ర విచారణ
బషీరాబాద్: అంతారం – గొట్లపల్లి అర్బన్ పార్కు వాకింగ్ పాత్ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాల్లో అటవీశాఖ అధికారుల పాత్రపై శుక్రవారం సాక్షి దినపత్రికలో ‘మట్టి పోశారు.. లక్షలు దోచారు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. దీనిపై అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్ ఆరా తీసినట్లు తెలిసింది. డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ను హైదరాబాద్కు పిలిపించి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. సాయంత్రం తాండూరుకు వచ్చిన డీఎఫ్ఓ.. బీట్, సెక్షన్ ఆఫీసర్లను విచారించడం తోపాటు రికార్డులను పరిశీలించారు. ఎఫ్ఆర్ఓ శ్రీదేవి సరస్వతి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ పనితీరు సరిగ్గా లేకపోవడం వల్లే అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అనంతరం అర్బన్ పార్కును సందర్శించి వాకింగ్ పాత్ పనులను పరిశీలించారు. మట్టి రోడ్డు కొలతలు తీసి నాణ్యతను చెక్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాకింగ్ పాత్ పనుల్లో అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు పనుల్లో భాగంగా చెట్ల తొలగింపు, మట్టి తవ్వడం వంటి వాటిని పరిశీలించి అందుకు కారణమైన వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. డీఎఫ్ఓ వెంట ఎఫ్ఆర్ఓ శ్రీదేవి సరస్వతి, బీట్, సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. అర్బన్ పార్కులో వాకింగ్ పాత్ పనుల కొలతలు తీస్తున్న డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్, ఫారెస్టు అధికారులు అధికారుల పాత్ర ఉంటే కఠిన చర్యలు: డీఎఫ్ఓ అర్బన్ పార్కులో వాకింగ్ పాత్ పనుల నాణ్యత పరిశీలన -
వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి
కేశంపేట: పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో వందశాతం ఇంటి పన్నులనులత మూడు రోజుల్లోగా వసూలు చేయాలని రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ ఆదేశించారు. మండల పరిధిలోని సంగెం గ్రామ పంచాయతీని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. పంచాయతీ రికార్డులను పరిశీలించి గ్రామంలో ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. సురేష్ మోహన్ మాట్లాడుతూ.. గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, మురుగు కాల్వలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎల్ఆర్ఎస్పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. -
స్వాహాపర్వం
సహకారం రైతు సేవలకు స్వస్తి వికారాబాద్లోని డీసీఎంఎస్ కార్యాలయం వికారాబాద్: డీసీఎంఎస్ ఆస్తుల లీజు వ్యవహారంలో సంబంధిత అధికారులు, సిబ్బంది లోపాయికారీ దందాకు తెరతీస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు సేవలే లక్ష్యంగా ఏర్పాటైన సహకార మార్కెట్ సంఘాలు మెల్లగా అన్నదాతలకు దూరమవుతున్నాయి. జిల్లాలో సహకార మార్కెటింగ్ సంఘాల పరిస్థితి దారుణంగా తయారైంది. అధికారుల వ్యవహార శైలిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీసీఎంఎస్లకు జిల్లాలో పెద్ద ఎత్తున ఆస్తులు ఉండగా వాటి లీజు కేటాయింపుల్లో లోపాయికారీగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులతో అధికారులు, ఉద్యోగులు కుమ్మకై ్క తక్కువ లీజుకు భవనాలు, దుకాణాలు, గోదాములు కట్టబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో వందకు పైగా దుకాణాలు, పదికి పైగా గోదాములు, రైస్ మిల్లులు, ఇతర భవనాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం లీజుకు ఇచ్చారు. మార్కెట్ విలువ కంటే తక్కువ ధరలకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. మార్కెట్ విలువలో సగం కంటే తక్కువ లీజుకు ఇచ్చేరనే విమర్శలు ఉన్నాయి. ఇష్టారాజ్యంగా దుకాణాల కేటాయింపు డీసీఎంఎస్కు వికారాబాద్లో 39 దుకాణాలు, రెండు గోదాములు ఉన్నాయి. తాండూరులో మూడు గోదాములు, 40 దుకాణాలు, ఒక స్కూల్ బిల్డింగ్, ఒక రైస్మిల్లు, ఒక దాల్మిల్లు ఉంది. పరిగిలో 25 దుకాణాలు, ఐదు గోదాములు, ఒక రైస్మిల్ ఉంది. వీటిలోనే ఎరువులు, విత్తనాలు అమ్మేవారు. ప్రస్తుతం దుకాణాలు, గోదాములు, రైస్ మిల్లులను లీజ్కు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. దీంతో ఉద్యోగులకు పనులు లేక కార్యాలయాల్లో ఖాళీగా కూర్చుంటున్నారు. దుకాణాల కేటాయింపులో లోపాయికారీగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి పట్టణాల్లో మెయిన్ రోడ్లలో దుకాణా సముదాయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కో దుకాణం నెల అద్దె రూ.15 వేల నుంచి రూ.35 వేల వరకు ఉంటుంది. పరిగి పట్టణంలో మున్సిపాలిటీకి ఉన్న దుకాణాలకు వేలం వేయగా నెలకు ఒక్కో దుకాణాన్ని రూ.15 వేల నుంచి రూ.36 వేల వరకు పాడి దక్కించుకున్నారు. ప్రైవేటు వ్యక్తులు సైతం తమ దుకాణాలకు ఇదే తరహాలో రెంట్లు వసూలు చేస్తున్నారు. కానీ డీసీఎంఎస్ అధికారులు మాత్రం లోపాయికారీగా వ్యవహరిస్తూ తక్కువ ధరలకే దుకాణాలు కట్టబెడుతున్నారు. సంస్థకు నష్టం చేస్తూ వారు మాత్రం లాభ పడుతున్నారు. ఒక చోట ఒక దుకాణానికి రూ.4,720, మరో చోట రూ.5,450, ఇంకో చోట రూ.6,680, మరో చోట రూ.9,500 రెంట్లు వసూలు చేస్తున్నారు. రెండేళ్లకోసారి పాత లీజుకే పాతవారికి షాపులను కట్టబెడుతున్నారు. తక్కువ అద్దెలకే డీసీఎంఎస్ ఆస్తులు కట్టబెడుతున్న అధికారులు బహిరంగ మార్కెట్తో పోలిస్తే సగమే! రైతు సేవలకు దూరమవుతున్న సహకార సంఘాలు ఎరువులు, విత్తనాల విక్రయానికి స్వస్తి పలికిన యంత్రాంగం గతంలో మండల కేంద్రాల్లోని డీసీఎంఎస్ల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు విక్రయించేవారు. ఇవి ప్రభుత్వరంగ సంస్థలు కావడంతో సర్కారు నిర్ధేశించిన ధరలకే ఇచ్చేవారు. డీసీఎంఎస్లు అందుబాటులో ఉన్నంత కాలం ప్రైవేటు ఎజెన్సీలు సరైన ధరలకే ఎరువులు, విత్తనాలు విక్రయించేవారు. దీంతో రైతులకు మేలు జరిగేది. మెల్లమెల్లగా సహకార మార్కెట్ సంఘాలు రైతులకు దూరమవుతూ వచ్చాయి. మొదట మండల కేంద్రాల్లో వీటి సేవలు నిలిచిపోగా తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో.. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనూ డీసీఎంఎస్లకు స్వస్తి పలకడం రైతులకు శాపంగా మారింది. దీంతో అన్నదాతలు తప్పనిసరిగా ప్రైవేటు వ్యక్తుల వద్ద ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేటు వ్యాపారులు రేట్లు పెంచి ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన కందులను పప్పుగా మార్చి తాండూరు కంది పప్పు పేరుతో విక్రయిస్తూ సంస్థ లాభాలు ఆర్జిస్తోంది. డీసీఎంఎస్ సేవలకు స్వస్తి పలకడంతో ఇందులో పని చేసే ఉద్యోగులకు పని లేకుండా పోయింది. దీంతో వారు తమ సొంత పనులు చక్కబెడుతూ, ఇతర వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ విధులకు ఎగనామం పెడుతున్నారు. గతంలో కేటాయించారు వికారాబాద్ పట్టణంలోని డీసీఎంఎస్కు చెందిన దుకాణాలు, గోదాంలను నేను బాధ్యతలు తీసుకోకముందే అద్దెకు ఇచ్చారు. గతంలో వీటిలో ఎరువులు, విత్తనాలు విక్రయించే వాళ్లం. వీటిని అద్దెకు ఇవ్వడంతో మాకు పనిలేకుండా పోయింది. – ఎల్లయ్య, బ్రాంచ్ మేనేజర్, వికారాబాద్ -
ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం
కొత్తగడి రెసిడెన్షియల్ సెంటర్ వద్ద సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ నారాయణరెడ్డిపదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ముందే కేంద్రాలకు చేరుకున్నారు. మొదటి రోజు పరీక్ష కావడంతో విద్యార్థుల వెంట తల్లిదండ్రులు, కుటుంబీకులు వచ్చారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సెంటర్లలోకి అనుమతించారు. వికారాబాద్ పట్టణంలోని పలు కేంద్రాలను కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్లలోకి వెళ్లే సమయంలో కలెక్టర్ తన సెల్ఫోన్ను బయట ఉంచారు. జిల్లా వ్యాప్తంగా 12,892 మంది పదో తరగతి విద్యార్థులు ఉండగా శుక్రవారం నిర్వహించిన తెలుగు పరీక్షకు 12,832మంది హాజరుకాగా 60మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. – అనంతగిరి -
శ్రీవారి వార్షికబ్రహ్మోత్సవాలకు రండి
సీఎంను ఆహ్వానించిన ఆలయ ధర్మకర్తలు కొడంగల్: పట్టణంలోని పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని ఆలయ ధర్మకర్తలు సీఎం రేవంత్రెడ్డిని శుక్రవారం ఆహ్వానించారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమల తిరుపతి తరహాలో ఇక్కడ నిత్యం స్వామివారికి వాహన సేవలు నిర్వహిస్తారు. వైఖానస ఆగమ శాస్త్రోకంగా నిత్య పూజలు, కై ంకర్యాలు నిర్వహిస్తారు. సీఎంను కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్, ఆలయ ధర్మకర్తలు నందారం శ్రీనివాస్, రత్నం, ఓం ప్రకాశ్, రాజేందర్ ఉన్నారు. ధారూరు తైబజార్ వేలం రూ.6.01 లక్షలకు దక్కించుకున్న మహేశ్ ధారూరు: ధారూరు తైబజార్ వేలం శుక్రవారం నిర్వహించారు. తిమ్మానగర్ గ్రామానికి చెందిన కే మహేశ్ రూ.6.01 లక్షలకు పాట పాడి రెండోసారి దక్కించుకున్నారు. గత ఏడాది రూ.4.08 లక్షలకు తైబజార్ దక్కించుకున్నారు. ప్రతి శనివారం నిర్వహించే కూరగాయల మార్కెట్లో వ్యాపారుల నుంచి నిర్ణీత రుసుం వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామ కార్యదర్శి అంజానాయక్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించగా వ్యాపారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రంలో ఫ్యాన్ల ఏర్పాటు తాండూరు రూరల్: మండలంలోని మల్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్ష కేంద్రంలో ఫ్యాన్లు, సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంపై శుక్రవారం సాక్షి దినపత్రికలో ఇదేం పరీక్ష కేంద్రం అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ జిల్లా అధికారులు స్పందించారు. శుక్రవారం పాడైన ఫ్యాన్ల స్థానంలో కొత్తవాటిని అమర్చారు. మరో తరగతి గదిలో కొత్తగా రెండింటిని ఏర్పాటు చేశారు. 24న కౌన్సెలింగ్ అనంతగిరి: జిల్లాలో ఎంఎల్హెచ్పీ (మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్) పోస్టులకు ఎంపికై న 14మంది అభ్యర్థులకు ఈ నెల 24న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరవణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30గంటలకు కలెక్టరేట్లోని ఎస్ –17 హాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికై న అభ్యర్థుల జాబితాను జిల్లా వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి తాండూరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశావర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆశావర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం రూ. 18 వేలు ఇవ్వాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, రూ.50 లక్షల ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆశావర్కర్లపై పీహెచ్సీ అధికారుల వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశావర్కర్లు రేణుక, అనిత, అరుణ, యాదమ్మ, హేమలత తదితరులు పాల్గొన్నారు. -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
కుల్కచర్ల: కుల్కచర్ల, చౌడాపూర్ మండలాలతో పాటుగా వికారాబాద్ జిల్లాకు సాగునీరు అందించేందుకు లక్ష్మీదేవిపల్లి ఎత్తిపోతల పథకం కోసం నిధులు కేటాయించడం అభినందనీయమని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, యువజన విభాగం అధ్యక్షుడు జంగయ్య, మండల ఉపాధ్యక్షు డు హరినాథ్రెడ్డి, నరసింహనాయక్, ఎస్టీ సెల్ జి ల్లా అధ్యక్షుడు శివరాములు, ఎస్టీ సెల్ మండల అ ధ్యక్షుడు రాంచందర్, నాయకులు శ్రీను, తుకానాం, కృష్ణయ్య, అమృతయ్య తదితరులు పాల్గొన్నారు. -
లెక్కల కోసమే నాటడం
ఉపాఽధిహామీ, పంచాయతీరాజ్ అధికారులకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయడానికే మొక్కలు నాటుతున్నారు. మొక్కలు నాటిన తర్వాత వాటిని సరంక్షించే వారే కరువయ్యారు. ప్రతీ ఏడాది రోడ్ల పక్కన మొక్కలు కాలిపోతున్నాయి. ఇవి అఽధికారులకు కనిపించడం లేదా? ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. – బల్వంత్రెడ్డి, మాజీ సర్పంచ్, దాతాపూర్ గడ్డి పెరగకుండా చూడాలి వనమహోత్సవంలో మొక్కలు నాటుతున్నారు. ఉపాధి హామీ సిబ్బందికి వర్షాకాలంలో పనులు ఉండవు. మొక్కలు కాపాడే బాధ్యత అప్పగించాలి. రోడ్ల పక్కన గడ్డి పెరగకుండా చూసుకుంటే ఈ సమస్య ఉత్పన్నం కాదు. మొక్కలు కాలిపోతుంటే ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు ఏం చేస్తున్నట్లు? – వడ్డె రాములు, మాజీ సర్పంచ్, ఆర్కతల మొక్కలు కాపాడుతాం రోడ్లకు ఇరువైపులా మొక్కలతో పాటు గడ్డి పెరిగి ఎండిపోయింది. ఎవరో ఒకరు గడ్డిని తగులబెట్టడంతో గడ్డితో పాటు మొక్కలు కాలిబూడిదవుతున్నాయి. ఇక నుంచి అలా జరగనివ్వం. ప్రస్తుతంఉపాధిహామీ పనులకు కూలీలు వస్తున్నారు. అదే కూలీలతో అన్ని గ్రామాల్లో రోడ్ల పక్కన ఉన్న ఎండిన గడ్డిని తీపిస్తాం. మొక్కలు కాపాడతాం. – అనురాధ, ఎంపీడీఓ, నవాబుపేట -
డాడీస్ యాప్తో వాహనదారులకు మేలు
దుద్యాల్: డాడీస్ యాప్ వాహనదారులకు, ప్రయాణికులకు ఎంతో ఉపయోగం అని డాడీస్ రోడ్డు ప్రతినిధి శ్రీశైలం అన్నారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని హకీంపేట్లో అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. డాడీస్ యాప్నకు సంబంధించిన క్యూర్ కోడ్ స్టిక్కర్ను వాహనాలకు అంటించి వారి వారి మొబైల్ ఫోన్లలో యాప్ ఆక్టివేషన్ చేశారు. దీంతో సంబంధిత బైక్ ప్రమాదానికి గురైనప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రమాదాన్ని గుర్తించి ఆంబులెన్స్కు సమాచారం చేరుతుందన్నారు. ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే వ్యకికి సంబంధించిన ఫోన్ ద్వారా ప్రమాదం చూసిన వ్యక్తి క్యూర్ కోడ్ను స్కానింగ్ చేయడం ద్వారా లోకేషన్ అలర్ట్ వస్తుందని అన్నారు. దీంతో మేము వెంటనే పోలీసులకు, అంబులెన్స్కు సమాచారం అందిస్తామన్నారు. వాహనాలు ఉన్న ప్రతీ ఒక్కరు ఈ యాప్ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు సంజీవ రెడ్డి, గ్రామస్తులు వెంకటయ్య, శివరాజ్, భాస్కర్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులపై చిన్నచూపు తగదు
తాండూరు టౌన్: అసంఘటిత రంగ కార్మికులపై ప్రభుత్వం చిన్నచూపు తగదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ అన్నారు. అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కరించాలనే డిమాండ్తో మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పోలీసులు పలువురు సీఐటీయూ, పీడీఎస్యూ నా యకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. భవన నిర్మా ణ, బీడీ కార్మికులు, ట్రాన్స్పోర్టు హమాలీలు, సె క్యూరిటీ గార్డులు తదితర అసంఘటిత రంగంలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వం వెంటనే కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డి మాండ్ చేశారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మే నిఫెస్టోలో 15 శాతం విద్యారంగ పటిష్టానికి నిధు లు కేటాయిస్తామని చెప్పి ప్రస్తుత బడ్జెట్లో కేవలం 7.57 శాతం నిధులు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. విద్య, కార్మిక రంగ సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో పీడీఎస్యూ సభ్యులు ప్రకాశ్, నవీన్ ఉన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ -
మల్కాపూర్లో అధికారుల తనిఖీ
తాండూరు రూరల్: మండల పరిధిలోని మల్కాపూర్ శివారు ప్రభుత్వ భూమిలో నాపరాతి తవ్వకాలపై మైనింగ్, రెవెన్యూ అధికారులు తనిఖీ చేపట్టారు. గ్రామంలోని సర్వేనంబర్ 72లో ఉన్న అసైన్డ్ భూమిలో అక్రమంగా నాపరాతి తవ్వకాలు చేపడుతున్నట్లు గ్రామస్తులు తుకారాం ఇటీవల కలెక్టర్ ప్రతీక్జైన్కు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం తాండూరు మైనింగ్ ఏడీ సత్యనారాయణ, ఆర్ఐ గోపి, సర్వేయర్ మహేశ్ బృందం నాపరాతి తవ్వకాలను పరిశీలించారు. తవ్వకాలను పరిశీలించిన అధికారులు వెనుదిరిగారు. దీంతో గ్రామస్తులు తుకారాం, మహేందర్రెడ్డి, చిరంజీవి మైనింగ్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎటువంటి లీజు లేకుండా జట్టురు మల్లమ్మ, కుర్వ మల్లప్ప పేరిట ఉన్న అసైన్డ్ భూమిలో నెల రోజులుగా తవ్వకాలు చేపడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమార్కుల అందిస్తున్న లంచాలు తీసుకుని తవ్వకాలను అడ్డుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయమై మరోమారు కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా ఇదే విషయమై స్పందించిన మైనింగ్ ఏడీ సత్యానాయణ మాట్లాడుతూ.. విచారణ చేశామని ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెవెన్యూ ఆర్ఐ గోపి మాత్రం తనకు ఈ విషయమై ఏమీ తెలియదని.. సమాచారం తెలుసుకునేందుకు వెళ్లాలని చెప్పడం గమనర్హం. మైనింగ్ అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం -
మొక్కలు నాటారు.. సంక్షరణ మరిచారు
నవాబుపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వనమహోత్సవ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో అభాసు పాలవుతోంది. ప్రతీ సంవత్సరం లక్ష్యం పెట్టుకుని మొక్కలు నాటి.. సంరక్షణ మాత్రం గాలికి వదిలేస్తున్నారు. అవెన్యూ ప్లాంటేషన్ పేరిట రోడ్లకు ఇరువవైపులా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో మొక్కలు నాటి వదిలేస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా గడ్డి ఏపుగా పెరగడం.. వేసవిలో ఆ గడ్డి ఎండిపోవడం.. ఆకతాయిలు, రోడ్ల పక్కన ఉన్న ౖభూముల రైతులు ఎండిన గడ్డికి నిప్పంటించడంతో గడ్డితో పాటు నాటిన మొక్కలు సతం కాలిబూడిద అవుతున్నాయి. 2019–2024 వరకు మండల వ్యాప్తంగా 25,012 మొక్కలు నాటేందుకు గాను రూ.20,71,725లు వెచ్చించారు. సంగం మొక్కలు బతికిన దాఖలాలు లేవు అవెన్యూప్లాంటేషన్లో గత ఐదేళ్లలో అధికారులు 25,012 మొక్కలు నాటగా ప్రస్తుతం సగం మొక్కలయినా బ్రతికిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రతి ఏటా వర్షాకాంలో మొక్కలు నాటడం వేసవిలో కాలిబూడిదవడం పరిపాటిగా మారిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎల్లకొండ, లింగంపల్లి, పూలపల్లి, వట్టిమీనపల్లి, చిట్టిగిద్ద, గొల్లగూడ, మాదిరెడ్డిపల్లి, నారెగూడ, నవాబుపేట, పులుమామిడి తదితర గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న మొక్కలు కాలిపోయాయి. ప్రతి ఏటా ఇలానే జరుగుతున్న అధికారులు, ఉపాధిహామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదు. అధికారుల తీరుపై ఆగ్రహం గతేడాది మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ ప్రతీక్జైన్ రోడ్ల పక్కన కాలిన మొక్కలను చూసి అఽధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఒక్క కారణం చాలదా మీ అందరిని సస్పెండ్ చేయడానికి హెచ్చరించినా అధికారుల్లో తీరుమారలేదని ప్రజలు మండిపడుతున్నారు. వనమహోత్సవంపై నిర్లక్ష్యపు నీడ కాలిబూడిదవుతున్న మొక్కలు పట్టించుకోని అధికారులు, ఉపాధిహామీ సిబ్బంది -
మీసేవలో అధిక వసూళ్లు
ధారూరు: నిర్ణీత రుసుము కన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్న మీసేవ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు. వివరాలు.. మండల కేంద్రంలోని మీసేవకు దోర్నాల్ గ్రామానికి చెందిన మహిపాల్ నిర్ణీత రుసుముకు మించి డబ్బు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు శుక్రవారం తహసీల్దార్ సాజిదాబేగం ఆర్ఐ స్వప్న, జూనియర్ అసిస్టెంట్ భీంకుమార్ను మీసేవకు పంపించారు. పదవ తరగతి పరీక్షల సమయంలో మీసేవ సెంటర్ తెరిచి ఉండడం, జిరాక్స్ సెంటర్ కొనసాగించడంపై ఆర్ఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై తహసీల్దార్ కలెక్టర్ కార్యాలయంలోని ఈడీఎంతో మాట్లాడారు. స్పందించిన ఈడీఎం రేపటి వరకు మీసేవ షట్టర్ తాళాలు ఇవ్వొద్దని సూచించారు. రాజీవ్ యువ వికాస్ పథకం కోసం ఆదాయ, కుల ధ్రువీకరణ దరఖాస్తులకు ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఆధార్ అప్డేట్కు సైతం ఎక్కువ మొత్తంలో తీసుకున్నారని ఫిర్యాదు చేసిన వెంటనే తిరిగి ఇచ్చేశారు. అక్రమాలకు పాల్పడుతున్నట్లు రుజువైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు తహసీల్దార్ను ప్రశ్నించగా.. మీసేవపై ఇప్పటికే కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని తదుపరి చర్యలు కలెక్టర్ తీసుకుంటారని వివరించారు. తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన బాధితులు రేపటి వరకు మీసేవ బంద్ -
క్రీడలతో నూతనోత్తేజం
మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం చేవెళ్ల: క్రీడలు యువతలో నూతన ఉత్తేజాన్ని నింపుతాయని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. పట్టణ కేంద్రంలో నెల రోజులుగా కొనసాగుతున్న పెద్దోళ్ల పర్మయ్య మెమోరియల్ మండల స్థాయి క్రికెట్ టోర్నీ శుక్రవారంతో ముగిసింది. ఈ పోటీల్లో విజేతలకు పర్మన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దయాకర్, కేఎస్ రత్నం నగదు బహుమతులు అందజేశారు. విజేత జట్టు ఊరెళ్లకు రూ.50వేలు, రన్నరప్ జట్టు రామన్నగూడకు రూ.25వేల నగదు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా దయాకర్, కేఎస్ రత్నం మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజీపీ మండల అధ్యక్షుడు అత్తెల్లి అనంత్రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కె. శివప్రసాద్, నాయకులు వెంకట్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, జహంగీర్, నర్సింలు, పి. ప్రభాకర్, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మత్తు మందు స్ప్రే చేసి.. మహిళ మెడలోంచి పుస్తెలతాడు చోరీ బొంరాస్పేట: గుర్తు తెలియని దుండగుడు మహిళపై మత్తు మందు స్ప్రే చేసి ఆమె మెడలోంచి బంగారు పుస్తెలతాడు చోరీ చేశాడు. ఈ ఘటన మండల పరిధిలోని తుంకిమెట్లలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వడ్ల బ్రహ్మచారి పరీక్షకు వెళ్లగా భార్య సుష్మిత ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆమె ముఖంపై మత్తు మందు స్ప్రే చేసి ఆమె మెడలోంచి 2.30 తులాల బంగారు పుస్తెలతాడు తెంచుకుని పరారయ్యాడు. బ్రహ్మచారి సోదరుడు శేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిరాశే!
రాష్ట్ర బడ్జెట్లో సీఎం సొంత జిల్లాకు మొండిచేయి ● కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్పై సానుకూల ప్రకటన ● ఊసేలేని అనంతగిరి పర్యాటకం ● కోట్పల్లి ప్రాజెక్టుకు రిక్తహస్తం ● పాలమూరు ఎత్తిపోతల ప్రస్తావనే లేదు వికారాబాద్: రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం ఈ ప్రాంత ప్రజలను నిరాశ పరిచింది. అనంతగిరి పర్యాటక అభివృద్ధికి.. కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు నిధులు కేటాయించలేదు. జిల్లా సాగునీటి వరప్రదాయినిగా భావించే పాలమూరు ఎత్తిపోతల పథకం ఊసే లేదు. గత బడ్జెట్ సమావేశాల్లో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న సీఎం ప్రస్తుత బడ్జెట్లో ఆ ప్రస్తావనే తేలేదు. జిల్లాలోని జుంటుపల్లి, లఖ్నాపూర్, సర్పన్పల్లి తదితర ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోడం రైతులను నిరాశ పరిచింది. బుధవారం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్పై జిల్లా నేతల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని అధికార పక్షం అంటుండగా.. అంకెలగారడీ తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. సంక్షేమానికి పెద్దపీట రాష్ట్ర బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భారీగా నిధులు కేటాయించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ఈ లెక్కన జిల్లాకు 14వేల ఇళ్లు మంజూరు కానున్నాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున జిల్లాకు రూ.700 కోట్ల నిధులు రానున్నాయి. అలాగే 1.30లక్షల మందికి గృహజ్యోతి పథకం అందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని 22 గురుకులాలకు సొంత భవనాలు సమకూరనున్నాయి. అయితే బీసీల సంక్షేమానికి తక్కువ నిధులు కేటాయించారని ఆ సంఘం నేతలు పెదవి విరుస్తున్నారు. -
సత్ప్రవర్తనతో మెలగాలి
జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ, జడ్జి శీతల్ పరిగి: ఒక్కసారి జైలు జీవితం గడిపిన వారు మళ్లీ జైలుకు రాకుండా సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ జడ్జి శీతల్ అన్నారు. బుధవారం పరిగి సబ్జైలును సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఖైదీలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. కొంత మంది అనుకోని సంఘటనల వల్ల జైలుకు వస్తారని, మరి కొంత మంది క్షణికావేశంలో చేసిన తప్పులకు ఇక్కడికి వస్తారని తెలిపారు. జైలు జీవితం గడపం అంటే మంచి ప్రవర్తన గల వ్యక్తిగా మారడం అని అన్నారు. బెయిల్ పిటీషన్ వేసుకోలేని వారు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద ఖైదీలకు న్యాయం చేయాలని న్యాయవాదులకు సూచించారు. అనంతరం బాలసదనంను సందర్శించి చిన్నారుల బాగోగులు తెలుసుకున్నారు. కార్యక్రంమలో జైలు సూపరింటెండెంట్ రాజ్కుమార్, న్యాయవాదులు వెంకటేష్, శ్రీనివాస్, గౌస్పాష తదితరులు పాల్గొన్నారు. మామిడి సాగులో జాగ్రత్తలు పాటించాలి హార్టికల్చర్ జిల్లా ఇన్చార్జ్ అధికారి కమల అనంతగిరి: ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున మామిడి సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని హార్టికల్చర్ జిల్లా ఇన్చార్జ్ అధికారి కమల సూచించారు. బుధవారం వికారాబాద్ మండలంలో మామిడి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మామిడి తోటలకు డ్రిప్ విధానంతో ఒక్కో చెట్టుకు రోజుకు 3 గంటల పాటు నీరు పెట్టాలని తెలిపారు. ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నర పాటు నీరు పడితే మట్టిలో తేమశాతం నిలకడగా ఉండి చెట్లు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. డ్రిప్ పరకరాలను చెట్టు కాండానికి 1.5 మీటర్ల దూరంలో అమర్చాలని సూచించారు. పది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న చెట్లకు 500 గ్రాముల యూరియా, 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించటం వలన మామిడి కాయలు బాగా వస్తాయని తెలిపారు. ఫిప్రోనేల్ 2ఎంఎల్ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల తామర పురుగు బెడద నుంచి పంటను కాపాడుకోవచ్చన్నారు. తేనె మంచు పురుగు నివారణకు బప్రొఫెజిన్ 1.5 మిల్లీ లీటర్లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. మామిడి పిందె నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ప్లానోఫిక్స్ ఒక మిల్లీ లీటరును 4.5 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల కాత రాలడాన్ని నివారించవచ్చని తెలిపారు. బిల్లు ఆమోదం బీసీల విజయం ● బీసీ యువజన సంఘంరాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ బషీరాబాద్: విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టబద్దత కల్పించడంపై బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈడిగి శ్రీనివాస్గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలోని ప్రతి బీసీ బిడ్డ విజయమన్నారు. బుధవారం అసెంబ్లీ హాలులో బీసీ యువజన నాయకులతో కలిసి సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చట్టం చేశారని అన్నారు. బిల్లు ఆమోదానికి కృషి చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. -
యథేచ్ఛగా ఫిల్టర్ ఇసుక దందా
● మట్టిని శుద్ధి చేసి ఇసుకను తయారు చేస్తున్న అక్రమార్కులు ● చోద్యం చూస్తున్న రెవెన్యూ, పోలీసు శాఖలు పరిగి: నియోజకవర్గంలో రోజురోజుకూ నిర్మాణాలు పెరుగుతుండటంతో ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇల్లు కట్టాలన్నా.. పరిశ్రమలు నెలకొల్పాలన్నా ఇసుక తప్పనిసరి. ప్రభుత్వ అనుమతితో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఇసుకను కొనుగోలు చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఫిల్టర్ ఇసుక కొనుగోలుపై దృష్టి సారించారు. వాగులు, నదుల నుంచి సహజ సిద్ధంగా లభించే ఇసుక స్థానంలో ఫిల్టర్ ఇసుకను వాడుతున్నారు. కొంతమంది అక్రమార్కులు ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. పరిగి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. కుల్కచర్ల, దోమ, పరిగి మండలాల్లో ఇసుక వ్యాపారం జోరుగా నడుస్తోంది. పరిగి పట్టణంతోపాటు ఇతర ప్రాంతాలకు బొంరాస్పేట్, యాలాల నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ విషయం పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రి వేళ జోరుగా రవాణా కొందరు అక్రమార్కులు ఇసుక అక్రమ దందాతో జేబులు నింపుకొంటున్నారు. పరిగి పట్టణంలో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు టిప్పర్లను కొనుగోలు చేసి బొంరాస్పేట, యాలాల, తాండూరు వాగుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళ ఇసుకను తరలిస్తున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో ఫిల్టర్ ఇసుక దందా జోరుగా సాగుతోంది. కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో ఫిల్టర్ ఇసుక కేంద్రాలను ఏర్పాటు చేశారు. మట్టిని శుద్ధి చేసి ఇసుకను తయారు చేయాలంటే నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. దీంతో నీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మట్టిని శుద్ధి చేయడం ద్వారా వచ్చే ఇసుకను నిర్మాణాల్లో చేపడితే పటిష్టత ఉండదని నిపుణులు అంటున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా కొందరు ఫిల్టర్ ఇసుక తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. మచ్చుకు కొన్ని.. ● కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో ఫిల్టర్ ఇసుకను ఎక్కువగా తయారు చేస్తున్నారు. ● పరిగి పట్టణానికి చెందిన కొంత మంది ఎలాంటి అనుమతులు లేకుండా పక్క మండలాల్లోని వాగుల నుంచి ఇసుక తెచ్చి విక్రయిస్తున్నారు. ● కుల్కచర్ల మండలం బొంరెడ్డిపల్లిలో ఫిల్టర్ ఇసుక జోరుగా సాగుతోంది. గ్రామ సమీపంలో ఫిల్టర్ ఇసుక కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిత్యం భారీగా విక్రయిస్తున్నారు. కుల్కచర్ల, దోమ మండలాలకు ఇక్కడి నుంచి ఫిల్టర్ ఇసుక సరఫరా అవుతోంది. ● గండిచెరువు, పుట్టపహాడ్, అనంత సాగర్, చాపలగూడెం, లాల్సింగ్ తండా, ఈర్లవాగుతండా, కుస్మసముద్రం, అంతారం గ్రామాల్లో ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేశారు. ● చౌడాపూర్ మండలం పాచ్చావ్తండా, చౌడాపూర్, వీరాపూర్, హనుమయ్యపల్లి, విఠాలాపూర్, లింగంపల్లి గ్రామాల్లో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. ● దోమ మండలంలో దిర్సంపల్లి, దోర్నాల్పల్లి, బ డెంపల్లి, కిష్టాపూర్ గ్రామాల్లో ఫిల్టర్ ఇసుక దందా యథేచ్ఛగా జరుగుతోంది. ● కుల్కచర్లలో రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 4గంటల వరకు ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు అనుమతులు లేకుండా ఇసుక తరలించినా.. మట్టిని శుద్ధి చేసి ఇసుకను తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇసుక అక్రమ రవాణా కట్టడికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తాం. ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరిగినా, ఫిల్టర్ ఇసుక తయారు చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – శ్రీనివాస్రెడ్డి, సీఐ, పరిగి -
‘ఆహార భద్రత’కు భంగం కలిగిస్తే చర్యలు
● రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి కడ్తాల్: ఆహార భద్రత హక్కుకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని ఓ రేషన్ దుకాణంతో పాటు, అంగన్వాడీ కేంద్రం, బాలికల ప్రాథమికోన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల, కేజీబీవీ, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలను ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, గోవర్ధన్రెడ్డి, జ్యోతి, అధికారులతో కలిసి తనిఖీలు నిర్వ హించారు. ముందుగా మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలోని రేషన్షాపును తనిఖీలు చేపట్టారు. అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు పంచ దార అందించడం లేదని తెలుసుకున్నారు. దీనిపై 30 రోజుల్లో కమిషన్కు నివేదిక అందించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. రేషన్ షాపుల వద్ద ఫిర్యాదు బాక్స్, స్టాక్ వివరాలు, సంబంధిత పౌర సరఫరా శాఖ అధికారుల ఫోన్ నంబర్ల వివరాలు ఖచ్చితంగా పెట్టాలని కమిషన్ బృందం ఆదేశించింది. అనంతరం అంగన్వాడీ కేంద్రం–2, 4 కేంద్రాలను సందర్శించి చిన్నారులకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహరం నిల్వలను, రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో అందిస్తున్న గుడ్డు పరిమాణం తక్కువగా ఉందని.. ఏజెన్సీకి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. -
విద్యార్థీ.. విజయీభవ
రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ● ఐదు నిమిషాలలోపు ఆలస్యానికి అనుమతి ● జిల్లాలో మొత్తం విద్యార్థులు 12,903మంది ● పరీక్ష కేంద్రాలు 69 ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు వికారాబాద్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం పరీక్ష కేంద్రాల్లో హాల్టికెట్ నెంబర్లు వేశారు. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. పరీక్షలు జరిగే సమయాల్లో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు, బెంచీలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 12,903మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6,450 మంది బాలురు, 6,453 మంది బాలికలు ఉన్నారు. 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అనుకోని పరిస్థితులు ఎదురై ఐదు నిమిషాల లోపు(9.35 గంటలు) ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. కాపీయింగ్కు ఆస్కారం లేకుండా.. గతంలో ఎన్నడూ లేని విధంగా కాపీయింగ్ కట్టడికి విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడితే ఇన్విజిలేటర్లను బాధ్యులను చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత సంఘటనలు పునరావృతం కాకుండా కలెక్టర్ పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల పర్యవేక్షణాధికారులతో నేరుగా సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పేపర్ లీకేజీ, మాస్ కాపీయింగ్ వంటివి జరిగితే ఇన్విజిలేటర్లతో పాటు జిల్లా, మండల స్థాయి విద్యాధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. డీఈఓ రేణుకాదేవితోపాటు 69 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 69 మంది చీప్ సూపరింటెండెంట్లు, 20 మంది తహసీల్దార్లు, 20 మంది ఎంపీడీఓలు, 20 మంది ఎంఈఓలు పరీక్షలను పర్యవేక్షించనున్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు అందాయి. అధికారులకు చాలెంజ్ పదో తరగతి పరీక్షలు జిల్లా విద్యాశాఖ తోపాటు ఉన్నతాధికారులకు చాలెంజ్గా మారింది. గతేడాది పది ఫలితాల్లో జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సారి ఆ అపఖ్యాతి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాపీయింగ్కు అవకాశం ఇవ్వొద్దు తాండూరు రూరల్: పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు అవకాశం ఇవ్వరాదని అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్కుమార్ ఆదేశించారు. బుధవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాలకు చెందిన అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో తాండూరు పట్టణంలోని నంబర్ వన్పాఠశాలలో మాస్ కాపీయింగ్ను ప్రోత్సహించిన ఇద్దరు ఉద్యోగులపై వేటు పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లను అనుమతించరాదని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ఏమైనా సంఘటనలు జరిగితే చీఫ్ సూపరింటెండెంట్లదే బాధ్యత అని స్పష్టం చేశారు. అప్రమత్తంగా ఉండండి: డీఈఓ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా కావడంతో పరీక్షల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీఈఓ రేణుకాదేవి సూచించారు. మాస్ కాపీయింగ్కు పాల్పడితే ఉపాధ్యాయులను బాధ్యులను చేసి ఉద్యోగం నుంచి తొలగించేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పట్టణ సీఐ సంతోష్కుమార్, తహసీల్దార్ తారాసింగ్, ఎంపీడీఓ విశ్వప్రసాద్, మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి, ఎస్ఐలు శంకర్, గిరి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ సహకరించాలి పదో తరగతి పరీక్ష కేంద్రా ల వద్ద పటిష్ట బందోబ స్తు ఏర్పాటు చేస్తున్నాం. కేంద్రాలకు వచ్చే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినా.. ఇతర అసౌర్యాలు కలిగినా వెంటనే డయల్ 100కు కాల్ చేయాలి. పరీక్షలు జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి. కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లరాదు. పరీక్షలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. విద్యార్థులందరికీ బెస్ట్ఆఫ్లక్ – నారాయణరెడ్డి, ఎస్పీ ఆల్దబెస్ట్ ముందుగా పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ ఆల్దబెస్ట్. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మౌలిక వసతులు కల్పించాం. ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పటిష్ట ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలి. మంచి ఫలితాలు సాధించి జిల్లాకు పేరు తేవాలి. – ప్రతీక్జైన్, కలెక్టర్ -
అట్టడుగున తలసరి!
● రూ.10.55 లక్షల ఆదాయంతో రంగారెడ్డి టాప్ ● అత్యలంగా వికారాబాద్ జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, వనరుల లభ్యత, మౌలిక సదుపాయాల అభివృద్ధితో తలసరి ఆదాయంలో జిల్లా తొలి స్థానంలో నిలిచింది. రాష్ట్ర తలసరి ఆదా యం సగటున రూ.3,46,457 ఉండగా.. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. సామాజిక ఆర్థిక సర్వే–2025 ప్రకారం 2023–24 సంవత్సరానికి అత్యధిక తలసరి ఆదాయం రంగారెడ్డిలో ఉండగా అత్యల్పంగా వికారాబాద్ నిలిచింది. గ్రేటర్ చుట్టూ.. గ్రేటర్ చుట్టపక్కల ప్రాంతాల్లో సంపద, ఆర్థిక అవకాశాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఆయా జిల్లాలు బలమైన పారిశ్రామిక, ఐటీ, సేవా రంగాల వృద్ధి నుంచి ప్రయోజనం పొందుతాయి. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండడంతో అధిక ఆదాయ స్థాయిలను కలిగిఉన్నాయి. తలసరి ఆదాయం అనేది ఒక జిల్లాలోని వ్యక్తుల సగటు ఆదాయం. ఇది జిల్లా ఆర్థిక ప్రగతిని సూచిస్తుంది. అభివృద్ధి కొన్ని పట్టణ జిల్లాల వైపు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. ఆర్థిక ప్రయోజనాలు సమానం పంపిణీ చేయడంలో వైఫల్యం వల్లే కొన్ని జిల్లాల్లో తలసరి ఆదాయం తక్కువగా ఉంది. జీడీపీలో రంగారెడ్డి హవా స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి (జీడీపీ) వ్యవసాయం, తయారీ, సేవలు, నిర్మాణం ఇతర పరి శ్రమలతో సహా జిల్లాలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవల విలువలను సూచిస్తుంది. ప్రస్తుత ధరల ప్రకారం జీడీడీపీలో గ్రేటర్ హైదరాబాద్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్రంలో అత్యధికం జీడీడీపీ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలు తొలి మూడు స్థానా ల్లో నిలిచాయి. రంగారెడ్డిలో జీడీడీపీ రూ. 3,17,898 కోట్లుగా ఉండగా.. హైదరాబాద్లో రూ.2,57,949 కోట్లు,మేడ్చల్–మల్కాజ్గిరిలో రూ.1,04,710 కోట్లుగా ఉంది. ఆర్థిక కార్యకలాపాలు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉండటమే ఈ వృద్ధి కొనసాగింపునకు ప్రధాన కారణం. ఉత్తర, దక్షిన భాగాలుగా ‘ట్రిపుల్ ఆర్’ హైదరాబాద్లో రద్దీని తగ్గించడంతో పాటు ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్తో ట్రిపుల్ ఆర్ పరిసర ప్రాంతాలలో ఆర్ధికంగా వృద్ధి చెందుతాయి. ఇప్పటికే హైదరాబాద్కు మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 50–60 కి.మీ. దూరంలో ట్రిపుల్ ఆర్ రానుంది. మొత్తం 361.52 కి.మీ. పొడవు ఉండే ట్రిపుల్ ఆర్ను ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా అభివృద్ధి చేయనున్నారు.2023–24 సంవత్సర తలసరి ఆదాయం రంగారెడ్డి రూ.10,55,913 హైదరాబాద్ రూ.5,54,105 సంగారెడ్డి రూ.3,45,478 మేడ్చల్–మల్కాజ్గిరి రూ.3,43,130 వికారాబాద్ రూ.1,98,40 -
యువ ఇంజనీర్ దుర్మరణం
శంకర్పల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైక్పై వెళ్తున్న మృతిచెందాడు. శంకర్పల్లి పట్టణ శివారులో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పిల్లిగుండ్లకు చెందిన గోవర్ధన్రెడ్డి, సుధ దంపతులకు హర్షవర్ధన్రెడ్డి(30), ధ్రువతేజరెడ్డి సంతానం. శంకర్పల్లి శివారులో నిర్మిస్తున్న సుభిషి కన్స్ట్రక్షన్స్లో హర్షవర్ధన్రెడ్డి సైట్ ఇంజనీర్గా, ధ్రువతేజరెడ్డి సేల్స్ ఎగ్జిక్యూటీవ్గా పని చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విధులు ముగించుకున్న హర్ష తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి దాటిన తర్వాత.. వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అదుపు తప్పిన బైక్ వేగంగా వెళ్లి డివైడర్ను తాకింది. దీంతో హర్షవర్ధన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన తోటి ఉద్యోగులు అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఘటన -
రైతులకు రుణాలందించండి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజల ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున వాటిని ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ ద్వారా రుణాలు అందించాలన్నారు. యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి, రానున్న సీజన్లో రైతాంగానికి అందించాల్సిన పంట రుణాలు సకాలంలో అందించాలని తెలిపారు. పూర్తి స్థాయిలో పంట రుణాల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. ఆయా రంగాల్లో పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందిస్తుండగా, మరికొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉండిపోతున్నాయని తెలిపారు. క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ వంద శాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు. వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ పథకాల కింద ఎంపికై న లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించి స్వయం ఉపాధికి చేయూతనివ్వాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తి స్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలన్నారు. సబ్సిడీ రుణాలు పంపిణీలో జాప్యం చేయవద్దన్నారు. ఎస్హెచ్జీ గ్రూపులకు యూనిట్ల గ్రౌండింగ్లో జాప్యం జరుగుతుందని చెప్పగా కలెక్టర్ స్పందించి వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో బ్యాంకర్లు పాల్గొన్నారు. ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు కృషి చేయాలి కలెక్టర్ నారాయణరెడ్డి -
మెరుగైన వైద్యం అందించండి
తాండూరు రూరల్: ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ సూచించారు. బుధవారం సాయంత్రం మండలంలోని జినుగుర్తి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఇన్ పేషంట్, లాబరేటరీ, ఔట్ పేషంట్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. వైద్యశాలకు వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. పీహెచ్సీలో అన్ని రకాల రక్త పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అందుకు లైట్లు, ఫ్యాన్లు సమకుర్చుకోవాలని సూచించారు. బీసీ హాస్టల్ పరిశీలన అనంతరం తాండూరు పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న బీసీ హాస్టల్ను అడిషనల్ కలెక్టర్ సుధీర్ తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని ఆదేశించారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని చిన్నారులకు సూచించారు. చదువు ప్రాధాన్యాన్ని వివరించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ శ్రీశైలం, పట్టణ ఆర్ఐ అశోక్, వైద్య సిబ్బంది ఉన్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ జినుగుర్తి పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ -
ముగ్గురి బైండోవర్
మోమిన్పేట: మండల తహసీల్దార్ కార్యాలయంలో ముగ్గురిని బైండోవర్ చేసినట్లు బుధవారం తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి తెలిపారు. గతంలో సారా కాస్తున్న లచ్చానాయక్ తండాకు చెందిన మేఘవత్ ప్రభు, మేఘవత్ బుజ్జిబాయి, మేఘవత్ ఫకీరలను బైండోవర్ చేశామన్నారు. ఎలాంటి ప్రభుత్వ నిషేధిత వస్తువుల జోలికి వెళ్లకూడదని ఆయన సూచించారు. వాగులో ఇరుక్కుని జింక మృతి ధారూరు: మండే ఎండలకు దాహార్తికి గురైన చుక్కల జింక వాగులోకి వెళ్లి నీటమునిగి మృతి చెందింది. ఈ మేరకు కళేబరాన్ని బుధవారం ఫారెస్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ధారూరు ఫారెస్టు రేంజర్ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గట్టెపల్లి–అల్లాపూర్ గ్రామాల మధ్య ఉన్న వాగులో నీటిని తాగేందుకు చుక్కల జింక దిగింది. లోతు ఎక్కువ ఉండటం, బురద నేల కావడంతో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక మృతి చెందింది. నాలుగు రోజుల తర్వాత జింక కళేబరం నీటిపై తేలడంతో, చేపలు పట్టేందుకు వెళ్లిన పెద్దేముల్ మండలం మారెపల్లితండాకు చెందిన వార్త్య శ్రీనివాస్కు కన్పించింది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా రేంజర్ రాజేందర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి జింక కళేబరాన్ని బయటకు తీయించారు. కుళ్లిపోయి ఉండటంతో 4 రోజుల క్రితం మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. జింక కళేబరాన్ని పోస్టుమార్టం చేయించి పక్కనే పూడ్చి పెట్టినట్లు రేంజర్ తెలిపారు. -
వెలగని వీధి దీపాలు
పరిగి: పట్టణ కేంద్రంలోని సాయిరాం కాలనీ లో కొంత కాలంగా వీధి దీపాలు వెలగడం లేదు. కాలనీలో షిర్టీ సాయిబాబా దేవాలయం ఉండటంతో రాత్రి వేళలో పూజలు నిర్వహించేందుకు భక్తులు వస్తుంటారు. దీపాలు పనిచేయకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. పలు స్తంభాలకు వీధి దీపాలు వెలగడం లేదని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అయినా అధికారు లు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి వీధి దీపాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కార్మికులు లేబర్కార్డు పొందాలి దౌల్తాబాద్: భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు లేబర్కార్డు పొందాలని అంకిత స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాష్కుమార్ సూచించారు. ఈ సందర్భంగా బుధవారం మండలంలోని చల్లాపూర్ గ్రామంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు లేబర్కార్డులు అందించారు. లేబర్కార్డు వల్ల కార్మికులకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయని తెలిపారు. ఒకవేళ లేబర్కార్డు కలిగి అనారోగ్యం మృతిచెందితే ప్రభుత్వం రూ.1.30లక్షలు పరిహారం అందిస్తుందన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6.30లక్షలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫీల్డ్ అధికారి పులిందర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు భయాందోళనకు గురికావొద్దు కొడంగల్ రూరల్: విద్యార్థులకు రుచికరమైన, మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని తహసీల్దార్ విజయ్కుమార్ సూచించారు. మున్సిపల్ పరిధిలోని పాతకొడంగల్లో ఉన్న ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర విద్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందించారు. ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. అనంతరం వంట గది, భోజనశాల, సరుకుల గది తదితర వాటిని పరిశీలించారు. భోజనశాలలో శుచి శుభ్రత పాటించాలన్నారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత దోమ: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ను టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బుధవారం మండల పరిధిలోని దాదాపూర్ గ్రామ నుంచి ఓ ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి సీఐ అన్వర్పాషా అడ్డుకున్నారు. సంబంధించిన ధ్రువ పత్రాలను డ్రైవర్ను అడగ్గా.. లేవని సమాధానం చెప్పడంతో ట్రాక్టర్ను సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడ అక్రమంగా వ్యాపారం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వాగతం ఇబ్రహీంపట్నం రూరల్: కలెక్టరేట్కు వచ్చిన తెలంగాణ ఫుడ్ కమిషన్ బృందానికి కలెక్టర్ నారాయణరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ అధికారులతో కమిషన్ సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు అమలుపై సమీక్షించి, సంతృప్తి వ్యక్తంచేశారు. -
ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ
అనంతగిరి: పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ నమోదు, మార్పులు చేర్పులు, బూతు స్థాయి ఏజెంట్ల నియామకం, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చుల సమర్పణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో ఓటు ప్రాముఖ్యతను కలిగి ఉండేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఫారం 6 నింపి నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అన్నారు. మీసేవ, ఆన్లైన్, హెల్ప్లైన్, మొబైల్లతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఫారం 7తో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని అదేవిధంగా ఫారం 8తో ఓటరు బదిలీ, పోలింగ్ కేంద్రం బదిలీ, కుటుంబ సభ్యులు ఒకే పోలింగ్ కేంద్రానికి మార్చుకోవడం ఉంటుందన్నారు. బూతు స్థాయి ఏజెంట్ల నియామకం వారం రోజుల్లోగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆయన సూచించారు. జాబితాలను పోలింగ్ కేంద్రం వారీగా బీఎల్ఓల మొబైల్ నంబర్తో సహా తహసీల్దార్లకు లేదా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి జిల్లా పార్టీల అధ్యక్షుల సంతకాలతో సమర్పించాలని తెలిపారు. సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నైమత్ అలీ, డిప్యూటీ తహసీల్దార్ ఉష్యానాయక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం -
‘ఫ్యూచర్’లో విలీనానికి ఉద్యమిస్తాం
మహేశ్వరం: మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేయడానికి అన్ని వర్గాల ప్రజలతో ఉద్యమిస్తామని జేఏసీ చైర్మన్ వత్తుల రఘుపతి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం మండలాన్ని విలీనం చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందన్నారు. మహా నగరం చేస్తామని గతంలో సీఎం ఎన్నో సార్లు చెప్పారని గుర్తు చేశారు. దీనిపై ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్రెడ్డిలను కలిసి తమ సమస్యను విన్నవిస్తామన్నారు. ఈ నెల 21న మండల పరిధిలోని అమీర్పేట్ పద్మావతి ఫంక్షన్ హాలులో ఫ్యూచర్ సిటీ జేఏసీ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు మనోహర్, సభ్యులు మల్లేష్ యాదవ్, అంధ్యానాయక్, ఈశ్వర్ముదిరాజ్, సుదర్శన్యాదవ్, యాదయ్య, కృష్ణానాయక్, పాండునాయక్, దత్తునాయక్ తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ రఘుపతి -
కనుల పండువగా రథోత్సవం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం స్వామివారికి అభిషేకం, పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు గోపాలాచార్యులు, రామాచార్యులు, రామానుజాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. అనంతరం భక్తుల కోలాహలం నడుమ రథోత్సవం కనులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాజ్కుమార్, ఈఓ స్నేహలత, మాజీ సర్పంచ్ శ్రీశైలం, నాయకులు శ్రీనివాస్రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
35 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
యాలాల: జిల్లాలో టాస్క్ఫోర్స్ అధికారులు, స్థానిక పోలీసులతో కలిసి బుధవారం జరిపిన దాడుల్లో వేర్వేరు ప్రాంతాల్లో 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. వివరాలిలా ఉన్నాయి. అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులు యాలాల మండలంలోని ఇందిరమ్మ కాలనీలో స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన మహేష్చంద్ర అనే వ్యక్తి పీడీఎస్ బియ్యాన్ని కొంటూ వ్యాపారం చేస్తుంటాడు. కాగా భారీగా పీడీఎస్ బియ్యాన్ని ఓ ప్రదేశంలో నిల్వ ఉంచారనే సమాచారంతో పోలీసులు, సివిల్ సప్లయ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో 29 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించి, ఆటోను యాలాల పీఎస్కు తరలించినట్లు సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ గణపతి తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మరో ఘటన.. కుల్కచర్ల: నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని మండల పరిధిలో టాస్క్ఫోర్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన సంగమేశ్వర్ ఇంటి వద్ద 6 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అన్వేష్రెడ్డి తెలిపారు. టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
షాద్నగర్రూరల్: మనస్తాపానికి గురైన వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ శివారులో బుధవారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ మల్లేష్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని రాయికల్ గ్రామానికి చెందిన సంద శ్రీనివాస్(32) డ్రైవర్గా పని చేస్తూ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. కొంత కాలం క్రితం అతడి తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఎవరూ లేకపోవడంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయాన్ని తెలుసుకున్న రైల్వే హెడ్కానిస్టేబుల్ మల్లేష్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వివరాలను తెలుసుకొని బంధువులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్టేషన్ మాస్టర్ అబుదేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
కమలంలో అసమ్మతి గళం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడిప్రకటనపై స్థానిక నేతల కినుక ● రాజశేఖర్రెడ్డికి పగ్గాలు అప్పగించడంతో గుర్రు ● అధిష్టానం పునరాలోచించాలని సూచన ● భవిష్యత్ కార్యాచరణపైనా చర్చ వికారాబాద్: బీజేపీ జిల్లా కొత్త అధ్యక్షుడి నియామకంపై అసమ్మతి గళం వినిపిస్తోంది. గద్వాలకు చెందిన డాక్టర్ రాజశేఖర్రెడ్డికి అధిష్టానం ఈ బాధ్యతలు కట్టబెట్టిన విషయం తెలిసిందే. వృత్తి రీత్యా వైద్యుడైన ఆయన ప్రస్తుతం వికారాబాద్లో ప్రైవేట్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితం పార్టీలో చేరారు. ఆయనతో పాటు జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను నియమించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సపోర్ట్తోనే రాజశేఖర్రెడ్డిని అధ్యక్ష పదవి వరించినట్లు కొంతమంది సీనియర్లు అంటున్నారు. చర్చకు తెర.. కొత్త అధ్యక్షుడి నియామకంపై కొంత కాలంగా చర్చ జరుగుతోంది. జిల్లా నుంచి పలువురు సీనియర్లు, జూనియర్లు పోటీ పడగా స్థానికేతరుడైన రాజశేఖర్రెడ్డికి పదవి దక్కింది. దీంతో ఆశావహులు అసంతృప్తికి లోనయ్యారు. ఆయన నామినేషన్ను తొలగించాలని కొంతమంది సీనియర్లు గత సోమవారం ఉదయం ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇవేవీ పట్టించుకోకుండా రాజశేఖర్రెడ్డికే జిల్లా పగ్గాలు అప్పగించారు. పార్టీ మండల అధ్యక్షుడిగా నియమించాలన్నా కనీసం మూడు సార్లు పార్టీ సభ్యత్వ నమోదులో పాల్గొనడంతో పాటు స్థానికుడై ఉండాలనే నిబంధనను పట్టించుకోలేని స్థానిక నేతలు మండిపడుతున్నారు. మంగళవారం కూడా జిల్లాకు చెందిన కొందరు సీనియర్లు వికారాబాద్లో సమావేశమై అసంతృప్తిని వెల్లగక్కడంతోపాటు పాటు భవిష్యత్ కార్యాచరణను చర్చించినట్లు తెలుస్తోంది. ఆశించి భంగపడిన సీనియర్లు జిల్లాకు చెందిన పలువురు సీనియర్లు జిల్లా అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డారు. వికారాబాద్కు చెందిన పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద్రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన వండ్ల నందు, వికారాబాద్కు చెందిన కేపీ రాజు, శివరాజు అధ్యక్ష రేసులో ఉంటూ వచ్చారు. వీరితో పాటు తాండూరుకు చెందిన ఉప్పరి రమేశ్, పరిగికి చెందిన రాముయాదవ్ తదితరులు కూడా పదవిని ఆశించారు. వీరందరూ తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని అధిష్టానాన్ని విజ్ఞప్తి చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా రాజశేఖర్రెడ్డికి పగ్గాలు అప్పగించడంతో ఆశావహులంతా షాక్కు గురయ్యారు. -
కడచూపు కోసం.. కన్నీటి పయనం
షాద్నగర్: విదేశీ ప్రయాణం అంటే సంతోషంగా ముందుకు సాగుతారు.. అక్కడే స్థిరపడి, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన పిల్లలు, బంధువులను చూసేందుకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతారు. కానీ రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్రెడ్డి, పవిత్ర దంపతుల అమెరికా ప్రయాణం కన్నీటి మయమైంది. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తమ కూతురు ప్రగతిరెడ్డి, మనవడు హర్వీన్రెడ్డి, వియ్యంకురాలు సునీతారెడ్డిని చివరిసారిగా చూసేందుకు మంగళవారం వారు స్వగ్రామం నుంచి బయల్దేరారు. ఈ నేపథ్యంలో టేకులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కూతురు, మనుమడిని తలచుకుంటూ బాధితులు రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. మృతదేహాలను ఇండియా తెప్పించేందుకు వీలు కావడం లేదని, అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రగతి అత్తింటి వారి నుంచి సమాచారం రావడంతో బరువెక్కిన హృదయాలతో బయల్దేరారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి దుండగుల కాల్పుల్లో మృతిచెందిన కేశంపేట విద్యార్థి గంప ప్రవీణ్ ఘటనను మరవకముందే.. ఈదుర్ఘటన జరగడం నియోజకవర్గ వాసులను కలవరపెడుతోంది. విదేశాల్లో ఉన్న తమ పిల్లలకు ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్పడం కనిపించింది. పలువురి పరామర్శఅమెరికాకు పయనమైన మోహన్రెడ్డి దంపతులు టేకులపల్లి నుంచి నగరంలోని కొత్తపేటలో ఉన్న తమ నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి వీరిని కలిసి ఓదార్చారు. -
చిరుత కాదు.. అడవి పిల్లి
● ట్రాప్ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు ● నిర్ధారించిన అటవీశాఖ అధికారులు ● ఊపిరి పీల్చుకున్న కార్మికులు, ప్రజలు తాండూరు రూరల్: మండలంలోని మల్కాపూర్, సంగెంకలాన్ గ్రామ శివారులో సంచరిస్తోంది చిరు తపులి కాదని.. అడవి పిల్లి అన్ని అటవీశాఖ అధికారులు తేల్చారు. వారు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో అడవి పిల్లి సంచరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. దీంతో కార్మికులు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మల్కాపూర్ శివారులోని సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఈ పరిశ్రమకు సంబంధించిన ముడిసరుకు కోసం మల్కాపూర్, సంగెంకలాన్ గ్రామ శివారులో 1,392 ఎకరాల్లో నాపరాతి క్వారీ ఉంది. ఇది అటవీ ప్రాంతంలో ఉంది. వారం రోజుల క్రితం క్వారీలో పనిచేసే కార్మికుడికి అడవి జంతువు కనిపించింది. అది చిరుతపులిని పోలినట్లు ఉండటంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు సోమవారం క్వారీ సమీపంలోని నీటికుంట వద్ద, సంగెంకలాన్ శివారులోని అటవీ ప్రాంతంలో ఐదు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో నీటికుంట వద్దకు అడవిపిల్లి వచ్చింది. ఈ దృశ్యాలు కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ ప్రాంతంలో సంచరిస్తోంది చిరుతపులి కాదని, అడవి పిల్లి అని ప్రజలు, కార్మికులు భయాందోళన చెందరాదని తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి సరస్వతి, ఇన్చార్జ్ సెక్షన్ ఆఫీసర్ పిర్యానాయక్ సూచించారు. అడవి పిల్లి వల్ల ఎలాంటి హాని ఉండదని వారు తెలిపారు. -
పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి
కలెక్టర్ ప్రతీక్జైన్ అనంతగిరి: పదో తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, పీఎస్ కస్టోడియన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతించరాదని ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు కేటాయించిన అధికారులు, సిబ్బంది మినహా ఇతరులను అనుమతించరాదన్నారు. అలాగే అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీఈఓ రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ డిపోకు 16 కొత్త బస్సులు అనంతగిరి: వికారాబాద్ ఆర్టీసీ డిపోకు ప్రభు త్వం 16 కొత్త బస్సులను కేటాయించింది. మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగిందని.. వికారాబాద్ డిపోకు మరిన్ని కొత్త బస్సులు కేటాయించాలని స్పీకర్ ప్రసాద్కుమార్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్ను కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు 16 కొత్త బస్సులను కేటాయించడం జరిగింది. ఈ బస్సుల రాకతో వికారాబాద్ నియో జకవర్గం పరిధిలో ప్రయాణం సులభతరమవుతుందని, కొత్త బస్సులు మంజూరు చేసిన మంత్రి పొన్నంకు స్పీకర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. పీఎస్ జేఏసీ జిల్లా చైర్మన్గా కిషన్రెడ్డి అనంతగిరి: జిల్లా పంచాయతీ సెక్రటరీస్ జేఏసీ చైర్మన్గా బి.కిషన్రెడ్డిని ఎన్నుకున్నారు. మంగళవారం వికారాబాద్లో జిల్లా పంచాయతీ సెక్రటరీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్గా కిషన్రెడ్డి, వైస్ చైర్మన్లుగా బాల రంగాచారి, మహేశ్వరి, జనరల్ సెక్రటరీగా కృష్ణ, ట్రెజరర్గా సత్యనారాయణను ఎన్నుకున్నారు. అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులను ఏకతాటిపైకి తీసుకువచ్చి జేఏసీ బలోపేతం చేస్తామన్నారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ సీనియర్ కార్యదర్శులు ప్రసన్నకుమార్, రాములు, రాజు, మధుకర్రెడ్డి, శ హేందర్రెడ్డి, రాంచందర్, రామకృష్ణ, రమేష్, రవిశెట్టి తదితరులు పాల్గొన్నారు. అనంతుడి సేవలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అనంతగిరి: బీజేపీ జి ల్లా అధ్యక్షుడిగా నియ మితులైన డాక్టర్ రాజశేఖర్రెడ్డి మంగళవా రం అనంతగిరి శ్రీ అనంతపద్మనాభ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనంతపద్మనాభ స్వామి ఆశీర్వాదంతో ముందుకు సాగుతానని తెలిపారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఆయన వెంట ధార్మిక సెల్ కన్వీనర్ మోహన్రెడ్డి, జాయింట్ కన్వీనర్ రాఘవేందర్, నాయకులు శివరాజు, గొడుగు సుధాకర్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలి ఇబ్రహీంపట్నం రూరల్: మధ్యాహ్న భోజనం కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం చంద్రమోహన్ మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్నతో కలిసి మాట్లాడారు. -
రోడ్ల పక్క.. ఖాళీ స్థలాల్లో..
పరిగి: పరిగి మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది. కొన్ని కాలనీలకు చెత్త సేకరణ వాహనాలు వారంలో రెండు మూడు రోజులే వస్తుండటంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్లపక్క చెత్తను పారబోస్తున్నారు. దీంతో ఈగలు, దోమలు వృద్ధి చెందడంతోపాటు దుర్గంధం వెదజల్లుతోంది. పరిగి మున్సిపాలిటీలో 15 వార్డులు, 32,500 జనాభా ఉంది. నిత్యం 14 వాహనాలతో 12 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. తడి పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని మున్సిపల్ అధికారులు చెబుతున్నా ప్రజలు మాత్రం రెండూ కలిపే వేస్తున్నారు. పరిగి పట్టణంలో చెత్త నిల్వకు డంపింగ్ యార్డు లేకపోవడంతో ప్రైవేటు స్థలాల్లో వేస్తున్నారు. ఇటీవల మున్సిపాలిటీలో ఆరు గ్రామాలు విలీనమయ్యాయి. దీంతో చెత్త సేకరణకు అదనపు వాహనాలు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న వాహనాల ద్వారా చెత్త సేకరణ కష్టంగా ఉంది. రెండో సారి వాహనం రావడం ఆలస్యం అవుతుండటంతో ప్రజలు రోడ్ల పక్క, ఖాళీ ప్రదేశాల్లో చెత్తను పారబోస్తున్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
అనంతగిరి: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మైపాల్ డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం కలెక్టరేట్ వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు డబుల్ సిలిండర్తోపాటు ప్రతి నెలా గ్యాస్ బిల్లులు ఇవ్వాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే మే నెలలో పూర్తిగా సెలవులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, అంగన్వాడీ టీచర్లు నర్సమ్మ, భారతి, మంజుల, బేబి, లక్ష్మి, విజయలక్ష్మి, నవనీత, వనజ, సంతోష, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
శభాష్ శశివర్ధన్
● హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో సత్తాచాటిన దుద్యాల్ వాసిదుద్యాల్: తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో దుద్యాల్కు చెందిన మాసుల శశివర్ధన్ సత్తాచాటారు. దీంతో తల్లిదండ్రులు చిన్న సాయప్ప, పద్మమ్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పేద కుటుంబానికి చెందిన శశివర్ధన్ తల్లిదండ్రులతోపాటు కూలి పనులు చేసుకుంటూ చదివాడు. పలుసార్లు పోటీ పరీక్షలు రాసి ఉద్యోగం కోసం ఎదురు చూశాడు. 2012లో కాంట్రాక్ట్ పద్ధతిన సర్వశిక్షా అభియాన్లో సీఆర్పీగా ఎంపికయ్యాడు. పదకొండేళ్లపాటు దుద్యాల్లో సీఆర్పీగా సేవలందిచాడు. ఆ తర్వాత దౌల్తాబాద్ మండలం గోకపస్లబాద్ పాఠశాలలో రెండేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. సీఆర్పీగా పని చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యడు. గతంలో జరిగిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలు రాసి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మంగళవారం దుద్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శశివర్ధన్ను గ్రామస్థులు, విద్యార్థులు, ఉపాధ్యాయులుఘనంగా సన్మానించారు. -
పారిశుద్ధ్యం.. అధ్వానం
మున్సిపాలిటీల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారంవికారాబాద్: పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. వార్డుల్లో సేకరించిన చెత్తను పట్టణ శివారు ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్నారు. కాలనీల్లో చెత్త కుండీలు తీసివేయడం.. రోజూ తిరగాల్సిన చెత్త బండ్లు సక్రమంగా రాకపోవడంతో ప్రజలు ప్రధాన కూడళ్లలో చెత్తను పారబోస్తున్నారు. దీంతో కాలనీలు కంపుకొడుతున్నాయి. మున్సిపాలిటీలో పరిస్థితి ఇలా ఉంటే అనుబంధ గ్రామాల్లో మరీ అధ్వానంగా ఉంది. ఇంటి, నల్లా పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు కాలనీల్లో కనీస సౌకర్యాలు, వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతాన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణ శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందడం.. అక్కడే చెత్తను డంపింగ్ చేస్తుంటంతో ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. తడి పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని చెప్పే మున్సిపల్ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. తడి పొడి చెత్తనంతా కలిపే సేకరిస్తున్నారు. ఎక్కడ చూసినా చెత్త కుప్పలే.. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 34 వార్డులు.. 70 వేల జనాభా ఉంది. పట్టణంలో రోజుకు సగటున 30 నుంచి 32 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. వికారాబాద్లో తడి పొడి చెత్త వేరు చేసే ప్రక్రియ చేపట్టడం లేదు. కంపోస్టు ఎరువుల తయారీ యూనిట్ నామమాత్రంగా పని చేస్తోంది. వారానికి 400 కిలోల ఎరువులు కూడా తయారు చేయడం లేదు. ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో ఏ వార్డులో చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. పట్టణంలోని మార్కెట్, రైతు బజార్ పరిసరాల్లో చెత్త పారబోయడం ఎక్కువగా కనిపిస్తోంది. వికారాబాద్ – అనంతగిరి మార్గంలోని మేకల గండి వద్ద చెత్తను డంప్ చేస్తున్నారు. చెత్త సేకరణ, తరలింపు కోసం రెండు జేసీబీలు, ఆరు ట్రాక్టర్లు, 17 ఆటోలు వినియోగిస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని 34 వార్డుల్లో 157 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు వికారాబాద్ను చెత్తరహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. చెత్తపై చిత్తశుద్ధి కరువు తాండూరు: కేంద్ర ప్రభుత్వం ఏటా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణపై స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం నిర్వహించి జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు అందజేస్తోంది. మూడేళ్లుగా కేంద్రం ప్రకటించే జాబితాలో తాండూరు మున్సిపాలిటీ చిట్ట చివరి స్థానంలో నిలవడం గమనార్హం. అంటే పారిశుద్ధ్య నిర్వహణలో ఈ మున్సిపాలిటీ ఏ స్థాయిలో ఉందో చెప్పనవసరం లేదు.తాండూరు మున్సిపాలిటీలో 36 వార్డులు.. 19వేల గృహాలు, 85 వేల జనాభా ఉంది. 254 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. రోజూ 40 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు.ఇందుకోసం 11 ట్రాక్టర్లు, 28 ఆటోలను వినియోగిస్తున్నారు. వీటిలో సగానికి పైగా పని చేయడం లేదు. డంపింగ్ యార్డు నిర్వహణను గాలికొదిలేశారు. తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. కానీ మున్సిపాలిటీలో ఈ విధానం పాటించడం లేదు. నాలుగేళ్లు గా శానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో చెత్త సేకరణ, డంపింగ్ అధ్వానంగా మారింది. ఇన్చార్జ్ అధికారులు ఉన్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. మున్సిపాలిటీలో చెత్త నుంచి ఎరువుల తయారీకి యూనిట్ ఏర్పాటు చేసినా అధికారుల నిర్లక్ష్యంగ కారణంగా ప్రక్రియ ఆగిపోయింది. రోడ్లపైనే ప్రవహిస్తున్న మురుగు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా తీరని సమస్యలు నామమాత్రంగాకంపోస్టు ఎరువుల తయారీ పట్టించుకోని మున్సిపల్ కమిషనర్లు ఇబ్బందుల్లో ప్రజలుజిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. పట్టణాల్లో చెత్త సేకరణ సరిగ్గా లేకపోవడం స్థానికులను ఇబ్బంది పెడుతోంది. రోడ్లపైనే మురుగు ప్రవహిస్తుండటంతో జనం నడవలేని పరిస్థితి నెలకొంది. కాలనీల్లో చెత్త పేరుకుపోవడంతో ఈగలు, దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పారిశుద్ధ్యంపై మున్సిపల్ కమిషనర్లు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. -
బీసీల చిరకాల స్వప్నం సాకారం
పరిగి: ఎన్నికల ముందు బీసీలకు న్యాయం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన మాట నిలబెట్టుకున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ అన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టినందుకుగాను మంగళవారం సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒకే సారి రెండు బీసీ బిల్లులను ప్రవేశపెట్టిన ఘటన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికే దక్కుతుందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుతో ఎంతో మేలు చేకూరుతుందన్నారు. బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. బీసీల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధానకార్యదర్శి హన్మంతుముదిరాజ్, చిన్న నర్సింలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, అడ్వకేట్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్కృష్ణ -
నాగసమందర్లో వన్యప్రాణుల వేట
ధారూరు: వన్యప్రాణుల వేటకు వచ్చిన వేటగాళ్ల వాహనాన్ని మంగళవారం ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది పట్టుకున్నారు. అధికారుల రాకను గుర్తించిన వేటగాళ్లు వాహనాన్ని వదిలి పారిపోయారు. ధారూరు రేంజర్ బి.రాజేందర్ తెలిపిన ప్రకారం.. ధారూరు ఫారెస్టు రేంజ్ పరిధిలోని నాగసమందర్ అటవీప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది గస్తీ తిరుగతున్నారు. వీరికి అడవిలో ఓ వాహనం కనిపించడంతో అదుపులోకి తీసుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తుండగా గమనించిన వేటగాళ్లు వారికి దొరక్కుండా పారిపోయారు. ఫారెస్టు రేంజర్ రాజేందర్, సిబ్బంది కేఏ 36 సీ 5587 నంబర్ వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో వన్యప్రాణులను వేటాడేందుకు తాడుతో అల్లిన వలల చుట్టలు, తీగలు లభ్యమయ్యాయి. కోట్పల్లి మండల సమీపం అన్నాసాగర్కు చెందిన ఓ అనుమానిత వ్యక్తిని ఫారెస్టు సిబ్బంది పట్టుకున్నారు. అతనితో పాటు వాహనాన్ని ధా రూరు అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి తరలించా రు. కాగా ఫారెస్టు అధికారులు పట్టుకున్న వాహనంపై అడవి రాములు అనే అక్షరాలు కనపించాయి. వేటగాళ్ల వాహనం సీజ్ -
వర్గీకరణ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేపట్టాలి
షాద్నగర్రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు చేపట్టిన రిలే దీక్షలు మంగళవారంతో 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరుతూ అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. అనంతరం నర్సింహ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా ఉద్యోగాలను భర్తీచేస్తే మాదిగలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఎస్సీ వర్గీకరణ ప్రకారమే నియామకాలు చేపట్టాలని కోరారు. మాదిగలకు న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చేంత వరకు ఉద్యమాన్ని విరమించేదిలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాండు, బాల్రాజ్, నాగభూషణం, సురేష్, మహేందర్, శ్రీనివాస్, శివశంకర్, యాదగిరి, చందు, శ్రీను, హరీష్, శ్రీశైలం, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ -
వన్యప్రాణుల దాహార్తికి చెక్డ్యాం
ధారూరు: మండుటెండల్లో ఊట నీరు వన్యప్రాణుల దాహార్తి తీరుస్తోంది. అడవిలోని జీవజాలం ఊటనీరు తాగుతూ తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. మండల పరిధిలోని ధారూరు–గట్టెపల్లి మధ్య అటవీ శాఖ చెక్డ్యాం నిర్మించింది. ఇక్కడ నీటి ప్రవాహం లేకున్నా వేసవిలో ఊట నీరు ఉబికి వస్తోంది. విషయం గమనించిన అటవీశాఖ 2024 డిసెంబర్లో రూ.5.58లక్షలు వెచ్చించి దొంగలకుంట అటవీప్రాంతంలో చెక్ డ్యాం నిర్మించారు. ధారూరు ఫారెస్ట్ బీట్లో నిర్మించిన ఈ చెక్డ్యాంపై నిత్యం నిఘా ఉంటుంది. రాత్రిళ్లు చెక్డ్యాం వద్దకు వచ్చే వన్యప్రాణుల వేటకు ఎవరైనా రావచ్చునని పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. చెక్ డ్యాంలో ఎక్కువైన నీటిని కాల్వల ద్వారా పారిస్తున్నారు. మంగళవారం ఈ చెక్డ్యాంను ఫారెస్టు రేంజర్ రాజేందర్, డిప్యూటీ ఫారెస్టు రేంజర్ హేమ పరిశీలించారు. వేసవిలోనూ ఉబికి వస్తోన్న ఊటజలాలు -
విలీనం చేసేంతవరకు పోరాటం
మహేశ్వరం: మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలని మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ వత్తుల రఘుఫతి డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని కర్నాటి మనోహర్ కాంప్లెక్స్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడుతూ.. మండల పరిధిలోని తుమ్మలూరు, మెహబ్బత్నగర్లను మాత్రమే ఫ్యూచర్ సిటీలో విలీనం చేయడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు మహేశ్వరాన్ని మహానగరంగా మార్చుతామని ఉచిత హామీలిచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో ఫ్యూచర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి కేవలం రెండు గ్రామాలను విలీనం చేసి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఓఆర్ఆర్కు అతి చేరువలో ఉన్న మహేశ్వరం మండలాన్ని ప్యూచర్ సిటీలో విలీనం చేయకపోవడం సరికాదన్నారు. త్వరలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను ఐక్యం చేసి ఫ్యూచర్ సిటీలో మండలపరిధిలోని అన్ని గ్రామాలను కలిపేవరకు ఉద్యమిస్తామన్నారు. నియోజకవర్గంలో స్ధానికేతలరులను గెలిపిస్తే తమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులను కలిసి సీఎం రేవంత్రెడ్డికి కలిసి తమ సమస్యలను విన్నవిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్యూచర్ సిటీ జేఏసీ కమిటీ సభ్యులు మనోహర్, కడారి జంగయ్య, కాకి ఈశ్వర్, మల్లేశ్ యాదవ్, అంధ్యా నాయక్, నందిగామ నర్సింహ, ఆవుల యాదయ్య, యాదయ్య గౌడ్, యాదగిరి గౌడ్, దత్తు నాయక్, రవికుమార్, రాజు నాయక్, సుదర్శన్ యాదవ్, యాదీష్, కృష్ణా నాయక్, రమేష్, ఆంజనేయులు, శ్రావణ్ పాల్గొన్నారు. మహేశ్వరం ఫ్యూచర్ సిటీజేఏసీ చైర్మన్ రఘుఫతి -
ముసుగు దొంగల హల్చల్
చేవెళ్ల: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా ముగ్గురు దుండగులు మూడు గ్రామాల్లో హల్చల్ చేశారు. మూడు ఇళ్లల్లో చోరీకి పాల్పడి నగదు, ఓ బైక్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలోని సింగప్పగూడ, రామన్నగూడ, న్యాలట గ్రామాల్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. సింగప్పగూడలో శేఖర్రెడ్డి తన ఇంటికి తాళం వేసి శంషాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. గమనించిన దుండగులు తాళం పగులగొట్టి రూ.8 వేల నగదు ఎత్తుకెళ్లారు. అదే గ్రామానికి చెందిన కుమ్మరి మహేందర్ ఇంటికి తాళం వేసి మరోగదిలో నిద్రించాడు. ఆయన పడుకున్న గదికి గడియ పెట్టి తాళం వేసిన ఇంట్లో రూ.6 వేల నగదు దోచుకెళ్లారు. న్యాలటకు చెందిన కానిస్టేబుల్ అశోక్ తన కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు వెళ్లారు. ఈ ఇంట్లో చొరబడిన దొంగలు రూ.10 వేలు దొంగలించారు. సింగప్పగూడలో రంగారెడ్డి ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్తో పరారవుతుండగా మార్గమధ్యలో రామన్నగూడ వద్ద బైక్లో పెట్రోల్ అయిపోవడంతో ద్విచక్రవాహనం నిలిచిపోవడంతో అక్కడే వదిలేశారు. రామన్నగూడ గ్రామంలోకి వెళ్లి అక్కడ గ్రామానికి చెందిన షఫీ ఇంటి ఎదుట పార్కు చేసిన మరోబైక్తో పలాయనం చిత్తగించారు. మూడు గ్రామాల్లో చోరీలు నగదు, బైక్ ఎత్తుకెళ్లిన దుండగులు సీసీ కెమెరాకు చిక్కిన దుండగులు మూడు గ్రామాల్లో దొంగలు పడినట్లు గుర్తించిన గ్రామస్తులు గ్రామాల్లోని సీసీ కెమెరా పుటేజీలు పరిశీలించారు. ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి చేతిలో కత్తులు, రాడ్లు పట్టుకుని వచ్చినట్లు గుర్తించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని పక్కింటి వారు లేచి బయటకురాకుండా చుట్టూ ఉన్న ఇళ్లకు గడియలు పెట్టి చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు మూడు గ్రామాల్లో క్లూస్టీంతో వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసుల దర్యాప్తు చేపట్టారు. -
చదువుకు పేదరికం అడ్డుకాదు
తాండూరు టౌన్: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ నంబర్వన్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించే దిశగా శ్రమించాలన్నారు. ఉన్నత శిఖరాలకు ఎదగడానికి పేదరికం అడ్డురాదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతో మంది మహోన్నత స్థితికి ఎదిగారని గుర్తుచేశారు. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దాత వనజ సహకారంతో విద్యార్థులకు బహుమతులు, పరీక్ష ప్యాడ్లు అందజేశారు. మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల రత్నమాల, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కరీమా బేగం, ప్రధానోపాధ్యాయులు శివకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలి డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఘనంగా నంబర్ వన్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం -
గడ్డి విత్తనాలకు మంగళం
దౌల్తాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో పశుపోషణ భారంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతీ సంవత్సరం పంపిణీ చేసే గడ్డి విత్తనాల సరఫరాలో ఈ ఏడాది అంతరాయం ఏర్పడింది. దీంతో మూగజీవాలకు పశుగ్రాసం దొరకడం ఇబ్బందిగా మారింది. మండల పరిధిలో 80శాతం వ్యవసాయం చేసే రైతులకు పశువులున్నాయి. ఈ ఏడాది పశు సంవర్ధక శాఖ ద్వారా అందించే గడ్డి విత్తనాలకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. పశువైద్యశాలకు చేరని విత్తనాలు మండల పరిధిలో 33 పంచాయతీలున్నాయి. ప్రతీ సంవత్సరం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 75శాతం రాయితీపై గడ్డి విత్తనాలు సరఫరా చేసేవారు. ఇందుకు ప్రత్యేక బడ్జెట్ కెటాయించేవారు. ఈ విత్తనాలు జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పశువైద్యశాలకు చేర్చి అక్కడి నుంచి రైతులకు రాయితీపై అందించేవారు. కానీ ఈ ఏడాది రాయితీ విత్తనాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో పంపిణీ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. యాసంగి ఆరంభంలో పంపిణీ చేసే గడ్డివిత్తనాలు రైతులు వేసవిని దృష్టిలో పెట్టుకుని సాగు చేశారు. తద్వారా గ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకునేవారు. కానీ ఈ సారి ఇప్పటి వరకు కూడా గడ్డి విత్తనాలు పశువైద్యశాలకు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరి కొంతమంది రైతులు కర్ణాటక రాష్ట్రంలో చొప్పను కొనుగోలు చేసి తెప్పించుకుంటున్నారు. కొంతమంది రైతుల వద్ద వరిగడ్డిని కొనుగోలు చేసి తరలిస్తున్నారు. నిలిచిన సరఫరా పశుగ్రాసం కోసం తిప్పలు కర్ణాటక నుంచి కొనుగోలు చేస్తున్న రైతులు ప్రత్యామ్నాయ చర్యలు గడ్డి విత్తనాలు ఇప్పటి వరకు అందకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. జొన్న, మొక్కజొన్న పంటల వైపు దృష్టి సారించారు. తమ పొలంలో బోర్లు వేసి బిందు సేద్యం ద్వారా మొక్కజొన్న, జొన్న పంటలను పండిస్తున్నారు. వర్షాధారిత పంటల రైతులు మాత్రం బయటి నుంచి పశుగ్రాసం కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గడ్డి విత్తనాలు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై పశువైద్యశాఖ అధికారి సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా ప్రభుత్వం నుంచి గడ్డి విత్తనాల సరఫరా లేదు. రైతులు ప్రతి రోజు వచ్చి అడుగుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియజేశాం. -
విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
తాండూరు రూరల్: విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని న్యాయవాది జిలానీ సూచించారు. మంగళవారం పెద్దేముల్ మండలం గోట్లపల్లి మోడల్ స్కూల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాలకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేసి కేసుల పాలైతే ఉద్యోగాలు రావని తెలిపారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్కు సంబంధించిన చట్టాలు, శిక్షలను వివరించారు. గొడవలు, అనవసర విషయాలు, వ్యసనాల జోలికి వెళ్లకుండా.. జీవితాలను అందంగా మలచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గాయత్రి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. లెప్రసీపై సర్వే దౌల్తాబాద్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో లెప్రసీ(కుష్టు) వ్యాధిపై వైద్యసిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కౌడీడ్, నర్సాపూర్ గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు సర్వే చేపట్టారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. వైద్యాధికారిని అమూల్య, సూపర్వైజర్ రఫీ సర్వే తీరును పరిశీలించారు. ఈ ఈనెల 30 వరకు అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం పరిగి: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన పట్టణ కేంద్రంలోని 1వ వార్డులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. పట్టణ కేంద్రంలోని ప్రేమ్నగర్ కాలనీలో నివాసముంటున్న సుగుణమ్మ పరిగి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. రోజువారీగా పనులకు వెళ్లగా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు గమనించి ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చేవరకు ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.75వేల నగదు కాలిబూడిదయింది. ఉపాధి కల్పనకు కృషి కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్రెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంకాల శేఖర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎల్మినేడులో లీడింగ్ ఎలక్ట్రానిక్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేఖర్రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులకు 68 మంది దరఖాస్తు చేసుకోగా 52 మందిని స్పాట్ సెలక్షన్ చేశారన్నారు. త్వరలోనే మిగిలిన వారికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఎలక్ట్రానిక్ కంపెనీ డైరెక్టర్ ఉష, మేనేజర్ భారతి, కాంగ్రెస్ అధ్యక్షులు యాదగిరి, సీనియర్ నాయకులు జంగయ్య, సురేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
లారీ, బైక్ ఢీ.. యువకుడి మృతి
చేవెళ్ల: లారీ బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధి ఖానాపూర్ బస్స్టేజీ సమీపంలోని హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై సోమ వారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. చేవెళ్ల గ్రామానికి చెందిన భగిర్తి వెంకటయ్య, సుమిత్రలకు ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు బి.సాయికుమార్(20) ఉన్నారు. ఇద్దరు కూతుర్ల వివాహం చేశారు. కుటు ంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సాయి పదో తరగతితోనే చదువు ఆపేసి, ప్రైవేటు పనులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎప్పటి లాగే యువకుడు పనికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ యువకుడు నడుపుతున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను ఎగిరి కిందపడగా.. బైక్తో పాటు యువకుడి తలపై నుంచి లారీ ముందుకు దూసుకుపోయింది. దీంతో సాయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించారు. లారీని డ్రైవర్ అక్కడే వదిలేసి పారిపోయాడు. మృతుడు సాయికుమార్గా గుర్తించిన పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. అనంతరం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కుటుంబానికి ఆధారంగా ఉన్న ఒక్కగానొక్క కొడుకు మరణంతో ఆ తల్లిదండ్రుల రోదనలు అందరినీ కలచివేశాయి. -
సారు రూటు.. సప‘రేటు’
బషీరాబాద్: అక్రమ సంపాదనకు అలవాటుపడిన ఓ రెవెన్యూ అధికారి చేతులు తడపందే ఏ పనీ చేయడం లేదు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చేవారు ఎవరైనా సరే ముడుపులు ముట్టజెప్పందే ఫైలు ముట్టుకోడు. ఎంతోకొంత అప్పగించందే సారు సంతకం పెట్టరు. కొంతమంది అక్రమార్కులతో కుమ్మకై ్క ప్రభుత్వ సంపదను పక్కదారి పట్టిస్తున్నారు. ఈయన అవినీతి లీలలపై ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో సారు తీరుపై నిఘా పెట్టిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ విషయం తెలియడంతో బదిలీ కోసం విశ్వప్రయత్నాలుచేస్తున్నారు. మచ్చుకు కొన్ని.. ● ఇటీవల ఓ రైతు తన భూమి పట్టా మార్పు కోసం రెవెన్యూ కార్యాలయానికి వచ్చాడు. ఒరిజినల్ పాసు పుస్తకం ఎక్కడో పోయిందని, పట్టామార్పు చేయాలని అడిగాడు. అయితే పని కావాలంటే రూ.10 వేలు కావాలని మధ్యవర్తి ద్వారా రాయభారం నెరిపాడు. అంత డబ్బు తన వద్ద లేదని రైతు ఎంత వేడుకున్నా కనికరించలేదు. చివరకు ఈ విషయం మీడియాకు లీక్ కావడంతో చివరికి రూ.5 వేలు తీసుకుని పని పూర్తి చేశాడు. ● మండల పరిధిలోని పలు గ్రామాల్లో కోర్టు కేసులు ఉన్న చాలా భూములకు పట్టా మార్పులు అవుతున్నాయి. ఇందుకోసం సంబంధిత వ్యక్తుల నుంచి భారీగా డబ్బులు తీసుకుంటున్నాడు. తాను సేఫ్ సైడ్లో ఉండేందుకు ముందుగానే వారితో నోటరీ రాయించి తీసుకుంటున్నాడు. ● ఇటీవల కొత్లాపూర్ గ్రామంలోని అసైన్డ్ భూములను ప్రైవేటు వ్యక్తులకు పట్టా చేశాడు. ఇందుకోసం వారి నుంచి భారీగా డబ్బు తీసుకున్నాడు. ● నావంద్గీ ఇసుక రీచ్లో అనుమతుల చాటున అవినీతి పర్వం కొనసాగిస్తున్నాడు. నాలుగు ట్రాక్టర్లకు పర్మిట్లు ఇచ్చి పది ట్రాక్టర్ల ఇసుక తరలిస్తూ అంతా కలిసి సొమ్ము చేసుకుంటున్నాడు. ● నావంద్గీ, నీళ్లపల్లిలోని ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. తనకు కావాల్సింది తీసుకుంటున్న సదరు అధికారి.. సెలవు రోజుల్లో పని చేసుకోండి అంటూ మౌఖిక అనుమతులు ఇస్తున్నాడు. ● పాసుపుస్తకాలు బ్యాంకులలో తనఖా పెట్టిన వారి పేర్లపై ఉన్న భూములను యథేచ్ఛగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. ● సీలింగ్, అసైన్డ్, గైరాని భూముల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఇందులో సదరు పెద్ద సారుదే ప్రధాన పాత్ర అనేది బహిరంగ రహస్యం. ● కొర్విచెడ్, జీవన్గీ, ఎకా్మాయి, క్యాద్గీరా నాపరాతి గనుల్లో లీజులు లేని వారి నుంచి నెలనెలా మామూళ్లు తీసుకుంటూ అక్రమార్కులు గనులు తవ్వుకోవడానికి మద్దతు ఇస్తున్నాడు. డబ్బులు ఇవ్వని వారి గనులను సీజ్ చేయడం.. ఆ గనుల్లో నుంచి కోత యంత్రాలను కార్యాలయానికి తీసుకురావడం పరపాటిగా సాగుతోంది. పైసలిస్తేనే పని కదిలేది అవినీతి నిరోధక శాఖకు అందిన ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరిన నివేదిక -
ప్రజలు భయాందోళన చెందొద్దు
తాండూరు రూరల్: మండల పరిధిలోని మల్కాపూర్, సంగెంకలాన్ గ్రామస్తులు భయందోళన చెందవద్దని అటవీశాఖ తాండూరు సెక్షన్ ఆఫీసర్ ఫిర్యానాయక్ సూచించారు. మల్కాపూర్ శివారులోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ క్వారీలో చిరుతపులి పిల్ల సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం మల్కాపూర్లో సిమెంట్ ఫ్యాక్టరీ క్వారీ సమీపంతో పాటు సంగెంకలాన్ శివారులో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫిర్యానాయక్ మాట్లాడుతూ... తాండూరు ఫారెస్ట్ రేంజ్ అఽధికారిణి శ్రీదేవి సరస్వతి ఆదేశాల మేరకు మూడు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. చిరుతపులి పిల్ల సంచరిస్తే ట్రాప్ కెమెరాలు దృశ్యాలు నమోదు అవుతాయని చెప్పారు. అట్టి దృశ్యాల ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలపై చర్చిస్తామన్నారు. కార్మికులతో పాటు ఆయా గ్రామస్తులు చిరుతపులి పిల్ల కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అటవీశాఖ బీట్ ఆఫీసర్ మల్లయ్య, సిమెంట్ ఫ్యాక్టరీ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. అటవీశాఖ తాండూరు సెక్షన్ ఆఫీసర్ ఫిర్యానాయక్ -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
తాండూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రయ్య డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిత్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ... కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం సరికాదన్నారు. కార్పొరేట్ యాజమన్యాలకు అనుకూలంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ లేబర్ కోడ్లతో దేశంలో ఉన్న 55 కోట్ల మంది కార్మికుల ఆగ్రహానికి కేంద్ర ప్రభుత్వం గురికావడం తథ్యమన్నారు. న్యూ ఢిల్లీలో మంగళవారం జరిగే ఉమ్మడి కార్మిక సంఘాల జాతీయ సదస్సును విజయవంతం చేయాలన్నారు. అనంతరం సీసీఐ ఫ్యాక్టరీ జీఎంను కలిసి సీసీఐ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాన్యం వేజ్ బోర్డు ప్రకారం కార్మికులకు వేతనాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా గౌరవ అధ్యక్షుడు బాలశంకర్, నాయకులు రవీందర్, వంశీకృష్ణ, రెడ్డి సురేష్, దస్తప్ప, లాహేర్ బాషా, మోహన్, వెంకటేష్, దశరథ్గౌడ్, దస్తప్ప తదితరులు పాల్గొన్నారు.ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుచంద్రయ్య -
నేడు జెడ్పీ పాఠశాల వార్షికోత్సవం
బొంరాస్పేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం, పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాలను మంగళవారం నిర్వహించనున్నట్లు జీహెచ్ఎం, ఎంఈఓ హరిలాల్ తెలిపారు. మధ్యాహ్నం వీడ్కోలు కార్యక్రమంలో ప్రముఖ మానసికవేత్త, ప్రేరణ కర్త డాక్టర్ పి.లక్ష్మణ్ ప్రేరణ కార్యక్రమాలు, సాయంత్రం వార్షికోత్సవంలో జిల్లా కలెక్టర్, డీఈఓ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, పలువురు నేతలు హాజరుకానున్నారని చెప్పారు. విద్యార్థులచే సాంస్కృతిక ఉంటాయన్నారు. పేరొందిన పూర్వ విద్యార్థులకు సన్మానాలు, బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. 20న తైబజార్ వేలం కొడంగల్: మున్సిపల్ పరిధిలోని తైబజార్ (అంగడి బజార్)కు ఈ నెల 20న వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బాలరాం నాయక్ సోమవారం తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ముందగా రూ.50 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకోడానికి మంగళవారం చివరి రోజని చెప్పారు. చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ మాడ్గుల: మండల పరిధి కొల్కులపల్లిలో వైన్ షాప్లో చోరీకి పాల్పడిన నేనావత్ సాయికుమార్ను సోమవారం అరెస్టు చేశామని సీఐ వేణుగోపాలరావు తెలిపారు. జనవరి ఒకటిన మద్యం దుకాణంలో దొంగతనం చేశాడని, నిందుతున్ని మాడ్గుల ఎక్స్ రోడ్ వద్ద అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచామని సీఐ వివరించారు. ఇటుక బట్టీలపై విజిలెన్స్ దాడులు ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో ఇటుక బట్టీలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. వ్యవసాయ పొలాలకు వినియోగించే విద్యుత్ను, అక్రమంగా పరిశ్రమలకు వాడుతున్నారన్న సమాచారంతో విజిలెన్స్ ఏడీ మోషా ఆధ్వర్యంలో సోమవారం పలు చోట్ల దాడులు నిర్వహించారు. 5 చోట్ల కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. తప్పనిసరిగా కమర్షియల్ మీటర్లు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. -
ఎమ్మెల్యే నిధులతో సీసీ రోడ్డు పనులు
పూడూరు: మారుమూల గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని మేడిపల్లికలాన్ గ్రామంలో రూ.5లక్షల ఎమ్మెల్యే నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించేలా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో నా యకులు కృష్ణయ్య, సల్మాన్, సుధాకర్రెడ్డి, శ్రీధర్, రాంచంద్రయ్య, పాల్గొన్నారు. సమాచారం కోసం సంప్రదించండి జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి అనంతగిరి: వ్యవసాయ శాఖకు సంబంధించిన రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ, పీఎం కిసాన్ సమాచారం కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రైతుబీమా కోసం అనిల్కుమార్(జూనియర్ అసిస్టెంట్) 99892 91049, రైతుభరోసా–పీఎం కిసాన్ సమస్యల కోసం ప్రశాంత్(జూనియర్ అసిస్టెంట్) 90103 39211, రుణమాఫీ మిగతా స్కీంలకు తేజస్ నాయక్(జూనియర్ అసిస్టెంట్) 82473 73976లో సంప్రదించాలన్నారు. జిల్లాలోని రైతులు స్కీంలకు సంబంధించిన సమాచారం కోసం ఈ ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. కోలాటం కళాకారుల ఉత్తమ ప్రదర్శన పరిగి: మండల పరిధిలోని మిట్టకోడూర్ కోలాటం కళాకారులు ఉత్తమ ప్రతిభ చాటారు. ఆదివారం రాత్రి నగరంలోని రవీంద్ర భారతిలో ఉగాది పురస్కారాల కార్యక్రమంలో భాగంగా అభియాన్ ఆర్ట్స్ అకాడమి సహకారంతో కోలాటం ప్రదర్శించారు. దీంతో ఉత్తమ కోలాట ప్రదర్శించిన కళాకారులకు ఆకాశమే అధ్యక్షురాలు కవిత తదితరులు ప్రశాంసా పత్రాలను అందజేశారు. రవీంద్ర భారతిలో ఉత్తమ ప్రతిభ కబర్చిన కళాకారులకు గ్రామస్తులు, మండల వాసులు అభినందిస్తున్నారు. షాపింగ్కు వెళ్లొచ్చే సరికి చోరీ పూడూరు: రంజాన్ షాపింగ్కు వెళ్లి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులు దోచుకెళ్లిన సంఘటన చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుసూదన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండల కేంద్రానికి చెందిన పర్వీన్బేగం, అలీలు భార్యాభర్తలు. ఇరువురూ రంజాన్ పండుగ సందర్భంగా షాపింగ్ చేసేందుకు సోమవారం వికారాబాద్కు వెళ్లారు. తిరిగి సాయంత్రం వచ్చే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి, వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులో ఉన్న రూ.53,000 విలువగల బంగారు, వెండి ఆభరణాలు, కొంత నగదు పోయిందని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అడవిలో మంటలు పూడూరు: వేసవి కాలంలో అడవుల పరిరక్షణ చర్యలు చేపట్టడంలో అటవీ శాఖ అధికారులు విఫలమయ్యారు. వేసవిలో తరచూ అడవులు తగులబడి పోతాయని తెలిసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మండలంలోని తిర్మలాపూర్ అటవీ ప్రాంతం తగులబడిపోతున్నా ఫారెస్టు అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. స్థానిక నాయకులతో కలిసి మాజీ సర్పంచ్ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. గడ్డి పూర్తిగా ఎండిపోవడంతో మంటలు అదుపులోకి రాలేదు. వేసవిలో అటవీ ప్రాంతంలో కందకాలు ఏర్పాటు తవ్వించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. -
జ్వరమని వెళ్త్తే.. ప్రాణం తీశారు!
షాద్నగర్రూరల్: జ్వరం వచ్చి ందని ఆస్పత్రికి తీసుకెళ్తే.. వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేశంపేట మండలం కోనాయపల్లి గ్రామ పంచాయతీ పరిధి లచ్యానాయక్తండాకు చెందిన సామ్యనాయక్(50)కు జ్వరం వచ్చిందని కుటుంబ సభ్యులు ఈ నెల 14న పట్టణంలోని ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకువచ్చారు. అతన్ని పరీక్షించిన ఆర్ఎంపీ.. తాను నిర్వహిస్తున్న బాలాజీ ఆస్పత్రికి రిఫర్ చేశాడు. అనంతరం అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. సామ్యనాయక్కు డెంగీ ఉందని చెప్పారు. చికిత్స పొందుతున్న వ్యక్తికి.. ప్లేట్లెట్స్ క్రమంగా తగ్గుతుండటంతో.. మెరుగైన వైద్యంకోసం నగరానికి తీసుకెళ్తామని ఆస్పత్రి యాజమాన్యానికి కుటుంబీకులు చెప్పినా.. వినిపించుకోలేదు. ఇక్కడ మంచి వైద్యం అందిస్తామని చెప్పారు. ఈ క్రమంలో నాయక్ ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. గమనించిన వైద్యులు సీపీఆర్ చేశారు. రోగి మృతి చెందాడని తెలుసుకున్న వైద్యులు, యాజమాన్యం ఆస్పత్రి షట్టర్స్ను మూసి వేశారు. మృతుడి కుటుంబీకులు కిందకు వెళ్లి తిరిగి పైకి వచ్చే సరికి.. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఆందోళన సామ్యనాయక్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో మృతుడి కుటుంబీకులు, బంధువులు ఆదివారం అర్ధరాత్రి బాలాజీ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎలా తరలించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, బందోబస్తు నిర్వహించారు. సోమవారం ఉదయం మరోసారి ఆందోళన చేశారు. ‘మా నాన్న చావుకు ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే’ కారణమని మృతుడి కుమారుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నామని ఎస్ఐ రాంచందర్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కుటుంబీకులు, బంధువుల ఆరోపణ ఆస్పత్రి ఎదుట ధర్నా -
మానసిక క్షోభ భరించలేక..
దోమ: కూతురు, కొడుకు మరణంతో పన్నెండేళ్లుగా మానసిక క్షోభను అనుభవిస్తున్న మహిళ పురుగు మందు మృతిచెందింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లికి చెందిన దొబ్బలి మైబమ్మ(55) ఐదుగురు సంతానం. వీరిలో 12 ఏళ్ల క్రితం ఓ కుమార్తె, ఎనిమిదేళ్ల క్రితం ఓ కుమారుడు అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె మానసిక వేదనతో కుంగిపోతోంది. ఇరుగుపొరుగు వారితోనూ మాట్లాడకుండా ఇంట్లోనే కూర్చునేది. ఈ క్రమంలో ఆదివారం ఆమె పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబీకులు వెంటనే నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మైబమ్మ మృతి చెందారు. ఆమె కుమార్తె నాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పురుగుమందు తాగిన మహిళ చికిత్స పొందుతూ మృతి -
విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి
పూడూరు: విద్యార్థులు చిన్నప్పటి నుంచే పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని మండలంలోని మేడిపల్లికలాన్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శ్రీకాంత్ అన్నారు. సోమవారం ఎఫ్ఎల్ఎన్ పురస్కారాల్లో భాగంగా జిల్లా విద్యాఽశాఖ ఆధ్వర్యంలో చన్గోముల్ కాంప్లెక్స్ పరిధిలోని తొమ్మిది పాఠశాలల విద్యార్థులకు స్థానిక పాఠశాలలో క్విజ్ నిర్వహించారు. అంగడిచిట్టంపల్లి పాఠశాల విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు. అనంతరం క్విజ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రేరణ పురస్కార సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో మెంటర్లు నాగరాజు, నవీన్, రాకేష్, అభిల తదితరులు పాల్గొన్నారు. -
ఐసీడీఎస్ను నిర్వీర్యం చేస్తే సహించం
ఇబ్రహీంపట్నం రూరల్: అంగన్ కేంద్రాలను నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదని సీఐటీయూ జిల్లా కమిటీ హెచ్చరించింది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రాజ్యలక్ష్మి, కవితల ఆధ్వర్యంలో సోమవారం 48 గంటల దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజు, చంద్రమోహన్లు మాట్లాడుతూ.. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసి, పీఎం శ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను తీసుకురావాలని చూస్తుందని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధాన చట్టాన్ని అమలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. మూత పడనున్న ఐసీడీఎస్లు: పీఎం శ్రీ పథకం కింద ప్రీ ప్రైమరీ కేంద్రాలను 28 జిల్లాల్లో 56 కేంద్రాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, మొబైల్ అంగన్వాడీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి తెరలేపిందని ఆరోపించారు. తద్వారా ఐసీడీఎస్లు పూర్తిగా మూతపడే అవకాశం లేకపోలేదని, దీంతో పేద పిల్లలకు పౌష్టికాహారం దూరం కానుందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు అనేక హామీలను ఇచ్చి నేడు, విస్మరిస్తుందని విమర్శించారు. టీఏ, డీఏలు పెంచాలని, అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. బీఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీల బలోపేతానికి బడ్జెట్ కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్, జగన్, జిల్లా నాయకులు కిషన్, దేవేందర్ పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్దే రాత్రి బస 48 గంటలు దీక్షకు పిలుపునివ్వడంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రాత్రి కలెక్టరేట్ కార్యాలయం వద్దే బస చేశారు. అక్కడే వంటావార్పు చేశారు. రోడ్డుపైనే టెంట్ల కింద పడుకున్నారు. ఆట పాటలతో బతుకమ్మలు ఆడి సరదాగా గడిపారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కదిలేది లేదని స్పష్టంచేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ కలెక్టరేట్ ఎదుట 48 గంటల దీక్ష -
సరదాగా వెళ్లి అనంతలోకాలకు
దోమ: సరదా కోసం బయటకు వెళ్లిన ఓ బాలుడు అనంతలోకాలకు చేరాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బుద్లాపూర్ అనుబంధ గోన్యానాయక్తండాకు చెందిన శంకర్, కవితకు ఓ కొడుకు, కూతురు సంతానం. కుమారుడు బాలాజీ(13) పరిగి పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే స్నేహితులతో కలసి సరదాగా ఆడుకున్న అతను.. ఆదివారం పలువురితో కలిసి సరదాగా బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం వేళ అందరూ కలిసి బొంరాస్పేట్ మండలం ఏర్పుమల్ల సమీపంలోని కాకరణవేణి ప్రాజెక్టుకు చేరుకున్నారు. ఈత కొట్టేందుకు అందరూ కలిసి నీళ్లలోకి దిగారు. ఈత రాని బాలాజీ సైతం వీరిని అనుసరించి మునిగిపోయాడు. వెతికినా కనిపించకపోవడంతో మిగిలిన వారు ఇంటి బాట పట్టారు. సాయంత్రమైనా కుమారుడు ఇంటికి చేరకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఈక్రమంలో ప్రాజెక్టు వద్దకు వెళ్లినట్లు స్థానికులు చెప్పడంతో అక్కడికి చేరుకుని వెతికారు. అప్పటికే చీకటి పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం కుటుంబీకులు వెళ్లి చూడగా బాలాజీ శవమై తేలాడు. ఇది చూసిన తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. మృతదేహానికి పరిగి ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాకరణవేణి ప్రాజెక్టులో మునిగి బాలుడి దుర్మరణం గోన్యానాయక్ తండాలో విషాదం -
ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే కుట్ర
అనంతగిరి: అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట 48 గంటల ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీ య విద్యా విధానం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేయకుండా ఆపాలన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ పర్మినెంట్ చేయాలన్నారు. మినీ అంగన్వాడీ టీచర్లకు పది నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలన్నారు. రిటైర్డ్మెంట్ బెనిఫిట్ కల్పించాలన్నారు. ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ, కార్యదర్శి భారతి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మైపాల్, ఉపాధ్యక్షురాలు లక్ష్మి, నాయకులు వనజ, మంజుల, భారతి, ప్రమీల, సత్యమ్మ, విజయలక్ష్మి పాల్గొన్నారు. ● సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ -
●సమస్యల పరిష్కారానికి ఆందోళన
తాండూరు పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ సీపీఎం నాయకులు సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. పలు వార్డుల్లో తాగునీటి సమస్య, డ్రైనేజీ, విద్యుత్ వంటి సమస్యలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని నేతలు ఆరోపించారు. వెంటనే స్పందించకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్, నాయకులు రాజు, సురేష్, నారాయణ పాల్గొన్నారు. – తాండూరు టౌన్ -
అడ్డుకట్ట
అప్రమత్తతే.. సైబర్ నేరాలకు తాండూరు టౌన్: అప్రమత్తతతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక వినాయక కన్వెన్షన్ హాల్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వ్యాపారులు, పలు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన ఉంటే వాటి నుంచి రక్షించుకోవచ్చన్నారు. సైబర్ నేరాలు అనునిత్యం కొత్త రూపం దాల్చుకుని వ్యాపారులు, ఉద్యోగులు, రైతులు, ప్రజల నుంచి నగదును దోచేస్తున్నాయన్నారు. సైబర్ నేరగాళ్లు పలు రకాల ఆఫర్లు, ఈజీ మనీ వంటి వాటితో ప్రజలను తప్పుదోవ పట్టించి వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు సుమారు రూ.30వేల కోట్ల నగదును కొట్టేశారని, ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో సైతం రూ.6 వేల కోట్ల మేర నగదును అమాయకులు పోగొట్టుకున్నారని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా నంబర్, కేవైసీ, పొరపాటున ఖాతాలోకి నగదు జమ చేశామని, ఏటీఎం కార్డు అప్డేట్ చేయాలని, లోన్స్ ఇస్తామని, మీ పేరుపై వచ్చిన పార్శిల్లో డ్రగ్స్ ఉన్నాయని, మీకు సంబంధించిన వారు కేసులో ఇరుక్కున్నారని పలు రకాలుగా సైబర్ దాడులు జరుగుతున్నాయని అన్నారు. డిజిటల్ అరెస్టు అనేది ఎక్కడా లేదని, లోకల్ పోలీసులు మీపై కేసు నమోదయ్యిందని ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వరన్నారు. ఇలాంటి సైబర్ దాడుల నుంచి ప్రజలు తమ ను తాము రక్షించుకోవాలన్నారు. ఇందుకు నిర్లక్ష్యం, భయాన్ని వీడి, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రశాంత్రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి మాట్లాడా రు. సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరాలపై ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేపట్టాలన్నారు. ఒకవేళ సైబర్ నేరగాళ్ల చేతిలో పడి నగదు పోగొట్టుకుంటే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలన్నారు. దీనివల్ల కొట్టేసిన నగదును పలు బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ కాకుండా అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారో, అలాగే సైబర్ నేరగాళ్ల నుంచి జరిగే దాడులను కూడా అరికట్టుకోవచ్చని తెలిపారు. అవగాహ న అనేది ఒక టీకా లాంటిదని, అది ఎలాంటి ప్రమాదాలు దరిచేరకుండా రక్షిస్తుందన్నారు. అనంతరం సైబర్ నేరాల అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూరు అధ్య క్ష, కార్యదర్శులు డాక్టర్ జయప్రసాద్, డాక్టర్ అనిల్కుమార్, సీఐలు సంతోష్ కుమార్, నగేష్, ఎస్సైలు రమేష్, శంకర్ పాల్గొన్నారు. ఐవీఎఫ్ సేవలు అభినందనీయం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సేవలు అభినందనీయమని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక వినాయక కన్వెన్షన్ హాల్ లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐవీఎఫ్, తాండూరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పలువురు ఆటో డ్రైవర్లకు ఎస్పీ చేతుల మీదుగా యూనిఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐవీఎఫ్ పలు సామాజిక కార్యక్రమాలు, సహాయ సహకారాలు అందించడం హర్షణీయమన్నారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రొంపల్లి సంతోష్ కుమార్, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐలు సంతోష్ కుమార్, నగేష్, ఎస్సైలు రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలితాండూరు రూరల్: కొందరు కోట్ల రూపాయలు వెచ్చించి ఇల్లు కట్టుకుంటారని, వేల రూపాయల విలువ చేసే సీసీ కెమెరాలు పెట్టుకోరని ఎస్పీ నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని కరన్కోట్ పోలీస్స్టేషన్లో 88 సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెర వేయ్యి కళ్లతో సమానమన్నారు. ప్రతి గ్రామంలో, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్, ఎస్ఐ విఠల్రెడ్డి, ఏఎస్ఐ పవన్ పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్పీ నారాయణరెడ్డి -
ఎన్సీసీ యూనిట్ ఏర్పాటు చేయండి
కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి సంజయ్ సేత్ను కోరిన ఎంపీ కొండా అనంతగిరి: వికారాబాద్లో ఎన్సీసీ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి సంజయ్ సేత్ను కోరారు. సోమవారం ఢిల్లీలో ఆయన్ను కలసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించా రని ఎంపీ తెలిపారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, చేవెళ్ల నియోజకవర్గ విద్యార్థుల కోసం వికారాబాద్లో ఎన్సీసీ యూనిట్ను ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎన్సీసీతో క్రమశిక్షణ, దేశభక్తి తోపాటు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కూడా రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. గత ఏడాది ఈ విషయమై సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాయడం జరిగిందని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించారని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్రెడ్డి పరిగి: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ కొప్పు రాజశేఖర్రెడ్డి నియమితులయ్యారు. సోమవా రం పార్టీ రాష్ట్ర శాఖ ఎనిమిది జిల్లాలకు అధ్య క్షులను ప్రకటించింది. ఈ జాబితాలో రాజశేఖర్రెడ్డికి చోటు లభించింది. జిల్లా అధ్యక్ష పదవి కోసం పార్టీ సీనియర్ నాయకులు శివరాజ్, సదానందరెడ్డి, రమేష్, వడ్ల నందు, రాజశేఖర్రెడ్డి పోటిపడ్డారు. అదిష్టానం రాజశేఖర్రెడ్డి వైపు మొగ్గు చూపింది. ఇంటివద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు పరిగి: ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలు ఆర్టీసీ అందిస్తుందని రంగారెడ్డి రీజియన్ లాజిస్టిక్ ఏటీఎం రవీందర్ అన్నారు. సోమవారం పరిగి కార్గో కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రెండు దఫాలుగా భద్రాద్రి రా మయ్య ముత్యాల తలంబ్రాలను ఆర్టీసీ కార్గో భక్తులకు అందజేసిందన్నారు.భక్తులు రూ.151 చెల్లించి ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 6న సీతారాముల కల్యా ణం జరుగుతుందని.. ఏప్రిల్ 7వ తేదీ వరకు దగ్గరలోని కార్గో సెంటర్లో బుక్ చేసుకో వచ్చని తెలిపారు. గ్రూప్–3లో సత్తాచాటిన శ్రవణ్కుమార్ కుల్కచర్ల: తెలంగాణ గ్రూప్–3 ఫలితాల్లో కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లికి చెందిన శ్రవణ్కుమార్ సత్తాచాటారు. రెండు రోజులక్రితం విడుదలైన ఫలితాల్లో 208వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం శ్రవణ్ కుమార్ రంగారెడ్డి జిల్లా సాతంరాయి కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. -
అగ్గి.. బుగ్గి
వేసవిలో తరచూ అగ్ని ప్రమాదాలు ● కేర్లెస్ స్మోకింగ్ కూడా ఓ కారణం ● ఫైర్ సేఫ్టీ లేకుండానే విద్యా సంస్థలకు అనుమతులు ● తనిఖీలు చేయని అధికారులు వికారాబాద్: ఎండాకాలం వచ్చేసింది.. రోజురోజు కూ ఎండలు తీవ్ర రూపుం దాల్చుతున్నాయి. ఏటా వేసవిలో వందల సంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు కాలి బూడిదవుతున్నాయి. లక్షల్లో నష్టం వాటిళ్లుతోంది. మన జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో గడ్డి వాములు, వ్యవసాయ ఉత్పత్తులు, చేతికొచ్చిన పంట తగలబడటం చూ స్తూనే ఉన్నాం. వీటి నివారణకు అగ్నిమాపక అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. ముందస్తు జా గ్రత్తలు.. ప్రమాదాలు సంభవించే సమ యంలో తక్షణ చర్యలు తీసుకుంటే ప్రమాదస్థాయిని, ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నా రు. ప్రైవేటు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మించే సమయంలో ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆగ్నిమాపక శాఖ సర్టిఫికెట్లు లేకుండానే విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ఇతర సంస్థలు నిర్వహిస్తున్నారు. అధికారులు కూ డా సర్టిఫికెట్లు లేకుండానే అనుమతులు ఇస్తుండటం విమర్శలకు తావిస్తోంది. చాలా పాఠశాలల్లో.. జిల్లాలోని చాలా పాఠశాలలు, కళాశాలలు, సిని మా థియేటర్లు, గోదాములు, ఫంక్షన్ హాళ్లు, ఆస్పత్రులు, అపార్టుమెంట్లు ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. అగ్ని ప్రమాద నివారణ పరికరాలు కూడా అమర్చుకోవడంలేదు. జిల్లాలో దాదాపు 50 ప్రైవేటు పాఠశాలలు, 50 ఇంటర్, డిగ్రీ కళాశాలలు,10 సినిమా థియేటర్లు, 50 ఫంక్షన్ హాళ్లు, 200 పైచిలుకు ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో పది శాతం మినహా మిగి న వాటికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు లేకుండానే నిర్వహి స్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు చేయకుండా సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే హెచ్చరించే పరికరాలు, నియంత్రించే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ వీటిని ఎవరూ వినియోగించడం లేదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు ● స్కూళ్లు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్లో ఫైర్ అలారం, స్మోక్ డిటెక్టర్లను అమర్చుకోవాలి. ● సెల్లార్లలో ఆటోమెటిక్ స్పింక్లర్లు వాడాల్సి ఉంటుంది. ● స్కూళ్లు, ఆస్పత్రుల్లోకి, బయటకు వెళ్లే మార్గాల్లో అటంకాలు లేకుండా చూసుకోవాలి. ● ఇంటి నుంచి ఎక్కువ రోజులు బయటకు వెళ్లాల్సివస్తే ఎలక్ట్రిక్ మేయిన్ స్విచ్, గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. గ్యాస్ స్టౌ రెగ్యులేటర్ పైపును ఆరు నెలలకోసారి తప్పనిసరిగా మార్చాలి. మండుతున్న స్టౌలో కిరోసిన్ పోయరాదు. ● తాటాకులు, గడ్డి తదితర మండే పదార్థాలతో చేసిన పైకప్పులు స్కూళ్లు, ఆస్పత్రులకు వాడొద్దు. ● షాక్ సర్క్యూట్ బ్రేకర్స్ పరికరాలను అమర్చుకోవాలి. గోదాములు, గిడ్డంగుల్లో స్టాక్ను చెక్క స్లీపర్లపై నిల్వ చేసుకోవాలి. నీరు అగ్నిమాపక సాధనాలు అందుబాటులో ఉంచుకోవాలి. ● వేసవిలో సాధ్యమైనంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లోనే వంట చేసుకోవాలి. వంట సమయంలో కాటన్ దుస్తులు వాడటం మంచిది. ● కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గి పుల్లలు ఆర్పకుండా పడేయరాదు. ఇళ్లలో ఐఎస్ఐ మార్కింగ్ కలిగిన వైర్లను మాత్రమే వాడాలి. ● చిన్న పిల్లలకు అగ్గిపెట్టెలు, టపాకాయలు, లైటర్లు అందుబాటులో ఉంచకూడదు. ● పంట పొలాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. గడ్డి వాములు, పంట నూర్పిడులు, ధాన్యం తగలబడి భారీ నష్టానికి దారి తీస్తుంది. వీటి వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు గడ్డి వాములను ఆవాసాలకు దూరంలో ఉండేలా చూసుకోవాలి. గడ్డి వాములు ఒకదాని పక్కన ఒకటి ఉండకుండా ఏర్పాటు చేసుకోవాలి. అడవికి నిప్పుపెడితే చర్యలుధారూరు: ధారూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అడవిని కొంతమంది అక్రమార్కులు తగులబెట్టి సాగుభూమిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ధారూరు ఫారెస్టు రేంజర్ రాజేందర్ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అసైన్డ్ పట్టాల కోసం కొందరు అడవిని దగ్దం చేస్తున్నారని తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం రాత్రి ధారూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రాస్నం అడవికి కొంతమంది అక్రమార్కులు నిప్పు పెట్టినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారిపై చర్యలు ఉంటాయన్నారు. దోర్నాల్, పగిడ్యాల, కమాల్పూర్, రాస్నం, బాణాపూర్, బిజ్వారం, సంగాయపల్లితండా, తిమ్మాయపల్లి, అడాల్పూర్, జుంటుపల్లి, గంగాసాగర్ అటవీ ప్రాంతంలోకి రాత్రి వేళ అక్రమార్కులు ప్రవేశించి చెట్లకు నిప్పు పెడుతున్నారని పేర్కొన్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉంటాలని, ఇలాంటి వారిపై దృష్టి సారించాలని సూచించారు. అడవికి నిప్పు పెడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాలో 2022–24 మధ్య జరిగిన అగ్ని ప్రమాదాలుఏడాది జరిగిన ప్రమాదాలు నష్టం కోట్లలో ప్రాణ నష్టం 2022 154 4.17 10 2023 146 3.37 09 2024 147 3.04 06 అవగాహన ఉండాలి అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయి.. ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్త లు తీసుకోవాలి అనే విష యంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ఆగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, పెట్రోల్ బంకుల్లో మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం. స్కూళ్లు, ఆస్పత్రులు, గోదాములు, పెట్రోల్ బంకుల్లో అగ్ని ప్రమాదాలను నియంత్రించే సాధనాలను అమర్చుకోవా లి. జిల్లాలో చాలా వాటికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు లేవు. అలాంటి వాటికి నోటీసులు ఇస్తాం. – పూర్ణచందర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి -
సర్వేకు సహకరించాలి
సర్వేలో ప్రధానంగా శరీర భాగాలపై ఉండే తెల్ల, నల్ల మచ్చలతో పాటు ఇతర రకాల చారలు ఉన్నవారిని గుర్తిస్తారు. మచ్చలు ఉన్న చోట స్పర్శ లేకపోవటం లాంటి లక్షణాల ద్వారా లెప్రసీ రోగులను నిర్ధారిస్తారు. వెంటనే దగ్గరలోని పీహెచ్సీకి వివరాలు అందజేస్తారు. రోగ నిర్ధారణ తరువాత వారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే చికిత్స చేయిస్తుంది. ఈ క్రమంలో రోగులను గుర్తించటమే ప్రధాన అంశం. అందుకే సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఇంటికి వచ్చిన ఆరోగ్య సిబ్బందికి అవసరమైన వివరాలు అందజేయాలి. – డాక్టర్ రవీందర్ యాదవ్, జిల్లా లెప్రసీ నిర్మూలన అధికారి -
పన్ను వసూలుపై ఆగ్రహం
తాండూరు: మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్నుల వసూలు కోసమే బిల్ కలెక్టర్లు ఉన్నారని, కానీ వారు విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడం ఏంటని మున్సిపల్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ విక్రంసింహారెడ్డితో కలిసి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏడాది కాలంగా పన్నులు వసూలు చేసే అవకాశం ఉన్నా ఎందుకు వసూలు చేయలేదని ప్రశ్నించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సీరియస్ అయ్యారు. ఈ ఏడాది మున్సిపాలిటీలో కేవలం 33 శాతమే వసూలు చేయడం దారుణమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 100 శాతం పన్ను వసూలు చేయాలని హెచ్చరించారు. అనంతరం సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు దుకాణ సముదాయాలకు వెళ్లి పన్నులను వసూలు చేశారు. బిల్ కలెక్టర్లు ఏం చేస్తున్నారు? సమీక్ష సమావేశంలో మున్సిపల్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ మండిపాటు -
హైవేపై కూలిన మర్రిచెట్లు
చేవెళ్ల: హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై రెండు చోట్ల ప్రమాదవశాత్తు రెండు మర్రిచెట్లు విరిగి పడ్డాయి. ఈ సంఘటనలు చేవెళ్ల మండలం ఖానాపూర్ బస్టేజీ సమీపంలో ఒకటి, ఆలూరు బస్టేజీ సమీపంలో మరొకటి చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం స్వల్ప వ్యవధిలో రెండు చోట్ల చెట్లు కూలిపోయాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎలాంటి వాహనాలు పరుగు తీయకపోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. మరోమార్గం లేకపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్ఐ శంకరయ్య, ఏఎస్ఐ చందర్నాయక్లు సిబ్బంది, స్థానికుల సహాయంతో జేసీబీతో చెట్లను పక్కకు తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేయించారు. ఈ మర్రి చెట్లు మొదళ్లు కాలిపోయి ఉండటంతో గాలి వీచిన సమయంలో ఇలా రోడ్డుపై పడిపోతున్నాయని, వాహనదారులు చెట్ల కింద ప్రయాణం చేసే సమయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలని పోలీసులు సూచించారు. తప్పిన ప్రమాదం, ట్రాఫిక్ అంతరాయం -
హెచ్ఎండీఏలోకి మోమిన్పేట గ్రామాలు
హెచ్ఎండీఏ పరిధిలోకి వెళ్లనున్న చీమల్దరి గ్రామం మోమిన్పేట: హెచ్ఎండీఏ పరిధిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఆర్ఆర్ఆర్ వెంబడి రెండు కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న గ్రామాలను హెచ్ఎండీఏ ఆధీనంలోకి తేనున్నారు. ఈ క్రమంలో మోమిన్పేట పరిధిలోని చీమల్దరి, దేవరంపల్లి, చక్రంపల్లి, బాల్రెడ్డిగూడెం గ్రామ పంచాయతీలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తున్నాయి. దీంతో డీటీపీసీ పరిధి నుంచి లేఅవుట్లు హెచ్ఎండీఏ పరిధిలోని వెళ్లనున్నాయి. గ్రామాల అభివృద్ధికి మరిన్ని నిధులు అదనంగా రానున్నాయి. దీంతో రైతుల భూములు మరింత పెరగనున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 80 శాతం అమ్ముకున్న భూములు ఈ నాలుగు గ్రామ పంచాయతీలలో రెండు సంవత్సరాల క్రితమే 80శాతం వరకు భూములను రైతులు అమ్ముకున్నారు. అప్పట్లోనే ఎకరా రూ.కోట్లల్లో పలికింది. ప్రస్తుతం రియల్ నేల చూపులు చూడటంతో ఽఅమ్మకాల, కొనుగోలులు నిలిచిపోయాయి. రైతుల వద్ద కేవలం 20శాతం భూమి మాత్రమే మిగిలి ఉంది. హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తే భూములు ధరలు పెరగనున్నాయని స్థిరాస్తి వ్యాపారులు పేర్కొంటున్నారు. అభివృద్ధి వేగవంతం అవుతుందని స్థానికుల సంబురం -
పంచాయతీ కార్మికుడి మృతి
వాటర్ ట్యాంక్లో పడితాండూరు రూరల్: ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంక్లో పడి ఓ పంచాయతీ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కరన్కోట్ గ్రామంలో చోటు చేసుకుంది. కరన్కోట్ ఎస్ఐ విఠల్రెడ్డి, గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మ్యాతరి లక్ష్మప్ప(42) ఏడేళ్ల నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మల్టీపర్పస్ వర్కర్గా పని చేస్తున్నారు. అప్పుడప్పడు ఆయన వాటర్ ట్యాంక్ను శుభ్రం చేసేవాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి.. రాత్రయినా తిరిగి రాలేదు. దీంతో ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. ఆదివారం ఉదయం గ్రామంలోని పంచాయతీకి చెందిన బంగారమ్మ తాగునీటి ట్యాంక్పైన లక్ష్మప్ప బట్టలు కనిపించాయి. వెంటనే వెళ్లి చూడగా వాటర్ ట్యాంక్లో విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అప్పటికే లక్ష్మప్ప మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి మృతి చెందాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఓ కూతురు ఉంది. శుభ్రం చేయించాం కరన్కోట్ గ్రామంలోని బంగారమ్మ గుడి వద్ద ఉన్న తాగునీటి వాటర్ ట్యాంక్ 60 వేల నీటి సామర్థ్యం కలదని గ్రామస్తులు తెలిపారు. అయితే ఈ ట్యాంక్ నుంచి జయశంకర్ కాలనీతో పాటు సీసీఐ కాలనీకి నీటి సరఫరా అవుతుంది. శనివారం రాత్రి పంచాయతీ కార్మికుడు ట్యాంకులో పడి మృతి చెందాడు. మృతదేహం నిల్వ ఉన్న నీరు ఆదివారం ఉదయం సరఫరా కావడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి ఆనంద్రావును వివరణ కోరగా.. ట్యాంక్ను శుభ్రం చేయించామన్నారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఆ నీటిని తాగామని గ్రామస్తుల భయాందోళన కరన్కోట్లో ఘటన -
ఇఫ్తార్ విందులో స్పీకర్
అనంతగిరి: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాలులో వ్యాపారవేత్త తన్వర్అలీ ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. రంజాన్ ఉపవాసాల సందర్భంగా స్పీకర్ ముస్లిం సోదరులకు ఖర్జురాలు తినిపించి దీక్షను విరమింపజేశారు. ప్రతి ఒక్కరూ ఆహ్లాద వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు. 26న వాహనాల వేలం ఎస్పీ నారాయణరెడ్డి అనంతగిరి: జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో పేరుకుపోయిన 148 గుర్తు తెలియని వాహనాలను ఈ నెల 26న వేలం వేయనున్నట్లు ఆదివారం జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లా పోలీస్ కేంద్రంలో భద్రపర్చిన ఈ వాహనాలను పోలీస్ చట్టం 1861లోని సెక్షన్ 26 ప్రకారం బహిరంగ వేలం వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఏదైన వాహనంపై ఎవరికై న అభ్యంతరం, యాజమాన్య హక్కులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం వాహనాల వేలం కమిటీ చైర్మన్, జిల్లా అదనపు ఎస్పీ టీవీ హన్మంత్రావును ఫోన్లో 87126 70012 సంప్రదించాలని వివరించారు. రక్త మైసమ్మ సేవలో మండలి చీఫ్ విప్ తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం మారెపల్లి గేటు వద్ద ఉన్న రక్త మైసమ్మ జాతరలో మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలో ఉన్న కేజీబీవీ పాఠశాల విద్యార్థినులతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శాలువతో మహేందర్రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తాం తాండూరు రూరల్: మండల పరిధిలోని మల్కాపూర్ శివారులోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలోని క్వారీలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ ఫిర్యానాయక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల క్వారీలో చిరుతపులి పిల్ల సంచారిస్తోందన్న ప్రచారంపై ఆయన స్పందించారు. మల్కాపూర్తో పాటు సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. చిరుతపులి పిల్ల కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బెల్కటూర్ సమీపంలో కూడా ఎలుగుబంటి సంచరిస్తోందన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పీఏసీఎస్ చైర్మన్కుసేవా వైభవ రత్న అవార్డు కొడంగల్: కొడంగల్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ కటుకం శివకుమార్ గుప్తాకు సేవా వైభవ రత్న అవార్డును ఆదివారం ప్రదానం చేశారు. హైదరాబాద్లోని సర్ సీవీ రామన్ అకాడమి(సేవా సాంస్కృతిక సంస్థ) రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం అవార్డును అందజేశారు. ఉగాది మహోత్సవ సువర్ణ ఘంటా కంకణ గోల్డ్ మెడల్స్ అవార్డుల సంబరాల సందర్భంగా హైదరాబాద్లోని హరిహర కళాభవన్లో సేవా వైభవ రత్న అవార్డును సీవీ రామన్ అకాడమి అధ్యక్షుడు డా.విజయ్కుమార్, చాముండేశ్వర మహర్షి, వెంకటేశ్వర్రావు చేతుల మీదుగా అందుకున్నారు. శివకుమార్ గుప్తా ప్రస్తుతం పీఏసీఎస్ చైర్మన్గా, ఆర్యవైశ్య సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. లయన్స్క్లబ్, బాధ్యత సేవా సంస్థల్లో ప్రతినిధిగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. -
నిశ్చితార్థం రద్దు చేయించి..
మీర్పేట: ప్రేమించానని ఏడేళ్లుగా వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, యువతి నిశ్చితార్థాన్ని సైతం రద్దు చేయించాడు. ఆపై ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధిత యువతి, మహిళా సంఘాల సహాయంతో కుటుంబ సభ్యులతో కలిసి యువకుడి ఇంటి ఎదుట ధర్నా చేశారు. ఈ సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లెలగూడకు చెందిన ఓ యువతి(28) ని మీర్పేట ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీకి చెందిన పూర్ణేశ్వర్రెడ్డి(28) ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని గతంలో ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేయించాడు. ఆమెతో చనువుగా ఉంటూ.. ఇంట్లో వారికి, బంధువులకు పరిచయం చేశాడు. కానీ ఆ తరువాత యువకుడికి గుట్టుచప్పుడు కాకుండా.. మరో యువతితో పెళ్లి చూపులు జరిగాయి. విషయం తెలుసుకున్న యువతి నిలదీయడంతో కులం వేరు కావడంతో మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని సమాధానం చెప్పాడు. దీంతో సదరు యువతి న్యాయం చేయాలంటూ ఆదివారం పూర్ణేశ్వర్రెడ్డి ఇంటి ఎదుట బంధువులతో కలిసి ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పెళ్లిచేసుకుంటానని మోసం చేసిన ప్రేమికుడు యువకుడి ఇంటి ఎదుట ధర్నా, అట్రాసిటీ కేసు నమోదు -
లింకురోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలి
చేవెళ్ల: పెండింగ్లో ఉన్న రేగడిఘనాపూర్–చనువెళ్లి లింక్రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయించాలని పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డికి ఎమ్మెల్సీ, చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి సూచించారు. మండలంలోని రేగడిఘనాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకుడు రఘువీర్రెడ్డి కాలికి గాయమై విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న చీఫ్ విప్ మహేందర్రెడ్డి ఆదివారం ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఆయనను గ్రామ నాయకులు కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గ్రామం నుంచి చనువెళ్లి లింక్రోడ్డుకు మంత్రిగా ఉన్న సమయంలో రూ.80లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఆ పనులు ఆలస్యమవుతున్నాయని గ్రామస్తులు ఆయనకు తెలిపారు. వెంటనే ఆయన పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ రోడ్డుపై ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన నిధులు రిజెక్ట్ అయ్యాయని, మరోసారి ప్రతిపాధనలు పంపాలని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఆయన స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో మాట్లాడి మంత్రి శ్రీధర్బాబుతో చర్చించి ఈ ప్రాంతంలో ఇలా మిగిలిపోయిన బ్రిడ్జిలకు సంబంధించి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. రోడ్డు పనులు త్వరగా ప్రారంభించాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు శ్రీరామ్రెడ్డి, శ్రీధర్రెడ్డి, నర్సింహారెడ్డి, వెంకట్రెడ్డి, చంద్రయ్య తదితరులు ఉన్నారు. చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి -
స్వయం సేవకులు పెరగాలి
ఆర్ఎస్ఎస్ వక్తి, విభాగ్ సహకార్య వాహ సూర్యనారాయణ మూర్తి పరిగి: స్వయం సేవకుల సంఖ్య పెరగాలని ఆర్ఎస్ఎస్ వక్తి, విభాగ్ సహకార్య వాహ సూర్యనారాయణ మూర్తి అన్నారు. ఆదివారం పరిగి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్లలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో పరిగి ఖండ సంఘ్ చాలక్ కె.బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మాధవ శాఖ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఆర్ఎస్ఎస్ను ఉద్దేశించి మాట్లాడారు. ఆర్ఎస్ఎస్తోనే వ్యక్తి పరివర్తన సాధ్యమవుతుందన్నారు. దేశ వ్యాప్తంగా శాఖ కార్యక్రమాల ద్వారా హిందూ సమాజంలో సమరసత, అనుశాసనం, శీల నిర్మాణం జరుగుతుందన్నారు. స్వయం సేవకుల ద్వారా నిర్వహించబడే వేలాది విద్యాలయాలు, అన్ని క్షేత్రాల్లోని లక్షలాది సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయని చెప్పారు. దీంతో సంఘం పట్ల సంపూర్ణ సమాజం యొక్క విశ్వసం పెరుగుతుందని తెలిపారు. స్వయం సేవకుల సంఖ్య పెరిగే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి గోపాల్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో ఆరాధనోత్సవాలు
కొడంగల్ రూరల్: పట్టణంలోని శ్రీనిరంజన మఠంలో ఆదివారం వీరశైవ సమాజం భక్తుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు మఠం మల్లికార్జునస్వామి, గడ్డం చంద్రశేఖర్స్వామి, మఠం విజయకుమార స్వామిలు వీరశైవ సమాజం సభ్యులచే ఆరాధనోత్సవాల్లో భాగంగా శ్రీస్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధం, సుగంధ ద్రవ్యాలతో బసవలింగేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా నమక చమక అధ్యాయాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. బిల్వాష్టకం, శివాష్టకం, అష్టోత్తర శతనామావళితో పూజలు నిర్వహించారు. దూప, దీప నైవేద్యాలను సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీనిరంజన మఠం పీఠాధిపతులు డాక్టర్ సిద్ధలింగ మహాస్వామి వారికి వీరశైవ సమాజం భక్తులు పాదపూజ చేశారు. నిరంజన మఠంలో బసవలింగేశ్వర స్వామివారి పల్లకీ సేవ నిర్వహించారు. పల్లకీ సేవ ముందు భక్తులు ఖడ్గాలు వేస్తూ స్వామివారిని స్మరించుకున్నారు. పురోహితులు భక్తులకు తీర్థప్రసాదాలు అందిస్తూ ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గురునాథ్రెడ్డి శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠాధిపతులు శ్రీజగద్గురు డాక్టర్ సిద్ధలింగ మహాస్వామివారు రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గురునాథ్రెడ్డిని సన్మానించారు. పట్టణంలోని శ్రీమహాదేవుని ఆలయ భజన మండలి సభ్యులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం నియోజకవర్గ అధ్యక్షుడు కొవూరు విజయవర్దన్, సమా జం సభ్యులు బిఆర్ విజయకుమార్, గంతల సంఘమేశ్వర్, బాలప్రకాశ్, తారాపురం రవి, గంటి సర్వేష్, రాకేష్, నాగభూషణం పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన వీరశైవ సమాజం భక్తులు స్వామివారి సేవలో పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్రెడ్డి -
ఎమ్మార్పీఎస్ దీక్షకు బీఆర్ఎస్ సంఘీభావం
శంషాబాద్ రూరల్: మాదిగల రిజర్వేషన్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదివారం శంషాబాద్ బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షను చేపట్టారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్రావు దీక్షాస్థలికి చేరుకుని సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల రిజర్వేషన్ల పట్ల దోబూ చూలాడుతోందని విమర్శించారు. దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించకుండా కొన్ని వర్గాలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్, జయమ్మ, కె.శ్రీనివాస్, రాజేందర్, అశోక్, చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు. -
నేడు కరన్కోట్కు ఎస్పీ రాక
తాండూరు రూరల్: మండల పరిధిలోని గౌ తపూర్ సమీపంలో ఉన్న కరన్కోట్ పోలీస్స్టేషన్కు సోమవారం జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి వస్తున్నట్లు ఎస్ఐ విఠల్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాండూరు మండలంలోని గౌతపూర్ నుంచి కోత్లాపూర్, గౌతపూర్ చౌరస్తా నుంచి ఓగిపూర్ వరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభిస్తారని తెలిపారు. ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి దోమ: ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలర్చుకోవాలని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం దోమ మండల పరిధిలోని మైలారం గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలంతా భక్తిభావంతో మెలగాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ విడుదల సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ అనంతగిరి: తెలంగాణ రాష్ట్రంలో భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెటింగ్ సిమెంట్ 5 స్టార్ గ్రేడ్ను ఆదివారం విడుదల చేశారు. వికారాబాద్లోని శ్రీగురుకృపా ఏజెన్సీస్ డీలర్ షాప్లో నిర్వహించిన తాపీ మేసీ్త్రల సమావేశంలో సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ ప్రసంగించారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందన్నారు. అల్ట్రాఫాస్ట్తో బ్రిడ్జిలు, పిల్లర్లు, స్లాబ్లు, రహదారులకు సరైన ఎంపికవుతుందన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందిస్తామని, స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకు వచ్చి సహాయపడతారని ఆయన సూచించారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లకన్నా కేవలం రూ. 20 ఎక్కువ ఉంటుందని, నాణ్యతను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీలర్ జగదీశ్, భారతి సిమెంట్ టెక్నికల్ బృందం సభ్యులు పాల్గొన్నారు. అదృశ్యమైన వ్యక్తిమృతదేహం లభ్యం ఇబ్రహీంపట్నం: కనిపించకుండా పోయిన యువకుడి మృతదేహం ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో లభ్యమైంది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సింగారం మధు(24), శుక్రవారం నుంచి కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద కుటుంబీకులు ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో తండ్రి జ్ఞానేశ్వర్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం స్థానిక పెద్ద చెరువు తూము వద్ద మధు చెప్పులు, పర్సు, ఐడీ కార్డు, సెల్ఫోన్ను స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. డీఆర్ఎఫ్ బృందం చెరువులో గాలించి మధు మృతదేహాన్ని వెలికితీశారు. అవివాహితుడైన యువకుడి మరణానికి కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మృతుడు రెండు నెలలుగా విధులకు హాజరు కావడంలేదని మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్ తెలిపారు. -
సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలి
మైలార్దేవ్పల్లి: అనాథలు, వృద్ధులు, మానసిక దివ్యాంగులకు తోడ్పాటు అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నామని మానవ సేవే మాధవ సేవా సంస్థ చైర్మన్ ఏర్వ కుమారస్వామి అన్నారు. ఆదివారం మేడిపల్లిలో గల అమ్మ ఆసరా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సహకరించిన ఆశ్రమ నిర్వాహకులు మేఘన్, విజయలక్ష్మి, శివలను సంస్థ ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్వ కుమారస్వామి మాట్లాడుతూ.. సమాజంలో సేవ చేయడం అందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు కొంపల్లి జగదీష్, గొంత్యాల శ్రీనివాస్, దినేష్, హేమలత, లక్ష్మి, అనిత తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక చింతన అవసరం: సిద్ధలింగ మహాస్వామి
ప్రతిఒక్కరూ కొంత సమయాన్ని ఆధ్యాత్మిక చింతన కోసం కేటాయించాలని, మనసుకు ప్రశాంతత చేకూరుతుందని శ్రీజగద్గురు నిరంజన మఠం పీఠాధిపతులు డాక్టర్ సిద్ధలింగ మహాస్వామి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీజగద్గురు నిరంజన మఠంలో స్వామివారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు ప్రవచనాలు అందించారు. ప్రతిఒక్కరూ భక్తి, ధ్యానం, భగవత్ చింతన అలవర్చుకుంటే ఆరోగ్యంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. భక్తితో దేన్నైనా సాధించొచ్చన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ, ధర్మాన్ని పరిరక్షిస్తూ సమాజ అభివృద్ధికి కృషిచేయాలని తెలిపారు. నిర్మలమైన మనసుతో భగవంతుడిని ఆరాధిస్తే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు పాల్గొన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
మైలార్దేవ్పల్లి: ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ యువజన విభాగం డివిజన్ అధ్యక్షుడు అక్కెం రాఘవేందర్యాదవ్ అన్నారు. శివాజీ చౌక్ సర్కిల్ వద్ద ఆదివారం కేటీఆర్, జగదీశ్వర్రెడ్డి దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు కావస్తున్న కూడా అభివృద్ధిపై దృష్టి సాధించకపోవడం సిగ్గుచేటన్నారు. సచివాలయం ప్రాంగణంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్కే దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. -
చిన్నవాటికే మనస్పర్థలు
దంపతుల మధ్య స్వార్థం పెరిగింది. ఈగో.. చిన్నచిన్న అంశాలకే గొడవపడుతున్నారు. కుటుంబ జీవి తంపై కనీస అవగాహన ఉండడం లేదు. పెళ్లి తర్వా త భర్త తరపు తల్లిదండ్రులు, ఇతర బంధువులను భార్య దూరం చేస్తోంది. భార్య తరపు బంధువులను భర్త దూరం పెడుతున్నారు. అమ్మాయి సున్నితంగా ఉంటే అబ్బాయి తరపు బంధువులు డామినేట్ చేస్తున్నారు. అబ్బాయి మెతకగా కన్పిస్తే అమ్మాయి తరపు బంధువులు వేధిస్తున్నారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు చెప్పినా వినడం లేదు. సఖి కేంద్రానికి వస్తున్న కేసుల్లో మెజార్టీ ఈ తరహాకు చెందినవే. నిజానికి వీరికి పెళ్లికి ముందే కౌన్సెల్సింగ్ ఇవ్వాల్సి ఉంది. – వి.జోత్స్న సీడీపీఓ, సఖికేంద్రం, వనస్థలిపురం ● -
ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలను అమల్లోకి తెచ్చింది. అయి నా హింస ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గృహ హింసకు గురయ్యే వారి కోసం 181 కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. బాధితులు స్వయంగా ఫోన్ చేసి రక్షణ పొందొచ్చు. బాధితులకు రక్షణ కల్పించి, కౌన్సెలింగ్ ద్వారా కాపురాలను నిలబెట్టేందుకు సఖి కేంద్రాలను ఏర్పాటు చేసింది. వనస్థలిపురం, శంషాబాద్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. వనస్థలిపురం సఖి కేంద్రంలో ఇప్పటివరకు 881కేసులు రాగా, 186 మినహా అన్నీ పరిష్కరించాం. శంషాబాద్ కేంద్రానికి 91కేసులు రాగా, 64 మినహా అన్ని కేసులు పరిష్కరించాం. – సంధ్యారాణి, మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి -
విద్యతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
మొయినాబాద్రూరల్: విద్యార్థులు విద్యతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎ.నరేంద్రకుమార్ పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని ఎన్కెపల్లి సమీపంలో గల భాస్కర విద్యా సంస్థల్లో 25వ వార్షికోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నరేంద్రకుమార్తో పాటు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో రూపేష్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కమాండ్ ఇంటెలిజెన్స్ అధికారి మేజర్ కునాల్సింగ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం నరేంద్రకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు పౌష్టికాహారం, సరిపడా నిద్ర, వ్యాయామం ఎంతో అవసరం అని అన్నారు. పట్టుదల, కృషి ఉంటే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చని తెలిపారు. రూపేష్, మేజర్ కునాల్సింగ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరం అన్నారు. అనంతరం విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. కళాశాల కార్యదర్శి కృష్ణారావు,బీఎంసీ డైరెక్టర్ దీపిక పాల్గొన్నారు. -
రైతులకు పరిహారం చెక్కులు అందజేత
అనంతగిరి: దుద్యాల్ మండలం హకీంపేట్లో పారిశ్రామిక పార్క్ కోసం భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రైతులకు శనివారం కలెక్టర్ ప్రతీక్జైన్ తన కార్యాలయంలో పరిహారం చెక్కులు అందజేశారు. గ్రామ సర్వే నంబర్ 252లో 31 మంది రైతులకు చెందిన 55.35 ఎకరాల భూమిని పారిశ్రామిక పార్క్ కోసం సేకరించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ రైతులకు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. హక్కులపై అవగాహన కల్పిస్తున్నాం అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అనంతగిరి: వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల హక్కులు, స్థిరమైన జీవన విధానికి న్యాయమైన ప్రవర్తన అనే అంశంపై అధికారులు, వినియోగదారులకు పలు సూచనలు చేశారు. వస్తు కొనుగోలులో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకవేళ మోసానికి గురైతే ఎక్కడ ఫిర్యాదు చేయాలో వివరించారు. అన్ని రకాల దుకాణాలను తూనికలు, కొలతల శాఖ అధికారులు తనికీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీసీఎస్ఓ మోహన్బాబు. డీఎల్ఎంఓ రియాజ్, కలెక్టరేట్ ఏఓ ఫరీనాఖాతూన్ తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తగా ఉండండి అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి సరస్వతి తాండూరు రూరల్: మండలంలో ఎలుగుబంటి, చిరుతపులి పిల్ల సంచరిస్తున్నందున ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని తాండూరు అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీదేవి సరస్వతి సూచించారు. శనివారం మండలంలోని బెల్కటూర్, మల్కాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మల్కాపూర్ శివారులో చిరుతపులి పిల్ల తిరుగుతున్నట్లు కార్మికుల నుంచి తమకు సమాచారం వచ్చిందన్నారు. అక్కడి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి క్వారీ సమీపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే బెల్కటూర్ సమీపంలో ఎలుగుబంటి సంచరిస్తోందని తెలిపారు. అక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పాలిషింగ్ యూనిట్ నిర్వాహకులను కోరినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక తాండూరు: తాండూరు బ్రాహ్మణ అర్చక, పురోహిత సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పురందరాచార్ శుక్రవార్, కార్యదర్శిగా సుధీంద్రాచారి, సహ కార్యదర్శిగా నాగరాజ్, కోశాధికారిగా సుమన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. కార్యవర్గం కాలపరిమితి 2025 నుంచి 28 వరకు ఉంటుందని పేర్కొన్నారు. -
అప్రమత్తతే రక్ష
ఎండలు ముదురుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు అవసరం వికారాబాద్: ‘ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. లేకుంటే వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది.. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం’.. అని డీఎంఅండ్ హెచ్ఓ వెంకటరవణ అన్నారు. ఎండల నుంచి ఎలా ఉపశమనం పొందాలి.. వడదెబ్బ బారిన పడుకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. శాఖా పరంగా తీసుకుంటున్న చర్యలను శనివారం ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆయన మాటల్లోనే.. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దు పదిహేను రోజులుగా ఎండలతోపాటు వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సూచనలతో శాఖా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వడదెబ్బకు గురయ్యే సమయంలో చేయాల్సిన ప్రథమ చికిత్స, చేయకూడని పనులపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో 720 మంది ఆశా వర్కర్లు పనిచేస్తుండగా ప్రతి ఒక్కరి వద్ద వంద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 200ల చొప్పున అందుబాటులో ఉన్నాయి. ఉపాఽధి హామీ పనులు జరిగే ప్రదేశంలో కూడా వీటిని అందుబాటులో ఉంచాం. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు. వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఉదయం 11నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు రాకపోవడం మంచింది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. ఇందులో భాగంగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పీహెచ్సీ వైద్యులు, పట్టణ, పల్లె, బస్తీ దవాఖానాల్లో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఒకవేళ ప్రజలు వడదెబ్బ బారిన పడితే ఎలాంటి వైద్యం చేయాలి.. ఏ ఆస్పత్రికి తరలించాలి.. అనే విషయాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖ పరంగా తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాం. వేసవిలో చేయకూడని పనులు ● సాధ్యమైనంత వరకు మండుటెండలో తిరగరాదు. అత్యవసరం ఉంటే తగు జాగ్రత్తలతో బయటకు వెళ్లాలి. ● ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మద్యానికి దూరంగా ఉండటం మంచిది. మద్యం సేవించడం వల్ల డీ హైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. ● రోడ్ల పక్క విక్రయించే రంగుల శీతల పానీయాలను తాగకపోవడం మంచిది. కలుషిత ఆహారం కూడా తీసుకోరాదు. ● మాంసాహారం తగ్గించడం మంచిది.. రోజువారి ఆహారంలో పళ్లు, కూరగాయలు, నీటి శాతం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇవి చేస్తే మేలు ● నీటితోపాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ● ఆహారం మితంగా తీసుకోవాలి. ● రోజుకు కనీసం 12నుంచి 15 గ్లాసుల నీరు తాగాలి. ఇలా చేయడం ద్వారా వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండదు. ● వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు రోజుకు రెండు పూటలా స్నానం చేయాలి. కాటన్, పలచటి దుస్తులు, లేతవర్ణం దుస్తులు ధరించాలి. ● దోమతెరలు కచ్చితంగా వాడాలి.. ● సాధ్యమైనంత వరకు ఇళ్లలో ఉండాలి. బయటకు వస్తే గొడుగు, టోపీ లాంటివి వాడాలి. వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన చర్యలు వడదెబ్బకు గురైతే వెంటనే ప్రథమ చికిత్స చేసి దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ప్రథమ చికిత్సలో భాగంగా వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడ ప్రదేశంలోకి చేర్చాలి. చల్లని ఫ్యాన్ గాలి తగిలేలా చూడాలి. తడి క్లాత్తో తుడవాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు తుడవాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా.. ఉప్పు కలిపిన గ్లూకోస్ నీరు.. ఓఆర్ఎస్ వాటర్ తాగించాలి. ఒకవేళ వడదెబ్బకు గురై అపస్మారకస్థితిలోకి చేరిన వ్యక్తికి నీరు తాగించరాదు. వీలైనంత తొందగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లాలి. ఇలాంటి చర్యలతో వడదెబ్బకు గురైన వారిని కాపాడుకోవచ్చని జిల్లా వైద్యాధికారి వెంకటరావణ తెలిపారు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవాలి ఉదయం 11నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇంట్లో ఉంటేనే సేఫ్ వైద్య ఆరోగ్య శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ‘సాక్షి’తో జిల్లా వైద్యాధికారి వెంకటరవణ -
‘పది’ పరీక్షలకు వేళాయె!
ఈ నెల 21నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు టెన్త్ ఎగ్జామ్స్ ● ఏర్పాట్లలో నిమగ్నమైన విద్యాశాఖ ● జిల్లాలో 69 పరీక్ష కేంద్రాలు, 12,901 మంది విద్యార్థులు ● ఠాణాలకు చేరిన ప్రశ్న పత్రాలు తాండూరు: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 21నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది చోటుచేసుకున్న పేపర్ లీకేజీ వంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 307 పాఠశాలలు ఉండగా 12,901 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 6,452 మంది బాలికలు, 6,449 మంది బాలురు ఉన్నారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాకు చేరిన ప్రశ్నపత్రాలు పదో తరగతి ప్రశ్న పత్రాలు జిల్లాకు చేరాయి. శనివారం వాటిని ఆయా కేంద్రాల సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించి భద్రపరిచారు. మరికొన్ని సబ్జెక్టులకు సంబంధించిన పేపర్లు రావాల్సి ఉంది. మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. పరీక్షల నిర్వహణకు 920 మంది అధికారులు జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు 920 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. 8మంది కస్టోడియన్లు, 69 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 69మంది సూపరింటెండెంట్లు, 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 700 మంది ఇన్విజిలేటర్లు, 69 మంది సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బందిని నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పాఠశాలల వారీగా పదో తరగతి విద్యార్థులు విద్యా సంస్థలు స్కూళ్ల సంఖ్య బాలికలు బాలురు జెడ్పీహెచ్ఎస్ 165 2,676 3,163 ప్రభుత్వ 9 296 131 ఎయిడెడ్ 2 14 16 కేజీబీవీ 18 831 0 ప్రైవేట్ 69 1,211 1,596 బీసీ వెల్ఫేర్ 10 287 379 ఎస్సీ వెల్ఫేర్ 7 238 293 ఎస్టీ వెల్ఫేర్ 4 149 140 ఎస్టీ ఆశ్రమ 6 197 124 టీఎంఆర్ఐఈఎస్ 6 113 151 టీఎస్ఎంఎస్ 9 295 456 టీఆర్ఈఐఎస్ 2 145 0 అన్ని ఏర్పాట్లు చేశాం పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గత సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాం. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరి కరాలను నిషేధించాం. పరీక్ష విధులకు హాజరయ్యే సిబ్బందికి కూడా ఆ ఆదేశాలు వర్తింపజేశాం. జిల్లా వ్యాప్తంగా 69 కేంద్రాలు, 12,901 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. – రేణుకాదేవి, డీఈఓ -
రేషన్.. వచ్చెన్
● దశాబ్దకాల నిరీక్షణకు తెర ● జిల్లాలో కొత్తగా 22,388 రేషన్ కార్డులు జారీ ● మార్చి కోటా 5,603 మెట్రిక్ టన్నుల బియ్యం విడుదలబషీరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం దశాబ్దకాలం పాటు ఎదురు చూసిన వారి నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభల ద్వారా తీసుకున్న దరఖాస్తులతో పాటు పెండింగ్ జాబితాలోని అర్హులకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. మార్చి కోటా బియ్యం కూడా విడుదల చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్కార్డు ప్రామాణికం కావడంతో కొత్త కార్డుల జారీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లాలో 2,63,573 మంది లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డుల జారీతో జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. గతంలో 2,41,185 మంది లబ్ధిదారులు ఉండగా 5,337.31 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసేవారు. కొత్తగా 22,388 కార్డులు అందుబాటులోకి రావడంతో అదనంగా 266.098 మెట్రిక్ టన్నుల బియ్యం కోటాను విడుదల చేశారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య 2,63,573 మందికి చేరుకుంది. 26,730 అంత్యోదయ కార్డులు, 39 అన్నపూర్ణ యోజన కార్డులు ఉన్నాయి. కార్డులోని ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందిస్తున్నారు. డిజిటల్ కార్డుల జారీకి కసరత్తు సంక్షేమ పథకాల అమలులో అవకతవకలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్ రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేస్తోంది. కొత్తగా రూపొందించే కార్డులో కుటుంబ సభ్యులను చేర్చేందుకు.. తొలగించేందుకు సులువుగా ఉండేలా తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ పూర్తయితే జూన్ నెలలో డిజిటల్ రేషన్కార్డులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దరఖాస్తు చేసుకున్న ఎనిమిదేళ్లకు.. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయాక ఎనిమిదేళ్ల క్రితం కొత్త రేషన్కార్డు కోసం దరఖాస్తు చేశా. కార్డు రాలేదు. నాతోపాటు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రజాపాలన గ్రామసభలో మళ్లీ దరఖాస్తు చేశా. ఇప్పుడు నా పేరిట రేషన్ కార్డు మంజూరైంది. ఇంకా బియ్యం తీసుకోలేదు. – తలారి సావిత్రి, మంతట్టి మీసేవ కేంద్రాల్లో డౌన్లోడ్ చేసుకోవాలి జిల్లాకు కొత్తగా 22,388 రేషన్కార్డులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన జాబితాను డీలర్లకు అందజేశాం. కార్డు మంజూరైన వారు మీసేవ కేంద్రాలు లేదా ఆన్లైన్ సెంటర్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త కార్డులకు మార్చి నెల కోటా బియ్యం పంపిణీ చేశాం. – మోహన్బాబు, డీఎస్ఓ -
పాండురంగ.. సేవలు వరంగా
కుల్కచర్ల: ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సరదాగా గడపడంతో పాటు ఇతర వ్యాపకాల వైపు దృష్టిసారిస్తారు. వారికి ఇష్టమైన వ్యాపారం, వ్యవసాయం, మొక్కల పెంపకం.. ఇలా తమ అభిరుచులకు తగిన పనులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేసి, రిటైరైన ప్రధానోపాధ్యాయుడు పాండురంగయ్య విద్యార్థుల శ్రేయస్సు కోసం పాఠాలు కొనసాగిస్తున్నారు. ఈయన సేవలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వరంగా మారాయి. ప్రతిరోజూ బడికి.. హెచ్ఎం పాండురంగయ్య గత నెల 24న ఉద్యోగ విరమణ పొందారు. కానీ ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో మంచి ఫలితాలు రావాలనే లక్ష్యంతో నిత్యం బడికి వస్తున్నారు. ఎప్పటిలాగే సమయానికి స్కూల్కు చేరుకుని పిల్లలకు గణితం బోధిస్తున్నారు. అంతేకాకుండా దోమ, షాద్నగర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మ్యాథ్స్పై ప్రత్యేక తరగతులు చెప్పడంతో పాటు పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలను వివరిస్తూ మోటివేషనల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లోనూ ఆదర్శమే షాద్నగర్ ప్రాంతానికి చెందిన పాండురంగయ్య 13జూన్ 2024లో ఇప్పాయిపల్లి ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంగా విధుల్లో చేరారు. అనతికాలంలోనే విద్యార్థుల నడవడికలో మార్పులు తీసుకురావడంతో పాటు వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తూ మౌలిక వసతుల కల్పన కోసం తన సొంత డబ్బులు వెచ్చించారు. తాను పనిచేస్తున్న పాఠశాలలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తమవంతు సాయం అందించేందుకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాసవి క్లబ్కు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన ఇప్పాయిపల్లి స్కూల్ విద్యార్థులకు వైట్ అండ్ వైట్ దుస్తులు, టై, బెల్టు, షూస్ అందజేయడంతో పాటు వాటర్ ప్యూరిఫయర్ వంటి సౌకర్యాలను కల్పించారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషిచేస్తున్న గురువు ఉద్యోగ విరమణ పొందినా నిత్యం విధులకు హాజరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సొంత డబ్బులతో వసతుల కల్పన ఆదర్శంగా నిలుస్తున్న రిటైర్డ్ గెజిటెడ్ హెచ్ఎం పాండురంగయ్య ఉన్నతిలోకి రావాలి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు నావంతు కృషి చేస్తున్నా. ఉద్యోగ విరమణ అనేది నా ఉద్యోగ జీవితంలో ఒక భాగమే. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అవసర నిమిత్తం నా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా. పేద పిల్లలు ఉన్నతిలోకి రావాలనేదే నా సంకల్పం. – పాండురంగయ్య, రిటైర్డ్ హెచ్ఎం -
బైక్ దొంగకు రిమాండ్
ఆమనగల్లు: బైక్ను చో రీ చేసిన వ్యక్తిని శనివారం రిమాండ్కు తరలించినట్లు ఆమనగల్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని విఠాయిపల్లి గ్రామానికి చెందిన సబావత్వాల్య గత ఏడాది డిసెంబర్లో తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ఎదుట పార్క్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని సరూర్నగర్కు చెందిన హాజీ బైక్ను చోరీ చేసినట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హాజీని కోర్టులో హాజరు పర్చి, రిమాండ్కు తరలించారు. చికిత్స పొందుతూ గర్భిణి మృతి వైద్యుల నిర్లక్ష్యమంటూ బంధువుల ఆరోపణ శంషాబాద్ రూరల్: ఛాతి నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ గర్భిణి మృతి చెందింది. ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం అమీర్పేట్ నివాసి బుషమోని ప్రమీల(33) 9 నెలల గర్భిణి. మొదటి నుంచి ముచ్చింతల్ శివారులోని జిమ్స్ ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతుంది. నెలలు నిండడంతో ప్రమీలను ఈ నెల 11న జిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 13వ తేదీ వరకు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమెను వైద్యులు ఇంటికి పంపించారు. 18న ఆస్పత్రికి రావాలంటూ డాక్టర్ పూజిత కొన్ని మందులు రాసిచ్చారు. శుక్రవారం రాత్రి ప్రమీల భోజనం తర్వాత వైద్యులు ఇచ్చిన మందులు వేసుకుంది. కాసేటి తర్వాత ఛాతిలో నొప్పి రావడంతో భర్త సాయిబాబు ఆమెను రాత్రి 10.30 గంటలకు జిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ సమయంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులు ఆమెను పరిశీలించారు. 12.15 గంటలకు డాక్టర్ రామారావు ఆమెను పరీక్షించగా అప్పటికే చనిపోయింది. సకాలంలో వైద్యం అందక తన భార్య మృతి చెందిందని, ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సాయిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో యాసిడ్ తాగి వృద్ధుడి మృతి శంషాబాద్ రూరల్: మద్యం తాగిన మత్తులో ఓ వృద్ధుడు యాసిడ్ తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని నర్కూడ వాసి కమ్మరి ఆనంద్ చారి(62) ఈ నెల 14న హోలీ ఆడి సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. రాత్రి తాగిన మత్తులో బాత్రూంలోకి వెళ్లి అక్కడ ఉన్న యాసిడ్ తాగి బయటకు వచ్చాడు. అతని షర్ట్పై మరకలను గమనించిన భార్య లక్ష్మి బాత్రూమ్లోకి వెళ్లి చూసింది. యాసిడ్ బాటిల్ మూత తీసి ఉండడంతో పాటు అందులో యాసిడ్ సగం మాత్రమే ఉంది. వెంటనే అతన్ని శంషాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి..అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లగా..చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో డంపింగ్ మణికొండ: ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా ఓ నిర్మాణ సంస్థ డంపింగ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని కోకాపేటవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట రెవెన్యూ సర్వే నెంబర్ 144లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాని పక్కనే ఓ నిర్మాణ సంస్థ తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ను ప్రభుత్వ భూమిలోకి పడేయటంతో పక్కనున్న నివాసాల్లో దుమ్ము చేరుతుంది. దాంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇదే విషయాన్ని అటు నిర్మాణ సంస్థ, ఇటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సిలిండర్ గ్యాస్లీకై ..నిప్పురవ్వలు ఎగసిపడి
మణికొండ: ఐటీ సంస్థలకు నిలయమైన ఓ బహుళ అంతస్తుల టవర్లో క్యాంటీన్ ఏర్పాటు పనులు చేస్తున్న క్రమంలో వెల్డింగ్ సిలిండర్ లీకై ..నిప్పు రవ్వలు ఎగసిపడి ఆరుగురికి గాయాలయ్యాయి. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని కోకాపేటలోని ఘర్ (జీఏఆర్) భవనంలో అనేక ఐటీ సంస్థలు కొనసాగుతున్నాయి. వారికి అనుకూలంగా ఉండేలా గ్రౌండ్ ఫ్లోర్లో కొత్తగా క్యాంటీన్ ఏర్పాటు చేసే పనులు చేపట్టారు. శనివారం సాయంత్రం వెల్డింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా సిలిండర్ నుంచి గ్యాస్ అధికంగా విడుదలై నిప్పు రవ్వలు చెలరేగాయి. దీంతో అక్కడే ఉన్న క్యాంటీన్ యజమాని రాకేష్తో పాటు కార్మికులు రిజ్వాన్, అన్వర్ మాలిక్, శివ, ఫరూఖ్ మాలిక్, రాజు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే సమీపంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అందులో ఒకరికి 50 శాతం, మరొకరికి 40 శాతం, నలుగురికి 30 శాతం కాలిన గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న నార్సింగి ఏసీపీ రమణగౌడ్, వట్టినాగులపల్లి అగ్నిమాపక శాఖ అధికారులు, హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నారు. అయితే అది అగ్ని ప్రమాదం కాదని, వెల్డింగ్ మిషన్ వద్ద గ్యాస్, అగ్గిరవ్వలు అధికంగా రావటంతో ప్రమాదం జరిగిందని ఏసీపీ తెలిపారు.ఆరుగురికి గాయాలు -
గ్రామసభలు తూతూ మంత్రం!
దౌల్తాబాద్: పల్లెల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామసభలను నిర్వహిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యం లేకపోవడంతో ఇవి తూతూమంత్రంగా కొనసాగుతున్నాయి. అవగాహన కల్పించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పంచాయతీల అభివృద్ధిలో గ్రామసభలు ఎంతో కీలకం. ఆయా శాఖల అధికారులతో పాటు పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ప్రజలు ఇందులో పాల్గొని సమస్యలను గుర్తించి, పరిష్కార మార్గాలపై చర్చిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరు, లబ్ధిదారుల వివరాల నమోదును గ్రామ సభల ద్వారా నిర్వహిస్తారు. ప్రభుత్వాలు చేపట్టే కొత్త పథకాలు, పనులపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటారు. నిర్వహణ ఇలా.. పంచాయతీల్లో ప్రతీ రెండు నెలలకు ఒకసారి సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాలి. అయితే ఏడాదిన కాలంగా సర్పంచ్లు లేకపోవడంతో కార్యదర్శులే నిర్వహిస్తున్నారు. సంబంధిత జీపీతో పాటు అనుబంధ గ్రామాల్లో సభలు నిర్వహించే తేదీలను ముందుగానే ప్రకటించాలి. ఈ విషయమై సిబ్బందితో టాంటాం(దండోరా) వేయించాలి. నిబంధనల ప్రకారం విధిగా 17శాఖల అధికారులు జనాభాలో సుమారు 20శాతం మంది ప్రజలు గ్రామసభకు హాజరయ్యేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇవేవీ పట్టించుకోవడం లేదు. కనీసం 50 మందితో గ్రామసభ నిర్వహించాలనే నిబంధనలు ఉన్నా పది మందితో కానిచ్చేస్తున్నారు. పంచాయతీ ఆదాయ, వ్యయాలపైన కార్యదర్శులు నివేదికలు చదివి వినిపించాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసక్తి చూపని గ్రామస్తులు.. జిల్లాలోని చాలా చోట్ల నిర్వహించే గ్రామసభలకు కనీసం పది నుంచి ఇరవై మంది కూడా రావడంలేదు. ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, వీఓఏలు, వైద్యసిబ్బంది మాత్రమే సభలకు హాజరవుతున్నారు. ప్రజలు, నాయకులకు సరైన సమాచారం ఉండటం లేదు. గ్రామ సభల్లో చర్చకు వచ్చే సమస్యలకు పరిష్కారం చూపితే వీటిపై గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ గ్రామాల్లో సమస్యలు పేరుకుపోవడం, సుదీర్ఘకాలంగా పరిష్కారం కాకపోవడం వంటి కారణాలతో సభలకు ఆదరణ తగ్గుతోంది. కనిపించని ప్రజల భాగస్వామ్యం అవగాహన కల్పించని అధికారులు ప్రజల భాగస్వామ్యం పెరగాలి గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలి. సభల నిర్వహణపై కార్యదర్శులతో గ్రామాల్లో దండోరా వేయిస్తున్నాం. సమాచారం తెలుసుకుని స్వచ్ఛందంగా సభకు రావాలి. దీంతో సమస్యలు పరిష్కరించే వీలు కలుగుతుంది. – శ్రీనివాస్, ఎంపీడీఓ, దౌల్తాబాద్ -
మట్టి.. కొల్లగొట్టి!
మొయినాబాద్: అక్రమార్కులకు మట్టే బంగారమవుతోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో నుంచి తరలించుకుపోయి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి సమయంలో మట్టిని తీసుకెళ్లి డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఫాంహౌస్లకు విక్రయిస్తున్నారు. ఇలా నిత్యం వందలాది టిప్పర్ల మట్టి తరలిపోతోంది. నగరానికి కూత వేటు దూరంలో ఉన్న మొయినాబాద్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. టిప్పర్ల యజమానులు నిత్యం ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల్లో మట్టి తవ్వి విక్రయిస్తున్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం పెద్ద చెరువులో నుంచి కొద్ది రోజులుగా నల్లమట్టిని తరలించుకుపోతున్నారు. రాత్రి వేళటిప్పర్ల ద్వారా తీసుకెళ్లి ఒకచోట డంప్ చేసుకుంటున్నారు. ఆతర్వాత ఫాంహౌస్లకు అమ్ముతున్నారు. మండలంలోని నాగిరెడ్డిగూడ సమీపంలో ఉన్న హిమాయత్సాగర్ చెరువులో నుంచి సైతం నల్లమట్టిని తరలిస్తున్నారు. అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల నుంచి ఎర్రమట్టి, మొరం తవ్వుతున్నారు. పెద్దమంగళారం, అప్పోజీగూడ, మేడిపల్లి ప్రాంతాల్లో ఎర్రమట్టి, కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, నక్కపల్లి, తోలుకట్ట ప్రాంతాల నుంచి మొరం తరలిస్తున్నారు. ఇలా నిత్యం వేలాది రూపాయల దందా నిర్వహిస్తున్నారు. సెలువు రోజుల్లోనే అధికంగా.. సెలవు రోజులను ఎంచుకుని అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అధికారులు ఎవురూ అందుబాటులో ఉండరనే వ్యూహంతో హాలీ డేస్ను ఇలా వినియోగించుకుంటున్నారు. చెరువులు, కుంటలను కాపాడాల్సిన ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదులు వచ్చినప్పుడే స్పందిస్తున్నారు. ఆతర్వాత నిఘా పెట్టడంలేదనే విమర్శలు వస్తున్నాయి. రెవెన్యూ శా ఖలో గ్రామస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో పంచాయతీల్లో జరుగుతున్న అక్రమాలు అధికారులకు తెలియడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే ఇవి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికై నా అక్రమ మట్టి రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కేసులు నమోదు చేశాం పెద్దమంగళారం పెద్ద చెరువులో నల్ల మట్టి తవ్వుతున్నట్లు గతంలో ఫిర్యాదులు వచ్చాయి. మట్టి తీస్తున్నవారిపై అప్పట్లోనే కేసులు నమోదు చేశాం. మళ్లీ ఎవరైనా మట్టి తీస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. మండలంలోని అన్ని చెరువులపై ప్రత్యేక నిఘా పెడతాం. – ప్రియాంక, ఇరిగేషన్ ఏఈ, మొయినాబాద్ యథేచ్ఛగా అక్రమ దందా! చెరువులు, కుంటల నుంచి మట్టి తరలిస్తున్న అక్రమార్కులు ప్రభుత్వ భూములే లక్ష్యంగా తవ్వకాలు రాత్రి వేళ, సెలవుదినాల్లో టిప్పర్ల ద్వారా తరలింపు ఫాంహౌస్లలో పోసి సొమ్ముచేసుకుంటున్న వైనం -
న్యాయం చేయాలని ఎస్పీకి వినతి
పూడూరు: సాగు చేస్తున్న భూమిని వదిలేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చన్గోముల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎస్ఐ పట్టించుకోవడం లేదని బాధిత మహిళ శోభ శనివారం జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండల పరిధిలోని పుడుగుర్తి గ్రామానికి చెందిన నాగులపల్లి శోభ గ్రామంలోని సర్వే నంబర్ 54లో 0–23 గుంటల భూమిని కొంత కాలంగా సాగు చేస్తున్నానని తెలిపింది. కొంత కాలంగా తమ కుటుంబంలో భూమి విషయంలో కోర్టులో కేసు నడుస్తుంది. ఇది ఇలా ఉండగా వారు ఆ భూమి విషయంలో రాజీ కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆ భూమికి ఎలాంటి సంబంధం లేని వడ్డె ఎల్లయ్య, శ్రీను, చంద్రయ్య, లక్ష్మయ్య, కాశీనాథ్లు తమ భూమిని లాక్కోవడానికి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దాడి చేసి తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనను రక్షించాలని, భూమి జోలికి రాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు. దీంతో ఎస్ఐ కూడా తననే బెధిరిస్తున్నారని ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీని కలిసిన వారిలో మాజీ ఎంపీపీ మల్లేశం, దేవనోనిగూడ వెంకటయ్య, బాధిత కుటుంబసభ్యులు ఉన్నారు. -
అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పట్టివేత
కేసు నమోదు చేసిన పోలీసులుమాడ్గుల: బెల్ట్షాప్లో విక్రయిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు మండల కేంద్రంలోని అంబాల యాదయ్యకు చెందిన మణికింఠ కిరాణం, ఈర్ల శ్రీనివాస్కు చెందిన జై హనుమాన్ కిరాణం, నాగిళ్ళ గ్రామంలోని అగిర్ చంద్రశేఖర్ కిరాణం దుకాణల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో రూ.50వేల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూ.6 వేల విలువ..యాచారం: అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలివీ.. మండల పరిధిలోని తమ్మలోనిగూడలో రాములు అనే వ్యక్తి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు శుక్రవారం యాచారం పోలీసులు వెళ్లి దుకాణంలో తనిఖీ చేయగా రూ.6 వేల విలువ జేసే లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. -
పల్లె గొంతెండుతోంది!
దుద్యాల్: మండుటెండులు ముదురుతున్న తరుణంలో ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచి ఆరు రోజులు గడుస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో కనీస అవసరాలకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని మండలంలోని ఆలేడ్ గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ తాగునీటి సరఫరా ఆరు రోజులుగా బంద్ కావడంతో అవస్థలు పడుతున్నారు. గత్యంతరం లేక గ్రామ సమీపంలోని వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకొని కాలం వెళ్లదీస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ అదే మాటే మిషన్ భగీరథ నీటి సరఫరా ఈ నెల 9 నుంచి బంద్ కావడంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేయడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. కొందరు గ్రామానికి సరఫరా అయ్యే బోరును తమ వ్యవసాయ పొలాలకు వాడుతున్నారనే ఆరోపణ కూడా వ్యక్తం అవుతోంది. గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేసే సంబంధిత వ్యక్తిని ఫోన్ ద్వారా సంప్రదించగా... పైపు లైన్ పగిలిపోయిందని, మరమ్మతులు చేస్తున్నారని సెలవిచ్చారు. గ్రామస్తులకు సైతం ఇదే సమాధాన్ని ఆరు రోజులుగా చెబుతుండడం గమనార్హం. మరోవైపు గ్రామంలోని పాఠశాలలో వేసిన బోరు నుంచి వచ్చే కొద్దిపాటి నీటితో కొందరు ఉపశమనం పొందుతున్నారు. ధర్నా చేపడతాం ఉన్నతాధికారులు స్పందించి వెంటనే గ్రామంలో తాగునీటి సరఫరా చేయాలని కోరుతున్నారు. లేకుంటే అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నా చేపడుతామని హెచ్చరిస్తున్నారు. ఊరిలో తాగునీటి సరఫరా ఇబ్బందిగా మారినప్పుడు గ్రామ పంచాయతీ ట్యాంకర్ సహాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కానీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల హస్నాబాద్లో తాగునీటి కోసం స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికార యంత్రాంగం స్పందించి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నారు. అదే మాదిరి తమ గ్రామంలో చర్యలు తీసుకోవాలని ఆలేడ్ గ్రామస్తులు క‘న్నీటి’తో విజ్ఞప్తి చేస్తున్నారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. మొన్న హస్నాబాద్.. ఇవాళ ఆలేడ్ గ్రామాలలో మిషన్ భగీరథ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగు నీటికి అరిగోస పడుతున్నారు. ఆరు రోజులుగా మిషన్ భగీరథ బంద్ తీవ్ర అవస్థలు పడుతున్న ఆలేడ్ గ్రామస్తులు స్పందించని అధికార యంత్రాంగం -
వినియోగదారుడా..బీ అలర్ట్!
సిటీ కోర్టులు: మార్కెట్లో కొనుగోలు చేసిన వస్తువు నాణ్యత, సేవల పరంగా వినియోగదారుడికి ఏ విధమైన మోసం జరిగినా మేమున్నామంటూ వినియోగదారుల ఫోరం అండగా నిలుస్తోంది. కొనుగోలు చేసే వస్తువులపై గరిష్ట ధర (ఎమ్మార్పీ), ఎక్స్పైరీ తేదీ, కంపెనీ చిరునామా, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబరు తదితర వివరాలు ఉత్పత్తులపై ముద్రించాల్సి ఉంటుంది. పేర్కొన్న వివరాలకు, వస్తువు, సేవల్లో పొందిన వాస్తవానికి తేడాలున్నపుడు వినియోగదారుడు ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. పైసా ఖర్చు లేకుండా కమిషన్లో కేసు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఆర్థిక స్థోమత లేనివారు సొంతంగా తమ కేసును తామే వినిపించుకునే వెసులుబాటూ ఉంది. ఆన్లైన్లోనూ కేసు నమోదు చేసుకోవచ్చు. వర్చువల్గా కేసుల వాదనలు వినిపించుకోవచ్చు. రూ.50 లక్షల విలువైన వస్తువు, సేవల కోసం జిల్లా కమిషన్లో ఫిర్యాదు చేయాలి. రూ.2 కోట్ల వరకు రాష్ట్ర కమిషన్లో, అంతకుమించితే జాతీయ కమిషన్లో ఫిర్యాదు చేయాలి. వినియోగదారుడి హక్కులు, ప్రయోజనాల గురంచి తెలియజెప్పేందుకు మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం కూడా నిర్వహిస్తున్నారు. వినియోగదారుల కమిషన్ల ఫోన్ నంబర్లు ● టోల్ ఫ్రీ నంబర్: 180042500333 ● జాతీయ వినియోగదారుల కమిషన్, న్యూఢిల్లీ: ఫోన్ 011–24608724. ● తెలంగాణ రాష్ట్ర కమిషన్, హైదరాబాద్, ఫోన్: 040–23394399 ● హైదరాబాద్ జిల్లా కమిషన్ ఎంజే రోడ్, నాంపల్లి, ఫోన్: 040–24733368, 040–24747733, 040–24746001 ● రంగారెడ్డి జిల్లా కమిషన్, ఎన్టీఆర్ నగర్, ఎల్బీనగర్, ఫోన్: 040–24031275 ఆర్థిక భారం లేకుండా న్యాయం పొందే అవకాశం ఈ చట్టం గురించి తెలుసుకుంటే ఎంతో మేలు కేసుల పరిష్కారం ఇలా.. సంవత్సరం నమోదైనకేసులు పరిష్కారమైనవి 2023 1,076 1,274 2024 1,340 1,358 2025 113 159 సరైన రసీదు తీసుకోవాలి వినియోగదారులు ఏదైనా వస్తువు కొన్నప్పుడు రసీదు తప్పక తీసుకోవాలి. ఆ వస్తువులో ఏదైనా లోపం ఉందని భావించినప్పుడు మీరు కమిషన్ను ఆశ్రయించి న్యాయం పొందడానికి ఆ రసీదు చాలా ఉపయోగపడుతుంది. – రాంగోపాల్రెడ్డి, అధ్యక్షుడు, హైదరాబాద్ వినియోగదారుల ఫోరం–3 -
భానుడి భగభగలు
● జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు ● మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో ఆరెంజ్ అలర్ట్ ● వడగాల్పులతో జనం బెంబేలు బషీరాబాద్: భానుడు భగ్గుమంటున్నాడు. శుక్రవారం జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 17 మండలాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. కొడంగల్లో కనిష్ట ఉష్ణోగ్రత 28.7 డిగ్రీలుగా నమోదైంది. ఉదయం 10 గంటలకే వడగాలులు వీస్తుండటంతో జనం హడలిపోతున్నారు. ఎండల తీవ్రత కారణంగా రోడ్లమీదకు రావాలంటేనే జంకుతున్నారు. మరోవైపు బోరుబావులు, చెరువుల్లో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు డిగ్రీల్లో..ప్రాంతం గరిష్టం కనిష్టం మర్పల్లి 40.3 32.7 మోమిన్పేట 40.2 30.9 ధారూరు 40.0 32.4 పూడూరు 40.0 32.4 బంట్వారం 39.2 31.6 దౌల్తాబాద్ 39.1 32.1 నవాబుపేట 39.1 29.0 వికారాబాద్ 39.0 27.7 బషీరాబాద్ 38.8 29.5 పరిగి 38.5 30.7 యాలాల 38.5 31.1 చౌడాపూర్ 38.4 30.9 తాండూరు 38.2 30.8 కుల్కచర్ల 38.1 30.6 దోమ 37.9 28.4 పెద్దేముల్ 37.6 31.1 బొంరాస్పేట 37.3 27.8 దుద్యాల్ 36.4 29.0 కొడంగల్ 36.1 28.7 -
గుర్తు తెలియని వాహనం ఢీ, వ్యక్తి మృతి
పరిగి: గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి రంగంపల్లి కాటన్మిల్లు సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సంతోష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి నుంచి రంగంపల్లి వైపు హైదారాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై సుమారు 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి, గురువారం రాత్రి 10 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలై దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతున్ని గుర్తించిన వారు 8712670041 నంబర్ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం అనంతగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలను మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం వికారాబాద్లో ఎమ్మెల్యే జగదీష్రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సభ నుంచి సస్పెండ్ చేశారని, ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పని చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు సుభాన్రెడ్డి, అనంత్రెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. చెరువులో పడి మేసీ్త్ర మృతి కొడంగల్ రూరల్: తాగిన మైకంలో ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం రుద్రారం పరిధిలోని పాటిమీదిపల్లి భీరం చెరువులో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బషీరాబాద్ మండలం బాదులాపూర్తండాకు చెందిన రాథోడ్ మోహన్(46) మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మద్యం తాగి బీరం చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత సరిగ్గా రాకపోవడంతో చెరువులో మునిగి మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడి భార్య సాలీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. ఆదివాసీ సంఘీభావ వేదిక ఏర్పాటు ముషీరాబాద్: ఉమ్మడి హైదరాబాద్ ఆదివాసీ సంఘీభావ వేదికను ఏర్పాటు చేశారు. శుక్రవారం విద్యానగర్లోని మార్క్స్ భవన్లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేదిక కన్వీనర్లుగా దళిత లిబరేషన్ ఫ్రంట్ నుంచి ఇందిర, ప్రజా కళామండలి నుంచి రాణి, చైతన్య మహిళా సంఘం నుంచి జయ, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం నుంచి రవి, ఏఐఎఫ్టీయూ నుంచి మల్లేష్, పీడీఎస్యూ మహేష్, అమరుల బంధుమిత్రుల సంఘం సత్యను ఎంపిక చేశారు. అలాగే పౌర హక్కుల సంఘం హైదరాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ వేదిక కోఆర్డినేటర్గా వ్యవహరిస్తారని లక్ష్మణ్ తెలిపారు. ఆదివాసీలపై మారణహోమాన్ని నిలిపి వేయాలని, సహజ వనరుల దోపిడీని అరికట్టాలని, పోలీసు క్యాంపులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. రూ.5లక్షల విలువైన విద్యుత్ వైర్లు చోరీ యాచారం: ఐదు లక్షల రూపాయల విలువ జేసే విద్యుత్ వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. వివరాలివీ.. మండల పరిధిలోని గునుగల్ గ్రామంలో అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇంజాపూర్ గ్రామానికి చెందిన నోముల కృష్ణాగౌడ్ బాలాజీ వెంచర్ను ఏర్పాటు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు రెండు రోజుల క్రితం వెంచర్లోని విద్యుత్ స్తంభాలకు ఉన్న రూ.5 లక్షల విలువ జేసే వైర్లను కత్తిరించి ఎత్తుకెళ్లారు. సిబ్బంది సమాచారం మేరకు యజమాని యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యుత్ వైర్లతో పాటు విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
హత్య చేసిన నిందితుడికి రిమాండ్
షాబాద్: మద్యం దుకాణంలో దొంగతనం చేస్తూ, అడ్డొచ్చిన ఓ యువకుడిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి ఓ ఆగంతకుడు షాబాద్ మండల కేంద్రంలోని దుర్గా వైన్స్లో దూరి పర్మిట్ రూమ్లో పడుకున్న వ్యక్తిని హత్య చేసిన సంగతి విదితమే. శుక్రవారం రాజేంద్రగనర్ జోన్ డీసీపీ శ్రీనివాస్ విలేకర్ల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పుడుగుర్తి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి నరేందర్ జల్సాలకు అలవాటు పడి చోరీలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 12న అర్ధరాత్రి అతడు దుర్గా వైన్స్లో చోరీకి యత్నించాడు. వెనుక వైపు గోడకు సుత్తెతో రంధ్రం చేస్తుండగా.. శబ్దం విని అక్కడే పనిచేసే భిక్షపతి(35) పర్మిట్ రూమ్ నుంచి బయటకు వచ్చి గట్టిగా అరిచాడు. దీంతో నరేందర్ పారతో భిక్షపతి తలపై కొట్టాడు. విలవిలలాడుతూ అక్కడే అతడు మృతి చెందాడు. ఆ తర్వాత వైన్స్లో దూరి సుమారు రూ.40వేల నగదు, కొన్ని మద్యం బాటిళ్లను తీసుకొని పరారయ్యాడు. సీసీ కెమెరా ఆధారంగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడి నరేందర్గా గుర్తించారు. అతడిని శుక్రవారం ఉదయం సీతారాంపూర్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి బ్యాంక్ అకౌంట్ను నిలుపుదల చేసి కొంత సొత్తును రికవరీ చేశారు. కాగా నరేందర్పై గతేడాది బహుదూర్పురా, అత్తాపూర్ పోలీస్స్టేషన్ల పరిధిలో నాలుగు చోరీల కేసులో నేరస్తుడిగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ నెల 3న నాగర్గూడ వైన్స్లో దొంగతనానికి పాల్పడ్డాడని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈ హత్య కేసును 24 గంటల్లోగా ఛేదించినందుకు రాజేంద్రగనర్ జోన్, చేవెళ్ల ఏసీపీలు ప్రశాంత్, కిషన్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ కె.శశాంక్రెడ్డి, షాబాద్ సీఐ కాంతారెడ్డి బృందాలను డీసీసీ అభినందించారు. గతంలోనూ పలు కేసులో ఉన్నట్లు నిర్ధారణ రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ -
శివారు ప్రాంతాలు.. చోరీలకు నిలయాలు
అబ్దుల్లాపూర్మెట్: హైదరాబాద్ నగర శివారులో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని అందిన కాడికి దోచుకొని పరారవుతున్నారు. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల ఈ తరహా ఘటనలు కలవరం పెడుతున్నాయి. ప్రతి నిత్యం గ్రామాల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నా వారి కళ్లను కప్పి కేటుగాళ్లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో మండలంలోని రెండు దేవాలయాల్లో దొంగతనానికి పాల్పడగా, ఈ నెలలో ఇప్పటి వరకూ పలుచోట్ల ఇళ్లలోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించుకుపోయి సవాల్ విసురుతున్నారు. ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు ● గత నెల 18వ తేదీన పిగ్లీపూర్లోని అభయాంజనేయస్వామి దేవాలయంలో చోరీ జరిగింది. దొంగలు ఆలయంలోని విగ్రహానికి అమర్చిన 15 కిలోల వెండి తొడుగును అపహరించుకుపోయారు. వాహన తనిఖీల్లో ఈ నెల 4వ తేదీన ఆలయంలో దోపిడీకి పాల్పడిన ఇద్దరు దుండగులను పోలీసులు పట్టుకుని, వారి నుంచి 20 కిలోల వెండి బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ● అనాజ్పూర్ గ్రామంలో గత నెల 27వ తేదీన శివాలయంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలోని రెండు హుండీలతోపాటు ఎల్ఈడీ లైట్లను అపహరించుకుపోయారు. ● మండల పరిధిలోని కవాడిపల్లి గ్రామంలోని ఉదయ్గార్డెన్స్లో ఈ నెల 10వ తేదీన ఓ ఇంటి తాళాలు పగులగొట్టి 4 తులాల బంగారు, 80 తులాల వెండి ఆభరణాలు, రూ.లక్ష మేర నగదును దోచుకెళ్లారు. ● బలిజగూడ గ్రామంలోనూ ఇదే తరహాలో ఓ ఇంట్లో ఈ నెల 10వ తేదీన దొంగతనం జరగగా.. 3 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు, రూ.38 వేల నగదు అపహరించుకుపోయారు. ● తాజాగా గురువారం రాత్రి అబ్దుల్లాపూర్మెట్లోని సాయినగర్ కాలనీలో నివాసముండే కొత్త రమేశ్ ఇంట్లోకి చొరబడిన దుండగులు 2.5 గ్రాముల బంగారు చెవి కమ్మలు, 20 తులాల వెండి పట్టీలు, 10 వేలు నగదును తస్కరించారు. రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు తరచూ ఇళ్లలో చోరీలు భయాందోళనలో ప్రజలు -
నేటి నుంచి ఒంటిపూట బడులు
బొంరాస్పేట: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి(శనివారం) ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాలల నిర్వహణ సమయంలో మార్పులు జరిగాయి. ‘పది’కి మినహాయింపు పదో తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. అన్ని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరగనున్నాయి. 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో ఈ ఏడాది 12,901 మంది విద్యార్థు లు పదో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10,074మంది, ప్రైవేట్ స్కూళ్లలో 2,827 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఐదు నెలలుగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. అప్పటికే అధికారులు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. ఒంటిపూట బడుల సమయపాలనజాగ్రత్తగా ఉండాలి ఎండలు ముదురుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పాఠశాలల్లో విద్యార్థులు వడదెబ్బకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నాం. శనివారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభవుతాయి. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి. – రేణుకాదేవి, డీఈఓ ● ఉదయం 8గంటలకు పాఠశాలలు ప్రారంభం ● ఉదయం 8.05 నుంచి 8.15 వరకు ప్రార్థన ● 8.15 – 8.55 వరకు ఒకటో పిరియడ్ ● 8.55 – 9.35 వరకు రెండో పిరియడ్ ● 9.35 – 10.15 వరకు మూడో పిరియడ్ ● 10.15 – 10.30 వరకు స్వల్ప విరామం ● 10.30 – 11.10 వరకు నాల్గో పిరియడ్ ● 11.10 – 11.50 వరకు ఐదో పిరియడ్ ● 11.50 – 12.30 వరకు ఆరో పిరియడ్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలుఉన్నత 176 కేజీబీవీలు 18 మోడల్ 09 యూపీఎస్లు 114 ప్రాథమిక 770 మొత్తం విద్యార్థుల సంఖ్య 1,22,556 24 నుంచి వేసవి సెలవులు విద్యా సంవత్సరం ప్రకారం వచ్చే నెల 23వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అమలు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ -
భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ
కుల్కచర్ల: మండలంలోని పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కోట్ల మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు పాండుశర్మ గ్రామస్తులతో కలసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుక్కపై ఎలుగుబంటి దాడి బెల్కటూర్ శివారులో ఘటన తాండూరు రూరల్: మండలంలోని బెల్కటూర్ శివారులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామ శివారులోని ఓ పాలిషింగ్ యూనిట్ పరిసరాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఎలుగుబంటి కనిపించింది. దాన్ని చూసిన కుక్కలు మొరగడంతో ఎలుగుబంటి దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కుక్క మూతి భాగానికి తీవ్ర గాయమైంది. ఈ విషయమై తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి సరస్వతిని వివరణ కోరగా.. గ్రామ శివారులో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారని తెలిపింది. తమ సిబ్బంది జంతువు కాలి ముద్రలు సేకరించి ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. నేటి నుంచి ధ్యానోత్సవం ఇబ్రహీంపట్నం: హార్ట్ఫుల్నెస్ సంస్థ, శ్రీ రామచంద్ర మిషన్ సంయుక్తంగా శని, ఆది, సోమవారాల్లో ఇబ్రహీంపట్నంలోని ఓసీ కమ్యూనిటీ హాల్లోఽ ధ్యానోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 15 సంవత్సరాలు దాటిన వారంతా ఈ ధ్యానోత్సవానికి హాజరు కావొచ్చని తెలిపారు. ధ్యానంతో కలిగే భౌతిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను ఈ కార్యక్రమంలో వివరించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ప్లీడర్గా గీతావనజాక్షి మొయినాబాద్: పెద్దమంగళారం మాజీ సర్పంచ్, న్యాయవాది గీతావనజాక్షి అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రంగారెడ్డి కలెక్టర్, మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారానికి చెందిన గీతావనజాక్షి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 2013 నుంచి 2018 వరకు ఆమె గ్రామ సర్పంచ్గా పనిచేశారు. మహిళలకోసం లీగల్ క్లినిక్ను సైతం నడుపుతున్నారు. చేవెళ్ల జూనియర్ సివిల్ కోర్టు, ఇతర కోర్టులకు అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్గా ఆమెను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్గా నియమితులైన సందర్భంగా పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. -
వెలవెలబోతున్న గ్రామసభలు
దౌల్తాబాద్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామసభల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యం లేక గ్రామాలు అభివృద్ధి చెందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే నామమాత్రంగా గ్రామసభలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంటున్నాయి. గ్రామపంచాయతీల అభివృద్ధిలో గ్రామసభల నిర్వహణ ఎంతో కీలకం. ఆయా శాఖల అధికారులతో పాటు పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ప్రజలు గ్రామసభల్లో పాల్గొని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం చర్చిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరు, లబ్ధిదారుల వివరాల నమోదు గ్రామసభల ద్వారా నిర్వహిస్తారు. ప్రభుత్వాలు చేపట్టే కొత్త పథకాలు, పనులపై ప్రజల అభిప్రాయాలు ఈ సభల ద్వారానే తెలుస్తాయి. ఇంత ప్రాధాన్యం ఉన్న గ్రామసభలు జిల్లాలో నామమాత్రంగానే కొనసాగడం విశేషం. గ్రామసభల నిర్వహణ ఇలా... గ్రామపంచాయతీల్లో ప్రతి రెండు నెలలకోసారి గ్రామసభలను సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించాలి. అయితే ప్రస్తుతం సర్పంచ్లు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులే గ్రామసభలు నిర్వహిస్తున్నారు. పంచాయతీతో పాటు అనుబంధ గ్రామాల్లో సభలు నిర్వహించే తేదీని సంబంధిత పంచాయతీ కార్యదర్శులు సిబ్బందితో దండోరా వేయించాలి. నిబంధనల ప్రకారం విధిగా 17శాఖల అధికారులు జనాభాలో సుమారు 20శాతం మంది ప్రజలు గ్రామసభకు హాజరు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కనీసం 50మందితో గ్రామసభను ఏర్పాటు చేసుకోవాలని నిబంధనలు ఉన్నా తూతూమంత్రంగా గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీ ఆదాయ, వ్యయాలపైన కార్యదర్శులు నివేదికలు చదివి వినిపించాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆసక్తి చూపని గ్రామస్తులు జిల్లాలోని చాలా గ్రామాల్లో నిర్వహించే గ్రామసభలకు కనీసం పది నుంచి ఇరవై మంది కూడా రావడంలేదు. ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, వీఓఏలు, వైద్యసిబ్బంది మాత్రమే వస్తున్నారు. పంచాయతీల అభివృద్ధి విషయంలో ప్రజలకు నాయకులకు మధ్య అంతగా సమాచారం ఉండడంలేదు. గ్రామసభల్లో చర్చిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపితే గ్రామసభలకు ఆదరణ పెరిగే అవకాశం ఉంది. సమస్యలు పేరుకుపోవడంతో సభలకు ఆదరణ తగ్గుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. కనిపించని ప్రజల భాగస్వామ్యం అవగాహన కల్పించని అధికారులు ప్రజల భాగస్వామ్యం పెరగాలి గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యం మరింతగా పెరగాలి. సభల నిర్వహణపై కార్యదర్శులతో గ్రామాల్లో దండోరా వేయిస్తున్నాం. సమాచారం తెలుసుకుని ప్రజలు స్వచ్ఛందంగా సభకు రావాలి. తద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు వీలుంటుంది. – శ్రీనివాస్, ఎంపీడీఓ, దౌల్తాబాద్ -
గ్రూపు–3లో మెరిసిన గిరిపుత్రుడు
మహేశ్వరం: ఉద్యోగం చేస్తూనే ఉన్నత స్థాయికి వెళ్లాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి చదివాడా యువకుడు. పేద కుటుంబంలో పుట్టి గ్రూప్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి సత్తా చాటాడు. మహేశ్వరం మండలం పెద్దమ్మ తండా గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న నల్లచెర్వు తండాకు చెందిన కాట్రావత్ దేవేందర్ నాయక్ శుక్రవారం వెల్లడించిన గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో శంషాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. సంతోషంలో తల్లిదండ్రులు ఇటీవల విడుదలైన గ్రూప్–2, గ్రూప్–1, గ్రూప్–3 ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి ప్రతిభ కనబర్చాడు. అంతకుముందు గ్రూప్–2 ఫలితాల్లో జోనల్ ఎస్టీ కేటగిరిలో 2వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 171వ ర్యాంకు సాధించాడు. గ్రూప్–1 పరీక్ష ఫలితాల్లో 433 మార్కులు సాధించారు. గ్రూప్–3 పరీక్ష ఫలితాల్లో ఎస్టీ కేటగిరిలో 2వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంకు సాధించి మెరిశాడు. దీంతో ఏదైనా ఉన్నత ఉద్యోగం తమ కుమారుడికి వస్తుందని దేవేందర్నాయక్ తల్లిదండ్రులు లక్ష్మి, రాములు నాయక్ సంతోష పడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంకు -
హోలీ శుభాకాంక్షలు
స్పీకర్ ప్రసాద్కుమార్ అనంతగిరి: రాష్ట్ర ప్రజ లకు స్పీకర్ ప్రసాద్కుమార్ గురువారం ఒక ప్రకటనలో హోలీ శు భాకాంక్షలు తెలిపారు. పండుగను స్నేహితు లు, కుటుంబసభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. శరీరానికి హాని కలిగించని రంగులను వినియోగించాలన్నారు. నేడు డయల్ యువర్ డీఎం అనంతగిరి: వికారాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యలు, సూచనలను సెల్ నంబర్ 9959226252కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు. తాండూరులో.. తాండూరు టౌన్: తాండూరు ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికుల సమస్యల పరిష్కా రం కోసం శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీఎం సురేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలను సెల్ నంబర్ 9959226251కు కాల్ చేసి తెలపాలన్నారు. ఉదయం 10నుంచి 11 గంటల మధ్య కాల్ చేయవచ్చని తెలిపారు. చేసి తెలియపరచాలన్నారు. 16న మెగా జాబ్మేళా తాండూరు టౌన్: తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 16న ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా నిరుద్యోగుల కోసం మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు క్యాంపు కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ ఫాక్స్కాన్ వారి సౌజన్యంతో ఈ జాబ్మేళా నిర్వహించనున్న ట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 2గంటల వరకు జాబ్మేళా ఉంటుందన్నారు. పది, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన మహి ళా నిరుద్యోగులు తమ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాల కోసం సెల్ నంబర్ల 9739693954, 8688547057లో సంప్రదించాలన్నారు. చట్టాలపై అవగాహన ఉండాలి అనంతగిరి: చట్టాలపై నేటి యువతకు అవగాహన ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్ అన్నారు. గురువారం వికారాబాద్లోని ఎస్ఏపీ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో బాధ్యతగల పౌరులుగా మెలగాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేష్, రాము, శ్రీనివాస్, ప్యానల్ న్యాయ వాది రాజశేఖర్, ప్రిన్సిపాల్ మందారికా అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పీఎంశ్రీ పథకాన్ని రద్దు చేయాలి షాద్నగర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బీస సాయిబాబ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు గురువారం సీఐటీయూ నాయకులతో కలిసి సీడీపీఓ షబానా బేగంకు వినతిపత్రం అందజేశారు. -
24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
● తిరుమల తరహాలో నిత్య కై ంకర్యాలు ● రోజూ శ్రీవారికి వాహన సేవలు ● ఏర్పాట్లు చేస్తున్న ఆలయ ధర్మకర్తలు కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్లో వెలిసిన శ్రీవారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన కలియుగ వైకుంఠ దైవం పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తుల ఇలవేల్పుగానిలిచిన శ్రీవారి ఉత్సవాలను వేద పండితులైన బ్రాహ్మణులు తిరుమల తరహాలో నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. తిరుమల తిరుపతి వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించే ఉత్సవాల్లో నిత్యం వాహన సేవలు, నిత్య కై ంకర్యాలు, పూజలు, సుప్రభాతం, తోమాల సేవ, అలంకరణ కనుల పండువగా కొనసాగుతాయి. గతం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను కొనసాగించడానికి ధర్మకర్తలు సిద్ధమయ్యారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శేష వస్త్రాలను సమర్పిస్తారు. నిత్య కార్యక్రమ వివరాలు 24వ తేదీ సోమవారం కోవిలాళ్వార్ల తిరుమంజనం, 25న మంగళవారం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పన, 26న ధ్వజారోహణం, తిరుచ్చి ఉత్సవం, పెద్ద శేషవాహనం, 27న చిన్న శేషవాహనం,హంసవాహనం, 28న సింహవాహనం, వ్యాళి వాహనం,29న కల్పవక్ష వాహనం, సర్వభూపాల వాహనం, అమావాస్య పూలంగి సేవ, 30న మోహినీ అవతార ఉత్సవం, ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం, గరుడోత్సవం, లంకా దహనం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శేష వస్త్రాలు సమర్పన, 31న హనుమంత వాహనం, వసంతోత్సవం, గజవాహ నం, ఏప్రిల్ 1న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 2న రథోత్సవం, అశ్వవాహనం వీధి ఉత్సవం, 3న పల్లకీ ఉత్సవం, చక్రస్నానం, ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ప్రతి రోజూ మధ్యాహ్నం 3గంటలకు ఉత్సవర్లకు అభిషేకం, సాయంత్రం 7గంటలకు ఊంజల్ సేవ, శ్రీ బాలాజీ పాడుతా తీయగా కార్యక్రమం, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు భజన కార్యక్రమాలు ఉంటాయి. -
గొంతు తడపని ‘మిషన్ భగీరథ’
పరిగి: మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. పట్టణంలోని 5వ వార్డు (వేంకటేశ్వస్వామి ఆలయం చుట్టూ ఉన్న కాలనీలకు ఏడాదిగా నీటి సరఫరా కావడం లేదు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. మిషన్ భగీరథ పైప్లైన్ మరమ్మతులకు కాలనీ వాసుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పట్టణంలోని చాలా కాలనీల ప్రజలు సొంత బోర్ల ద్వారా నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. పాత పరిగి, మరి కొన్ని కాలనీలకు మాత్రమే రోజూ నీటి సరఫరా జరుగుతోంది. పరిగి మున్సిపాలిటీలో 34,500 మంది జనాభా ఉండగా వారికి నిత్యం 42,22,500 లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం మున్సిపాలిటీలో 3.60 ఎంఎల్డీ బల్క్ వాటర్ అందుబాటులో ఉంది. మిషన్ భగీరథ ద్వారా 1.67 ఎంఎల్డీ నీరు సరఫరా చేస్తున్నారు. మోటర్ల ద్వారా 1.25 ఎంఎల్డీ నీరు, రెండు సంపుల ద్వారా దాదాపు 5లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇవి కాకుండా 72 బోర్లు, 15 ట్యాంకులు ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. వేసవిలో తాగునీటి కోసం రూ.15లక్షలు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. -
దాహం.. దాహం
శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 202510లోuకొడంగల్: మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కృష్ణమ్మ ప్రజల దాహం తీరుస్తోంది. కొడంగల్, పాత కొడంగల్, గుండ్లకుంట, కొండారెడ్డిపల్లి, బూల్కాపూర్, ఐనన్పల్లి గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణ శివారులో సిద్దనొంపు సమీ పంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్లుటీపీ) నుంచి ఓవర్హెడ్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేసి కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపల్ పరిధిలో తాగునీటి సమస్య లేదని కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యం నీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. ఏటా వేసవిలో తాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిసినా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోనూ నీటి సమస్య ఉంది. పట్టణ ప్రజలకు సరిపడా నీరు సరఫరా కావడం లేదు. వికారాబాద్లో రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. తాండూరు, పరిగి పట్టణాల్లో కూడా ప్రజలకు నీటిపాట్లు తప్పడం లేదు. కొడంగల్ పట్టణంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. వికారాబాద్: మున్సిపల్ పరిధిలో రోజు తప్పించి రోజు తాగునీరు సరఫరా అవుతోంది. మిషన్ భగీరథ పథకం ద్వారా దాదాపు 90 శాతం మేర నీటి అవసరాలు తీరుతున్నాయి. మిగతా లోటును బోరు బావులు, హ్యాండ్ పంపుల ద్వారా తీరుస్తున్నారు. పైప్లైన్ లీకేజీలు పెద్ద సమస్యగా మారింది. దీంతో తాగునీరు కలుషితమవుతోంది. ప్రజలు ఆ నీటిని తాగలేక వాటర్ క్యాన్లు కొనుగోలు చేస్తున్నారు. పైప్లైన్లు వేసే సమయంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవటం వల్ల తొందరగా లీకేజీ అవుతున్నాయి. చాలా కాలనీల్లో నల్లా కనెక్షన్కు ఉన్న ట్యాపులు, మీటర్లను తొలగించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి మున్సిపల్ పరిధిలో 16వేల నివాసాలు.. 70 వేల జనాభా, 10,600 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు ఒకరికి 100 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన వికారాబాద్ మున్సిపాలిటీకి రోజుకు 7 ఎంఎల్డీ(మిలియల్ లీటర్ ఫర్ డే) నీరు అవసరం. ప్రస్తుతం రోజు తప్పించి రోజు సరఫరా చేస్తున్నారు. రెండు రోజులకు 14 ఎంఎల్డీ నీరు అవసరం కాగా 10.4 ఎంఎల్డీలే సరఫరా అవుతోంది. వీటితో పాటు మున్సిపల్ పరిధిలో 198 బోరు బావులు, 56 చేతిపంపులు ఉన్నాయి. నల్లాలు లేని చోట వాటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి సమస్యలు తలెత్తితే శివారెడ్డిపేట్ చెరువును నుంచి సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. న్యూస్రీల్దాహం తీరుస్తున్న కృష్ణమ్మ వికారాబాద్ మున్సిపాలిటీలో తాగునీటికి అవస్థలు రోజు విడిచి రోజు సరఫరా పట్టణ జనాభా 70వేలు,నల్లా కనెక్షన్లు 10,600 నిత్యం 14 ఎంఎల్డీ నీరు అవసరం ప్రస్తుతం సరఫరా చేస్తున్నది10.4 ఎంఎల్డీలే -
ఆదర్శ కవయిత్రి మొల్ల
ప్రొఫెసర్ విజయలక్ష్మి తాండూరు: రామాయణ మహా గ్రంథాన్ని సరళ భాషలో రచించిన మొల్ల జీవితం మహిళా లోకానికే ఆదర్శమని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఏ విజయలక్ష్మి అన్నారు. గురువారం పట్టణంలోని విశ్వవేద పాఠశాలలో కవయిత్రి మొల్ల కళావేదిక ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కవయిత్రిలు జ్వలిత, మంజుశ్రీ, సక్కుబాయిలకు మొల్ల సాహిత్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఆ తర్వాత విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మొల్ల కళా వేదిక ఫౌండర్, అధ్యక్షుడు వెంకట్, ప్రధాన కార్యదర్శి వంశరాజు, కవులు రవీందర్, బాలకృష్ణ, బసవరాజు, కోటం చంద్రశేకర్, యూసుఫ్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి పనుల్లో అక్రమాలు సహించేది లేదు షాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనులు సక్రమంగా జరిగేలా చూడాలని డీఆర్డీఓ శ్రీలత పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఉపాధిహామీ భవనంలో 2023–2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు ఉపయోగపడే పనులను ఎంపిక చేసుకోవాలన్నారు. మొక్క లు నాటడం, వాటి సంరక్షణ, వ్యవసాయ పొలాల్లో కాలువలు తవ్వడం, పొలాలను చదును చేయడం, గట్లు పోయడం వంటి పనులు చేపట్టాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అపర్ణ, ఏపీడీ చరణ్గౌతమ్, ఏఈవో కొండయ్య పాల్గొన్నారు. -
మన బాధ్యత
మెరుగైన వైద్యం● కలెక్టర్ ప్రతీక్జైన్పూడూరు: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందేలా వైద్యాధికారులు చొరవ చూపాలని కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదేశించారు. గురువారం పూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ట్రైనీ కలెక్టర్ ఉమాహారతితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు, కల్పించాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మందులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రి భవనాన్ని, పరిసరాలను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యసేవలు అందించాలని అన్నారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అవసరం మేరకు లైట్లు, ఫ్యాన్లు సమకూర్చుకోవాలని సూచించారు. రోగులు, గర్భిణులకు అందుతున్న సేవలను డాక్టర్ దేవికారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఇంకా ఏమైనా అవసరం ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ భరత్గౌడ్, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటికి తిప్పలు
తాండూరు: మున్సిపల్ పరిధిలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఏడాదిన్నర క్రితం మిషన్ భగీరథ పథకం కింద పలు వార్డుల్లో పైప్లైన్లు వేసి, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు తాగునీరు సరఫరా కావడం లేదు. పాత తాండూరు, మల్రెడ్డిపల్లి, ఎన్టీఆర్ కాలనీ, రాజీవ్ గృహకల్ప కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మున్సిపల్ పరిధిలో 36 వార్డులు.. 14,706 గృహాలు ఉన్నాయి. మొత్తం 80 వేల జనాభా ఉంది. నిత్యం 9 ఎంఎల్డీ నీరు అవసరం ఉంటుంది. కాగ్నా నది వద్ద రెండు పంప్ హౌజ్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పట్టణంలోని 6వేల ఇళ్లకు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. మరో రెండు వేల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చినా సరఫరా కావడం లేదు. ఎన్టీఆర్ కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మించి ఏళ్లు కావస్తున్నా అందుబాటులోకి తేలేదు. 325 బోరు మోటార్లు, 122 చేతి పంపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని పాడయ్యాయి. -
ఆలయ నిర్మాణానికి సహకరించండి
తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం గాజీపూర్లోని చెన్నకేశవ ఆలయ పునఃనిర్మాణానికి దాతలు సహకరించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను సన్మానించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గాజీపూర్లో వెయ్యి ఏళ్ల క్రిందటి చెన్నకేశవ ఆలయం శిథిలావస్థకు చేరడంతో దాతల సహకారంతో పునఃనిర్మిస్తున్నామన్నారు. ఈ మేరకు దాతలు డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఎం.వెంకట్రెడ్డి, తాండూరు పట్టణానికి చెందిన వి.రాజేశ్, ఎల్.పవన్ విరాళం అందజేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్రెడ్డి, మహిపాల్రెడ్డి, లాల్రెడ్డి, వీరప్ప, సాయిలు, రవి, వీరేందర్, సంగమేశ్వర్, నాగర్జునరెడ్డి, బిచ్చన్న, రాములు, రాంచెంద్రి, అంజి, వెంకటయ్య, రాంరెడ్డి, వేణు, సాయి, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి -
భవనం పైనుంచి పడి వృద్ధుడి మృతి
మొయినాబాద్: మొదటి అంతస్తు పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలైన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పీఎస్ పరిధిలోని కనకమామిడిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దింటి గోవింద్రెడ్డి(75) కుటుంబం మొదటి అంతస్తులో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి బయట ఏదో గొడవ జరుగుతుందని చూడటానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. మొదటి అంతస్తుకు రేలింగ్ లేకపోవడంతో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డిన ఆయన్ను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వృద్ధుడు గురువారం సాయంత్రం మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. ఎదురెదురుగా బైక్లు ఢీ ఆర్టీసీ డ్రైవర్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు షాబాద్: ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన షాబాద్ ఠాణా పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని బోడంపహాడ్ గ్రామానికి చెందిన మొగిలిగిద్ద సుధాకర్, కొత్తపల్లి బాలయ్య బైక్పై ఇంటికి వెళ్తున్నారు. అదే గ్రామానికి చెందిన తిమ్మక్క రజినీకాంత్ తన ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో అంతారం స్టేజీ వద్ద ఈ రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుధాకర్, రజనీకాంత్ తీవ్రంగా గాయపడడంతో షాద్నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిగి డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న సుధాకర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా బాలయ్య స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. భార్యను కడతేర్చిన భర్త రహమత్నగర్ : కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి భార్యను హత్య చేసిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రహమత్నగర్ డివిజన్ రాజీవ్గాంధీ నగర్కు చెందిన నరేందర్ స్ధానికంగా మిల్క్ బూత్ నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య పద్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి కూడా వారి మధ్య మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహానికి లోనైన నరేందర్ పద్మ(50)ను గొంతు నులిమి హత్య చేఽశాడు. గురువారం ఉదయం బోరబండ పోలీసుల ఎదుట లొంగి పోయాడు. సంఘటనా స్ధలాన్ని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్కుమార్, ఎస్ఆర్నగర్ ఏసీపీ వెంకటరమణ పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
అడుగుకో గుంత.. ప్రయాణం చింత
మోమిన్పేట: మండల వాసులు నగరానికి వెళ్లాలంటే శంకర్పల్లి మీదుగా సమీపం మార్గం ఉంటుంది. కానీ వీరు మాత్రం వయా సదాశివపేట, సంగారెడ్డి మీదాగా వెళ్లాల్సి వస్తోంది. శంకర్పల్లి మార్గమంతా గుంతలమయంగా మారడంతో చేసేది లేక దూరభారమైనా చుట్టూ తిరిగి వెళ్తున్నారు. బీటీ రోడ్డు వేయాలి మోమిన్పేట నుంచి మైతాబ్ఖాన్గూడ వరకు 19 కిలో మీటర్ల దూరం ఉంటుంది. కానీ ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే జనం జంకుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కనీసం గుంతలు పూడ్చేందుకు సైతం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏన్కతల, దేవరంపల్లి, చక్రంపల్లి, చీమల్దరి, బాల్రెడ్డిగూడెం ప్రజలు తప్పక శంకర్పల్లి రోడ్డు మీదుగానే వెళ్తున్నారు. మిగిలిన మండలాల వారు వయా సదాశివ్పేట మీదుగానే ప్రయాణిస్తున్నారు. రియల్ వ్యాపారం మండలంలో రెండేళ్ల క్రితం జోరుగా సాగింది. ఒక ఎకరా రూ.4కోట్ల వరకు ధరలు పలికాయంటే పరిస్థితి ఇట్టే అర్థమవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన హెచ్ఎండీలో నాలుగు పంచాయతీలు విలీనం కానున్నాయని.. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుని బీటీ రోడ్డు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.శంకర్పల్లి మార్గానికి బదులుగా సంగారెడ్డి మీదుగా వెళ్తున్న ప్రయాణికులు -
సీఎంఆర్ ధాన్యం అందజేయాలి
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్అనంతగిరి: వానాకాలం పంటలకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యాన్ని ప్రభుత్వానికి సత్వరమే అందజేయాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో రైస్మిల్లర్స్, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మాట్లాడుతూ.. సీఎంఆర్ డెలివరీ చేయనివారిపై, ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. 2024–25 వానాకాలం సీజన్లో పాలుపంచుకున్న మిల్లర్లు అందరూ వరి ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి అందజేయాలన్నారు. లేదంటే తదుపరి సీజన్లో వారికి వరి ధాన్యం అలాట్మెంట్ ఉండదని చెప్పారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, డీఎం వెంకటేశ్వర్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్తా, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రెటరీ శ్రీధర్ రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏజెంట్ల నియామకానికి చర్యలు బూత్ స్థాయి ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. గురువారం ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఫారం 6, 7, 8 పెండింగ్, రాజకీయ పార్టీల సమావేశాలు, బూత్ స్థాయి ఏజెంట్ నియామకం తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మార్చి 19 లోగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి బూతు స్థాయి ఏజెంట్ల నియామకానికి చర్యలు చేప ట్టాలని అధికారులకు సూచించారు. ఫారం 6, 7, 8 పెండింగ్లో ఉంటే ఈ నెల 21లోపు పూర్తి చేయాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుధీర్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నేహమత్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ చొరవతోనే అభివృద్ధి
చేవెళ్ల: మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని భారత జాతీయ మహిళా సమాఖ్య(ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల అన్నారు. గురువారం ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో మున్సిపల్ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనభాలో సగభాగం ఉన్న మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను సైతం అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వాలు మహిళల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా 20శాతం మహిళలు పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనతతో భాదపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య నాయకురాలు వెంకటమ్మ, నాయకురాళ్లు లలిత, విజయమ్మ, రమాదేవి, వినోద, సుగుణమ్మ, అంజమ్మ, జయమ్మ, యాదమ్మ, రాములమ్మ, చంద్రకళ, సీపీఐ నాయకులు కె. రామస్వామి, వడ్ల సత్యనారాయణ, బాబురావు, యాదగిరి, శ్రీకాంత్, పెంటయ్య, తదితరులు ఉన్నారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల -
వర్గీకరణ చేపట్టే వరకు పోరాటం
ఆమనగల్లు: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పోతుగంటి కృష్ణమాదిగ అన్నారు. వర్గీకరణ చేపట్టే వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలనే డిమాండ్తో చేపట్టిన దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరాయి. దీంతదీక్షలో కిశోర్కుమార్మాదిగ, సురేశ్, విజయ్కుమార్, సాయి, విజేందర్, మహేశ్, సచిన్, పవన్లు కూర్చున్నారు. ఈ సందర్భంగా పి.కృష్ణమాదిగ మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా పోరాడుతున్నా వర్గీకరణ చట్టబద్దత కల్పించకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నారాయణ, కుమార్, శ్రీను, మహేశ్, సురేశ్, బాలరాజు, శ్రీకాంత్, కృష్ణ, శివ, నర్సింహ, కుమ్మరసంఘం నాయకులు నాగేశ్, బాలకృష్ణ, రమేశ్, తిరుపతి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పి.కృష్ణమాదిగ -
ఉపాధి కూలీల బిల్లులు చెల్లించాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ మర్పల్లి: పెండింగ్లో ఉన్న ఉపాధి కూలీ డబ్బులు వెంటనే వారి ఖాతాల్లో జమచేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.మైపాల్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మండల కేంద్రంలో పార్టీ నాయకులు, ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూలీ డబ్బుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదన్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న పేద రైతులను గుర్తించి వారికి వెంటనే పట్టాలు అందజేయాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సతీష్, లేబర్ యూనియన్ మండల అధ్యక్షుడు ఆనదం, నాయకులు సంజీవులు, అశోక్, చంద్రయ్య, రాజు, శ్రీనివాస్, లాలిబాయి తదితరులు ఉన్నారు. వ్యక్తి బలవన్మరణం దోమ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దోమ పీఎస్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ ఆనంద్కుమార్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన నందార్పేట్ లక్ష్మయ్య(52) తన భార్య మొగులాలీతో తరుచూ గొడవ పడుతూ ఉండేవాడు. బుధవారం గొడవపడిన ఆయన బొంరాస్పేట్ మండలం సాలిందాపూర్లోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. గురువారం తిరిగి ఇంటికి వస్తూ బ్రాహ్మణపల్లి తండా సమీపంలోని ఓ గేదెల షెడ్లో రాడ్డుకు తాడుతో ఉరేసుకున్నాడు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి మృతుడి భార్యకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతున్న యువకుడి మృతి దోమ: బైక్తో ట్రాలీని ఢీకొట్టిన ఘటనలో చికిత్స పొందుతున్న యువకుడు గురువారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని మోత్కూరు గ్రామానికి చెందిన సండి ధన్రాజ్(18), సండి సాయికుమార్ పరిగి వెళ్తున్న క్రమంలో మైలారం గేట్ సమీపంలో ట్రాక్టర్ ట్రాలీని బలంగా ఢీకొట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో క్షతగాత్రులను కుటుంబ సభ్యులు వికారాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో ధనరాజ్ మృతి చెందగా.. సాయికుమార్ పరిస్థితి సైతం విషయమంగానే ఉందని ఎస్ఐ ఆనంద్కుమార్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బైక్ను ఢీకొట్టిన ఆటో ద్విచక్ర వాహనదారుడి మృతి మొయినాబాద్: బైక్ను ఆటో ఢీకొట్టడంతో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన మొయినాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. చిలుకూరు గ్రామానికి చెందిన బక్క రాజు(35) బాలాజీ ఆలయం వద్ద టెంకాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 9గంటల ప్రాంతంలో రాజు తన బైక్పై హిమాయత్నగర్ వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా చిలుకూరు మహిళ ప్రాంగణ సమీపంలో ఎదురుగా వస్తున్న అశోక్ లేలాండ్ ఆటో అతివేగంగా బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజుకు తీవ్రగాయాలవడంతో గమనించిన స్థానికులు స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కకు చేరుకుని మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారలు సంతానం. కేసు దర్యాప్తులో ఉంది. -
ఆర్టీసీ డ్రైవర్పై దురుసు ప్రవర్తన
ధారూరు: ఆర్టీసీ బస్సు వెనుకాలే వస్తున్న కారు ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద బస్సును తగులుకుంటూ ముందుకెళ్లింది. కారు గీతలు పడడంతో సదరు యజమాని బస్ డ్రైవర్ ఫోన్ తీసుకెళ్లి స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం వెలుగుజూసింది. వివరాలు.. బుధవారం వికారాబాద్ నుంచి తాండూరు వైపు ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తోంది. మోమిన్పేట్ సీఐ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది బలరాం కారు బస్సు వెనుకాలే వస్తోంది. అనంతగిరి సమీపంలోని జింక బొమ్మ రోడ్డు మలుపులో స్పీడ్ బ్రేకర్ వద్ద బస్సు స్లోగా వెళ్తుండడంతో కారు బస్సు వెనుక నుంచి రాసుకుంటూ కొంత దూరం వెళ్లగా గీతలు పడ్డాయి. వెంటనే బలరాం బస్సును ఆపి డ్రైవర్పై దురుసుగా ప్రవర్తించి సెల్ఫోన్ లాక్కున్నాడు. డ్రైవర్ది తప్పు కానప్పటికీ బ్రతిమాలి డబ్బు ఇస్తానని చెప్పినా వినకుండా ఫోన్ ఇవ్వకుండా వెళ్లాడని ఆరోపించాడు. దీంతో డ్రైవర్ ధారూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా తమ పరిధిలోరి రాదని, వికారాబాద్ పీఎస్లో ఫిర్యాదు చేయాలని ఎస్ఐ అనిత సూచించారు. 24 గంటలపాటు స్విచ్ఛాఫ్ బస్సు డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో నా ఫోన్ జీపీఆర్ఎస్కు అనుసంధానంగా ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్దే తప్పని అందరు చెప్పిన నా ఫోన్ తీసుకుని పోయి 24 గంటల పాటు స్విచాఫ్ చేసుకున్నారు. చివరకు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశా. మోమిన్పేట సీఐ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బలరాం ఫోన్ ఇవ్వాలని కోరితే రూ. 15వేలు డిమాండ్ చేస్తున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఐ భీంకుమార్ను కోరారు. కాగా సీఐని వివరణ కోరేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేరు. జీపీఆర్ఎస్కు అనుంసంధానమైన ఫోన్ లాక్కెళ్లిన హెడ్ కానిస్టేబుల్ బలరాంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్రైవర్ షఫీ -
నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచండి
కొడంగల్ రూరల్: రైతాంగానికి నాణ్యమైన విత్తనా లు, ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి డీలర్లకు సూచించారు. బుధవారం మండలంలోని పర్సాపూర్ రైతు వేదికలో డివిజన్లోని ఎరువుల దుకాణాల డీలర్లకు వ్యవసాయ చట్టాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందు కొనుగోలు చేసే రైతులకు బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదని, లేబుల్ లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు ఉంటాయన్నారు. అనుమతి లేని విత్తనాలు, నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా డీలర్లు అధికారులకు సహకరించాలని కోరారు. విత్తనాలను అక్రమంగా నిల్వ చేసినా, రవాణా చేసినా, ప్యాకెట్ లేకుండా లూజుగా అమ్మినా జరిమానా తోపాటు శిక్ష తప్పదన్నారు. రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. స్టాక్కు సంబంధించి ఎప్పటికప్పుడు రికార్డులు నమోదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ శంకర్ రాథోడ్, మండల వ్యవసాయాధికారులు జి.తులసి, హిమబిందు, ఏఈఓలు రాజు రాథోడ్, అశ్విని, డీలర్లు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి ఎరువుల దుకాణాల డీలర్లతో సమావేశం వ్యవసాయ చట్టాలపై అవగాహన ఉండాలని సూచన