breaking news
Vikarabad District News
-
బీపీ నియంత్రణతో గుండెపోటుకు చెక్
తాండూరు: రక్తపోటు నియంత్రణతోనే గుండెపోటు నివారించవచ్చని ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఏ) జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జయప్రసాద్ అన్నారు. ఆదివారం ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా లయన్స్క్లబ్ ఽఆధ్వర్యంలో రన్ ఫర్ హెల్దీ హర్ట్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ నుంచి సాయితరుణ్ ఆస్పత్రి వరకు నడిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హృద్రోగ సమస్యలు,. నివారణ చర్యలపై డాక్టర్ జయప్రసాద్ అవగహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చైర్మన్ బస్వరాజ్, కార్యదర్శి గౌరీశంకర్, మాజీ కౌన్సిలర్ సోమశేఖర్, నాయకులు తదితరులున్నారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జయప్రసాద్ -
ఎకరాకు రూ.50 వేలు చెల్లించాలి
బంట్వారం: పంట నష్ట పరిహారం ఎకరాకు రూ.50 వేలు చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బంట్వారం, కోట్పల్లి మండలాల్లో పర్యటించి భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి నష్టం అంచనాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందే వరకు అండగా నిలుస్తామన్నారు. వాగుల చుట్టూ ఉన్న పంట పొలాలన్ని పూర్తిగా నీట మునిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూమి కోతకు గురియై పొలాలు సైతం కొట్టుకుపోయాయన్నారు. అలాగే దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. అనంతరం ఎన్నారంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. 22 నెలల పాలనలో కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు పంచారు. ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ నాయకులు ఓట్లకు వస్తే నిలదీయాలన్నారు. అనంతరం జిన్నారంలో బతుకమ్మ సంబరాల్లో పాల్లొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సుందరి అనిల్, మల్లేశం, నాయకులు రాములు, వెంకటేష్యాదవ్, బల్వంత్రెడ్డి, దశరథ్గౌడ్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే ఆనంద్ -
అలుగుపారి.. వంతెన దెబ్బతిని
ధారూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోట్పల్లి ప్రాజెక్టు అలుగు పారడంతో రుద్రారం–నాగసమందర్ గ్రామాల మధ్యనున్న వంతెన పాక్షికంగా కొట్టుకుపోయింది. వరద ఉధృతి తగ్గడంతో దెబ్బతిన్న బ్రిడ్జి సోమవారం బయటపడింది. ఇరు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. 2016లో ఈ వంతెన వరదనీటి ప్రవాహానికి కొట్టుకపోగా రూ.50 లక్షలతో తాత్కాలికంగా నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం రాకపోకలు స్తంభించడంతో రెండువైపులా నుంచి రావడానికి 10 కిలోమీటర్లకు బదులుగా 60 కిలోమీటర్ల దూరభారం అవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. -
వరద నీరు వస్తుందని ఆందోళన
తాండూరు రూరల్: మండలంలోని సంగెంకలాన్ గ్రామ శివారులోని చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై తమకు నమ్మకం లేదని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామ సమీపంలోని బండలవాగు వద్ద రైల్వేట్రాక్ ఫిల్లర్లతో వరద నీరంతా ఎస్సీకాలనీలో వస్తోందని ఆందోళన చేపట్టారు. రెండోరోజు సోమవారం సైతం గ్రామ శివారులో ఉన్న రైల్వేట్రాక్ వద్ద గూడ్స్ రైలును అడ్డుకున్నారు. దాదాపు గంటపాటు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న చెట్టినాడు ప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ తమకు నమ్మకం లేదని గ్రామస్తులు మండిపడ్డారు. ఆందోళన చేసిన తర్వాత పరిష్కారిస్తామని చెప్పి కనిపించకుండా పోతారని వాపోయారు. భారీ వర్షం కారణంగా ఎస్సీకాలనీలోని ఇళ్లల్లోకి మోకాళ్లలోతు వరద నీరు వచ్చిందన్నారు. నిత్యవసర సరుకులు పాడయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతకి ఆందోళన విరమించకపోవడంతో కంపెనీ జీఏం శేఖర్బాబు ఎస్సీకాలనీలో పర్యటించారు. కాలనీవాసులతో మాట్లాడి నిత్యవసర సరుకులు, సామగ్రిని అందజేస్తామని హామీ ఇచ్చారు. గూడ్స్రైలును ఆపిన విషయం తెలుసుకున్న కరన్కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్, తాండూరు రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఆందోళనకారులకు సర్ది చెప్పారు. రైలు పట్టాలపై కూర్చున్న సంగెంకలాన్ గ్రామస్తులు -
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
అనంతగిరి: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ.. పెండింగ్ వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు పండుగ పూట కూడా పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు కల్పించుకుని పెండింగ్లో ఉన్న వేతనాలు మంగళవారం వరకు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు గోవర్ధన్, తుకారాం, మహేందర్, ఊషయ్య, శ్రీనివాస్, నర్సమ్మ, రవికుమార్, రామకృష్ణ, లక్ష్మయ్య, యాదయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ -
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు కుల్కచర్ల: సీఎంఆర్ఎఫ్.. పేదలకు వరమని కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామంలో పలు తండాల బాధితులకు మంజూరైన చెక్కులను సోమవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు ముదిరాజ్ మాట్లాడుతూ.. అర్హులైన బాధితులు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, అంబు, రాజు, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం ధర్నా కుల్కచర్ల: భారత్ గ్యాస్ సిలిండర్లు సమయానికి సరఫరా చేయడం లేదని వినియోగదారులు సోమవారం ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని వినియోగదారులు భారత్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం వద్ద ఉదయం నుంచి సిలిండర్ల కోసం నిరీక్షించారు. ఏజెన్సీ నిర్వాహకులు స్పందించకపోవడంతో పరిగి–మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు, పోలీసులు వారికి సర్దిచెప్పి సిలిండర్లను అందజేశారు. ముందస్తు బుకింగ్ లేకుండా కార్యాలయం వద్దకు రావడంతో సమస్య తలెత్తిందని నిర్వాహకులు చెబుతున్నారు. సిలిండర్ల కోసం ఒకరోజు ముందుగానే బుక్ చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. అంగన్వాడీ సిబ్బందికి చీరల పంపిణీ కొడంగల్ రూరల్: పట్టణంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గామాత సన్నిధిలో సోమవారం అంగన్వాడీ సిబ్బందికి, ఆశ కార్యకర్తలకు మున్సిపల్ మాజీ చైర్మన్ ఆర్.జగదీశ్వర్రెడ్డి చీరలు పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు అమ్మవారి సన్నిధిలో ముత్తైదువులతో కుంకుమ, పసుపు(పసుపు బొట్టు) అందిస్తూ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు లక్ష్మీనారాయణగుప్తా తదితరులు పాల్గొన్నారు. బెన్నూరులో కూలిన ఇల్లు యాలాల: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని బెన్నూరు గ్రామానికి చెందిన మాల అమృతమ్మకు చెందిన ఇల్లు కూలింది. పైకప్పు తోపాటు బయటి గోడలు బీటలు వారాయి. దీంతో అమృతమ్మ భయాందోళన వ్యక్తం చేసింది. తమకు ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు కోరింది. -
గ్రూప్ –2 ఫలితాల్లో సత్తా
దోమ: గ్రూప్ –2 ఫలితాల్లో మండలం నుంచి ఇద్దరు అభ్యర్థులు సత్తాచాటారు. చట్లచందారం గ్రామానికి చెందిన వార్ల వెంకటయ్య కుమార్తె వార్ల సుష్మ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ)గా నియమితులయ్యారు. మల్లేపల్లి తండాకు చెందిన విస్లావత్ గణేశ్ ఎకై ్సజ్ ఎస్సై ఉద్యోగం సాధించారు. వీరిని ఆయా గ్రామాల ప్రజలు అభినందించారు. బైక్ను ఢీకొట్టిన టిప్పర్ కార్పెంటర్ దుర్మరణం షాద్నగర్రూరల్: టిప్పర్ ఢీకొని కార్పెంటర్ మృతి చెందిన ఘటన పట్టణంలోని పాతజాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ శరత్కుమార్ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న శివశంకర్(33) ఈశ్వర్కాలనీలో కార్పెంటర్ షాపు నడుపుతున్నాడు. ఆదివారం అర్ధరాత్రి తన షాపు మూసి బైక్పై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో మహబూబ్నగర్ రోడ్డులోని యమ్మీ బేకరీ ఎదురుగా ఉన్న దుకాణానికి వెళ్లి రోడ్డుపైకి వస్తుండగా టిప్పర్ వెనుక నుంచి వేగంగా వచ్చి బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివశంకర్ తలకు తీవ్ర గాయాలై కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వివరాలను తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు టిప్పర్ను పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. మృతుడి సోదరుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రెచ్చిపోయిన చైన్ స్నాచర్ వృద్ధురాలి మెడలోంచి పుస్తెలతాడు చోరీ ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల ఠాణా పరిధిలో సోమవారం ఓ చైన్ స్నాచర్ చేతివాటం ప్రదర్శించాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. రాగన్నగూడ శోభానగర్లో నివాసం ఉండే దాశరథి చెన్నమ్మ(60) ఎన్టీఆర్ నగర్లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంది. ఉదయం చెన్నమ్మ రాగన్నగూడ సబ్స్టేషన్ సమీపంలో కూరగాయలు పట్టుకుని నడుచుకుంటూ బస్టాండ్కు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వెనకాల నుంచి వచ్చి ఆమె మెడలో ఉన్న మూడు తులాల మంగళసూత్రం లాక్కుని పారిపోయాడు. -
సీసీ కెమెరాలతో నేరాల అదుపు
దోమ: శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపకరిస్తున్నాయని.. ప్రతీ గ్రామంలో తప్పక ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐ వసంత్జాదవ్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని బొంపల్లిలో ఆయన సిబ్బందితో కలిసి సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో, దుకాణాలు, కాలనీలు, ఇళ్ల వద్ద తప్పక ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాములు, శేఖర్, రాములు, షేర్ ఖాన్, షఫీ, రమేష్, ఇంతియాజ్, మధు, బాబు, తదితరు లు పాల్గొన్నారు. అంతకు ముందు బాస్పల్లి గ్రామ సమీపంలో హెడ్ కానిస్టేబుల్ నర్సింలు పోలీసు సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎస్ఐ వసంత్ జాదవ్ -
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్చందు తాండూరు రూరల్: మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు, సమాజం బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్చందు అన్నారు. సోమవారం మండలంలోని జినుగుర్తి గ్రామంలో పీహెచ్సీ వద్ద స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అనంతరం డాక్టర్ రషీద్ మాట్లాడుతూ.. 200 మంది మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో నాయకులు రాంలింగారెడ్డి, అజ్మత్ అలీ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసులు ఎత్తివేయాలి అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి కొడంగల్ రూరల్: అంగన్వాడీలు హక్కుల సాధన కోసం శాంతియుత ఉద్యమం చేస్తుంటే అక్రమ కేసులు పెట్టడం సరికాదని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. సోమ వారం పట్టణంలో సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ సిబ్బందితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రీ ప్రైమరీ విద్యను విరమించుకోవాలనే డిమాండ్తో సీఎం ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమపై కేసులు పెట్టారని, వెంటనే ఎత్తివేయాలన్నారు. ప్రభు త్వం ముందు ఉంచిన 18 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. సత్వరం పరిష్కరించాలి అనంతగిరి: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆయా శాఖ ల అధికారులను ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం 43 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీఓ వాసుచంద్ర పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం మంబాపూర్లో సోమవారం జరిగిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి చెందిన సునీత ఇంటి నిర్మా ణం పూర్తి చేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అంజయ్య, నారాయణరెడ్డి, నాయకులు గోపాల్, నారాయణరెడ్డి, జితేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మహిపాల్రెడ్డి, లొంక నర్సింలు, ఉప్పరి మల్లేశం, రియాజ్, ఎల్లారెడ్డి పాల్గొన్నారు. అస్తిత్వ పోరాటానికి సిద్ధం కావాలి షాద్నగర్: అస్తిత్వ పోరాటానికి మాలలు సిద్ధం కావాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మహేశ్ మాల పిలుపునిచ్చారు. పట్టణంలోని ఆర్ఆండ్బీ అతిథి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేపట్టే ఎస్సీ ఉప వర్గీకరణను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, రోస్టర్ పాయింట్లను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం నవంబర్ 2న హైదరాబాద్లో భారీ ఎత్తున మాలల రణభేరి మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
కోడ్ పక్కాగా అమలు చేయాలి
అనంతగిరి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలి కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదేశించారు. సోమవారం నగరం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ప్రతీక్జైన్ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు ఉంటాయన్నారు. కోడ్ అమలులోకి వచ్చినందున రాజకీయ ప్రచారాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, గోడలపై రాతలు తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్ఓ మంగీలాల్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తదితరులు పాల్గొన్నారు. -
పంట రుణాల మాఫీకి నిర్ణయం
బషీరాబాద్: భారీ వర్షాలకు పూర్తిగా పంటలు కోల్పోయిన రైతులకు అండగా ఉంటామని నావంద్గీ సొసైటీ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. సోమవారం సొసైటీ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశంలో నిర్వహించారు. కాగ్నా నది వరదల కారణంగా పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. బాధిత రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని పాలకవర్గం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు చెప్పారు. మండలంలో 1,117 మంది రైతులు సుమారు రూ.6.5 కోట్ల పంట రుణాలు తీసుకున్నారని వాటిని మాఫీ చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. మండలంలోని రైతులకు సేవాభావంతో యూరియా సరఫరా చేశామన్నారు. సొసైటీకి లాభం లేకున్నా యూరియా అందించామన్నారు. అందరి సహకారంతో సొసైటీ ఆర్థిక అభివృద్ధికి, అనేక వాణిజ్య వ్యాపారాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, గోపాల్రెడ్డి, రంగారెడ్డి, తోట గోపాల్, హన్మంత్రెడ్డి, సీఈఓ వెంకటయ్య, రైతులు పాల్గొన్నారు. -
శరవేగంగా దుద్యాల్ అభివృద్ధి
దుద్యాల్: మండలంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొత్త మండలం కావడంతో సొంత భవనాల కొరత ఏర్పడింది. రెవెన్యూ సేవ లు మినహా, ఇతర కార్యకలాపాలు పాత మండలాల్లోనే కొనసాగేవి. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహిస్తుండటంతో దుద్యాల్కు మహర్దశ పట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు మంజూరయ్యాయి. ఏకంగా రూ.300 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో తహసీల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, వ్యవసాయ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ ఒకే చోటనిర్మిస్తున్నారు. రూ.100 కోట్లతో రోడ్ల విస్థరణ పనులు జోరుగు సాగుతున్నాయి. దుద్యాల్లో రూ.8.5 కోట్లతో మండల సమీకృత భవన నిర్మాణాలు చేపట్టారు. పట్టణ పరిధిలోని మహబూబ్నగర్ – చించోళి జాతీయ రహదారి సమీపంలో రూ.3.5 కోట్లతో పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం సాగుతోంది. అలాగే హకీంపేట్లో రూ.15 కోట్లతో సమీకృత పాఠశాల భవనం చేపట్టారు. మండల కేంద్రంలో రూ.45 కోట్లతో ఏటీసీ సెంటర్ నిర్మాణానికి ఇటీవల మంత్రి వివేక్ వెంకట్స్వామి భూమిపూజ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గౌరారంలో పల్లె దవాఖాన నిర్మా ణ పనులు సాగుతున్నాయి. వీటితోపాటు అంగన్వాడీ కేంద్రం, పాఠశాల భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. హకీంపేట్లో మహిళ శక్తి భవనం, ప్రభుత్వ పెట్రోల్ పంపు పనులు చేపట్టారు. దుద్యాల్ – లగచర్ల మధ్య ధాన్యం నిల్వ కో సం గోదాంలు నిర్మించనున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి. పారిశ్రామిక వాడ ఏర్పాటుతో.. మండలంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియను దాదాపు పూర్తిచేశారు. లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల పరిధిలో దాదాపు రూ.15 వేల కోట్ల వ్యయంతో పరిశ్రమలు నెలకొల్పనున్నట్లు అధికారి పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. -
స్థానిక నగారా
వికారాబాద్: ఎప్పుడెప్పుడా అని అంతా ఆశగా ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఇప్పటికే ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ జారీ చేసిన నేపథ్యంలో తాజాగా ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. దీంతో ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తొలి విడతలో పార్టీ గుర్తులపై నిర్వహించే జిల్లా, మండల ప్రాదే శిక స్థానాలకు ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత సర్పంచ్, వార్డులకు ఓటింగ్ జరుగనుంది. రెండు విడతల్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, మూడు విడతల్లో జీపీల ఎన్నికలు నిర్వహించనున్నారు. సోమవారం నుంచే కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో పోలింగ్ బూత్లను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. పరిషత్కు రెండు విడతల్లో.. జిల్లాలో 20 జెడ్పీటీసీ, 20 ఎంపీపీ, 227 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా, మన జిల్లాలో మాత్రం రెండు విడతల్లో పూర్తి చేయనున్నారు. తొలి విడతలో ఎన్నికలు నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్ తొమ్మిదిన నోటిఫికేషన్ జారీ చేసి, అదే రోజు నుంచి 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 12న నామినేషన్ల స్కూట్నీ చేసి, అర్హులైన అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నారు. 13న అభ్యంతరాలను స్వీకరించి, 14న పరిష్కరించనున్నారు. 15న నామినేషన్ల ఉప సంహరణ సహా అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. 23న ఉదయం 7 నుంచి 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక రెండో విడతలో ఎన్నికలు నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్ 13న నోటిఫికేషన్ జారీ చేసి, అదే రోజు నుంచి 15 వరకు నామినేషన్లు స్వీకరించనుంది. 16న స్క్రూట్నీ, అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ఆ తర్వాత 17న అభ్యంతరాల స్వీకరణ, 18న పరిష్కారం, 19న నామినేషన్ల తిరస్కరణ సహా అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనుంది. 27న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు నిర్వహించనుంది. తొలి, విడత మలి విడత ఎన్నికల ఫలితాలను నవంబర్ 11న విడుదల చేయనుంది. జీపీలకు మూడు విడతల్లో.. జిల్లాలో 594 గ్రామ పంచాయతీలు, 5,058 వార్డులు ఉన్నాయి. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ 17న ప్రారంభమై 31వ తేదీతో ముగియనున్నాయి. రెండో విడత అక్టోబర్ 21న ప్రారంభమై నవంబర్ 4తో, మూడో విడత అక్టోబర్ 25న ప్రారంభమై నవంబర్ 8తో ముగుస్తాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడించనున్నారు. అమలులోకి ఎన్నికల నియమావళి ఎన్నికల కోడ్ సోమవారం నుంచే అమలులోకి వచ్చింది. వరుస ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి పనులకు కోడ్ అడ్డంకిగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యవసరాలు తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ తదితర పనులను మాత్రం అధికార యంత్రాగమే నిర్వహించనుంది. ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయడానికి వీలులేదు. ఓటర్లను ప్రలోభపెట్టే పథకాలు, కార్యక్రమాలు నిర్వహించరాదు. నిధులు మంజూరైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మరో నెలరోజులపాటు బ్రేక్ పడనుంది. ఇప్పటికే నిధులు మంజూరై కొనసాగుతున్న పనులకు మాత్రం ఎలాంటి ఆటంకం ఉండదు. సంక్షేమ పథకాల అమలులో కూడా కొత్త లబ్ధిదారుల ఎంపిక జరగదు. అదే విధంగా పాత లబ్ధిదారులకు మాత్రం యథాతథంగా ఫలాలు అందనున్నాయి. జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు -
కాంగ్రెస్ది కపట నాటకం
● బీసీ రిజర్వేషన్ అడ్డుకునేందుకు సీఎం అనుచరుడితో కోర్టులో పిటిషన్ ● రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్ తాండూరు: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాన్ని 42 శాతం రిజర్వేషన్ల పేరిట దగా చేస్తోందని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్ అన్నారు. ఆదివారం ఆయన పట్టణంలోని ఎన్ఎస్పీ ట్రస్ట్ భవనంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించి 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ నెల 26వ తేదీన 42 శాతం రిజర్వేషన్పై ప్రభుత్వం జీఓ జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్లు ప్రకటించారన్నారు. రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే సీఎం రేవంత్రెడ్డి అనుచరుడు మాధవరెడ్డి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారన్నారు. రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కపట నాటకమాడుతోందని ఆరోపించారు. బీసీ బిల్లు గవర్నర్ వద్ద నేటికీ పెండింగ్లో ఉందన్నారు. బీసీ బిల్లు ఆమోదం పొందకుండానే ప్రభుత్వం రిజర్వేషన్ల జీఓలను తీసుకొచ్చి మోసం చేస్తోందన్నారు. బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నా చేస్తే ఏఐసీసీ నేతలు ఎందుకు మద్దతు తెలపలేదని ప్రశ్నించారు. బీసీలను కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీలతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రభుత్వ మోసాన్ని ప్రజలకు తెలిసేలా 22 నెలల పాలనలో కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట బీఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ప్రజా ఉద్యమం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భానుప్రసాద్, నరేష్గౌడ్, సిద్దిక్, శ్రీధర్, మనోహర్ తదితరులున్నారు. -
అయ్యో.. గోమాత!
బషీరాబాద్: గోశాలలో గోవులను కట్టేసిన తగుళ్లే(తాడు) యమపాశాలయ్యాయి. వరద ఉధృతి నుంచి తప్పించుకోలేక 91 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. ఈ హృదయ విదారక ఘటన జీవన్గీ–జెట్టూరు శివారులో కాగ్నా నది ఒడ్డునున్న గోశాలలో చోటు చేసుకుంది. వరద ఉధృతి తగ్గడంతో ఆదివారం గోశాల నిర్వాహకులు అక్కడి పరిస్థితి చూసి భీతిల్లారు. మహబూబ్నగర్ మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి ఏర్పాటు చేసిన ఈ గోశాల బాధ్యతను గంగ్వార్కు చెందిన బంధువు ప్రతాప్రెడ్డి చూసుకుంటున్నారు. రెండు రోజులుగా వర్షాలు కురవడంతో శనివారం కాగ్నా నది వరద పోటెత్తి గోశాలపై నుంచి సుమారు ఏడు ఫీట్లకు పైగా ప్రవహించింది. వరదల్లో చిక్కుకున్న 136 పశువుల్లో 45 గోవులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడగా 46 కళేబరాలు లభ్యమయ్యాయి. మరో 45 జీవాలు వరదకు కొట్టుకుపోయాయని నిర్వాహకులు తెలిపారు. గోవుల కళేబరాలను ఖననం చేశారు. కాగ్నా వరదకు 91 మూగజీవాలు మృత్యువాత -
పండుగ పూట పరేషాన్
‘ఇందిరమ్మ’కు ఇసుక కొరత ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక దొరకక మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో నిర్మాణ పనులు నిలిచిపోయాయి.వికారాబాద్: ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెండింగ్ పెడుతున్నారు. దీంతో పండుగపూట సైతం పస్తులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి నాలుగు నుంచి ఎనిమిది నెలల వరకు వేతనాలు విడుదల చేయడం లేదని వాపోతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడో ఒకప్పుడు ఉండే ఈ సమస్య కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మరింత జఠిలమైందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదిరోజులు ఆలస్యంగా ఖాతాల్లో జమ చేసినా ప్రభుత్వంపై మండిపడే ఉద్యోగ సంఘాలు వీరి విషయంలో మాత్రం నోరుమెదపడం లేదు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, పోలీసుల టీఏ, డీఏ బిల్లులు సైతం ఆరు నెలలుగా అందడం లేదని పేర్కొంటున్నారు. ఆయా కార్యాలయాల నిర్వహణ బిల్లులు పాస్ కావటం లేదు. అప్పులు చేసి కార్యాలయ విధులు నిర్వహించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేపట్టినా అందని వేతనం జిల్లాలో వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న సుమారు 800 మంది, విద్యాశాఖలో 750 మంది, డీఆర్డీఏలో 200 మంది ఉద్యోగులకు నెలనెలా వేతనాలు అందడంలేదు. గతంలో రెండు, మూడు నెలలు ఆలస్యమవగా ప్రస్తుతం ఒక్కో శాఖలో నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలలుగా వేతనాల కోసం పడిగాపులుకాస్తున్నారు. మండల విద్యావనరుల కేంద్రాల్లో, కస్తూర్భా గాంధీ గురుకులాల్లో విధులు నిర్వహించే నాన్ టీచింగ్ స్టాఫ్, సీఆర్పీలు, ఎంఐసీలు, పీటీఐలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఐఈఆర్సీలు వేతనాలు అందని వారిలో ఉన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో విధులు నిర్వహించే గెస్ట్ లెక్చరర్లు ఎనిమిది నెలలుగా వేతనాలు అందటంలేదంటూ ఇటీవల ఆందోళ న చేపట్టినా ఎటువంటి ఫలితం దక్కలేదు. డీఆర్డీఏ శాఖలో అటెండర్లు, సీసీలు, ఏపీఓలు, టీఏ లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఏపీఎంలు తదితరులు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. చక్కదిద్దకుంటే రోడ్డెక్కుతాం రాష్ట్రంలో దసరా ఘనంగా నిర్వహించుకుంటారు. ఇంటిల్లిపాది కొత్త దుస్తులు కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటికీ వేతనాలు అందక.. బి ల్లులు రాక పండుగకు పస్తులు తప్పేట్లు లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పది నుంచి 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఓ పక్క క్రమబద్ధీకరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుండగా ప్రభుత్వం వేతనాల విడుదలలోనూ అలసత్వం వహిస్తోంది. అప్పు పుట్టడంలేదని ఆవేదన చెందుతున్నారు. వేతనాల విడుదలలో వివక్ష తగదంటున్నారు. పరిస్థితి చక్కదిద్దకుంటే రోడ్డెక్కక తప్పదని హెచ్చరిస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు పెండింగ్ నాలుగు నుంచి ఎనిమిది నెలలుగా ఇబ్బంది పడుతున్న హెల్త్,ఎడ్యుకేషన్, డీఆర్డీఏ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు అందని బిల్లులు అప్పు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్న వైనం -
బీసీకే పట్టం
వరుస వానలు.. ఏకధాటి వర్షాలకు జిల్లా వాసులు బెంబేలెత్తారు. వాగులు, వంకలు పొంగిపొర్లి పంటలు, రోడ్లు పాడయ్యాయి.జెడ్పీ పీఠం..వికారాబాద్: ఎట్టకేలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు వచ్చేశాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కేటాయింపు నేపథ్యంలో ఏడాది నుంచి ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన లిస్టు విడుదల చేసింది. దీంతో ఉత్కంఠ వీడింది. త్వరలో షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆశావహులు ఎన్నికలకుసంసిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు సంతోషంలో ఉండగా.. ప్రతికూలంగా రిజర్వేషన్లు వచ్చిన వారు నిరాశకు గురవుతున్నారు. తొలిసారి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించటంతో జనాభాలో అత్యధికులుగా ఉన్న బీసీలకు ఎక్కువ స్థానాలు దక్కాయి. జిల్లాలో అత్యధిక ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలు బీసీలకు కేటాయించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం సైతం బీసీ జనరల్ కావడంతో పార్టీలు బలమైన బీసీ నేతల వేటలో పడ్డాయి. తాజాగా విడుదల చేసిన రిజర్వేషన్ల ప్రకారం 20 మండలాల్లో ఎనిమిది ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు బీసీలకు కేటాయించారు. 227 ఎంపీటీసీ స్థానాల్లో 94 ఎంపీటీసీ, 594 పంచాయతీల్లో 250 సర్పంచ్ స్థానాలకు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. మద్దతు కూడగట్టుకుంటున్న ఆశావహులు జిల్లాలో గతంలో 367 పంచాయతీలుండగా అదనంగా మరో 227 జీపీలు పెరిగాయి. ప్రస్తుతం జిల్లాలో వ్యాప్తంగా 594 గ్రామ పంచాయతీలు ఏర్పాడ్డాయి. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలను గతంలో ఎస్టీలకే రిజర్వు చేశారు. దీంతో బీసీ రిజర్వేషన్లకు అన్యాయం జరిగిందనే వాదన సైతం తెరపైకి వచ్చింది. ఇప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రకటనతో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. జిల్లాలో గతంలో 4,850 వార్డులుండగా ప్రస్తుతం జిల్లాలో 5,058 వార్డులకు పెరిగాయి. ఈ వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఆశావహులు తమ గ్రూపులు, వర్గాలను కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మద్దతుదారులను పోగేసుకోవటంతో పాటు తమ ప్రాతినిథ్యాన్ని బలపర్చాలని ముఖ్య కార్యకర్తల మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఇక వరుస ఎన్నికలు! అన్ని సజావుగా జరిగితే వరుస ఎన్నికలు రావటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగియగా మరో ఎన్నికల పండగకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల పదవీకాలం గతేడాది జనవరి 31తో ముగియగా ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన జీపీలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం పరిషత్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ప్రకటించడంతో పాటు నోటిఫికేషన్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వరుస ఎన్నికలు రావటం ఖాయమనే తెలుస్తోంది. ఇప్పటికే కలెక్టర్లు, డీపీఓలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఎప్పుడు అనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది.జెడ్పీటీసీ స్థానం రిజర్వేషన్ దుద్యాల, దోమ, మర్పల్లి, కుల్కచర్ల బీసీ మహిళ దౌల్తాబాద్, మోమిన్పేట, బొంరాస్పేట జనరల్ మహిళ పూడూరు, కోట్పల్లి ఎస్సీ మహిళ చౌడాపూర్ ఎస్టీ మహిళ యాలాల, ధారూరు, బంట్వారం, బషీరాబాద్ బీసీ జనరల్ తాండూరు, కొడంగల్, నవాబుపేట జనరల్ వికారాబాద్, పరిగి ఎస్సీ జనరల్ పెద్దేముల్ ఎస్టీ జనరల్ -
కంప్యూటర్ అసోిసియేషన్ అధ్యక్షుడిగా తుల్జారాంగౌడ్
పూడూరు: రాష్ట్ర పంచాయతీరాజ్ కంప్యూటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్.తుల్జారాంగౌడ్, ఉపాధ్యక్షుడిగా ఎం.వెంకట్, ప్రధాన కార్యదర్శిగా నాంచేరి రాములును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొనగాల మహేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. కంప్యూటర్ ఆపరేటర్స్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సంఘం నూతన కమిటీ సభ్యులు మహేశ్కు పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. లగచర్ల అడవుల్లో వదలిన అటవీశాఖ అధికారులు దుద్యాల్: మండలం పరిధిలోని పోలేపల్లి గ్రామంలో కొండచిలువ కలకలం సృష్టించింది. ఆదివారం మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా.. వారి వలకు భారీ కొండ చిలువ చిక్కింది. మత్స్యకారులు వల లాగేందుకు యత్నించగా ఎంతకూ రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ యాదగిరి ఘటనా స్థలికి చేరుకుని విషయాన్ని అటవీశాఖ అధికారులకు చేరవేశారు. వలలో చిక్కిన కొండ చిలువను ట్రాక్టర్లో తీసుకెళ్లి లగచర్ల అటవీ ప్రాంతంలో వదిలినట్లు అటవీశాఖ బీట్ అధికారి రవి తెలిపారు. ఇటివలే కురిసిన వర్షాలకు వచ్చిన వరదల్లో చెరువులోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తాం మాజీ మంత్రి సబితారెడ్డి సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కనిపించడం లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి అన్నారు. ఒకవేళ నిర్వహిస్తే జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలన్నీ బీఆర్ఎస్ కై వసం చేసుకోవడం ఖాయమని చెప్పారు. ఈ మేరకు ఆదివారం శంషాబాద్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో 22 నెలలుగా నాటకాలాడుతున్న రేవంత్ ప్రభుత్వం మొదట్లోనే ఎందుకు జీఓ జారీ చేయలేదని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చాక అమలు చేయడం లేదని అన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించితే రాజ్యాంగబద్ధంగా చర్యలు చేపట్టాల్సింది పోయి జీఓ జారీ చేయడం కాలయాపన కోసమేనని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీ తీర్మానం, గవర్నర్ ఆమోదం, కేంద్ర ఆమోదం కోసం ఢిల్లీలో ధర్నా తదితర డ్రామాలతో కాలయాపన చేసిన రేవంత్ చివరికి మోసపూరిత జీవో జారీచేసి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వాస్తవా లను గమనించలేనంత అమాయకులు ప్రజలు కారని, మోసకారి కాంగ్రెస్కు కర్రకాల్చి వాత పెట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏ రిజర్వేషన్లు వచ్చినా పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణేలకు పిలుపునిచ్చారు. సమావేశంలో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, సీనియర్ నాయకుడు క్యామ మల్లేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చిలకమర్రి నర్సింహ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు పట్నం అవినాష్ రెడ్డి, బూర్కుంట సతీష్, రమేశ్ గౌడ్, కార్మిక నాయకుడు పి.నారాయణ పాల్గొన్నారు. -
రూ.81 లక్షలతో సీసీ రోడ్లు
దోమ: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని బొంపల్లి, బాస్పల్లి, గోడుగోనిపల్లి, దోర్నాల్పల్లి, మైలారం, మోత్కూర్ గ్రామాలలో రూ.81లక్షలతో వేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, యూజీడీ, హైమాస్ట్ లైట్లు, పంచాయతీ భవనాలు తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ శాంతుకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ప్రభాకర్రెడ్డి, బద్రి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్కుమార్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ యాదయ్యగౌడ్, మాజీ సర్పంచ్లు సురేశ్, అనంతయ్య, రాములు, యాదయ్యసాగర్, పార్టీ సీనియర్ నేతలు రాఘవేందర్రెడ్డి, అంతిరెడ్డి, శ్రీనివాస్, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, బాల్రాజ్, యాదగిరి, శేఖర్, రాములు, బషీర్, ఇంతియాజ్, హైమద్, భీమయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మోత్కూర్ గ్రామంలో రూ.1.50 లక్షలతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను కార్యకర్తలతో కలసి ప్రారంభించారు. బొంపల్లి గ్రామంలో సింగిల్ ఫేస్ మోటర్ను ప్రారంభించి గ్రామస్తులకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఓటు చోరీతోనే అధికారంలోకి బీజేపీ పరిగి: ఓటు చోరీతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన పట్టణ కేంద్రంలో ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆత్మ కమిటీ నూతన భవనాన్ని ప్రారంభించారు. సుల్తాన్పూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ బీజేపీ ప్రభుత్వంపై ఓటు చోర్ గద్దే చోడ్ అనే నినాదానికి రాష్ట్రం మద్దతు తెలుపుతోందన్నారు. దొంగ ఓట్లపై రాహుల్గాంధీ పోరాడుతుంటే ఎన్నికల కమిషన్చే కేసులు పెట్టించడం సరికాదన్నారు. బీజేపీ ఓట్ చోరీతో అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని ప్రతి గడప గడపకు చేరవేసే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలన్నారు త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ నియోజకర్గ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఏడీఏ లక్ష్మీకుమారి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రారంభించిన ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
వైభవం.. వేంకటేశ్వర కల్యాణం
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాత్రి స్వామి వారిని అశ్వవాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలన్నీ గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సూర్యప్రభ వాహనంపై అనంతుడు వికారాబాద్లోని ఆలంపల్లిలో వెలిసిన లక్ష్మీఅనంతపద్మనాభ స్వామి వారు ఆదివారం రాత్రి సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. ఆలయ మాడ వీధుల్లో భక్తుల హరినామస్మరణ నడుమ ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అశ్వవాహనంపై ఊరేగిన శ్రీవారు -
గ్రూప్–1 ఉద్యోగిగా తాండూర్ ఎకై ్సజ్ సీఐ
తాండూరు: తాండూరు ఎకై ్సజ్ సీఐ ఆదిశేషిరెడ్డి గ్రూప్–1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యా రు. ఎకై ్సజ్ శాఖ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆదిశేషిరెడ్డి తాండూరు ఎకై ్సజ్ ఇన్చార్జి సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో వెలువడిన గ్రూప్–1 ఫలితాల్లో ఆదిశేషిరెడ్డి ఉత్తమ ర్యాంకు సాఽఽధించడంతో పోలీసు శాఖలో డీఎస్పీగా ఎంపికయ్యారు. శనివారం శిల్పకళావేదికలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఆయన నియామకపత్రాలు అందుకున్నారు. ప్రభుత్వానికి నివేదిస్తాం తహసీల్దార్ పురుషోత్తం మర్పల్లి: పంటనష్ట పరిహారం అంచానా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తహసీల్దార్ పురుషోత్తం అన్నారు. శనివారం ఆయన మండల పరిధిలోని కల్ఖోడ, రావులపల్లి, మర్పల్లి తండాలో పాడైన పంటలను, రోడ్లను పరిశీలించారు. ఆయన వెంట ఎస్ఐ అబ్ధుల్ రహూఫ్ ఆర్ఐమావరెడ్డి ఉన్నారు. అలుగు ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం బంట్వారం: అలుగు ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైంది. బంట్వా రం ఎస్ఐ విమల తెలి పిన ప్రకారం.. కోట్పల్లి మండలం కొత్తపల్లికి చెందిన చింతకింది రవికుమార్ (35), ప్రేమ్ కుమార్ ఇద్దరూ కలిసి శుక్రవారం రాత్రి బైక్పై బంట్వారం మండలం సుల్తాన్పూర్కు వెళ్లా రు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా కొత్తపల్లి చె రువు అలుగు ఉధృతిలో బైక్ అదుపు తప్పి ఇద్ద రూ కింద పడ్డారు. ఆ సమయంలో సుల్తాన్పూ ర్ గ్రామస్తులు చెరువు గట్టు వద్ద నుంచి గమనించి ప్రేమ్కుమార్ను కాపాడారు. రవికుమార్ మాత్రం అలుగు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. శనివారం పోలీసులకు సమాచా రం అందడంతో ఎస్ఐ విమల సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్య లు చేపట్టారు. కిలో మీటరు దూరంలో రవికుమార్ మృతదేహన్ని గుర్తించి స్థానికుల సహయంతో బయటికి తీశారు. మృతుడు స్థానికంగా కూలీ పనులు చేస్తూ ఒంటరిగా జీవించేవాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పో స్టుమార్టం నిర్వహించి మృతదేహన్ని బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. గుట్కా అమ్మకాలపై కఠిన చర్యలు దోమ: గుట్కా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వసంత్జాదవ్ అన్నారు. దోమ మండల కేంద్రంలోని పలు దుకాణాల్లో శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుట్కా, పొగాకు తదితర పాన్ మసాలాలు తిని అనేకమంది కేన్సర్ బారిన పడి, ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వీటిని విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
చివరి మజిలీకి చిక్కులు
● అంత్యక్రియలు చేయాలంటే వాగు దాటాల్సిందే ● వరద నీటి నుంచే ట్రాక్టర్లో మృతదేహాన్ని తరలించిన గ్రామస్తులు ● పాలకులు సమస్య పరిష్కరించాలని డిమాండ్ మర్పల్లి: మండల పరిధిలోని సిరిపురంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు రెండు దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో గ్రామస్తులు ఎవరైనా చనిపోతే వీరన్న వాగు మీదుగానే శ్మశాన వాటికకు వెళ్లాలి. ఇక్కడ వంతెన నిర్మించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా పట్టించుకునే వారే కరువయ్యారు. శుక్రవారం రాత్రి గ్రామానికి చెందిన నిమ్మగల పెంటమ్మ(65) అనారోగ్యంతో మృతి చెందింది. శనివారం చితిపేర్చేందుకు వాగులో పారుతున్న వరద నుంచే ట్రాక్టర్లో కట్టెలు తీసుకెళ్లారు. ఎంతకూ వరద ఉధృతి తగ్గకపోవడంతో ట్రాక్టర్లో మృతదేహం ఉంచి వాగు మీదుగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో ట్రాక్టర్ వరదలో చిక్కుకోవడంతో గ్రామస్తులంతా కలిసి నెట్టుకుంటూ వాగు దాటించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పటికై నా పాలకు స్పందించి వీరన్నవాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రాకపోకలకు బ్రేక్
దుర్గామాత పూజకు ట్రాక్టర్లో వాగుదాటించిన పాలేపల్లి వాసులు దోమ: రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కార ణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నా యి. శనివారం గొడుగునిపల్లి వాగు ఉధృతికి పరిగి–మహబూబ్నగర్ మార్గంలో రాకపోకలు నిలిచాయి. పాలేపల్లి వాగు ఉప్పొంగి ఎక్కడి వా హనాలు అక్కడే ఆగిపోయాయి. దుర్గామాత పూజకోసం పూజారి ట్రాక్టర్ సాయంతో వాగుదాటించారు. బ్రహ్మణపల్లి వాగు సైతం హైలెవల్ వంతెనపై పారుతూ జనజీవనం స్తంభించింది. 27 ఏళ్లకు అలుగు పారిన అయినప్పుడు చెరువు మండల పరిధిలోని అయినప్పుడు గ్రామ పెద్ద చెరువు 27 ఏళ్ల తర్వాత మత్తడి దూకింది. సుమారు 600 ఎకరాల ఆయకట్టు ఉండగా రైతులు సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు 200 ఎకరాల పంట పొలాలు నీటి పాలయ్యాయి. గొడుగోనిపల్లిలో బి.రాములమ్మ ఇంటి గోడ కూలి తిమ్మని సత్తయ్య బైక్ పడింది. దీంతో ద్విచక్రవాహనం పూర్తిగా ధ్వంసమైంది. -
ఆగం చేసిన కోట్పల్లి వరద
రాంపూర్తండా, గట్టేపల్లి రైతులను ముంచిన కోట్పల్లి అలుగునీరు ● వాగులో కొట్టుకుపోయిన నాలుగు గేదెలు వాటి దూడెలు ● 30 విద్యుత్ స్తంభాలు, నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం ధారూరు: రాంపూర్తండాలో సాగుచేసిన కంది, వరి పంటలను కోట్పల్లి ప్రాజెక్టు అలుగునీరు తూడ్చిపెట్టిందని రైతులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. తండాకు చెందిన బుజ్జిబాయి, రుక్కిబాయి, మున్యానాయక్లు సాగుచేసిన వరి, కంది పంట పొలాలు నీటిలో కొట్టుకుపోయాయి. వాగు పక్క నుంచి వేసిన విద్యుత్ లైన్లో దాదాపు 30 స్తంభాలు నేలకొరిగాయి. మూడు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ఓ ట్రాన్స్ఫార్మర్ కొట్టుకుపోయింది. వీధినపడ్డ రైతు తార్యానాయక్ వాగు పక్కనే ఉన్న పొలంలో కుటుంబంతో ఉంటున్న తార్యానాయక్ పాడి పరిశ్రమ కొనసాగిస్తున్నారు. పొలంలో నిర్మించుకున్న ఇంట్లో నిద్రించగా శనివారం తెల్లవారుజామున వాగు ఉధృతంగా ప్రవహించి పాకలో కట్టేసిన నాలుగు గేదెలను, వాటి దూడెలు నీటి ప్రవాహంలో కలిసిపోయాయి. ఎంత వెతికినా వాటి కళేబరాలు కూడా దొరకలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంట్లోకి వదర చేరి సామగ్రి కొట్టుకుపోయింది. నాలుగు ఎకరాల వరిపై ఇసుక మేట వేసింది. నిద్రలోంచి మేల్కన్న తార్యానాయక్ ప్రాణాలను అరచేతిలో పెట్టకుని తండ్రి, భార్యా, ముగ్గురు పిల్లల్ని ఇంట్లోంచి తీసుకెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు. గేదెలు, వాటి దూడలకు రూ. 5 లక్షల విలువ ఉంటుందని, వరి పొలం, ఇంటి సామాగ్రి కలిపి రూ.2 లక్షలు, మొత్తం రూ.7 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాడు. వరుస వర్షాల కారణంగా కోట్పల్లి ప్రాజెక్టు అలుగునీరు వాగు ప్రవహిస్తుండడంతో పంటలు పాడయ్యాయి. వాగుకు ఇరువైపులా 600 మీటర్ల వరకు కంది, పత్తి, వరి పంటలు నేలమట్టమయ్యాయి. మండలంలోని గట్టెపల్లి గ్రామంలోనే 30 ఎకరాలు పత్తి, పది ఎకరాల కంది, 25 ఎకరాల్లో వరి పాడైంది. కౌలు రైతు నర్సింహ 1.70లక్షలతో 15 ఎకరాల్లో కౌలు పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. రుద్రారం, అల్లాపూర్, నాగసమందర్ గ్రామాల్లో దాదాపు 42 ఎకరాల్లో కంది, వరి, పత్తి పంటలు నీటిలో కొట్టుకపోయాయని రైతులు వాపోయారు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పాడైన పంట పంట పొలాలను పరిశీలించి పరిహారం అందిచాలని రైతులు కోరుతున్నారు. కూలిన కేరెళ్లి సొసైటీ భవనం నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలోని కేరెళ్లి సోసైటి భవనం శనివారం కూలింది. భవనం వెనుక బాగంలో కూలడం, దాని పక్కనే ఉన్న అంగన్వాడీ భవనంలో ఎవరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం ధారూరు పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, సీఈఓ కె.నర్సింలు సంఘటన స్థలాన్ని సందర్శించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కూలిన భవనాన్ని వెంటనే డిస్మెటల్ చేయించాలని గ్రామస్తులు కోరారు. ధారూరు: అర్దరాత్రి ఇంట్లోకి వాగునీటి ప్రవాహం చేరడంతో ప్రాణాలతో బయటపడ్డ తార్యానాయక్ కుంటుంబంధారూరు: రాంపూర్తండాలో తార్యానాయక్ ఇంట్లోకి చేరిన వరద -
ఆయకట్టు పంటలకు నష్టం
నీట మునిగిన పత్తి, వరి ● పాడైన రోడ్లు మర్పల్లి: మండల పరిధిలో శుక్రవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షంతో పంటలు పాడయ్యాయి. పత్తి, పసుపు, మొక్కజొన్న, కూరగాయ పంటలు నీట మునిగాయి. రావులపల్లి, కల్ఖోడ ఆర్అండ్బీ రోడ్డు, మర్పల్లి నుంచి తండాకు వెళ్లేందకు వేసిన రోడ్లు తెగిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజల రాకపోకలు స్తంభించాయి. రావులపల్లి చెరువు కింద కుడి, ఎడమ కాల్వల ఆయకట్టులో 200 ఎకరాల వరకు పంటలు కోతకు గురయ్యాయి. దీంతో రైతులు కన్నీటి పర్వంతమయ్యారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ప్రభుత్వంకు విజ్ఞప్తి చేశారు. కల్ఖోడ గ్రామంలో ఓరైతు ఇల్లు వర్షానికి కూలింది. పలు ఇండ్లలో నీరు చేరి జాగరణ చేశారు. తెలుసుకున్న తహసీల్దార్ పురుషోత్తం, ఎస్ఐ రవూఫ్, అధికారులు కల్ఖోడ, రావులపల్లి గ్రామాలలో పంటలను పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. కోతకు గురైన రోడ్లను, పంటలను పరిశీలించి పరిహారం అందేవిదంగా ప్రభుత్వంకు నివేదికలు పంపుతామన్నారు. ఎకరాకు రూ.25వేలు: మెతుకు ఆనంద్ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పార్టీ నాయకులతో కలిసి పాడైన పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పాడైన పంటలకు తక్షణ సాయంగా రైతులకు ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి రైతులు ఉన్నారు. -
నీట మునిగిన పంటలు
మోమిన్పేట: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు పూర్తిగా పాడయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు ధ్వంసమయ్యాయి. నందివాగు పరివాహక ప్రాంతంలోని పంటలు నీట మునిగాయి. రావుల, కోల్కుంద, గోవిందాపూర్, రాళ్లగుడుపల్లి, కాస్లబాదు, మేకవనంపల్లి, మల్లారెడ్డిగూడెం, రాంనాథ్గుడుపల్లి గ్రామాలని పెద్దవాగు పరివాహక ప్రాంతంలోని పంటలకు పూర్తి నష్టం వాటిల్లింది. దుర్గంచెర్వు అలుగు ఉధ్రుతికి రోడ్డు గుంతలమయమైంది. టేకులపల్లిలో ఇళ్లలోకి వరద చేరి ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. -
తెగిన బ్రిడ్జి.. కూలిన ఇళ్లు
యాలాల: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కాగ్నా ఉధృతికి మండలంలోని కోకట్ కాగ్నా బ్రిడ్జి తెగింది. దీంతో తాండూరు–రాస్నం, ముద్దాయిపేట మీదుగా పరిగి, హైదరాబాద్ ప్రాంతాలకు రాకపోకలు నిలిచాయి. శివసాగర్, జుంటుపల్లి ప్రాజెక్టులు అలుగులు పారాయి. బెన్నూరుకు చెందిన తిమ్మయ్య, రాస్నంకు చెందిన మల్లేషం ఇళ్లు కూలాయి. కోకట్ బ్రిడ్జిని పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే వరద ఉధృతికి తెగిన కోకట్ కాగ్నా బ్రిడ్జిని కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తహసీల్దార్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ మార్గంలో రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. యుద్ద ప్రాతిపదికన బ్రిడ్జికి మరమ్మతులకు చర్యలు తీసుకుంటామన్నారు. -
జలదిగ్బంధం
తాండూరు రూరల్: మండల పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా వాగులు ఉగ్రరూపందాల్చడంతో వీర్శెట్టిపల్లి జలదిగ్భందంలో చిక్కుకుంది. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర సరుకులు పాడయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచి చీకటికమ్ముకుంది. విషయం తెలుసుకున్న తాండూరు సబ్ కలెక్టర్ విశ్వప్రసాద్, తహసీల్దార్ తారాసింగ్, యాలాల ఎస్ఐ విఠల్రెడ్డి, ఆర్ఐ గోపి శనివారం గ్రామస్తులకు ధైర్యం చెప్పారు. సాయంత్రానికి ఉధృతి తగ్గి రాకపోకలు కొనసాగాయి. లారీ డ్రైవర్లను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం మండల పరిధిలోని ఓగిపూర్ సమీపంలో సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లిన లారీ డ్రైవర్లు జట్టూరు వాగులో చిక్కుకున్నారు. కర్ణాటక రాష్ట్రం చంద్రపల్లి డ్యాం ఒక్కసారిగా నీటిని విడుదల చేయడంతో జట్టూరువాగు వద్ద లారీలు వరదలో చిక్కుకున్నాయి. ఉత్తర్ప్రదేశ్కు చెందిన ముజావీర్, జార్ఖండ్కు చెందిన బుద్దిరామ్ లారీల్లో ఇరుక్కుకుని కంపెనీ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు కరన్కోట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మహబూబ్నగర్కు చెందిన ఎస్డీఆర్ఎఫ్ బృందం సాయంతో పడవలో వెళ్లి డ్రైవర్లను కాపాడారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ తారాసింగ్, రూరల్ సీఐ నగేష్, ఎస్ఐ రాథోడ్ వినోద్ పర్యవేక్షించారు. సంగెంకలాన్ ఎస్సీకాలనీలోకి చేరిన వరద సంగెంకలాన్ చుట్టూ వాగులు పొంగిపొర్లి ఎస్సీ కాలనీలోని ఇళ్లల్లోకి వరద చేరింది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బోంకూర్ గ్రామం చుట్టూ నీరు చేరి గ్రామస్తులు ఆందోళన చెందారు. మునిగిన సబ్స్టేషన్.. మండలంలోని గౌతపూర్ విద్యుత్ సబ్స్టేషన్ నీట మునిగింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆయా గ్రామాలకు తాండూరు సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా కొనసాగించారు. ఉగ్రరూపంద్చాలిన కాగ్నా అర్ధరాత్రి ఇళ్లలోకి చేరిన వరద ఓగిపూర్–జట్టూరు వాగులో చిక్కుకున్న లారీ డ్రైవర్లు -
అప్రమత్తంగా ఉండండి
అనంతగిరి/పరిగి: భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లో జిల్లాస్థాయి అధికారులతో కలిసి టెలీకాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలో ప్రమాదం జరిగే అవకాశం ఉన్న 50 వాగులు, బ్రిడ్జిలను గుర్తించి రెవెన్యూ, పోలీసులు కాపలా ఉండేలా ఏర్పాట్లు చేశారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ఉధృతంగా ప్రవహించే వాగులు దాటొద్దని గ్రామాల్లో దండోరా వేయించాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్నచోట బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డితో కలిసి పరిగి, వికారాబాద్ మున్సిపల్ పరిధిలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలను పరిశీలించారు. వాతావరణ శాఖ మన ప్రాంతాన్ని రెడ్ అలర్ట్గా ప్రకటించిందని పేర్కొన్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పెద్ద పెద్ద భవనాల వద్ద, చెట్ల కింద ఉండరాదన్నారు. కలెక్టర్ వెంట వికారాబాద్, పరిగి మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, వెంకటయ్య తదితరులు ఉన్నారు. -
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిగి/దోమ: పేదల ఆరోగ్య పరిరక్షణే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం దోమ మండలం బొంపల్లికి చెందిన నలుగురికి రూ.1.70 లక్షల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రభాకర్ రెడ్డి, కిష్టాపూర్కు చెందిన అంజిలయ్య గౌడ్ నూతనంగా నిర్మించుకున్న గృహ ప్రవేశాలకు హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మాలి విజయ్కుమార్రెడ్డి, గ్రంథాల సంస్థ మాజీ డైరెక్టర్ బంగ్ల యాదయ్య గౌడ్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, బొంపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు వెంకట్, నాయకులు అంతిరెడ్డి, రాములు, రమేశ్, శేఖర్, బషీర్, హైమద్, ఇంతియాజ్, హరిలాల్, గోపాల్, యాదయ్య, నర్సింహులు, వెంకట్రెడ్డి, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా..సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా అర్హులను గుర్తించి సీఎం సహాయనిధి మంజూరు చేశారన్నారు. అనారోగ్యానికి గురై ప్రైవేట్లో మెరుగైన చికిత్స నిమిత్తం ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తుందన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పరిగి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి తీరుతామన్నారు. -
డాక్టర్ వినయ్కుమార్కు జిల్లా ఆస్పత్రి బాధ్యతలు
తాండూరు: తాండూ రు పట్టణంలోని ప్రభు త్వ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ వినయ్కుమార్ నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి గర్భిణి మృతికి కారణమైన సూపరింటెండెంట్ సునీతపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో వినయ్కుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శిథిలావస్థ ఇళ్లను గుర్తించండి మున్సిపల్ కమిషనర్ యాదగిరి తాండూరు టౌన్: పట్టణ పరిధిలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించాలని మున్సిపల్ కమిషనర్ యాదగిరి సూచించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో సిబ్బందితో సమావేశమయ్యారు. భారీ వర్షాలు కురుస్తున్నందున పాత ఇళ్లు, శిథిలావస్థకు చేరిన ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. వార్డుల వారీగా ప్రమాదకర ఇళ్లను గుర్తించాలన్నారు. వాటిని తొలగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదన్నారు. అలాగే జనావాసాల మధ్య చెత్తాచెదారం వేయకుండా చూడాలన్నారు. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. సమావేశంలో డీఈ మణిపాల్, మేనేజర్ నరేందర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉమేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. చెరుకు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి తాండూరు రూరల్: తట్టెపల్లి ప్రాంతంలో చెరు కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తామని పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం సొ సైటీ కార్యాలయంలో సీఈఓ చంద్రమౌళి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దేము ల్ మండలంలోని తట్టెపల్లి, బుద్దారం,గాజీపూ ర్, పెద్దేముల్ గ్రామాల్లో రెండు వేల ఎకరాల్లో రైతులు చెరుకు పంట సాగు చేస్తున్నారని తెలి పారు. నాబార్డు నిధులతో పరిశ్రమను నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఇందు కోసం ఎకరా భూమి కేటాయించాలని కలెక్టర్ను కోరనున్నట్లు తెలిపారు. సొసైటీ పాలకవర్గం సభ్యులు ఉప్పరి మల్లేశం, హన్మంత్, రహీం, శంకర్, శ్రీరాం, దిగంబరం, సుక్కమ్మ పాల్గొన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయండి అనంతగిరి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో డిమండ్ చేశారు. ఏడాదిలోగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా ఎలాంటి ప్రయోజనం లేద న్నారు. ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యా యం చేయాలని కోరారు. ఇదే అంశంపై నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సార్ ఆర్యోగం రోజురోజుకూ క్షీణిస్తోందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. అశోక్ ఆర్యోగం మెరుగు పడే వరకూ ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలన్నారు. హనుమంత వాహనంపై శ్రీనివాసుడు అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం రాత్రి శ్రీనివాసుడు హనుమంత వాహనంపై విహరించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. 11 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. -
కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ
అనంతగిరి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, ప్రకృతికే అందం మన బతుకమ్మ సంబురమని కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో డీఆర్డీఏ, మెప్మా, ఉద్యానవన, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై గౌరీమాత పూజ చేసి వేడుకలను ప్రారంభించారు. మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ సందడి చేశారు. కలెక్టర్ బతుకమ్మ ఆట ఆడి ఉద్యోగుల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్ఓ మంగీ లాల్, అడిషనల్ డీఆర్డీఏ నర్శింహులు, శిశుసంక్షేమ శాఖ జిల్లా అధికారి కృష్ణవేణి, డీపీఆర్ఓ చెన్నమ్మ, డీపీఓ జయసుధ, డ్వాక్వా గ్రూపు మహిళలు పాల్గొన్నారు. -
హైవేల అభివృద్ధికి నిధులివ్వండి
తాండూరు: జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని స్పీకర్ ప్రసాద్కుమార్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. శుక్రవారం వారు మహారాష్ట్రలోని నాగ్పూర్లో కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్ – తాండూరు రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని కోరారు. ఇప్పటికే జిల్లాలోని మన్నెగూడ వరకు నేషనల్ హైవే ఉందని, అక్కడి నుంచి తాండూరు వరకు, తాండూరు నుంచి ముంబై జాతీయ రహదారిని అనుసంధానం చేసేలా జహీరాబాద్ వరకు విస్తరించాలని కోరారు. ఇందుకోసం నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందింనట్లు స్పీకర్, ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నేత ఉత్తమ్చంద్ తదితరులు పాల్గొన్నారు. -
పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ
అనంతగిరి: వీరనారి, గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని, ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ సుధీర్తో కలిసి ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రధాన పాత్ర పోషించారని కొనియాడారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్డీఓ మంగీలాల్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి మాధవరెడ్డి, డీటీడీఓ కమలాకర్ రెడ్డి, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి కృష్ణవేణి, డీపీఆర్ఓ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రేపు చలో కలెక్టరేట్
అనంతగిరి: జిల్లాలోని ట్రిపుల్ఆర్ భూ నిర్వాసితులతో రేపు చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ తెలిపారు. గురువారం నాలుగు మండలాల భూ బాధితులతో ఆయన మాట్లాడారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దని సూచించారు. కొత్త అలైన్మెంట్తో పేద, మధ్య తరగతి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పాత అలైన్మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు కృష్ణారెడ్డి, సురేందర్, శ్రీను, నర్సింలు, బాలరాజు, రాంచంద్రయ్య జంగయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త మద్యం దుకాణాలకు టెండర్లు షురూ..
అనంతగిరి: జిల్లాలో నూతన మద్యం పాలసీ 2025– 27 సంవత్సరానికి గాను 59 షాపులకు టెండర్లు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. లాటరీ పద్ధతి ద్వారా 17 దుకా ణాలను వివిధ కేటగిరీలకు కేటాయించినట్లు తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆబ్కారి శాఖ ఆధ్వర్యంలో నూతన మద్యం దుకాణాల కేటాయింపుపై సమావేశం నిర్వహించారు. ఎస్సీ కేటగిరికి 9, ఎస్టీలకు 2, గౌడ కులస్థులకు 6 కేటాయించం జరిగిందని తెలిపారు. మిగిలిన 42 దుకాణాలకు ఓపెన్ కేటగిరి కిందకు వస్తాయన్నారు. ఆసక్తి గల వారు రూ.3.3 లక్షలు (నాన్ రీఫండబుల్)డీడీ తీసి దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 23న కలెక్టరేట్లో లాటరీ తీయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, జిల్లా ఆబ్కారీ అధికారి విజయ భాస్కర్, డీటీడీఓ కమలాకర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి మాధవరెడ్డి పాల్గొన్నారు. -
బీజేపీలో అందరికీ సమ ప్రాధాన్యత
తాండూరు టౌన్: బీజేపీ అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ జన్మదిన సేవా పక్షోత్సవాల్లో భాగంగా గురువారం పట్టణంలోని హరిజన వాడలో జిల్లా కార్యదర్శి వెంకటేష్తో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పక్షం రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్, ఉపాధ్యక్షులు సాయిరెడ్డి, నరేందర్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, లాల య్య, విక్రాంత్, అంబదాస్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో పార్టీ నాయకులు భారతీయ జనసంఘ్ అధ్యక్షుడు, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం, నాయకులు మల్లేష్, కృష్ణ, ప్రకాష్, ప్రహ్లాద్, కిరణ్, నరేష్, సంగమేశ్వర్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీవ్ గృహకల్పలో కార్డన్ సెర్చ్
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ గృహకల్పలో గురువారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, 9మంది ఎస్ఐలు, 6గురు ఏఎస్ఐలు, 45మంది సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా కాలనీలోని అన్ని నివాసాల వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమా నాస్పద వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్లు, సరైన ధ్రువపత్రాలు లేని 41 ద్విచక్ర వాహనాలు, 2ఆటోలు, మరో ఫోర్ వీలర్ను సీజ్ చేశారు. కార్యక్రమంలో వికారా బాద్ టౌన్ సీఐ భీంకుమార్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నిస్తే అరెస్టులా?
దుద్యాల్/దోమ/పూడూరు/పరిగి: పేదలు, బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తే అక్రమంగా అరెస్టులు చేస్తారా..? అని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం దోమ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి అక్రమ అరెస్టులతో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. కొడంగల్ పట్టణంలో అభివృద్ధి పేరిట అడ్డగోలుగా పేదల ఇళ్లు, మసీదులు, దర్గాలు, చర్చిలు కూల్చివేయడం సరికాదని హితవు పలికారు. అరాచకాలను ప్రశ్నించేందుకు వెళ్తున్న తమను అరెస్టు చేయించి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. తాము ఏనాడూ అభివృద్ధిని అడ్డుకోలేదని, బాధితులకు పూర్తి న్యాయం చేసిన తర్వాతే పనులు చేపట్టాలని కోరుతున్నట్లు వివరించారు. పేదల ఇళ్లు కూల్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అసలేం జరిగిందంటే.. కోస్గి పట్టణంలో ఓ వివాహ వేడుకకు హాజరైన నరేందర్రెడ్డి కొడంగల్కు బయలుదేరారు. ఇటీవల కొడంగల్లో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు పలు ఇళ్లు, దర్గా, శ్మశానవాటికను కూల్చివేశారు. ఈవిషయమై నాలుగు రోజుల క్రితం బాధితులు, ముస్లింలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో వారిని కలిసేందుకు నరేందర్రెడ్డి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దుద్యాల్ గేటు వద్ద ఆయన్ను అరెస్టు చేశారు. మొదట దుద్యాల్ పీఎస్కు తరలించాలని భావించారు. అయితే అక్కడికి బీఆర్ఎస్ నేతలు చేరుకోవడంతో దోమ స్టేషన్కు ఆ తర్వాత చన్గోముల్ పోలీస్స్టేషన్ తరలించారు. నరేందర్రెడ్డి తోపాటు దౌల్తాబాద్ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కోట్ల మైపాల్, హస్నాబాద్ మైనార్టీ నాయకుడు ఉస్మాన్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు అరెస్టులు పట్నం నరేందర్రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పలువురు బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేశారు. మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రామకృష్ణను కొడంగల్లో అరెస్టు చేసి పరిగి స్టేషన్కు తరలించారు. వీరిని జెడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యుడు మీర్ మహమూద్ అలీ, మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్కుమార్, ప్రవీణ్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, సురేందర్ తదితరులు కలిశారు. అలాగే దుద్యాల్ మండల అధ్యక్షుడు చాంద్ పాషా, నాయకులు నరేశ్ గౌడ్, బుగ్గప్ప, బసిరెడ్డి, సోమనాథ్, రాములు, విశాల్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు నరేందర్రెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్, మాజీ ఎంపీపీ మల్లేశం, పార్టీ శ్రేణులు దోమ పీఎస్కు చేరుకుని నరేందర్రెడ్డిని పరామర్శించారు. పాలన చేతగాకే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. -
ట్రిపుల్ఆర్ బాధితులకు అండగా ఉంటాం
పూడూరు: ట్రిపుల్ ఆర్ భూ బాధితులకు అండగా ఉంటామని, సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం మండలంలోని రాకంచర్ల ఆలయ ప్రాంగణంలో భూములు కోల్పోతున్న పరిగి, వికారాబాద్, నవాబుపేట్, పూడూరు మండలాలకు చెందిన రైతులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి రైతుల సమస్యలు తెలియజేస్తానని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి ఆలోచించాలని కోరారు. ఈ విషయమై సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్గడ్కారిని కలుస్తానని తెలిపారు. ట్రిపుల్ ఆర్ కారణంగా రైతులకు జరిగే నష్టాన్ని, రైతుల బాధలను అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. పేద రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు కారణంగా ఎక్కువగా పేదల భూములు పోతున్నాయని, పాత అలైన్మెంట్ అమలు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు. పార్టీలకు అతీతంగా పోరాడితేనే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. సమస్య తీవ్రత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసేలా చేయాలని సూచించారు. అనంతరం బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. పెద్దల భూములను కాపాడటం కోసం పేదల కడుపుకొడతారా అని నిలదీశారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పేద రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఎంపీ విశ్వేశ్వర్రెడ్డిని కోరారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు భూనేటి కిరణ్కుమార్, శరత్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, నర్సింహారెడ్డి, మల్లేశం, తాజొద్దీన్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. -
9శాఖలు 0 మొక్కలు
పెద్దేముల్ అటవీ ప్రాంతంలో మొక్కలు నాటుతున్న కూలీలు తాండూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని కొన్ని శాఖలలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు టార్గెట్ ఇచ్చారు. కానీ తొమ్మిది శాఖల ఉద్యోగులు ఒక్క మొక్క కూడా నాటకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వానాకాలం సీజన్ ప్రారంభ దశలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. జూలై నెలలో సమృద్ధిగా కురవడంతో మొక్కలు నాటే ప్రక్రియను ప్రారంభించారు. లక్ష్య ఛేదనలో.. ఈ ఏడాది జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 20 మండలాల్లో 48.38 లక్షల మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. 20 ప్రభుత్వ శాఽఖలు, నాలుగు మున్సిపాలిటీలకు టార్గెట్ కేటాయించారు. ఇప్పటి వరకు ఆయా శాఖలు 35,82,223 మొక్కలు నాటాయి. తొమ్మిది విభాగాలు మాత్రం ఒక్క మొక్క కూడా నాటలేదు. మరో పక్షం రోజులు మాత్రమే గడువు ఉండటంతో టార్గెట్ పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. డీఆర్డీఓ అధికారులు లక్ష్యానికి మించి మొక్కలు నాటారు. అటవీ శాఖ గమ్యానికి చేరువైంది. ఆ జాబితాలో.. మొక్కలు నాటని జాబితాలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటి పారుదల, వ్యవసాయ, మార్కెటింగ్, పోలీసు, పశు సంవర్ధక, గనులు, సంక్షేమ శాఖలు ఉన్నాయి. ఈ విభాగాలకు టార్గెట్ కేటాయించినా ఆ దిశగా ముందుకు సాగలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యం శాఖ టార్గెట్ నాటిన మొక్కలు అటవీ 3,60,000 2,70,774 వ్యవసాయ 6,38,500 0 పశు సంవర్ధక 5,000 0 ఆర్అండ్బీ 500 0 డీఆర్డీఓ 26,87,000 30,87,000 ఉద్యాన 2,55,400 2,55,400 పౌరసరఫరాల 2,000 2,000 విద్య 11,000 11,000 మార్కెటింగ్ 500 0 పంచాయతీరాజ్ 4,00,000 0 పరిశ్రమల 10,000 10,000 గనుల 58,000 0 ఎకై ్సజ్ 58,900 33,955 డీడబ్ల్యూఓ 1,000 0 పోలీసు 9,200 0 నీటి పారుదల 7,600 0 మున్సిపాలిటీ తాండూరు 3,50,000 3,90,000 వికారాబాద్ 1,10,500 1,42,500 కొడంగల్ 3,25,000 3,25,500 పరిగి 83,550 63,854 -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం
కుల్కచర్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటి అధిక స్థానాలు సొంతం చేసుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాదరావు అన్నారు. బుధవారం కుల్క చర్లలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత మోర్చా మండల అధ్యక్షుడిగా ఆంజనేయులును, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా మహేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బీజేపీ శ్రేణులు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జి.వెంకటయ్య ముదిరాజ్, టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడు వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హరికృష్ణ, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సౌమ్యారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కాటనిపల్లి ఆంజనేయులు, మైపాల్, నాయకులు రాంచంద్రయ్య, కొండ ఆంజనేయులు, సూర్యకాంతం, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. అధిక స్థానాలు సొంతం చేసుకుంటాం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి -
యంత్రం జాడేదీ !
రాయితీ వ్యవసాయ పరికరాల కోసం రైతుల ఎదురుచూపులువికారాబాద్: రాయితీ యంత్ర పరికరాల కోసం మహిళా రైతులు ఎదురుచూడక తప్పడం లేదు. దరఖాస్తులు స్వీకరించి ఆరు నెలలు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం వాటి ఊసెత్తడంలేదు. మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీపై పథకం అమలు చేయాలని నిర్ణయించింది. కిసాన్, స్వయం సహాయక సంఘాల ద్వారా పరికరాల కొనుగోలుకు అవకాశం కల్పించింది. అయితే ప్రక్రియ దరఖాస్తుల దశ దాటడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యంత్రలక్ష్మి పథకం పేరిట వ్యవసాయ పనిముట్లు అందిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు, రైతు బీమా పథకాల కారణంగా రాయితీ యంత్రాలకు స్వస్తి పలికారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పథకం అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించినా ఇంకా ప్రారంభం కాలేదు. ఈలోగా కేంద్ర ప్రభుత్వం మహిళా రైతులకు సబ్సిడీపై పని ముట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా దరఖాస్తులు కూడా స్వీకరించింది. జిల్లాకు 454 యూనిట్లు జిల్లాకు 454 యూనిట్లు మంజూరు చేశారు. జనరల్ కేటగిరి కింద చిన్న, సన్నకారు రైతులతోపాటు పెద్ద రైతులు వస్తారు. వీరికి 338 యూనిట్లు కేటాయించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళా రైతుల కోసం 77 యూనిట్లు, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన చిన్న, సన్నకారు, పెద్ద రైతులకు 39 యూనిట్లు కేటాయించారు. వికారాబాద్ నియోజకవర్గంలోని ఎస్సీలకు 25, ఎస్టీలకు 11, జనరల్కు 116 యూనిట్లు కేటాయించారు. పరిగి నియోజకవర్గంలోని ఎస్సీలకు 17, ఎస్టీలకు 09, జనరల్కు 77 యూనిట్లు కేటాయించారు. కొడంగల్ నియోజకవర్గంలోని ఎస్సీలకు 20, ఎస్టీలకు 11, జనరల్కు 79 యూనిట్లు మంజూరు చేశారు. తాండూరు నియోజకవర్గంలోని ఎస్సీలకు 15 యూనిట్లు, ఎస్టీలకు 8, జనరల్ మహిళలకు 64 యూనిట్లు కేటాయించారు. ఇందులో కాళ్లు, చేతుల సాయంతో పని చేసే స్ప్రేయర్లు, బ్యాటరీతో పని చేసే స్ప్రేయర్లు ఉన్నాయి. నాగలి, గొర్రు, ఎరువులు, విత్తనాలు వేసే ట్రాక్టర్కు వినియోగించే పరికరాలు, పురుగుల మందు స్ప్రే చేసేం డ్రోన్లు కూడా ఉన్నాయి. పవర్ వీడర్లు, బ్రష్ కటర్లు తదితర యంత్ర పరికరాలను రాయితీపై అందజేయనున్నారు. ఈ విషయమై డీఏఓ రాజరత్నంను వివరణ కోరగా యంత్ర పరికరాల కోసం రైతులు దరఖాస్తులు చేసుకున్న విషయం నిజమే కానీ, అర్హుల ఎంపికపై తమకెలాంటి ఆదేశాలు అందలేదని తెలిపారు. ఆరు నెలల క్రితం ఆన్లైన్లో దరఖాస్తులు జిల్లాకు 454 యూనిట్లు మంజూరు మహిళా రైతులకు మాత్రమే.. రూ.3 వేల నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఉపయోగం అర్హులు ఎవరంటే.. 2024 – 25 వ్యవసాయ సంవత్సరానికి గాను ఈ పథకం వర్తింపజేయనున్నారు. రూ.3 వేల నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు రాయితీ వర్తించనుంది. ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు రిజర్వేషన్ ప్రాతిపదికన వాటా కేటాయించగా మిగతా సామాజిక వర్గాలకు జనరల్ కేటగిరి కింద కేటాయించారు. మహిళా రైతులందరూ ఈ పథకానికి అర్హులు. ఎకరంలోపు వ్యవసాయ భూమి ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.లక్షకు పైగా విలువ చేసే యంత్రాలు కావాల్సి వస్తే ఒక ఎకరం కంటే ఎక్కువ భూమి ఉండాలి. ఎకరంలోపు ఉంటే రూ.లక్షలోపు యంత్రాల కోసం అర్జీ పెట్టుకోవచ్చు. వ్యవసాయ డ్రోన్లు, మినీ ట్రాక్టర్లు కావాలంటే కనీసం రెండున్నర ఎకరాల పొలం ఉండాలి. జిల్లాస్థాయి కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. -
వేగం పెంచండి
అభివృద్ధి పనుల్లో మంచాల: తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల(టీపీఎస్) అభివృద్ధి పనులను వేగిరం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి, డైరెక్టర్ నవీన్ నికోలస్ అన్నారు. బుధవారం వారు మంచాల మండల పరిధిలోని ఆరుట్ల, మంచాల ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఆయా పాఠశాలల అభివృద్ధి ప్రణాళిక, జరుగుతున్న పనులు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరుట్లలో ప్రీ ప్రైమరీ పాఠశాల నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు సులువుగా ఉంటుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పిస్తున్నామని.. విద్యార్థుల సంఖ్య సైతం అదే విధంగా పెరిగిందన్నారు. డిజిటల్ తరగతులు, క్రీడా ప్రాంగణం, పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. పనులు మరింత వేగిరం చేయాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధితోనే పిల్లల భవిష్యత్ మారుతుందన్నారు. అనంతరం ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. అదనపు తరగతి గదులు, లైబ్రరీ, సరిపడా ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని పేరెంట్స్ కమిటీ కోరింది. అనంతరం మంచాల ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడ చెప్పట్టే అభివృద్ధి కార్యక్రమాలను మ్యాప్ ద్వారా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సుశీందర్రావు, విద్యా కమిషన్ సభ్యులు పద్మజాషా, జ్యోత్స్న, ఎంఈఓ రాందాస్, మంచాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతయ్య, ప్రధానోపాధ్యాయులు గిరిధర్గౌడ్, నారాయణరెడ్డి, ఝాన్సీ, రుబియానా బేగం, మోహన్రెడ్డి, ఆయా పాఠశాలలకు చెందిన పేరెంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 14న సీఎం రాక? ఈ నెల 22న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వసతులు, విద్యాశాఖ అధికారులతో సమావేశమై విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే భాగంగానే పనులు వేగవంతగా చేపట్టాలని ఉన్నత స్థాయి అధికారులు సందర్శనార్థం వచ్చినట్లు సమాచారం. నవంబర్ 14న సీఎం వచ్చే అవకాశం ఉందని వినికిడి. రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి ఆరుట్ల, మంచాల ప్రభుత్వ పాఠశాలలను సందర్శించినఅధికారుల బృందం -
చంద్రప్రభ వాహనంపై శ్రీవారు
వికారాబాద్ పట్టణంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడోరోజు బుధవారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. 11 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవాల్లో బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమం పీఠాఽధిపతి డాక్టర్.మహంత్ సిద్ధేశ్వరానందగిరి మహరాజ్ పాల్గొన్నారు. మంగళవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల కూచిపూడి నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది. – అనంతగిరిచంద్రప్రభ వాహనంపై కొలువుదీరిన స్వామివారు -
యూరియా మహాప్రభో..!
తాండూరు రూరల్/బషీరాబాద్: యూరియా బాధలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా రైతాంగాన్ని ఈ సమస్య వెంటాడుతోంది. తెల్లవారింది మొదలు సొసైటీ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. రోజంతా పడిగాపులు కాసినా బస్తా కూడా దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా ఇదే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు వదిలేసి యూరియా కోసం తిరగాల్సి వస్తోందని పలువురు పేర్కొన్నారు. మా బాధలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పంటలకు పైపాటుగా యూరియా వాడాల్సి ఉందని తెలిపారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఎల్మకన్నె సొసైటీ కార్యాలయానికి రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. చెప్పులను క్యూలో ఉంచి యూరియా కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. బషీరాబాద్ మండలం నావంద్గీ సొసైటీ కార్యాలయం వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. యూరియా కొరతపై రైతులు తరచూ రోడ్డెక్కుతున్నారు. సాగుకు సరిపడా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారం రోజులుగా పడిగాపులు వారం రోజులుగా యూరియా కోసం నావంద్గీ సొసైటీ కార్యాలయానికి వస్తున్నా. కనీసం టోకెన్ కూడా దొరకడం లేదు. 4.18 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. ఇప్పటి వరకు యూరియా వాడలేదు. పంట దెబ్బతింటోంది. నాలుగు సంచుల యూరియా ఇస్తే పంటను కాపాడుకుంటా. – జగదీష్, రైతు, గంగ్వార్ ఇండెంట్ ప్రకారమే.. మండల వ్యవసాయ అధికారులు పంపిన ఇండెంటు ప్రకారం సొసైటీకి యూరియా వస్తోంది. ఇప్పటి వరకు 8వేల బస్తాలు పంపిణీ చేశాం. ఇంకా 80 మొట్రిక్ టన్నులు అవసరం ఉంది. రైతుల బాధలు చూడలేకపోతున్నాం. సాగుకు సరిపడా యూరియా వస్తే ఇబ్బందులు ఉండవు. – వెంకట్రామ్రెడ్డి, చైర్మన్, నావంద్గీ సొసైటీ ఆందోళన వద్దు తాండూరు మండలంలో యూరియా కొరత లేదు. బుధవారం ఎల్మకన్నె సొసైటీకి 450 బస్తాల యూరియా వచ్చింది. రైతులందరికీ సరఫరా చేస్తున్నాం. గురువారం చెంగోల్ గ్రామంలో యూరియా అందుబాటులో ఉంటుంది. రైతులు ఆందోళన చెందరాదు. పట్టాదారు పాసు పుస్తకం తెచ్చి యూరియా తీసుకెళ్లాలి. – కొమురయ్య, ఏడీఏ, తాండూరు పక్షం రోజులుగా ఎరువుల కొరత కార్యాలయాల వద్ద నిత్యం పడిగాపులే సాగుకు సరిపడా సరఫరా చేయని వైనం బస్తాతో సరిపెడుతున్న అధికారులు ఆందోళనలో అన్నదాతలు -
బరిలో తొమ్మిది మంది
● మదర్ డెయిరీ సభ్యుల నియామకానికి 27న ఎలక్షన్ హయత్నగర్: నల్లగొండ– రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమాఖ్య లిమిటెడ్(నార్ముల్ మదర్ డెయిరీ) పాలకవర్గ ఎన్నికల్లో తొమ్మిది మంది చివరి బరిలో నిలిచారు. డెయిరీలో ఖాళీగా ఉన్న ముగ్గురు సభ్యుల నియామకం కోసం దాఖలు చేసిన నామినేషన్ల ఉప సంహరణ, స్క్రూటినీ అనంతరం తొమ్మిది మంది తుది పోటీ లో ఉన్నారు. మహిళా రిజర్వేషన్ స్థానానికిగానూ కర్నాటి జయశ్రీ, గుంట్ల రాధిక, మోతె పూలమ్మ, సుదగాని విజయ తలపడనున్నారు. మిగిలిన రెండు అన్రిజర్వ్ స్థానాల్లో కుంచాల ప్రవీణ్రెడ్డి, పెద్దిరెడ్డి భాస్కర్రెడ్డి, రచ్చ లక్ష్మీనర్సింహ్మారెడ్డి, శీలం వెంకటనర్సింహ్మారెడ్డి, సందిల భాస్కర్గౌడ్ పోటీ పడుతున్నారని ఎన్నిల అధికారి వెంకట్రెడ్డి తెలిపారు. హయత్నగర్లోని ఎస్వీ కన్వెన్షన్ హాల్ లో శనివారం ఉదయం 8 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగుతుందని స్పష్టంచేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు, విజేతల ప్రకటన ఉంటుందన్నారు. ఎన్నికయ్యే సభ్యులు అక్టోబర్ 1న బాధ్యతలు చేపడుతారని వెల్లడించారు. అర్హులైన సొసైటీల చైర్మన్లు ఐడీ కార్డుతో వచ్చి ఓటింగ్లో పాల్గొనాలన్నారు. -
ఇంట్లోకి చొరబడి.. పుస్తెలతాడును అపహరించి
శంకర్పల్లి: వంట గదిలో ఉన్న వృద్ధురాలి మెడలో నుంచి దుండగులు పుస్తెలతాడును అపహరించారు. ఈ సంఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి కొండకల్ గ్రామానికి చెందిన నారాయణరెడ్డి(82), పద్మమ్(70) దంపతులు. వీరితో కుమారుడు, కోడలు ఉంటున్నారు. బుధవారం కుమారుడు, కోడలు బయటకు వెళ్లారు. మధ్యాహ్నం భర్తకు భోజనం పెట్టేందుకు ఆమె వంట గదిలోకి వెళ్లింది. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు.. ఇంటి ముందు ఆగారు. ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెలతాడుని లాక్కొని.. వెంట వచ్చిన వ్యక్తితో బైక్పై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ వీరబాబు, డీఐ సమరంరెడ్డి వివరాలు సేకరించారు. చుట్టూ పక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి, వెలిమల గ్రామం వైపు వెళ్లినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బైక్పై ఉడాయించిన దుండగులు -
భక్తి భావంతో మానసిక ప్రశాంతత
కడ్తాల్: ప్రతి ఒక్కరూ భక్తిమార్గం ఎంచుకోవాలని, తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్నాయక్ అన్నారు. బుధవారం మండల పరిధి మద్దెలకుంట తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ మాలధారణ భక్తుల ఆధ్వర్యంలో ఇరుముడి పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథ్నాయక్ మాట్లాడుతూ.. సేవాలాల్ సత్యం,ఽ ధర్మం, సమానత్వం, ఽభక్తి విలువలు బోధించారని, ఆయన చూపిన మార్గంలో యువత నడుచుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజశాంతికి దోహదపడతాయని తెలిపారు. ఇందులో మాజీ సర్పంచ్ కస్ననాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మాణ రంగంలో ‘భారతి సిమెంట్’ రారాజు
అనంతగిరి: నిర్మాణ రంగంలో రారాజు భారతి సిమెంట్ అని ఆ సంస్థ టెక్నికల్ ఇంజినీర్ సామ్రాట్ అన్నారు. వికారాబాద్లోని ఓం సాయి ట్రేడర్స్ డీలర్ దుకాణంలో బుధవారం తాపీ మేస్రీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందని తెలిపారు. ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణానికి సరైన ఎంపిక అని పేర్కొన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచితసాంకేతిక సహాయం అందజేస్తామని, స్లాబ్కాంక్రిట్ సమయంలో నిపుణులైన సంస్థ ఇంజినీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడతారని చెప్పారు. ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్కు రూ.20 అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రూ.1 లక్ష ప్రమాద బీమా బాండ్లను 60 మంది తాపీ మేసీ్త్రలకు అందజేశారు. అనంతరం డీలర్ కృష్ణ మాట్లాడుతూ.. భారతి సిమెంట్ పనితీరు చాలా ఫాస్ట్గా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ వీరాంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీఓ ప్రకారం వేతనాలు ఇవ్వాలి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మొయినాబాద్: మున్సిపల్ కార్మికులకు జీఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్, అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం పుర కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పురపాలిక సంఘం ఏర్పడి 9 నెలలు అవుతున్నా.. వేతనాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ చట్టం ప్రకారం వేతనాలు, యూనిఫాంలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో విధులు బహిష్కరించి, ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ జమీర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ ప్రవీణ్కుమార్, నాయకులు మహేందర్, అశోక్, నగేష్గౌడ్, రత్నం, సుధాకర్, సురేష్, కృష్ణ, జగన్, నర్సింహ్మ, వెంకటేశ్, ప్రమీల ఉన్నారు. -
బాబోయ్.. భౌభౌ
విశ్వాసానికి మారుపేరైన శునకాలు.. విచక్షణ కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నాయి. దీంతో ప్రజలే కాదు.. జంతు ప్రేమికులు సైతంఆందోళన చెందుతున్నారు. ఇటీవల కుక్కకాటు కేసులు పెరుగుతుండటంతో వాటికి దూరంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాండూరు రూరల్: వీధి కుక్కలతో ప్రజలు బెంబేతెత్తిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎటునుంచి వచ్చి పిక్కలు పట్టేస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో వీధి కుక్కల బెడద అంతకంతకూ పెరిగిపోతుండగా.. అదే స్థాయిలో కేసులు పెరుగుతుండటం ఆదోళన కలిగిస్తోంది. వెంబడించి.. మండల పరిధి 33 గ్రామాల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మేజర్ గ్రామపంచాయతీ మల్కాపూర్, సమీపంలోని కోటబాసుపల్లి, వడ్డెరబస్తిని కలుపుకొని ఇక్కడ సుమారు ఐదు వేలకు పైగా జనాభా ఉంది. ఈ గ్రామంలోని ఏ వీధిలో చూసినా కుక్కల గుంపు ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. అకారణంగా దాడులకు పాల్పడుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. వారం రోజుల క్రితం నడుచుకుంటు వెళ్తున్న బాలుడు ఆనంద్ను కరిచాయి. అంతే కాకుండా గడిచిన కొద్దిరోజుల్లో మన్సన్పల్లి బాలరాజ్, కుర్వ మణిక్యప్ప, హన్మంత్, ప్రణయ్, భాగ్యలను కాటు వేశాయి. దీంతో సుమారు 20 మంది వరకు బాధితులు ఉంటారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కుక్కకాటు బాధితులు రేబిస్ వ్యాధితో చనిపోతున్నారన్న వార్తల నేపథ్యంలో బాధితులు, గ్రామస్తులు భయందోళన చెందుతున్నారు. ఒంటరిగా ఏ ఒక్కరు నడిచుకుంటు వెళ్లినా వెంబడిస్తున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ అధికారులు స్పందించి, గ్రామసింహాల బారి నుంచి కాపాడాలని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దారిన పోయే వారిపై.. వీధుల్లో కుక్కల గుంపుని చూసి భయపడుతున్నాం. మా కాలనీలో చిన్నారులపై తరచూ దాడులు చేస్తున్నాయి. రోజురోజుకూ వాటి ఆగడాలు పెరిగిపోతున్నాయి. దారిన పోయే వారిపై అకారణంగా ఎగబడుతున్నాయి. అధికారులు స్పందించి, వాటి నుంచి రక్షణ కల్పించాలి. – రాములమ్మ, మల్కాపూర్ గ్రామం నియంత్రణకు కృషి గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇదే విషయాన్ని పశువైద్యాధికారులతో పాటు పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. వాటి నియంత్రణకు కృషి చేస్తా. ఎవరూ ఆందోళన చెందవద్దు. – ఇస్మాయిల్, జీపీ కార్యదర్శి, మల్కాపూర్ గాయాన్ని చూపుతున్న బాలుడు బెంబేలెత్తుతున్న ప్రజలు మల్కాపూర్లో స్వైరవిహారం 20కి పెరిగిన కుక్కకాటు బాధితుల సంఖ్య -
కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి
● పరిగికి నలువైపులా రహదారుల విస్తరణ ● ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిగి: గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి అడ్డంకులు తొలగడంతో.. బుధవారం రోడ్డు విస్తరణ సాధన సమితి సభ్యులు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నందున రూపులేఖలు మారుతున్నాయని చెప్పారు. గతంలో ఎన్హెచ్ 163 అభివృద్ధిని గత ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. ప్రస్తుతం అడ్డంకులు తొలిగి, పనులు ప్రారంభం అయ్యాయని, అవి పూర్తయితే జిల్లాకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పరిగి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పరిగి నుంచి కొడంగల్కు నాలుగు లైన్లు, జిల్లా కేంద్రానికి నాలుగు లైన్ల రోడ్డు పనులు జరుగుతున్నాయని వివరించారు. గుడిసె లేని ఊరే లక్ష్యం గుడిసెలు లేని ఊరు ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని సుల్తాన్పూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. బీఆర్ఎస్ పార్టీ.. పదేళ్లు అధికారంలో ఉండి, ఏ ఒక్క పేదవాడికి ఇళ్లు కట్టించి ఇవ్వలేదని విమర్శించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే పేదవారి సొంతింటి కల నెరవేర్చిందన్నారు. -
రికార్డుల నిర్వహణసక్రమంగా ఉండాలి
డీఎల్పీఓ ప్రవీణ్కుమార్ యాలాల: రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉంచుకోవాలని డివిజనల్ పంచాయతీ అధికారి ప్రవీణ్కుమార్ సూచించారు. బుధవారం యాలాల జీపీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యాచరణ తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. డీఎల్పీఓగా బాధ్యతలు చేపట్టాక ఆయన తొలిసారి మండలానికి రావడంతో ఎంపీఓ యాదయ్య ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శి ఆనంద్రావు, సిబ్బంది సాయి, జగదీశ్వర్, జానీ తదితరులు ఉన్నారు. రోడ్డుపై దిగబడిన లారీ తాండూరు రూరల్: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కల్వర్టు నిర్మాణం అనంతరం దానిపై పోసిన మట్టిలో ఓ సిమెంట్ ట్యాంకర్ లారీ బుధవారం దిగబడింది. వివరాలు ఇలా ఉన్నాయి. అల్లాపూర్ నుంచి కోత్లాపూర్ వరకు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఐనెల్లి గ్రామ శివారు వద్ద నేషనల్ హైవే అధికారులు కల్వర్టును తొలగించారు. ఆపై పైపులు వేసి, మట్టితో పూడ్చారు. భారీ వర్షాల కారణంగా సిమెంట్లోడ్తో వెళ్తున్న భారీ వాహనం రోడ్డు మధ్యలో కూరుకుపోయింది. దీంతో తాండూరు– చించోళి మార్గంలోని కోటబాసుపల్లి, మల్కాపూర్, కోత్లాపూర్, సంగెంకలాన్తో పాటు కర్ణాటకకు వెళ్లే వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఎట్టకేలకు జేసీబీ సహాయంతో ఆ వాహనాన్ని వెలుపలకు తీసి, ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం పహాడీషరీఫ్: ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాం కాలనీలోని ఇందిరా సొసైటీలో మధుబన్ కాలనీకి చెందిన శేషు, ప్లాస్టిక్ రీసైక్లింగ్ గోదాం నిర్వహిస్తున్నారు. ఉదయం 4 గంటల సమయంలో కర్మాగారంలో అగ్ని కీలలు ఎగిసి పడ్డాయి. గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. అప్పటికే అందులోని ప్లాస్టిక్ స్క్రాప్ పూర్తిగా కాలిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, రూ.8 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని తెలిపారు. ఎలాంటి ఫిర్యాదు అందనందున కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. తుక్కుగూడ: విదేశీ వర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం(ఏఓఈఎఫ్) కింద 2025–26కు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి జె.రామారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులకు రూ.20లక్షల స్కాలర్షిష్ పొందేందుకు యూఎస్ఏ, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, సౌత్కొరియా, ఆస్ట్రేలియా, జర్మనీ వర్సిటీల్లో మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులతో పాటు పీజీ, పీహెచ్డీ కోర్సులు చేయాలనుకునే వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. నవంబర్ 19 వదరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని చెప్పారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి -
అమ్మానాన్నకు దూరమై..చదువులమ్మకు దగ్గరై..
● ఎంబీబీఎస్ సీటు సాధించిన నిరుపేద విద్యార్థి ● చిన్నాన్న, చిన్నమ్మ సహకారంతో ముందుకు ● డాక్టర్ అయి.. ప్రజాసేవలో తరిస్తా: వంశికొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం చేగిరెడ్డి ఘనాపూర్ గ్రామానికి చెందిన వెన్నశెట్టి మంజుల, జంగయ్య దంపతులకు వంశీకృష్ణ, నందిని ఇద్దరు సంతానం. వీరిద్దరు మూడేళ్లలోపు ఉన్నప్పుడే కన్నవారు దూరం కాగా.. అన్నా, చెల్లెలు అనాథలుగా మిగిలారు. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలో ఆ చిన్నారులను చిన్నాన్న బీమయ్య, చిన్నమ్మ యాదమ్మ దంపతులు అక్కున చేర్చుకున్నారు. ఆదర్శంగా తీర్చిదిద్దారు. చేరదీసినందుకు.. ఉన్నతంగా.. వంశీకృష్ణ, నందినిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి వరకు చదివించారు. ఆ తరువాత ఇద్దరు గురుకుల పాఠశాలకు ఎంపికై ఉన్నత చదువులు పూర్తిచేశారు. వంశీకృష్ణ గౌలిదొడ్డి గురుకుల కళాశాలలో ఇంటర్లో 920 మార్కులు సాదించాడు. ఆపై నీట్ ప్రవేశ పరీక్ష రాసి 407 మార్కులతో నాగర్కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సంపాదించాడు. అన్నను ఆదర్శంగా తీసుకున్న చెల్లెలు నందిని.. షాద్నగర్ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఇంటర్ పూర్తిచేసి, నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఎవరినీ మరువను.. వంశి తల్లిదండ్రులను కోల్పోయిన మమ్మల్ని చిన్నాన్న, చిన్నమ్మలు చేరిదీసి కన్నబిడ్డలా చూసుకున్నారు. వారి కష్టాన్ని వృథా కానీయకుండా గుర్తింపు తెచ్చుకున్నాను. అండగా నిలిచిన వారిని మరువను. డాక్టర్ను అయి.. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తాను. బతుకు బాటను చూపించారు అమ్మానాన్న పోవడంతో మా చిన్నాయన, చిన్నమ్మలు చేరదీసి చదివించారు. నాడు ఉపాధ్యాయులు శివాజీ, వెంకట్రావు మమ్మల్ని బాగా చూసుకున్నారు. పాఠాలు చెప్పడమే కాదు.. బతుకు బాటను చూపించారు. వారి స్ఫూర్తితోనే ఉన్నతంగా చదువుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నదే నా తపన. – నందిని ఆర్థికంగా అండగా ఉంటా వంశీకృష్ణ మెడికల్ సీటు సాధించగానే.. అండగా ఉంటామంటూ దాతలు ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విద్యార్థిని శాలువాతో సత్కరించి, ఆర్థికంగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు కృష్ణ రూ.25 వేలు అందజేశారు. బీఆర్ఎస్ నాయకుడు చందునాయక్ రూ.11 వేలు ఇచ్చారు. మరికొందరు తాము సైతం అంటున్నారు. -
అంత్యక్రియలకు వెళ్లి.. శవమై తేలి
స్నానానికి చెరువులో దిగి వ్యక్తి గల్లంతు బషీరాబాద్: అంత్యక్రియలకు వెళ్లిన ఓ వ్యక్తి అనంత లోకాలకు వెళ్లాడు. ఈ సంఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మంతట్టి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ నుమాన్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లింగంపల్లి శ్యాణప్ప(52) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. మంగళవారం అదే గ్రామానికి చెందిన అభిషేర్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన.. ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యలో స్నానం చేయడానికి పిన్చెరువులోకి దిగి నీట మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు చెరువు వద్దకు వెళ్లి ఆచూకీ కోసం గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. చికటి పడడంతో గాలింపు సాధ్యపడలేదు. బుధవారం ఉదయం గజ ఈతగాళ్లను రప్పించి, మృతదేహాన్ని బయటకు తీశారు. మద్యం మత్తులో ఉండటంతోనే శ్యాణప్ప నీటి మునిగి మృతి చెందాడని మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి కొడుకు శ్యామప్ప, కూతురు సవిత ఉన్నారు. -
ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి
● జిల్లా కార్యదర్శి మహిపాల్ ● తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం నిరసన బంట్వారం: ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు బుధవారం బంట్వారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మహిపాల్ మాట్లాడారు. బొప్పునారంలో సర్వే నంబర్ 69లో దళితులకు కేటాయించిన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలన్నారు. భూస్వాముల అక్రమ పట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. మైనింగ్, బీడు భూములకు రైతుభరోసా నిలిపేయాలని సూచించారు. అనంతరం డీటీ మహేశ్కు వారు వినతి పత్రం అందజేశారు. -
మళ్లీ దంచిన వర్షం
తాండూరు రూరల్: వర్షాల జోరు తగ్గడం లేదు. దీంతో మండలంలోని గ్రామాల్లో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. గతంలో కురిసిన వానలకే పెద్దఎత్తున పెసర, మినుము పంటలు పాడయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే పత్తి పంట కుదురుకుంటున్న సమయంలో మళ్లీ వాన దంచికొట్టింది. మంగళవారం మధ్యాహ్నం సైతం మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఫలితంగా చేతికి వచ్చిన పత్తి పంట పాడైందని కర్షకులు లబోదిబోమంటున్నారు. పత్తి చేలలో వర్షపు నీరు చేరడంతో మునిగాయి. సంగెంకలాన్, ఐనెల్లి వాగులు పొంగిపొర్లాయి. తాండూరు–చించోళి రోడ్డుపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వాగు ఉధృతి తగ్గిన తర్వాత వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. వరుణుడు శాంతించాలని వేడుకోలు ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంట చేతికి రావడం కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా వరుణుడు శాంతించాలని కోరుతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశామని, చేతికి వచ్చే క్రమంలో భారీ వర్షాల కారణంగా శ్రమంతా వరదలో పోయిందని మదనపడుతున్నారు. వర్షాలు తగ్గితేనే పత్తి పంట చేతికి వస్తోందని అన్నదాతలు భావిస్తున్నారు. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు నీట మునిగిన పత్తి తదితర పంటలు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతుల గగ్గోలు -
అక్రమ తవ్వకాలను ఆపేయండి
● ప్రజాసంఘాల డిమాండ్ ● తహసీల్దార్ పద్మావతికి వినతిపత్రం బొంరాస్పేట: కొత్తూరు శివారులోని మాలగుట్ట నుంచి మట్టి తవ్వకాలను నిలిపేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టను తవ్వుతూ పరిగితో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్, పోలీసులు కుమ్మకై ్క ఈ వ్యవహారం నడిపిస్తున్నారని ఆరోపించారు. అక్రమ తవ్వకాలను వెంటనే ఆపేయాలని తహసీల్దార్ పద్మావతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కె.చంద్రయ్య , సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు వెంకటయ్య, ఎమ్మార్పీఎస్ నాయకుడు సుభాన్, కేఎన్పీఎస్ జిల్లా నాయకులు లక్ష్మయ్య, కుర్వ హక్కుల పోరాట సమితి నాయకుడు బాలప్ప, బాల్రెడ్డి, జైపాల్రెడ్డి, మహేందర్, జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అటవీ భూమి ఆక్రమిస్తే చర్యలు
యాలాల: అటవీ భూములను ఉద్దేశ పూర్వకంగా చదును చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ రాజేందర్ హెచ్చరించారు. మంగళవారం మండల పరిధిలోని రాస్నం అటవీ ప్రాంతంలోని కంపార్ట్మెంట్ నంబరు 109లో సంగాయిపల్లితండాకు చెందిన వెంకటేష్, రాస్నం గ్రామానికి చెందిన జేసీబీ చెట్లు, పొదలు చదును చేస్తుండగా అటవీశాఖ అధికారులు గుర్తించి జేసీబీని సీజ్ చేశారు. అనంతరం ఎఫ్ఆర్ఓ మాట్లాడుతూ.. వెంకటేష్ గతంలో కూడా అటవీ భూముల ఆక్రమణకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ విషయంలో చట్టరీత్యా చర్యలతో పాటు సీజ్ చేసిన జేసీబీని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్ల పేర్కొన్నారు. కార్యక్రమంలో సెక్షన్ అధికారి కనకరాజు, బీట్ ఆఫీసర్ వీరబాబు, వాచర్లు యాదగిరి, ఆఫ్రీద్, మహేష్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ రాజేందర్ -
రూ.కోటి ఇస్తేనే భూములిస్తాం
నవాబుపేట: తమకు ఎకరాకు రూ.కోటి పరిహారం చెల్లిస్తేనే త్రిపుల్ఆర్ రోడ్డుకు భూములు ఇస్తామని మండలంలోని చించల్పేట రైతులు పేర్కొన్నారు. మంగళవారం త్రిపుల్ ఆర్లో భూములు పోతున్న రైతులు గ్రామంలో సమావేశమయ్యారు. రోడ్డు నిర్మాణంలో తమ పట్టాభూములు, సాగుకు వచ్చే పొలాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి బదులు భూమి ఇవ్వాలని లేదంటే ఎకరాకు రూ.కోటి పరిహారం చెల్లిస్తేనే తామ భూములు ఇస్తామని తీర్మానించుకున్నారు. ఇది వరకే స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి స్పీకర్ ప్రసాద్కుమార్, జిల్లా ఇన్చార్జి మంత్రికి తమ బాధలు వివరించామన్నారు. కార్యక్రమంలో బాధితులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
మహిళల ఆరోగ్యానికి రక్ష
దౌల్తాబాద్: మహిళల ఆరోగ్యానికి రక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్వస్త్ నారీ సశక్త్ అభియాన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో ప్రతి మహిళకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మండలంలో గత వారం రోజులుగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. మంగళవారం స్థానిక పీహెచ్సీ ఆవరణలో మెగా హెల్త్ శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. మహిళ శిశు సంక్షేమ శాఖ పోషన్ అభియాన్ కార్యక్రమానికి అనుబంధంగా మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలు గుర్తించారు. వారికి అవసరమైన మందులతో పాటు మెరుగైన చికిత్సలు చేస్తున్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యురాలు ప్రియదర్శిని, సూపర్వైజర్ రఫీ, పల్లె దవాఖాన డాక్టర్ సంతోష్, ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు ఉన్నారు. వర్షానికి కూలిన ఇల్లు దౌల్తాబాద్: మండలంలోని దేవర్ఫసల్వాద్ గ్రామంలో వర్షానికి గ్రామానికి చెందిన తలారి దస్తప్ప ఇల్లు మంగళవారం కూలింది. ఇటీవల కురిసిన భారీ వానకు ఇల్లు కూలిందని బాధితుడు తెలిపాడు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ప్రభుత్వం తరఫున బాధితుడికి ఆర్థికసాయం అందించాలని ముదిరాజ్ సంఘం నియోజకవర్గ నాయకుడు కూర వెంకటయ్య కోరారు. క్రీడలతో ఆరోగ్యానికి మేలు కొడంగల్ ఏఎంసీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ దుద్యాల్: క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో దసరా ప్రీమియర్ లీగ్(క్రికెట్ పోటీలు)ను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వయసుతో సంబంధం లేకుండా ఆటలు ఆడాలన్నారు. క్రీడలతో ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ ఖలీల్ పాషా, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీశైలంగౌడ్, నాయకులు సత్యనారాయణ, నిర్వాహకులు నరేందర్గౌడ్, సంతోష్, అనిల్ పాల్గొన్నారు. హనుమత్ వాహనంపై ఊరేగింపు అనంతగిరి: వికారాబాద్ పట్టణం ఆలంపల్లిలో వెలిసిన శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేశారు. సుప్రభాతసేవ, అర్చనలు, ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ గావించారు. అనంతరం నైవేద్యం సమర్పించి ప్రత్యేక హారతి ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి ఆలయ మాడ వీధుల్లో స్వామి వారిని హనుమత్ వాహనంపై ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ పద్మనాభం, ఈవో నరేందర్, గ్రామస్తులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కారు అదుపుతప్పి.. ముగ్గురికి గాయాలు బొంరాస్పేట: నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మంగళవారం ఉదయం హైదరాబాద్కు చెందిన కారు మెకానిక్ సయ్యద్ కిబిరియా తన స్నేహితులైన అయూబ్, సలీమ్లతో కలిసి కారులో కర్ణాటకలోని గుర్మిట్కల్కు వెళుతున్నారు. మార్గమధ్యలో నాగిరెడ్డిపల్లి శివారులో జాతీయ రహదారి 163పై అతివేగంగా కారు నడపడంతో అదుపుతప్పి పక్కన స్తంభాన్ని ఢీకొట్టారు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాల వెంకటరమణ తెలిపారు. -
ఉచిత వైద్య శిబిరానికి స్పందన
తాండూరు: పట్టణంలోని మాతాశిశు ఆస్పత్రి ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మంగళవారం జిల్లా వైద్య శాఖ స్వస్త్ నారీ సశక్త్ అభియాన్లో భాగంగా మహిళలకు, చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి జిల్లా వైద్యాధికారి, లలితాదేవి, డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీంద్రయాదవ్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ సునిత, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక, ఆరోగ్య భద్రత కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రవీణ్, కార్తీక్, పద్మ, షౌల్ హమీద్, కవిత, ప్రసాద్నాయక్, సుధామాయ్, విగ్నేష్, అపర్ణ, శ్రీలతలు పది విభాగాలకు చెందిన పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, పట్టణ వైద్యాధికారి గిరిధర్యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 320 మందికి పరీక్షలు చేసిన డాక్టర్లు -
పండగ పూట జరభద్రం
ఎస్ఐ యాదగిరి దుద్యాల్: దసరా పండుగకు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ యాదగిరి సూచించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇళ్లకు తాళాలు జాగ్రత్తగా వేసుకోవాలని సూచించారు. దొంగలు అదును చూసి ఇళ్లను టార్గెట్ చేసి దోచే అవకాశం ఉందన్నారు. ఇంట్లో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, డబ్బులు ఉంచరాదని చెప్పారు. చుట్టుపక్కల వాళ్లను ఇంటి వైపు గమనించాలని సూచించారు. దినసరి కూలీ అదృశ్యం తాండూరు రూరల్: ది నసరి కూలీ అదృశ్యమైన సంఘటన మండలంలోని కరన్కోట్ పోలీస్స్టేషన్ పరిధి లోని చోటు చేసు కుంది. ఎస్ఐ రాథోడ్ వినోద్ కథనం ప్రకారం.. రాంపూర్ గ్రామానికి చెందిన చౌహన్ మోహన్నాయక్ నిత్యం లారీల్లో నాపరాతి, సిమెంట్ అన్లోడింగ్ పనులు చేస్తూంటాడు. ఈ నెల 18న అతను ఇంట్లో పనికి వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. వారం రోజులైన ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మంగళవారం కరన్కోట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అతని ఆచూకీ తెలిస్తే 87126 70052కు తెలపాలని కోరారు. బతుకమ్మ ఆడుతూఅస్వస్థతకు గురై.. గుండెపోటుతో మహిళ దుర్మరణం ఇబ్రహీంపట్నం రూరల్: బతుకమ్మ ఆడుతూ అస్వస్థతకు గురైన ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పీఎస్ పరిఽధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం, రంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మి(66) ఆదిబట్లలోని టీసీఎస్ ఎదుట ఉన్న వెంకటేశ్వర హాస్టల్లో వంట మనిషిగా పని చేసేది. ఈనెల 21న హాస్టల్లో ఉండే మహిళలతో కలిసి బతుకమ్మ ఆడింది. ఈక్రమంలో అలసటగా ఉందంటూ గదిలోకి వెళ్లింది. ఎడమ చేయి లాగుతోందని చెప్పడంతో జండూబామ్ రాసి పడుకోబెట్టారు. ఛాతిలో కూడా నొప్పి వస్తోందని చెప్పడంతో ఆర్ఎంపీని పిలిపించారు. పల్స్ బాగా పడిపోవడంతో రాత్రి 12:30 గంటలకు అంబులెన్స్లో వనస్థలిపురం ఏరియా అస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. లక్ష్మి గతంలో సీపీఐఎంఎల్ పార్టీలో క్రియాశీలక సభ్యురాలిగా, ప్రగతిశీల మహిళా సమాఖ్య(పీఓడబ్ల్యూ) సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారు. లక్ష్మికి భర్త నాగయ్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు. -
భవిష్యత్ సేంద్రియ వ్యవసాయానిదే
తాండూరు రూరల్: భవిష్యత్ కాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయంవైపే మొగ్గు చూపుతారని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ రావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని జినుగుర్తి గ్రామ శివారులో ఉన్న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్లోని వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాలలో రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయంపై(ఎన్ఎస్ఎస్) శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవీ రావు మాట్లాడుతూ.. భవిష్యత్లో సేంద్రియ వ్యవసాయానికి మంచి డిమాండ్ ఉంటుందన్నారు. ప్రస్తుతం రసాయన ఎరువులు, పురుగుల మందు లు వాడకంతో అనేక దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఈ నెల 29 వరకు విద్యార్థులకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ నవీన్కుమార్, డాక్టర్ గీత, డాక్టర్ అర్చన కర్ణి, డాక్టర్ రేవతిలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ రావు -
రేడియల్ రోడ్డుకు భూములివ్వం
అనంతగిరి: శంషాబాద్ నుంచి పరిగి రాకంచర్ల మీదుగా చేపట్టే రేడియల్ రోడ్డు ప్రతిపాదనకు తాము భూములు ఇవ్వమని పూడూరు మండలానికి చెందిన రైతులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాకంచర్ల మీదుగా వచ్చే రూట్ అలైన్మెంట్ను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. తమకున్న కొంత భూమిలో రోడ్డు పోతే జీవనం ఎలా సాగాలని ప్రశ్నించారు. పరిగి, పూడూరు మండలాలోని ఎనిమిది గ్రామాల గుండా ఈ రోడ్డు పోతుందన్నారు. దాదాపు 350 ఎకరాల నల్లరేగడి సాగుభూమి ఉందన్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. రహదారిని రద్దు చేయాలి పరిగి: రైతుల పొలాల నుంచి వెళ్లే రేడియల్ రోడ్డును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని భూ బాఽధితులు డిమాండ్ చేశారు. దామగుండం నేవీరాడర్ స్టేషన్కు వేళ్లేందుకు శంషాబాద్ నుంచి రంగాపూర్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి ఇటీవల సర్వే నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం భూ బాధితులు పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి తహసీల్దార్ వెంకటేశ్వరికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎనిమిది గ్రామాల్లోని 360 ఎకరాల భూమిని రైతులు కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ రోడ్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. పూడూరు మండల భూ బాధితులు -
పశు వైద్యానికి చర్యలు
● తాండూరులో డాక్టర్లు అందుబాటులో ఉంటారు ● జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సదానందంతాండూరు రూరల్: మెరుగైన పశు వైద్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సదానందం తెలిపారు. మంగళవారం తాండూరులోని ఏడీఏ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి పట్టణంలో పశువైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. యాలాల మండల వైద్యాధికారి శివదుర్గకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ప్రతి రోజూ మధ్యాహ్నం ఆస్పత్రికి వస్తారని తెలిపారు. అలాగే వికారాబాద్ జిల్లా కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది అశోక్ సోమ, మంగళ, బుధవారాల్లో, కుక్కింద సబ్ సెంటర్లో పని చేసే సైదులు గురు, శుక్ర, శనివారాల్లో అందుబాటులో ఉంటారని వివరించారు. జిల్లాలో 2.50 లక్షల ఆవులు, గేదెలు, ఎద్దులు, 4.50 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో 33 మంది మండల పశువైద్యులకు గాను 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 60 ప్యారామేట్ సిబ్బందికి గాను 25 పోస్టులు ఖాళీ పోస్టులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 10 క్వింటాళ్ల పశుగ్రాస విత్తనాలు ఉన్నాయని, 75 శాతం సబ్సిడీపై పాడి రైతులకు పంపిణీ చేస్తామని చెప్పారు. తాండూరులోని ఏడీఏ కార్యాలయం శిథిలావస్థకు చేరిందని, తాత్కాలికంగా మరో భవనం కేటాయించాలని సబ్ కలెక్టర్కు లేఖ రాసినట్లు తెలిపారు. నూతన భవనం కోసం కలెక్టర్కు ప్రతిపాదనలు పంపనున్నట్లు జిల్లా పశువైద్యాధికారికి సదానందం తెలిపారు. -
వేతనాలు చెల్లించాలి
తాండూరు టౌన్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న పార్ట్టైం ఉపాధ్యాయులకు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వెంటనే వేతనాలు చెల్లించాలని పలువురు మంగళవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. ఇంటి కిరాయి చెల్లించలేక, నిత్యావసర సరుకులు కొనలేక నానాయాతన పడుతున్నామన్నారు. పండగ పూట ఇంటిళ్లిపాది పస్తులు ఉండాల్సిన స్థితి ఏర్పడిందని వాపోయారు. గురుకుల కార్యదర్శులు ఒకరి తర్వాత ఒకరు బదిలీపై మారుతూ వస్తున్నా, ఎవరూ తమ వేతనాల గూరించి పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పార్ట్టైం ఉపాధ్యాయులకు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెలా 5వ తేదీలోగా వేతనాలు చెల్లించాలని కోరారు. అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో నెల రోజుల పాటు పూజా సామగ్రి విక్రయానికి వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో నరేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్తీక మాసంలో టెంకాయలు, పూజా సామగ్రి విక్రయించడంతోపాటు కొబ్బరి చిప్పల సేకరణకు ఈ నెల 27న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ ప్రాంగణంలో వేలం ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాలకు ఆలయ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ బంట్వారం: భూస్వాముల చెరలో ఉన్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని బొప్పునారం సర్వే నంబర్ 69లోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని 187 ఎకరాల అసైన్డ్ భూమిని గతంలో ప్రభుత్వం దళితులకు పంచిందన్నారు. అప్పటి నుంచి వారే సాగు చేసుకుంటున్నారని తెలిపారు. అయితే గ్రామానికి చెందిన కొందరు పెత్తందారులు ఆ భూములను అక్రమంగా పట్టాలు చేసుకొని అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నరని తెలిపారు. పేదలకు న్యాయం చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తాండూరు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 157 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి పథకం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పపత్రిలో వైద్యం పొందిన వారు సీఎంఆర్ఎఫ్ కింద దరఖాస్తు చేసుకుంటే ఆర్థిక సాయం అందుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు పట్లోళ్ల బాల్రెడ్డి, మాధవరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ధారూరు: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఇసుకకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ సాజిదాబేగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కుమ్మరిపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 30 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దీని విలువ రూ.21,600 ఉంటుందని తెలిపారు. ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనాలని తహసీల్దార్ కోరారు. -
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
అనంతగిరి: పెండింగ్ కేసులపై ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలని ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులపై పీఎస్ వారీగా సమీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులపై డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులు దృష్టి సారించాలన్నారు. నేర నియంత్రణలో, పరిశోధనలో సీసీ కెమెరాల ప్రాధాన్యత చాలా వరకు ఉంటుందన్నారు. ప్రతి పీఎస్ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తులకు రూంలు అద్దెకు ఇచ్చే ముందు వారి అడ్రస్, ఆధార్కార్డు, ఫోన్ నంబర్ తదితర వివరాలు తీసుకోవాలని ఇళ్ల యజమానులకు సూచించారు. రౌడీ షీటర్స్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాములునాయక్, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఎస్పీ నారాయణరెడ్డి -
రిజర్వేషన్.. టెన్షన్
యాచారం: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సర్కార్ ఆదేశాల మేరకు అధికారులు వార్డు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు దాదాపు ఖారారు చేసినట్లు తెలుస్తోంది. గోప్యత పాటించడంతో ఆశావహుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేయడం కోసం రెండు, మూడేళ్లుగా ప్రజల్లో ఉంటూ వివిధ సేవా కార్యక్రమాల పేరుతో రూ.లక్షల్లో ఖర్చు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచనతో ఉండడంతో గ్రామ స్థాయిలో ఉండే పోటీదారుల్లో టెన్షన్ మొదలైంది. రిజర్వేషన్లు కలిసొస్తాయో.. లేదోనని ఆందోళన చెందుతున్నారు. మహానగరం చుట్టూ విస్తరించి ఉన్న జిల్లాలో ఏ గ్రామం నుంచి వార్డు సభ్యుడిగా, సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా గెలిపొందినా మంచి పలుకుబడి ఉంటుంది. ఫ్యూచర్సిటీతో యాచారం, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల, ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో క్రేజ్ ఏర్పడింది. స్థానిక ఎన్నికల్లో గెలుపొందితే తమ ఫ్యూచర్ కూడా మారుతుందని ఆశలపల్లకీలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు షెడ్యూల్ వస్తే.. రెండేళ్లుగా ఊరిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామని సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహుల్లో ఒకింత ఆందోళన.. మరోవైపు ఆశలు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. నేడో రేపో రిజర్వేషన్లు ప్రకటించి.. రెండు, మూడు రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ షెడ్యూల్.. ఆ వెంటనే పంచాయతీల షెడ్యూల్ ప్రకటించి ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు షెడ్యూల్ వస్తే పోటీలో ఉండడానికి కొందరు సై అంటుండగా.. మరికొందరు నై అంటున్నారు. యూరియా కొరత, పింఛన్ల పెంపు తరహా సమస్యలు అధికార పార్టీ నేతలను కలవర పెడుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆశతో ఉన్నారు. రిజర్వేషన్ ఏం వస్తుందో.. ఖర్చు ఎలా భరించాలో..‘స్థానిక’ షెడ్యూల్పై ఎడతెగని ఉత్కంఠ కలిసొస్తాయో.. లేదోనని ఆందోళన పోటీ కోసం ఉవ్విళ్లూరుతున్న ఆశావహులు ఇప్పటికే జనాన్ని ఆకర్షించేందుకు సేవా కార్యక్రమాలు అప్పు చేసైనా ఖర్చు చేసేందుకు సిద్ధం!రిజర్వేషన్లు కలిసొచ్చి.. పోటీ తట్టుకోవాలంటే దీటుగా ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు పోటీకి ఉత్సాహం చూపుతున్న ఆశావహులు డబ్బుల వేటలో పడ్డారు. వడ్డీ వ్యాపారుల వద్దకు క్యూ కడుతున్నారు. కొందరు తమకున్న వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇతర ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు భారీగా ‘వడ్డి’ంపులకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, ఆమనగల్లు, కందుకూరు, మాడ్గుల, తలకొండపల్లి, మహేశ్వరం, షాద్నగర్, చేవెళ్ల మండలాల్లోని పంచాయతీ, మండల పరిషత్లకు డిమాండ్ ఏర్పడింది. మరి రిజర్వేషన్లు ఎవరికి అనుకూలిస్తాయో.. ఎవరికి నిరుత్సాహం మిగులుస్తాయో వేచి చూడాలి. -
పత్తి సేకరణకు ఏర్పాట్లు చేయండి
● మిల్లుల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి ● అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అనంతగిరి: పత్తి కొనుగోలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. అలాగే కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, సంబంధిత ట్రేడర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,46,725 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 2,68,282 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిన్నింగ్ మిల్లుల వద్ద అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. పత్తి కొనుగోలుకు రైతుల ఆధార్ కార్డు ప్రామాణికమని, బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్తో అనుసంధానం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్లైన్లో నమోదు కాని రైతుల జాబితాను ఏఈఓలు పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని తెలిపారు. నకిలీ పత్రాలు జారీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు ఏ గ్రేడ్ పత్తికి రూ. 8,110 మద్దతు ధర ప్రకటించిందన్నారు. బీ గ్రేడ్కు రూ.7,710 ధర నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రతి మిల్లులో కాంటాలను పరిశీలించాలని తూనికలు కొలతల శాఖ అధికారులకు ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఫైర్ శాఖకు సూచించారు. జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి వాహనాలకు ఇబ్బందులు ఎదురుకాకుందా పోలీస్, రవాణా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రామునాయక్, సీసీఐ అసిస్టెంట్ మేనేజర్ ప్రజక్త, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి సారంగపాని, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, విద్యుత్, రవాణా, పోలీస్ అధికారులు, ట్రేడర్లు తదితరులు పాల్గొన్నారు. -
భూ సేకరణ పూర్తి చేయండి
అనంతగిరి: జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ట్రైనీ కలెక్టర్ హార్స్ చౌదరి, డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ అనంతగిరి: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలు ఇచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కి 158 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన అర్జీలను పెండింగ్లో ఉంచరాదన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మంగీలాల్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందజేసిన సంజీవ్కుమార్ బంట్వారం: ప్రముఖ బిల్డర్ బంట్వారం వాసి మొగ్దుంపురం సంజీవ్కుమార్ సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి తిరుమల లడ్డూ ప్రసాదం అందజేశారు. పరిగి: జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని సోమవారం పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా ప్రజలు సంతోషంగా ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేను ఆలయ అర్చకులు శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
దేవీ శరన్నవరాత్రులు
తాండూరు రూరల్: ఐనెల్లిలో అమ్మవారికి పూజలు చేస్తున్న భక్తులు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దుర్గామాతను ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మ వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సోమవారం శైల పుత్రి రూపంలో దర్శనమిచ్చారు. వికారాబాద్ సమీపంలోని శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభస్వామి దేవస్థానంలో ఆలయ ట్రస్టీ చైర్మన్ పద్మనాభం ధ్వజారోహనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. – అనంతగిరి -
బతుకమ్మ పాట ఆవిష్కరణ
నవాబ్పేట: ఎమ్మెల్యే కాలె యాదయ్య స్వగ్రామం చించల్పేటలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘తారాజువ్వా.. తంగేడు పువ్వా’ అనే బతుకమ్మ పాట – 2025 రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సోమవారం గ్రామంలో బతుకమ్మ పాట సీడీని ఆవిష్కరించారు. అంజిలప్ప రచించిన పాటను గాయని మమతా రమేశ్ పాడారని చెప్పారు. ఈ నెల 29న నిర్వహించే సామూహిక బతుకమ్మ సంబరాలు, వీడియో సాంగ్ చిత్రీకరణకు జోగు శ్యామలాదేవి, గాయని మమతా రమేశ్, సీనియర్ జానపద కళాకారుడు అశోక్ మాస్టర్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్ తదితరులు హాజరువుతున్నట్లు చెప్పారు. బతుకమ్మ సంబరాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు కాలె జయమ్మ, మాజీ ఎంపీపీ భవాని, గేయ రచయిత, గాయకుడు అంజిలప్ప, జానపద కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నూనె గింజల సాగుతో అధిక ఆదాయం
కొడంగల్ రూరల్: వ్యవసాయ అధికారుల సూచనలు పాటించడంతోపాటు నాణ్యమైన విత్తనాలు వాడి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని పెద్దనందిగామ గ్రామంలో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబ్లె ఆయిల్స్ – ఆయిల్స్ సీడ్స్(ఎన్ఎంఈఓ–ఓఎస్) పథకం కింద రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూనె గింజల ఉత్పత్తి పెరగడం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. సాగు పద్ధతులను పాటిస్తూ సమయానికి విత్తుకోవాలని, ఎరువుల వినియోగం, పంట సంరక్షణ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏడీఏ శంకర్రాథోడ్, మండల వ్యవసాయాధికారి జి.తులసీ, ఏఈఓలు అశ్విని, సుమ, రాజు, ఐసాక్ హెరాల్డ్, శ్రీపతి, మాజీ సర్పంచు సంజీవరెడ్డి, రైతులు సత్యనారాయణరెడ్డి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజరత్నం -
జనావాసాలు.. జలమయం
తుర్కయంజాల్: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం సాయంత్రం మొదలు రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. 7.5 సె.మి. వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బడంగ్పేట కార్పొరేషన్ పరిధి పలు ప్రాంతాల్లో 10 సె.మి. వర్షం కురిసింది. దీంతో తుర్కయంజాల్ మాసబ్ చెరువుకు వరద పోటెత్తింది. అక్కడి నుంచి నుంచి ఇంజాపూర్ దిలావర్ఖాన్ చెరువుకు నీరు ప్రవహించే వాగు జలప్రవాహానికి ఆపిల్ అవెన్యూ, ఇందిరమ్మ కాలనీలు నీటిలో తేలియాడాయి. సోమవారం సాయంత్రం భారీ వర్షం పడగా.. రెండు ఫీట్లకు పైగా నీరు అపార్ట్మెంట్లలో చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో గడిపారు. వద్దన్నా వినకుండా.. ఇంజాపూర్ నుంచి తొర్రూర్కు వెళ్లే మార్గంలో సుమారు 200 ఫీట్ల వెడల్పుతో నీరు ప్రవహిస్తుండటంతో.. అప్రమత్తమైన మున్సిపల్ కమిషనర్ కె.అమరేందర్ రెడ్డి అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయించారు. అడ్డుగా రాళ్లను పెట్టించారు. ఇది లెక్కచేయని బైరమాల్గూడకు చెందిన ముగ్గురు యువకులు.. వరదలో కారును ముందుకు పోనిచ్చారు. ప్రవాహం పెరగడంతో కారు ట్రాన్స్ఫార్మర్ దిమ్మెకు తగిలించి నిలిపారు. అతి కష్టం మీద, మున్సిపల్ సిబ్బంది సహకారంతో ముగ్గురు యువకులను బయటకు రప్పించారు. -
కొనసాగుతున్న హైవే విస్తరణ
వాహనాల రాకపోకలకు అంతరాయం తాండూరు రూరల్: మండల పరిధి అల్లాపూర్ నుంచి కోత్లాపూర్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా తాండూరు– చిందోళి మార్గంలోని ఐనెల్లి గ్రామ సమీపంలో ఉన్న వంతెనను సంబంధిత అధికారులు.. ఇటాచీ, జేసీబీ సహాయంతో తొలగింపు పనులు కొనసాగిస్తున్నారు. దీంతో ఐనెల్లి బిడ్జ్రికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిర్మాణ పనుల నేపథ్యంలో.. పక్కనే డైవర్షన్ రోడ్డును నిర్మించారు. తాండూరు నుంచి చించోళి వెళ్లే వాహనాలు.. ఆ మార్గం గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. హత్య కేసులో నిందితుడికి రిమాండ్ తాండూరు టౌన్: మహిళ హత్య కేసులో నిందితున్ని రిమాండ్కు తరలించామని పట్టణ సీఐ సంతోష్ కుమార్ సోమవారం తెలిపారు. పట్టణంలోని మల్లప్పమడిగ వద్ద ఆదివారం పట్టపగలు మాంసం విక్రయించే పిచ్చకుంట్ల పద్మమ్మ(60).. మేనల్లుడు వెంకటి చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు నిందితుడు హత్యకు ఉపయోగించిన గొడ్డలితో పాటు, మృతిరాలి మెడలో నుంచి అపహరించిన 4.2 తులాల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై హత్యానేరం, దొంగతనం కేసు నమోదు, చేసి రిమాండ్కు తరలించారు. దిగబడిన ట్రాక్టర్ కొడంగల్ రూరల్: తాండూర్ నుంచి కోస్గి వైపు ఫీటు రాయి లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్.. మండల పరిధి పర్సాపూర్ బస్టాఫ్ సమీపంలో సోమవారం మట్టిలో కూరుకుపోయింది. దీనిని రోడ్డు పనులు చేస్తున్న వారు గమనించి, ఇటాచీ సహాయంతో వాహనాన్ని వెలుపలకు తీశారు. సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి కుల్కచర్ల: సబ్బండ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వ కృషి చేస్తుందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. సోమవారం వడ్డెర సంఘం కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల నాయకులు పలువురు.. వడ్డెర భవనం నిర్మించాలని కోరుతూ వారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కులగణన చేసి, ఏ వర్గానికి ఎంతశాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రణాళికతో ఉందని పేర్కొన్నారు. శేఖర్, రాములు, కృష్ణయ్య, వెంకటయ్య, జనార్దన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థికి పరామర్శ తాండూరు టౌన్: చెట్టు కొమ్మ తలపై విరిగిపడి ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి సుశాంత్ను ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి సోమవారం నగరంలోని ఆస్పత్రిలో పరామర్శించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. సుశాంత్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందుతుందని హామీ ఇచ్చారు. ఆయన వెంట నాయకులు గడ్డల రవీందర్, రాజేందర్, శివకుమార్ తదితరులు ఉన్నారు. -
సత్తాచాటిన ఆదిత్యవర్ధన్
తాండూరు: యాలా ల మండలం బండమీదిపల్లికి పద్మ నర్సింహులు దంపతుల కుమారుడు ఆదిత్యవర్ధన్ నీట్ ప్రవేశ పరీక్షలో సత్తాచాటి ఎంబీబీఎస్ సీటు సాఽధించారు. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ గురుకులాల్లోనే చదువుకున్నాడు. నీట్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్లో ఉచిత సీటు దక్కించుకున్నారు. తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు విద్యార్థిని అభినందించారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి అభినందించారు. విద్యార్థిని శాలు వాతో సన్మానించారు. -
ప్రసవానికి వచ్చి.. ప్రాణం కోల్పోయి..
● మాతా శిశు ఆస్పత్రిలో గర్భిణి మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన తాండూరు టౌన్: కాన్పు కోసం వచ్చిన గర్భిణి మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రావులపల్లికి చెందిన అఖిల(23)ను రెండో కాన్పు కోసం వారి కుటుంబీకులు ఆదివారం అర్ధరాత్రి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సోమవారం ఉదయం 6 గంటలకు డాక్టర్ మంజుల వారికి సూచించారు. ఆ తరువాత కొద్దిసేపటికే కడుపులో బిడ్డతో పాటు అఖిల మృతి చెందింది. దీంతో బంధువులు ఎంసీహెచ్ ఎదుట ఆందోళనకు దిగారు. రాత్రంతా బాగానే ఉందని చెప్పిన వైద్య సిబ్బంది, తెల్లవారగానే పరిస్థితి విషమంగా ఉందని, మరో దవాఖానకు తీసుకెళ్లాలని చెప్పడం, కొద్దిసేపటికే గర్భిణి చనిపోవడానికి కారణం వైద్య సిబ్బందే కారణమని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహిరించిన సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ కౌన్సిలర్ సోమశేఖర్ మాట్లాడుతూ.. ఎంసీహెచ్లో ఇలాంటి సంఘట నలు తరచూ జరుగుతున్నాయని, అయినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇదే విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత మాట్లాడుతూ.. గర్భిణి మృతిపై విచారణ చేసి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గైనకాలజిస్ట్పై వేటు కాన్పు కోసం మాతాశిశు ఆస్పత్రికి వచ్చిన గర్భిణి మృతిపై రాష్ట్ర వైద్య విచారణ బృందం సభ్యులు సోమవారం రాత్రి వరకు విచారణ చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన గైనకాలజిస్ట్ డాక్టర్ మంజులను విధుల నుంచి తొలగించారు. ఇందుకుసంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి రావులపల్లికి చెందిన అఖిల.. కాన్పు నిమిత్తం తాండూరులోని మాతాశిశు ఆస్పత్రికి వచ్చి సోమవారం ఉదయం మృతి చెందింది. కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో రాష్ట్ర విచారణ బృంద సభ్యులు నేషనల్ హెల్త్ మిషన్ గైనకాజిస్ట్ డాక్టర్ సుమిత్ర, మెడికల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం, డీఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి, అనస్తీషియన్ డాక్టర్ రవిశంకర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. గర్భిణి ఎంసీహెచ్కు వచ్చిన సమయం నుంచి ఆమె మృతి వరకు జరిగిన విషయాలపై సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కడుపులో శిశువు మృతి చెందడం, అధిక రక్తస్రావం వల్ల ఆమె మృతి చెంది ఉంటుందని విచారణ బృంద సభ్యులు తెలిపారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎంసీహెచ్కు గర్భిణి రాగా డ్యూటీ డాక్టర్ మంజుల తెల్లవారుజామున 5గంటలకు ఆస్పత్రికి వచ్చి ఆమెను పరీక్షించడాన్ని బృంద సభ్యులు తప్పుబట్టారు. విధుల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆమెను విధుల నుంచి తొలగిస్తునట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి తెలిపారు. -
అవే వెతలు!
యూరియా కోసం తప్పని తిప్పలు ఎల్మకన్నె సొసైటీ కార్యాలయం ఎదుట బారులు తీరిన రైతులు ఒక్క బస్తా మాత్రమే అందజేత తాండూరు రూరల్: అన్నదాతలకు యూరియా కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఓ వైపు పొలాల్లో పని చేసుకుంటూ.. మరోవైపు యూరియా కోసం కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. ఎరువుల కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఎల్మకన్నె సొసైటీ కార్యాలయం వద్దకు ఆయా గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు కార్యాలయానికి చేరుకొని రైతులను సముదాయించారు. క్యూలో ఉన్న వారికి సొసైటీ సీఈఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది టోకెన్లు పంపిణీ చేశారు. 450 బస్తాల యూరియా రావడంతో ఒక్కో రైతుకు ఒక్కో బస్తా సరఫరా చేశారు. మధ్యాహ్నం వరకు క్యూలో ఉన్న రైతులకు సరఫరా చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పెద్దేముల్లో.. పెద్దేముల్ ఎఫ్ఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులు క్యూలో చెప్పులు ఉంచారు. తెల్లవారుజామున 4 గంటలకే కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు రైతులతో మాట్లాడి పరిస్థితిని వివరించి క్యూలో నిలబెట్టారు. కార్యాలయ సిబ్బంది పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్కార్డు తీసుకొని టోకెన్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత యూరియా సరఫరా చేశారు. పంటలకు సరిపడా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. -
జీఎస్టీ తగ్గింపుతో పేదలకు ఊరట
అనంతగిరి: జీఎస్టీ సంస్కరణలు దేశాన్ని మరింత బలోపేతం చేస్తాయని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పేదలు, రైతులు, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఊరటనిచ్చిందని చేవెళ్ల ఎంపీ, జీఎస్టీ ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. జీఎస్టీ తగ్గింపుపై వికారాబాద్లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తగ్గిన జీఎస్టీతో ప్రజలకు కొనుగోలు సామర్థ్యం పెరుగుతుందన్నారు. వస్తు వినియోగ పన్ను తగ్గింపు అంశం ప్రజల్లోకి చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని మీడియాను కోరారు. జీఎస్టీ తగ్గింపును వ్యక్తిగత, రాజకీయ కోణాల్లో కాకుండా ప్రజాప్రయోజనాల అంశంగా పరిగణించాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. కొన్ని శక్తులు దేశాన్ని విభజించేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. జీఎస్టీ అంశాన్ని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వారికోసమే అలైన్మెంట్ మార్పు బడా బాబుల భూములను కాపాడేందుకే రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారని ఎంపీ కొండా ఆరోపించారు. ప్రస్తుత ప్లాన్లో పేద, మధ్య తరగతి రైతుల భూములే పోతున్నట్లు తెలుస్తోందన్నారు. ట్రిపుల్ ఆర్ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మాత్రమే ఇస్తుందని, భూసేకరణ, అలైన్మెంట్ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని స్పష్టంచేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్ని పనులూ తానే చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా అధ్యక్షుడికి చేదు అనుభవం ఇదిలా ఉండగా ప్రెస్మీట్ చివరి దశలో అక్కడికి వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డి సాధారణ కార్యకర్తలా సమావేశంలో కూర్చున్నారు. ప్రెస్ మీట్ అనంతరం బయటకు వచ్చేశారు. అదే గదిలో కూర్చున్న ఎంపీ ప్రెస్మీట్ తర్వాత డోర్ పెట్టేసి పార్టీ నాయకులతో మాట్లాడారు. డోర్ తీసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన జిల్లా అధ్యక్షుడికి మీరు అక్కడే వెయిట్ చేయండి అని సూచించారు. సమావేశం అనంతరం ఎంపీతో మాట్లేందుకు ప్రయత్నించినా నేను తిరుపతి వెళ్తున్నా, ఫ్లైట్ టైమ్ అయిపోతుందంటూ కారులో హైదరాబాద్ బయల్దేరారు. ఈ సమావేశంలో జీఎస్టీ జిల్లా ప్రచారక్ ఈశ్వరప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజు, రమేశ్కుమార్, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, సీనియర్ నాయకులు వడ్లనందు, అమరేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నరోత్తంరెడ్డి, నందు, చరణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ, జీఎస్టీ ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
ఎంబీబీఎస్ సీటు సాఽధించిన విద్యార్థులు
కొడంగల్: పట్టణానికి చెందిన ఏవీ అఖిల్ యాదవ్ నీట్లో మెరుగైన ర్యాంక్ సాధించి ఉచితంగా ఎంబీబీఎస్ సీటు పొందారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలో 469 మార్కులు వచ్చాయి. దీంతో కాళోజీ నారాయణరావ్ యూనివర్సిటీ నిర్వహించిన కౌన్సెలింగ్లో హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. సోమవారం హైదరాబాద్ వెళ్లి మెడికల్ కాలేజీలో జాయిన్ అయినట్లు అఖిల్ యాదవ్ తండ్రి ఏవీ పృథ్విరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా అఖిల్ యాదవ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మెడికల్ సీటు సాధించినట్లు చెప్పాడు. భవిష్యత్తులో వైద్య వృత్తిలో స్థిరపడి రోగులకు సేవ చేయనున్నట్లు తెలిపారు. అఖిల్ యాదవ్కు టీయూడబ్లూజే(ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిషన్ రావ్, నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు కత్తి ప్రభాకర్, కొడంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులు చామంతి ప్రభాకర్, కానుకుర్తి రమేష్, రాకేష్ యాదవ్, పకీరప్ప, నరేందర్, గోపాల్, బొంకురు నరేష్, గడ్డం రాచయ్య అభినందనలు తెలిపారు. -
అన్నదాతకు అండగా నిలుస్తాం
బషీరాబాద్ ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి బషీరాబాద్: మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ అన్నదాతలకు అండగా నిలుస్తుందని బషీరాబాద్ ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి అన్నారు. సోమవారం కార్యాలయంలో జరిగిన పాలకవర్గం సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. రైతులు పండించిన ధాన్యానికి మంచి ధర కల్పించడంతో పాటు మార్కెటింగ్ చేసేందుకు తోడుగా నిలుస్తుందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు పెంచేలా రైతులకు అవగాహన కల్పించడంలో భాగంగా, ఇతర రాష్ట్రాల్లో పర్యటనకు పాలకవర్గానికి అనుమతి లభించిందన్నారు. ఆఫీసులో ఫర్నిచర్ కొనుగోలుకు రూ.2 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న మాధవరెడ్డిని పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చందర్నాయక్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, డైరెక్టర్లు మహేందర్రెడ్డి, హన్మంతు, మోహన్, నరేష్, నరేష్ రాథోడ్, సత్యానందం, మునీర్, పాండురంగం, నరేష్ మర్పల్లి, పెంటప్ప, వనమాల, సెక్రటరీ సిద్ధమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
కుల్కచర్ల: అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ అన్నారు. సోమవారం గిరిజన సంఘాల చలో హైదరాబాద్ పిలుపు మేరకు.. పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని రాద్దాంతం చేస్తున్న నాయకుల తీరుకు నిరసనగా గిరిజనులు ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఐక్యంగా ప్రభుత్వ తీరుకు నిరసనగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చూస్తే దేశవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కుట్రకు పాల్పడుతున్న సోయం బాపురావు, తెల్లం వెంకట్రావులను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి బలరాం నాయక్, మండల అధ్యక్షుడు ప్రకాష్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి గణేశ్ నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు అంబర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ -
దంచికొట్టి.. దడపుట్టించి
వరుణుడి కుండపోతకు పల్లెలు, పట్టణాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఏకధాటి వర్షాలతో వాగులు వంకలు జల ప్రవాహంతో ఉరకలెత్తుతున్నాయి. చెరువులు అలుగు పోస్తున్నాయి. పంట పొలాలు నీట మునిగి, రైతన్నకు నష్టాన్ని మిగిల్చాయి. రహదారులు, కల్వర్టులు దెబ్బతిని వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొడంగల్/కొడంగల్ రూరల్/దుద్యాల్/ దౌల్తాబాద్: జిల్లాలోని పలు మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా పడింది. కొడంగల్ మండలంలో 5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు అలు గు పారుతున్నాయి. పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. హుస్సెన్పూర్ రోడ్డు వరద ఉధృతికి కోసుకు పోయింది. పర్సాపూర్లో ప్రధాన రహదారిపై బురదలో వాహనాలు దిగబడ్డాయి. అంగడిరాయిచూర్ వాగు జోరుగా ప్రవహిస్తోంది. కొడంగల్ బైపాస్ నిర్మాణం కోసం వేసిన మట్టి వర్షం దాటికి కొట్టుకొని పోయింది. మండలంలోని ర్యాలపేట చెరువుకు గండి పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు గండిని పూడ్చడానికి ప్రయత్నించారు. ఇరిగేషన్ అధికారులు గండిని పూడ్చారు. దుద్యాల్ మండలంలో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. చెరువులు ఆలుగు పారుతున్నాయి. కుదురుమల్ల గ్రామ సమీపంలో వాగుపై వంతెన నిర్మాణం కోసం తెచ్చిన ఇటాచీ, కాంక్రీట్ మిక్సింగ్ మిషన్ నీటి మధ్యలో ఇరుక్కుపోయాయి. దుద్యాల్ గేటు వద్ద నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ చుట్టూ నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దౌల్తాబాద్ మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాల్లో బీటీ రోడ్లు ధ్వంసమయ్యాయి. మట్టి రోడ్లు కోసుకుపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇండాపూర్ – కుదురుమళ్ల మధ్య వాగు ఉధృతంగా పారడంతో రాకపోకలు స్తంభించాయి. గుముడాల – బిచ్చాల రోడ్డు ధ్వంసమైంది. దేశాయిపల్లి, దౌల్తాబాద్ గ్రామాల మధ్య ఉన్న చింతల్ చెరువు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యాంకి గ్రామంలో చెరువు కింద పంట లు నీట మునిగి పోవడంతో రైతులు నష్టపోయారు. వరుణుడి బీభత్సం.. రాత్రికిరాత్రే అతలాకుతలం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు అలుగుపోస్తున్న చెరువులు, కుంటలు నీటమునిగిన పంటపొలాలు, దెబ్బతిన్న రోడ్లు స్తంభించిన రవాణా,అస్తవ్యస్తంగా జనజీవనం -
‘స్థానిక’.. కదలిక!
వికారాబాద్: దసరాకు ముందే స్థానిక సందడి మొదలు కానుంది. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేయాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వం నుంచి జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు అందడం, ఆ మేరకు వార్డు, గ్రామ, మండల స్థాయి ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లు, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను రెడీ చేసి ఉంచడం తెలిసిందే. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పనకు సంబంధించిన జీఓ వెలువడిన వెంటనే డెడికేషన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా వార్డులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఒకటిరెండు రోజుల్లో బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉండటం, నెలాఖరులోగా ఎప్పుడైనా నోటిఫికేషన్ వెలువడే చాన్స్ ఉండటంతో ఇప్పటి వరకు స్తబ్ధుగా ఉన్న ఆశావహుల్లో మళ్లీ చర్చ మొదలైంది. తొలి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత వార్డు మెంబర్లు, సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటర్ల ముసాయిదా వెల్లడి జిల్లాలో 20 మండలాలు ఉండగా, వీటి పరిధిలో నాలుగు మున్సిపాలిటీలున్నాయి. 20 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 227 ఎంపీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. వార్డులు, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలను పంచాయతీ/ మండల పరిషత్ కార్యాలయాల్లో వెల్లడించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీపరంగా ప్రకటించనున్నట్లు తెలిసింది. వీకెండ్లో కానీ/దసరా సెలవుల్లో కానీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. నేడో, రేపో రిజర్వేషన్ల అంశం కొలిక్కి వస్తుందనే అంచనాలు ఈ నెలాఖరులో ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న నేతల్లో ఒక్కసారిగా కదలిక గ్రామ, మండలాల వారీగా సమావేశాల నిర్వహణకు పార్టీల యోచన ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశాం. ఓటర్ల జాబితా తయారీలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారమివ్వబోం. బోగస్ ఓట్లకు తావు లేకుండా పక్కాగా రూపొందిస్తున్నాం. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి.. అభ్యంతరాలను స్వీకరించి, అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నాం. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తాం. నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్ల స్వీకరణ తర్వాతే బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తులను ముద్రించనున్నాం. ఇందుకోసం అవసరమైన బ్యాలెట్ పేపర్లను సిద్ధంగా ఉంచాం. బ్యాలెట్ బాక్సులను ఇతర రాష్ట్రాల నుంచి సమకూర్చనున్నాం. – ప్రతీక్జైన్, కలెక్టర్ గ్రామ పంచాయతీలు 594 వార్డులు 5,058 మొత్తం ఓటర్లు 6,99,895 పురుషులు 3,44,963 మహిళలు 3,54,912 ఇతర ఓటర్లు 19 ఎంపీటీసీలు 227 జెడ్పీటీసీలు 20 -
క్రీడలు అలవాటుగా మార్చుకోవాలి
శంషాబాద్: క్రీడలు పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని రాజేంద్రనగర ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ సూచించారు.ఆదివారం పట్టణంలో ఎస్ఎస్ స్కేటింగ్ మైదానంలో మహబూబ్నగర్ జిల్లా రోలర్ స్కేటింగ్ చాంఫియన్ షిప్ 2025 పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.... చిన్న వయసుల్లో క్రీడాభిరుచిని పెంచడం ఎంతో మంచిదన్నారు. క్వాడ్, ఇన్లైన్ విధానాల్లో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభకనబర్చిన వారిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ, మాజీ వైస్ చైర్మన్ బండిగోపాల్, మాజీ కౌన్సిలర్ మేకల వెంకటేష్ ముదిరాజ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పి.సంజయ్యాదవ్, సీనియర్ నాయకులు దూడల వెంకటేష్గౌడ్, జి.వై.ప్రభాకర్ పాల్గొన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఉత్సాహంగా స్కేటింగ్ పోటీలు -
పూలతోట.. సిరుల పంట
పండుగల వేళ.. పూలకు క్రేజీ ఏర్పడింది. రోజువారీగా ఎలాంటి కార్యాలు చేపట్టినా.. పుష్పాలకు తగిన ప్రాధాన్యం ఉంటుంది. కానీ.. వెనువెంటనే వస్తున్న బతుకమ్మసంబురాలు, దేవీ నవరాత్రోత్సవాలు,అనంతరం దీపావళి పండుగల నేపథ్యంలో డిమాండ్ బాగా పెరిగింది. వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పూతోటల రైతులకు లాభాల పంట పండిస్తున్నాయి. యాచారం: హైదరాబాద్ మహానగరం చుట్టూ విస్తరించి ఉన్న జిల్లా పరిధి వ్యవసాయ పొలాలు పూ తోటలకు ప్రసిద్ధి. ఇబ్రహీంపట్నం, శంషాబాద్, రాజేంద్రనగర్, చేవేళ్ల, కందుకూరు, షాద్నగర్, మహేశ్వరం, హయత్నగర్లో పూల సాగుకు అనుకూలమైన నేలలు ఉండడంతో.. ఆయా ప్రాంతాల రైతులు పూ తోటల పెంపకంపై దృష్టి సారించారు. సీజన్లను బట్టి సుమారు రెండు వేల ఎకరాలకు పైగానే బంతి, చామంతి, కనకాంబరాలు, మల్లె, గులాబీని సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, అంతే శ్రమతో స్వల్పకాలంలోనే అధిక లాభాలు పొందుతున్నారు. ఒక రకంగా పూ తోటలు.. వారి ఇంట్లో సిరులు కురిపిస్తున్నాయి. పూల సాగుకు ఆసక్తి రాజధానికి చేరుకునే శ్రీశైలం, నాగార్జునసాగర్, క ర్నూల్, బీజాపూర్, విజయవాడ జాతీయ రహదారులకు ఇరువైపులా సాగు భూములున్న రైతులు.. పూతోటల పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు. కాలానికి అనుగుణంగా పంట పండిస్తూ.. హైవేపైనే విక్రయిస్తుంటారు. తాజా పూలు కావడంతో ప్రజలు కొనుగోలు చేయడానికి మక్కువ చూపుతున్నారు. పొలాల వద్దకే వచ్చిన కొనుగులు చేస్తుండటంతో ఇది రైతులకు బాగా కలిసి వస్తోంది. బంతి కిలోకు రూ.50 నుంచి వంద లోపు డిమాండ్ ఉండగా, అదే చామంతి, కనకాంబరాలు, మల్లె, గులాబీ తదితర వాటికి కిలో రూ.150 పైగానేఉంటుంది. డిమాండ్ను బట్టి.. డిమాండ్ను బట్టి రైతులు పూల సాగును చేస్తున్నారు. బోనాలు, వినాయక చవితికి మంచి లాభాలు పొందారు. బతుకమ్మ, దసరా, దీపావళి, కొద్ది రోజుల్లో వచ్చే కార్తీక మాసంలో 41 రోజుల పాటు భక్తీశ్రద్ధలతో జరిగే అయ్యప్ప పూజలనుదృష్టిలో ఉంచుకొని సాగు చేస్తూ.. ఆదాయంపొందేందుకు ప్రణాళిక చేసుకున్నారు. కొందరు రైతులు స్థానికంగానే విక్రయిస్తుండగా.. మరికొందరు నగరానికి తరలిస్తున్నారు. ఏడు ఎకరాల్లో బంతి రూ.లక్షన్నర పెట్టుబడి తో ఏడు ఎకరాల్లో బంతిని సాగు చేస్తున్నాను. దసరా పండుగ సందర్భంగా.. పూలను కోసం హైవేపై విక్రయిస్తున్నాం. రానున్న దీపావళి, కార్తీకమాసంలో మంచి లాభాలు వస్తాయనే నమ్మకం ఉంది. – కృష్ణ, పూల వ్యాపారి, చౌదర్పల్లి పూలతోనే పూజ కార్తీక మాసం అయ్యప్ప దీక్షలో 41 రోజుల పాటు పూలతో మణికంఠుడికి ప్రత్యేక పూజలు చేస్తాం. అందులో ఎక్కువగా బంతిపూలే ఉంటాయి. ఇతర పుష్పాలతో దేవతామూర్తులకు అలంకరణ చేస్తాం. ధర ఎంతున్నా.. భక్తితో కొనుగోలు చేస్తాం. కార్యక్రమాలు నిర్వహిస్తాం. – నారాయణశెట్టి, యాచారం పండుగల వేళ..భళే డిమాండ్ హైవేలపై విక్రయిస్తున్న రైతులు కిలో బంతికి రూ.50, చామంతికి రూ.150 తాజా పూలను కొనుగోలుచేసేందుకు ప్రజల ఆసక్తి -
పట్టపగలే దారుణం
● మేనత్తపై కత్తితో దాడిచేసిన అల్లుడు ● పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు తాండూరు టౌన్: మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. అయిన వారే ఒకరిని ఒకరు చంపుకునే ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. పంది మాంసం విక్రయం విషయంలో తలెత్తిన గొడవ చివరకు ఓ మహిళ ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన తాండూరు పట్టణంలోని మల్లప్ప మడిగె వద్ద చోటు చేసుకుంది. పట్టణ సీఐ సంతోశ్ కుమార్ తెలిపిన ప్రకారం.. ఇందిరానగర్కు చెందిన పిచ్చకుంట్ల పద్మమ్మ(60) స్థానిక మల్లప్ప మడిగ వద్ద పంది మాంసం విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె మేనల్లుడు వెంకటి తాను సైతం ఇక్కడే మరో దుకాణం పెడతానని అత్తకు చెప్పాడు. దీంతో ఆమె నా వ్యాపారం దెబ్బతీయొద్దని అల్లుడును కోరింది. ఇదే విషయంలో ఇరువురి మధ్య పలుమార్లు గొడవలు తలెత్తాయి. అత్త తన వ్యాపారానికి అడ్డుగా ఉందని భావించిన వెంకటి.. ఆదివారం మధ్యాహ్నం మాంసం విక్రయిస్తున్న పద్మమ్మ వద్దకు వచ్చి ఒక్కసారిగా ఆమె తలపై కత్తితో దాడి చేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దాడిని చూసి బెంబేలెత్తిన జనం అనంతరం తేరుకుని రక్తమడుగులో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం నిందితుడు వెంకటి పట్టణ ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. మృతురాలికి భర్త, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి మెడలో రెండు తులాల బంగారు గొలుసు ఉండాలని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ బంగారం ఎవరు తీసుకుని ఉంటారనేది విచారిస్తున్నామన్నారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
శంకర్పల్లి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంకర్పల్లి పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్పరెడ్డి గూడేనికి చెందిన కుమ్మరి దశరథ్(38) కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉండేవాడు. ఆయనకి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దశరథ్కి అనారోగ్య సమస్యలు రావడంతో డాక్టర్ మద్యం తాగొద్దని సూచించారు. అయినప్పటికీ తాగడం మానకపోవడంతో శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందని దశరథ్ ఇంట్లో గది లోపలికి వెళ్లి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇబ్రహీంపట్నం రూరల్: చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.సామేలు పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని పాషానరహరి స్మారక కేంద్రంలో ఆదివారం కేవీపీఎస్, జనవిజ్ఞాన వేదిక, ప్రజానాట్యమండలి సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సామేలు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం కుల, మత తారతమ్యాలు లేకుండా జరిగిందని గుర్తు చేశారు. ఈ నెల 26న చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని త్రిశక్తి కాలనీలో తెలంగాణ సాయుధ పోరాటం వీధి నాటకం రాత్రి 7 గంటలకు ప్రదర్శిస్తారన్నారు. తెలంగాణ సాహితి సంస్థ జిల్లా కన్వీనర్ సత్తన్న, ఆలేటి ఆటం తదితరులు పాల్గొన్నారు. -
బండ్లగూడను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
బండ్లగూడ: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ను ఆదర్శవంతంగా అభివృద్ధి చేసేందుకు నిధులను మంజూరు చేసి అభివృద్ధి పరుస్తున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు హరీశ్గౌడ్ ఆధ్వర్యంలో శివసాయినగర్ కాలనీ వాసులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి చేయాల్సిన పనులను ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సానుకూలంగా స్పందించి వెంటనే కార్పొరేషన్ కమిషనర్కు ఫోన్ చేసి జరగవలసిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఎస్టిమేషన్స్ వేసి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా సంవత్సరంలోనే ఇప్పటికే వంద కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. బండ్లగూడ కార్పొరేషన్ను రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనే గొప్ప కార్పొరేషన్గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు. కాలనే నేతలు బహుబలి వినయ్, రాజేష్, భరత్, హేమంత్, రాధిక, రేణుక, రజిత తదితరులు పాల్గొన్నారు. -
నమో యువ రన్
తాండూరు: పట్టణంలో బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదివారం నమో యువరన్ కార్యక్రమం నిర్వహించారు. రన్ అనంతరం స్థానిక విలియం మూన్ పాఠశాల మైదానంలో వ్యాయామం చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు.రమేష్కుమార్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపారన్నారు. దేశానికి ఆరోగ్యకరమైన యువతే వెన్నుముక అన్నారు. మట్టిగుంతలో పడి పంచాయతీ కార్మికుడి మృతి తాండూరు రూరల్: మట్టిపనికి వెళ్లిన పంచాయతీ కార్మికుడు గుంతలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఎల్మకన్నె గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కరన్కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్రమెట్టి బాలప్ప(38) పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బోనమ్మ ఆలయం వద్ద మట్టి తవ్వేందుకు తీసుకెళ్లాడు. మట్టి ట్రాక్టర్లో నింపుతుండగా బాలప్ప ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయాడు. వెంటనే ఆయన్ను తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. చికిత్స పొందుతున్న అడ్వకేట్ మృతి అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని కొత్తగడి సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతున్న అడ్వకేట్ బాలయ్య(58) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. బంట్వారం మండలం బొపునారం గ్రామానికి చెందిన బాలయ్య వికారాబాద్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయనకు భార్య, నలుగురు కూతుర్లు, కొడుకు ఉన్నారు. మృతుడు గతంలో బార్ అసోసియేషన్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నవ్వుతూ అందరిని పలకరించే బాలయ్య అకాల మరణం తమను కలిచివేస్తో ందని న్యాయవాదులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిషోర్, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు సందర్శించి నివాళి అర్పించారు. సాయంత్రం వికారాబాద్లో అంత్యక్రియలు ముగిశాయి. ప్రైవేటు ఉద్యోగి బలవన్మరణం నవాబుపేట: కుటుంబ కలహాల కారణంగా ఓ ప్రైవేటు ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డా డు. ఎస్ఐ పుండ్లిక్ తెలిపిన ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తు మండల కేంద్రానికి చెందిన అరవింద్(30) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆరు నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన వినూత్నతో వివాహమైంది. హైదరాబాద్ నివాసం ఉంటున్న ఈ దంపతుల నడుమ తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19న డ్యూటీకి వెళ్తున్నాని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. మండల పరిధిలో ని గేట్ వనంపల్లి శివారులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గమనించిన పశువుల కాపరులు పోలీసులు సమాచారం ఇచ్చా రు. మృతుడి వద్ద లభించిన ఆధారాలను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు రాజు, లక్ష్మి వచ్చి తమ కొడుకుగా నిర్ధారించారు. అనంతరం మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమాధుల తొలగింపు సరికాదు కొడంగల్: అభివృద్ధి పేరిట దర్గాలను తొలగించడం సరికాదని కొడంగల్ పట్టణ ముస్లింలు ఆదివారం ఆందోళన చేపట్టారు. స్థానిక వినాయక్ చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ముస్లింలు మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న మహబూబ్ సుబాని దర్గా, వినాయక్ చౌరస్తా సమీపంలోని సమాధులను పోలీసులు రాత్రికిరాత్రే తొలగించారని ఆగ్రహంవ్యక్తం చేశారు. రోడ్ల విస్తరణ పేరిట చిరువ్యాపారుల డబ్బాలు, పేదల ఇళ్లను తొలగించారని వాపోయారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని.. తాము దైవాలు భావించే దర్గాలను పోలీసు బలగాలతో కూల్చడం సరికాదన్నారు. ధర్నా చేస్తున్న ముస్లింలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ ధర్నాకు మద్దతుగా బహదూర్పూర ఎంఐఎం ఎమ్మెల్యే, బోధన్ మాజీ ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. -
ఏనుగు జంగారెడ్డికి గ్లోబల్ పీస్ అవార్డు
కందుకూరు: అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్నారాయణ సూచన మేరకు సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ జి.వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డికి గ్లోబల్ పీస్ అవార్డు–2025 ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. జంగారెడ్డి అహింసా మార్గంలో విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉంటూ యువతకు మార్గదర్శంగా నిలిచారని, అందుకే అవార్డుకు ఎంపిక చేశామని తెలిపారు. అవార్డు గ్రహీత మాట్లాడుతూ.. హింసా మార్గం ద్వారా ఏమీ సాధించలేమని అన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, సంస్థ నిర్వాహకులు బిచ్చుకారి సూర్య, ఢిల్లీ శివకుమార్, అందుగుల సత్యనారాయణ, సీనియర్ నాయకులు రాకేష్గౌడ్, సౌడపు వెంకటేశ్, యు.బాబురావు, మహేందర్, నరసింహా, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛత విరియాలి.. వాడలు మెరవాలి
షాద్నగర్: పల్లెలు, పట్టణాలు సంపూర్ణ స్వచ్ఛత సాధించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. పరిశుభ్రతలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ వివిధ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీఒక్క అడుగు స్వచ్ఛత వైపుశ్రీ నినాదంతో స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పక్షం రోజుల పాటు రోజుకో కార్యక్రమం నిర్వహించేలా కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 17 నుంచి ప్రారంభమైన కార్యక్రమాలు అక్టోబర్ 2 వరకు కొనసాగనున్నాయి కార్యక్రమాలు ఇలా.. ● ఈనెల 22న గ్రామాల్లో నీటి క్లోరినేషన్, తాగు నీటి ట్యాంకుల శుభ్రత, పారిశుద్ధ్యంపై ఇంటింటి ప్రచారం ● 23న ఉత్సవ కమిటీల సహకారంతో సాంస్కృతిక కార్యక్రమాలు ● 24న డ్రైనేజీల్లో చెత్త తొలగింపు, ఇంకుడు గుంతల నిర్మాణం ● 25న శ్రమదానం, చెత్త తొలగించిన చోట మొక్కలు నాటడం ● 26న డ్రైడే, మహిళా సంఘాల సభ్యులు ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తపై అవగాహన, గ్రామాల్లో దోమల నివారణ చర్యలు, ఫాగింగ్, బ్లీచింగ్ చేయడం ● 27న పారిశుద్ధ్య సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ, బీమా పత్రాల పంపిణీ, ఉత్తమ సిబ్బందికి సన్మానాలు ● 29న ప్లాస్టిక్ వాడకంపై అవగాహన, ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం, మహిళా ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు ● 30న గ్రామాల్లో విస్తృతంగా శ్రమదాన కార్యక్రమాలు ● అక్టోబర్ 1న పనికి రాని పాత వస్తువులతో అలంకరణ వస్తువుల తయారీ, వీధుల్లో శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల తయారీపై అవగాహన, మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ ● 2న ప్రభాత భేరి, గ్రామ సభల నిర్వహణ, ఉత్తమ పారిశుద్ధ్య సిబ్బందికి సన్మానాలు. పల్లెలు, పట్టణాల్లో కొనసాగుతున్న ‘స్వచ్ఛతాహీ సేవ’ అక్టోబర్ 2 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు పరిశుభ్రత, దోమల నివారణ, స్వచ్ఛతపై అవగాహనస్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. పరిశుభ్రత, ప్రజారోగ్యంపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. – సునీత, మున్సిపల్ కమిషనర్, షాద్నగర్ -
సుడి దోమతో జాగ్రత్త
వరి పైరుకు దోమపోటు ● సమగ్ర యాజమాన్యంతో నివారణ నవాబుపేట: వరి పంటకు పొట్ట దశలో సుడిదోమ ఆశించే అవకాశం ఉంటుంది. ఇవి వరి మొక్కల నుంచి రసాన్ని పీల్చి మొక్కలను పసుపురంగుకు మార్చి ఎండిపోయేలా చేస్తాయి. ఇది రైతులకు ఆందోళన కలిగిస్తుంది. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ నివారణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి జ్యోతి పేర్కొన్నారు. గుర్తింపు లక్షణాలు ● వరి పంటలో ప్రధానంగా గోధుమ రంగు దోమ(బీపీహెచ్) , తెల్లవీపు దోమ(డబ్ల్యూపీహెచ్)లు ఆశిస్తాయి. ● పిల్ల, పెద్ద దోమలు గుంపులుగా దుబ్బుల మొదళ్ల నుంచి రసం పీలుస్తాయి. ● ఆకులు లేత పసుపు రంగులోకి మారతాయి. ● పొలంలో నీరు తెట్టులా తేలుతూ కనిపిస్తుంది. ● పంట సుడులుగా వలయాకారంలో ఎండిపోతుంది. దీనిని హావర్ బర్న్ అంటారు. ● తీవ్రత ఎక్కువైతే పొలం ఎండిపోతుంది. తాలు గింజలు ఏర్పాడుతాయి. నూర్పినప్పుడు సూకలు అవుతాయి. ● సుడిదోమ ద్వారా గ్రాసి స్టంట్ వైరస్ వ్యాప్తి చెందుతుంది. నివారణ : ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వాడాల్సిన మందులు ● డైనోటెప్యురాన్ 20ఎస్జి–0.4 గ్రాములు/బ్యూప్రొఫెజిన్–1.6 మి.లీ/పైమెట్రొజైన్ 50 డబ్ల్యూజీ–0.60గ్రాములు/ట్రైప్లూమెజోపైరిమ్–0.485 మి.లీ/శ్రీఇమిడాక్లోప్రిడ్ 40శాతం ప్లస్ ఎతిప్రోల్ 40శాతం డబ్ల్యజీ––0.25గ్రాములు లీటరు నీటికి కిలిపి పిచికారీ చేయాలి. ● మందుకు పిచికారీ సమయంలో పొలంలో నీటిని తగ్గించాలి. ● పాయలు తీసి, మందు మొక్కల మొదళ్లపై పడేలా చూడాలి. -
నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
అనంతగిరి: పట్టణంలోని ఆలంపల్లి హౌసింగ్బోర్డు కాలనీలో వెలిసిన వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాల(శ్రీవారి రజతోత్సవ బ్రహ్మోత్సవాలు)కు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ధర్మకర్తల మండలి ప్రతినిధులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8గంటలకు ధ్వజారోహనంతో ప్రారంభం కానున్నాయి. నిత్యం ఉదయం 5గంటలకు సుప్రభాత సేవ, 5.30 గంటలకు మహాభిషేకం, 7 గంటలకు నైవేద్యం, మంగళహారతి, 8గంటలకు అర్చనలు, స్వామి వారి దర్శనం, 10 గంటలకు శ్రీవారి కల్యాణం, మధ్యాహ్నం 12.30 గంటలకు నైవేద్యం, మంగళహారతి, తీర్థప్రసాద వితరణ, ఒంటిగంటలకు మహాప్రసాదం, సాయంత్రం 4గంటలకు విష్ణు లలితా సహస్రనామ పారాయణం, 5గంటలకు మహిళల భజన, 6 గంటలకు వాహనసేవలు, 6.30 గంటలకు ఊయల సేవ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. గురువారం శమీ పూజ, చక్రస్నానం, ధ్వజ అవరోహనంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కోరారు. -
జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా కన్వీనర్ రాజ్కుమార్ మోమిన్పేట: రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలని జిల్లా కన్వీనర్లు రాజ్కుమార్, వాజయ్ శ్రవణ్కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని జెడ్పీహెచ్ఎస్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలకు అర్హులన్నారు. రాష్ట్ర కమిటీ ఎంపిక చేసిన బమ్మెర పోతన, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, వట్టికోట అళ్వార్స్వామి, వానమామలై వరదాచార్యులు, సురవరం ప్రతాప్రెడ్డి, సామల సదాశివ, బోయ జంగయ్య, పాకాల యశోద, కాళోజీ నారాయణరావు, డాక్టర్ సి.నారాయణరెడ్డి కవుల గురించి వ్యాసం రాయాల్సి ఉంటుందని చెప్పారు. పాఠశాల స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించి ఉత్తమంగా రాసిన ఒక బాలిక, ఒక బాలుడి వ్యాసాలను జిల్లా స్థాయికి పంపాలన్నారు. జిల్లా స్థాయికి వచ్చిన 50 వ్యాసాల నుంచి ఐదుగురిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయాలన్నారు. అక్టోబర్ 6వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులు అందరూ ఈ పోటీల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. ఇతర వివరాలకు 98667 50134, 84668 23975 నంబర్లో సంప్రదించాలన్నారు. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య దుద్యాల్: మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో స్వయంభుగా వెలిసిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు వెంకటయ్య అన్నారు. ఆదివారం ఆయన రూ.75 లక్షలతో ఆలయ ప్రాంగణం చుట్టూ నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. కడా ప్రత్యేక నిధులతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. పల్లెలు, పట్టణాలతో పాటు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కొడంగల్ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సైతం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జయరాములు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: తాగిన మత్తులో పలువురు యువకులు బస్సు డ్రైవర్పై దాడి చేశారు. ఈ ఘటన వికారాబాద్ సమీపంలోని అనంతగిరిగుట్టలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన ప్రకారం.. తాండూరు నుంచి వికారాబాద్ ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సుకు అనంతగిరి ఆలయం సమీపంలో కొందరు యువకులు కారు అడ్డుపెట్టారు. అంతటితో ఆగకుండా డ్రైవర్ సత్తయ్యను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారు. ఎంత సముదాయించినా పట్టించుకోకుండా యువకులు హల్చల్ చేశారు. దీంతో ప్రయాణికులు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డ్రైవర్ సత్తయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువకులను అదుపులోకి తీసుకున్నారు. శంకర్పల్లి: ఆత్మరక్షణకు ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు గార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన 1వ దక్షిణ భారత కరాటే చాంపియన్షిప్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ విభాగాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక ధృడత్వంతో పాటు మానసికోల్లాసం కలుగుతాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ నాయకులు వైభవ్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు దేశసేవలో భాగస్వామ్యులు కావాలి
జవహర్నగర్: జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని బిట్స్ పిలానీ క్యాంపస్లో రచయిత్రి రాయపూడి ఆశాలత, ఆమె కుమారుడు రంజీ ట్రోఫీ క్రికెటర్ రాయపూడి నాగేంద్ర ఆధ్వర్యంలో రచించిన ‘అమ్మ ఒడి – నా తెలంగాణ’ పుస్తకాన్ని ఆదివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. విద్యార్థులు దేశసేవలో భాగస్వామ్యులు కావాలన్నారు. ప్రపంచ దేశాల్లో డిజిటలైజేషన్ దేశంగా భారతదేశం నిలవడం సంతోషంగా ఉందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ప్రపంచ దేశాలను ధీటుగా భారతదేశం అవతరించిందన్నారు. ఆదివాసీ ప్రాంతాన్ని ఎంచుకొని వారి స్థితిగతులపై పరిశోధనలు చేసి విద్యా, ఆరోగ్య, ఉపాధి కల్పించి పేదరికాన్ని పాలదోలమే లక్ష్యంగా ఐఐటీ విద్యార్థి, రంజీ ట్రోపీ క్రికెటర్ నాగేంద్ర పని చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో హరియాణా మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్బాబు, బిట్స్ పిలానీ డైరెక్టర్ సౌమ్యో ముఖర్జీ, డీన్ యేగేశ్వరి పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అమ్మ ఒడి – నా తెలంగాణ పుస్తకావిష్కరణ -
హామీలు అమలు చేయాలి
కొడంగల్ రూరల్: కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇ చ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు రూ.6 వేలు, సాధారణ పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పుతోందన్నారు. పెన్షన్ దరఖాస్తులను ఆమోదించిన ప్రతీ ఒక్కరికి నూతన పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కొడంగల్ ప్రధాన చౌరస్తా నుంచి తహసీల్దార్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గజ్జల ప్రకాశ్, దివ్యాంగులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. కొత్త పెన్షన్లు ఇవ్వాలి అనంతగిరి: ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం పెన్షన్లను పెంచాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన వృద్ధులు, దివ్యాంగులు, ఎంఎస్పీ నాయకులతో కలిసి వికారాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా కొత్త పెన్షన్లు ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి దసరా నుంచే పెన్షన్లను మంజూరు చేయాలన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ -
వసతి గృహాల్లో సెలవుల సందడి
● తల్లిదండ్రులు, విద్యార్థులతో కిక్కిరిసిన హాస్టళ్లు ● దసరా హాలీడేస్ నేపథ్యంలోఇంటిబాట పట్టిన విద్యార్థులు దుద్యాల్: ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించడంతో గురుకులాలు, కేజీబీవీల్లో శనివారం సందడి కనిపించింది. జూన్ మాసంలో పాఠశాల పునఃప్రారంభం నుంచి ఇప్పటి వరకు సెలవులు లేకపోవడంతో కొంత ఒత్తిడికి గురైన విద్యార్థులకు పండగు హాలీడేస్ ఉపశమనం కలిగించాయి. తమను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు, పోషకులతో సంతోషంగా ఇంటిబాట పట్టారు. పిల్లల కోసం వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సంక్షేమ హాస్టళ్లు కిక్కిరిసిపోయాయి. విద్యార్థులు ఇంటికి వెళ్తున్న తరుణంలో బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు కిక్కిరిసిపోయాయి. పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఆపకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో ఇళ్లకు చేరుకున్నారు. -
పశు సంరక్షణపై ఆందోళన
తాండూరు రూరల్: పశువైద్య శాఖ అధికారుల తీరుపై తాండూరు ఏఎంసీ చైర్మన్ పి.బాల్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆయన స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోని పశువైద్య ఏడీఏ కార్యాలయాన్ని సందర్శించారు. గంటపాటు అక్కడే ఉన్నా వైద్యులు ఎవరూ రాలేదు. ఈ సందర్భంగా బాల్రెడ్డి మాట్లాడుతూ.. ఏడీఏ కార్యాలయంలో ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నోవా కొన్ని నెలలుగా రైతులకు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని సాయిపూర్, మల్రెడ్డిపల్లి, పాంత తాండూరు పాటు పలు కాలనీల రైతులు పశు వైద్యులు లేక జీవాలకు సరైన వైద్యం అందడం లేదని ఫిర్యాలు చేస్తున్నారన్నారు. ఈ మేరకు కార్యాలయానికి రావడంతో సిబ్బంది మల్లికార్జున్ మినహాయిస్తే ఎవరూ లేరన్నారు. రోగాలు వ్యాప్తి చెంది పశువులు మృత్యువాత పడుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇదే విషయమై జిల్లా పశువైద్యశాఖ అధికారి డాక్టర్ సదానందంను ఫోన్లో సంప్రదించారు. డాక్టర్ల తీరుపై స్థానిక ఎమ్మెల్యే మనోహర్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వైద్యాధికారుల తీరుపై ఏఎంసీ చైర్మన్ అసంతృప్తి -
ఫోన్ల వినియోగంలో అప్రమత్తత అవసరం
యాలాల: స్మార్ట్ ఫోన్ల వినియోగంలో బాలికలు అప్రమత్తంగా ఉండాలని యాలాల ఎస్ఐ విఠల్రెడ్డి సూచించారు. శనివారం తాండూరు షీ టీం ఆధ్వర్యంలో అగ్గనూరు జెడ్పీహెచ్ఎస్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయంలో అవగాహన ఉండాలన్నారు. అనవసర లింకులు ఓపె న్ చేసి సైబర్ నేరాల బారిన పడొద్దని సూచించారు. ఫొటో మార్ఫింగ్, ఈవ్ టీజింగ్, అత్యవసర సమయాల్లో డయల్ 100, 181 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సాయం పొందాలన్నారు. అనంతరం షీ టీం ఇంచార్జీ శేఖర్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆదేశాలతో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలికలు, యువతీ యువకులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీసులు ఉన్నారు. యాలాల ఎస్ఐ విఠల్రెడ్డి -
డ్రోన్ వ్యవసాయం
● పురుగు మందు పిచికారీలో విరివిగా వనియోగిస్తున్న రైతులు ● మందుల వాడకం తగ్గడంతో పాటు కూలీల కొరతను అధిగమిస్తున్న కర్షకులు ● సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న అన్నదాతలు దౌల్తాబాద్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించుకునేందుకు రైతులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వరికోత నూర్పిడి పలు పనులు యంత్రాలతో చేస్తున్నారు. వివిధ పంటలతో పాటు వరిపైరులోనూ డ్రోన్ల సాయంతో పురుగు మందు పిచికారీ చేస్తున్నారు. దీంతో వాడే మందుల మోతాదు తగ్గించుకోవడంతో పాటు కూలీల కొరతను అధిగమిస్తున్నారు. పెట్టుబడిని ఆదా చేసుకుంటున్నారు. తగ్గనున్న మందుల వినియోగం వ్యవసాయ అధికారుల సూచనల ప్రకారం ఎకరా వరిపైరుపై తైవాన్ స్ప్రేయర్తో మందులను చల్లించాలంటే 120 నుంచి 140 లీటర్ల నీటిలో మందులను కలిపి చల్లించాలి. ఇందుకు మందు చల్లే వ్యక్తితో పాటు ట్యాంక్లో నీరు పోయడానికి ఓ మనిషి అవసరం ఉంటుంది. అందుకు రూ.వేయి ఖర్చు అవుతుంది. ఇదే పనిని డ్రోన్లతో 30–40 లీటర్ల నీటిలో మందును కలిపి ఎకరానికి చల్లుకోవచ్చంటున్నారు. అయిదెకరాల మందు పిచికారీకి ఒక మనిషి సరిపోతారని చెబుతున్నారు. డ్రోన్తో ఎకరం మందు పిచికారి చేసేందుకు రూ.400 ఖర్చువుతుంది. పురుగుమందు మోతాదు సైతం తగ్గించుకోవచ్చని కర్షకులు వెల్లడిస్తున్నారు. పంటల్లో భారీగా నీరు వర్షాలు అధికంగా పడడం వల్ల పొలాల్లో నీరు మోకాళ్ల లోతు వరకు చేరాయి. అంతలోతు నీటిలతో తైవాన్ స్ప్రేయర్తో మందు పిచికారీ కష్టంగా మారింది. దీంతో సాధారణ పద్ధతికంటే డ్రోన్ల సాయంతో సస్యరక్షణ చర్యలు చేపట్టడం మంచిదని భావించిన రైతులు అటుగా మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం నందారం గ్రామంలో రైతులు డ్రోన్లను విరవిగా వినియోగిస్తున్నారు. ఖర్చు తగ్గింది వరి పంట సాగులో పురుగు దోమ ప్రభావం కనిపించింది. పొలాల్లో నీళ్లు ఎక్కువగా ఉండడం కూలీల కొరత ఉండడం మనుషులతో అయితే మందు పిచికారీ సక్రమంగా జరగదని డ్రోన్ సహాయంతో పిచికారి చేయించా. పని సులభమయింది. ఖర్చు తగ్గింది. – రాజశేఖర్రెడ్డి, రైతు, నందారం -
మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
యాలాల: కాగ్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. యాలాల ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని సంగెంకుర్దులో కాగ్నా నది నుంచి ఇసుక రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు తమ సిబ్బంది తనిఖీలు చేపట్టగా రెండు ఖాళీ ట్రాక్టర్లు ఇసుక రవాణాకు వెళ్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. అదే సమయంలో దేవనూరు శివారులో తనిఖీలు చేపట్టగా ఇసుక లోడ్తో వెళుతున్న ట్రాక్టరును గుర్తించి తనిఖీలు చేయగా ఎటువంటి అనుమతి పత్రాలు లేవు దీంతో ఖాళీ ట్రాక్టర్లను తహసీల్దార్కు అప్పగిస్తామని.. లోడ్ ట్రాక్టరుపై నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ముర్రుపాలలో వ్యాధి నిరోధక శక్తి
మోమిన్పేట: ముర్రు పాలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు బాబురావు అన్నారు. శనివారం మండల పరిధిలోని కోల్కుందలో పోషణ మాసోత్సవాల్లో భాగంగా చిన్నారు తల్లులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. ప్రతీ తల్లి బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టించాలన్నారు. తల్లి పాలతో బిడ్డకు ఆరు రోగాలు దరిచేరవని వివరించారు. ఆరు నెలల వరకు తల్లి పాలను పట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారం తీసుకుని పోషకాహారలోపం సమస్యలకు దూరంగా ఉండాలని సూచించారు. చిరు ధాన్యాలు, కూరగాయలు పుష్కలంగా తీసుకొవాలని చెప్పారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సలహాలు, సూచనలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త గొంగమ్మ, ఆశ వర్కర్లు, చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎం బాబురావు -
ఆధార్ అప్డేట్ చేస్తామంటూ..
ధారూరు: ఆధార్ కార్డులను అప్డేట్ చేయడంతో పాటు తప్పులను సవరిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో తిష్టవేశారు. వీరిపై కొంతమంది స్థానిక యువకులకు అనుమానం రావడంతో తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చేసరికి అక్కడి నుంచి జారుకున్నారు. తహసీల్దార్ సాజిదాబేగం, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్కు చెందిన ఇద్దరు యువకులు కంప్యూటర్ పరికరాలు, ప్రింటర్, వైట్ పేపర్లతో శనివారం ధర్మాపూర్ జీపీకి వచ్చారు. మాజీ సర్పంచ్ పంపించాడని, గెజిటెడ్ సంతకాలు అవసరమైనా తామే చూసుకుంటామని నమ్మబలికారు. ఆధార్ కార్డుల అప్డేట్ కోసం రూ.35 బదులు రూ.350 వసూలు చేస్తుండటంతో అనుమానం వచ్చిన పలువురు యువకులు తహసీల్దార్కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే ఈడీఎం కాల్చేసిన ఆమె ఆధార్ అప్డేట్ కోసం ధర్మాపూర్ జీపీకి ఎవరినైనా పంపంచారా అని ఆరా తీయగా లేదనే సమాధానం వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఆమె స్థానికుల ఫోన్ద్వారా యువకుల వివరాలు చెప్పమనగా తడబడ్డారు. తాను వచ్చేవరకు ఎవరి ఆధార్కార్డు, ఫోన్నంబర్లు సేకరించవద్దని సూచించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. గ్రామాల్లో సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది. వ్యక్తిగత సమాచారం సేకరించి, మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తహసీల్దార్ సూచించారు. వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి పేరు యూసూఫ్ అని, విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. ధర్మాపూర్ జీపీ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తుల తిష్ట తహసీల్దార్ అప్రమత్తతతో జారుకున్న వైనం వివరాలు సేకరిస్తున్న అధికారులు సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని సూచన -
స్వస్థ్ నారీ స్వశక్త్తో సంపూర్ణ ఆరోగ్యం
డాక్టర్ ప్రియదర్శిని దౌల్తాబాద్: స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్లో భాగంగా మహిళలకు పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్ ప్రియదర్శిని అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పీహెచ్సీలో చెవి, ముక్కు, గొంతు నొప్పి లక్షణాలున్న 132 మంది మహిళలకు వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈఎన్టీ స్పెషలిస్టు వైద్యులు నాగరాజు, సూపర్వైజర్ రఫీ, ఏఎన్ఎంలు సిబ్బంది ఉన్నారు. తాండూరు మండలానికి ఏడుగురు జీపీఓలు తహసీల్దార్ తారాసింగ్ తాండూరు రూరల్: మండలానికి ఏడుగురు గ్రామ పాలన అధికారుల(జీపీఓ)ను నియమిచినట్లు తహసీల్దార్ తారాసింగ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని 22 క్లస్టర్లకు గాను ఏడుగురు విధుల్లో చేరారన్నారు. వ్యర్త తేజస్ నాయక్. ఈడ్గి రాంచంద్రయ్య, బి.కిష్టప్ప, నర్మద, నీరటి వెంకటయ్య, బి.చిన్న నర్సింలు మండలానికి కేటాయించారని వివరించారు. మరో 15 మంది మండలానికి జీపీఓ రావాల్సి ఉందన్నారు. వారందరూ వచ్చిన తర్వాత జీపీఓలకు క్లస్టర్ల వారీగా గ్రామాలు కేటాయిస్తామన్నారు. దిగుబడి లేకమార్కెట్ వెలవెల! ధారూరు: వ్యవసాయ ఉత్పత్తులు లేక ధా రూరు మార్కెట్ వెలవెలబోతోంది. మండల వ్యాప్తంగా రైతులు ఈసారి సుమారు వెయ్యి ఎకరాల్లో పెసర, వంద ఎకరాల్లో మినుము సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయంలోనే కురిసిన భారీ వర్షాలకు చేలు పూర్తిగా పాడయ్యాయి. దీంతో దిగుబడులు చేతికందలేదు. రైతులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు మార్కెట్లోకి సరుకు రావడం లేదు. ఏటా ఈసీజన్లో వేలాది బస్తాల పెసర, మినుము ఉత్పత్తులు మార్కెట్కు తరలివచ్చేవి. పంటలు దెబ్బతినడంతో శనివారం రైతులు లేక మార్కెట్ కళావిహీనంగా కనిపించింది. వ్యాపారులు, అడ్తిదారులు మధ్యాహ్నం వరకే ఇళ్లకు వెళ్లిపోయారు. బ్రహ్మోత్సవాలకు సిద్ధం ● లక్ష్మి అనంతపద్మనాభ స్వామి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి ● రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం అనంతగిరి: వికారాబాద్ పట్టణం ఆలంపల్లిలోని శ్రీ లక్ష్మి అనంతపద్మనాభ స్వామి ఆలయంలో సోమవారం నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త పద్మనాభం, ఈఓ నరేందర్ తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో మొదటి రోజు సాయంత్రం 4.30 గంటలకు ధ్వజారోహణంతో ప్రారంభిస్తారని తెలిపారు. నిత్యం ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, అర్చన, పూజలతో పాటు రాత్రి 7 గంటలకు స్వామి వారి వాహన సేవ ఉంటుందని తెలిపారు. మంగళవారం హనుమత్వాహనంపై, బుధ వారం ముత్యాలపందిరి, గురువారం శేషవాహనం, శుక్రవారం గరుడ, శనివారం చంద్రప్రభ, ఆదివారం సూర్యవాహన సేవ కొనసాగనున్నాయని వివరించారు. దసరాను పురస్కరించుకుని సాయంత్రం 4 గంటలకు అశ్వవాహన ఊరేగింపు ఉంటుందని తెలిపారు. అనంతరం 5గంటలకు ఆలంపల్లి మైదానంలో రావణదహనం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. -
బైక్ను ఢీకొట్టిన సిమెంట్ ట్యాంకర్
ధారూరు: బైక్ను సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఆశాపురి ఫ్యాక్టరీ వద్ద శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన ప్రకారం.. పెద్దేముట్ మండలం రుక్మాపూర్కు చెందిన భానుప్రసాద్ హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. పెద్దల అమవాస్య కోసం బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా సుద్ద ఫ్యాక్టరీ రోడ్డుపై సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. కేసు దర్యాప్తులో ఉంది. ద్విచక్ర వాహనదారుడికి గాయాలు -
డీఫాల్టర్లకు ధాన్యం బంద్
రెండేళ్లుగా పౌరసరఫరాల శాఖకు బియ్యం ఇవ్వని మిల్లర్లు తాండూరు: పౌరసరఫరాల శాఖ రైస్ మిల్లర్లకు సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు పక్కదారి పట్టించారు.కోవిడ్ సమయంలో లాక్డౌన్ను అదునుగా చేసుకొని పేదలకు పంపిణీ చేసే బియ్యంతో అక్రమాలకు పాల్పడ్డారు. రైస్ మిల్లుల యజమానులు గడువులోపు అందించకపోవడంతో 30 మంది నిర్వాహకులకు అధికారులు నోటీసులు జారీ చేసి రూ.20 కోట్లు జరిమానా విధించారు. ఈ వానాకాలంలో రైతుల నుంచి సేకరించే ధాన్యాన్ని డీఫాల్టర్లకు ఇవ్వొద్దని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రీసేల్ జిల్లాలోని 20 మండలాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. సాగునీటి వనరులు మెరుగుపడడంతో ఎనిమిదేళ్లుగా సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, బోరు మోటార్ల కింద వరిసాగు వానాకాలంలో 1.20 లక్షల ఎకరాలు, యాసంగిలో సుమా రు 80 వేల ఎకరాల వరకు సాగవుతోంది. ఈ ధాన్యాన్ని ఏటా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. పౌరసరఫరాల శాఖ ఆధీనంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ కోసం సీఎంఆర్ చేసేందుకు రైస్ మిల్లులకు తరలిస్తారు. కాగా 2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాల్లో తరలించిన ధాన్యం మిల్లర్లు గడువు ముగిసినా అందించలేదు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణ చేపట్టారు.మిల్లుల్లోకి వెళ్లి తనిఖీలు చేపట్టగా ధాన్యం కనిపించలేదు. ఇటువంటి 30 మంది రైస్ మిల్లుల యజమానులకు నోటీసులు జారీ చేయడంతో పాటు రూ.20 కోట్లు చెల్లించాలని గతంలో నోటీసులు జారీ చేశారు. కొందరిపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేశారు. సీఎంఆర్ ధాన్యం అమ్మకాలు రైతుల నుంచి ప్రభుత్వ మద్ధతు ధరకు కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం రైస్ మిల్లులకు అప్పగించిన ధాన్యాన్ని మిల్లు యజమానులు తాండూరు వ్యవసాయ మార్కెట్లో విక్రయించారనే ఆరోపణలున్నాయి. తాండూరు వ్యవసాయ మార్కెట్లో ఏటా 40 వేల నుంచి ఆరువేల క్వింటాళ్లు మాత్రమే ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయి. కానీ 2023లో మార్కెట్ యార్డులో 4 లక్షల క్వింటాళ్లు విక్రయాలు జరిగాయి. మార్కెట్కు వచ్చిన ధాన్యం రైస్ మిల్లర్లు రైతుల పేరిట విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్ణయం ఫైనల్ పౌరసరఫరాల శాఖకు 30 రైస్ మిల్లులు సీఎంఆర్ ఇవ్వలేదు. దీంతో మిల్లు యజమానులను డిఫాల్టర్ల జాబితాలో చేర్చి నోటీసులు జారీ చేశారు. 30 మిల్లు ల యజమానుల నుంచి రూ.20 కోట్ల వరకు పెనాల్టీ విధించాం. డిఫాల్టర్లకు ఈ సీజన్లో సీఎంఆర్ అందించే విఽషయంలో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారు. – మోహన్కృష్ణ, డీఎం, పౌరసరఫరాల శాఖ -
దరఖాస్తుల ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలలో 26, 27న ఇంటర్వ్యూలు అనంతగిరి: వికారాబాద్లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో వివిధ విభాగాలలో (28) సీనియర్ రెసిడెంట్లకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని డాక్టర్ దీన్దయాళ్ బంగ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న ఉదయం 9నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు, జిరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు. వివరాలను జీఎంసీవికారాబాద్.ఏసీ.ఇన్ వెబ్సైట్లో పొందవచ్చన్నారు. ఈ ఉద్యోగాలకు గౌరవ వేతనం చెల్లించబడుతుందన్నారు. ప్రొఫెసర్లు, అసోసియేటెడ్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు.. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాలల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు(2), అసోసియేటేడ్ ప్రొఫెసర్లు(17), అసిస్టెంట్ ప్రొఫెసర్లు(30) పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దీన్దయాళ్ బంగ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు, జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని ఆయన సూచించారు. వివరాలను జీఎంసీవికారాబాద్.ఏసీ.ఇన్ వెబ్సైట్లో పొందవచ్చన్నారు. 23న మెగా వైద్య శిబిరం తాండూరు టౌన్: పట్టణంలోనిమాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ శిబిరం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రసూతి, పి ల్లల, నేత్ర, ఈఎన్టీ, దంత, చర్మ, మానసిక వై ద్యానికి సంబంధించిన స్పెషలిస్టు వైద్యులు ఈశిబిరంలో సేవలందిస్తారన్నారు. మహిళా, శి శు సంరక్షణ సేవలు,టీబీనమోదు, రక్తదాన శి బిరాల నిర్వహణ, మహిళా ఆరోగ్య సేవలు, కి షోర బాలికలు, మహిళలకు అవగాహన కార్య క్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రైతులే విత్తనాలు ఉత్పత్తి చేసుకోవాలి శాస్త్రవేత్త డాక్టర్ సునీత బంట్వారం: రైతులు తమ పంట పొలాల్లోనే విత్తనాలు ఉత్పత్తి చేసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ సునీత అన్నారు. శనివారం ఆమె కోట్పల్లి, రాంపూర్, ఎన్నారం గ్రామాల్లో వరి, కంది పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీత మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనాలు పండించడంలో తీసుకోవాల్సిన మెళకువలను రైతులకు వివరించారు. ప్రతి గ్రామంలో నాణ్యమైన విత్తన పథకం (క్యూఎస్ఈవీ) అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రైతులు సాగు చేస్తున్న నాణ్యమైన విత్తన కేత్రాలను సందర్శిస్తున్నామని చెప్పారు. రైతులే విత్తనాలు ఉత్పత్తి చేసుకుని సాగు చేస్తే ఖర్చులు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. విత్తనాలు అందుబాటు లో ఉండడటమే కాకుండా నకిలీ సీడ్స్తో మోసపోకుండా ఉండవచ్చన్నారు. రైతులు తాము పండించిన విత్తనాలను ఇతరులకు అమ్ముకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కోట్పల్లి ఏఓ కరుణాకర్రెడ్డి, ఏఈఓలు సందీప్, నర్మద రైతులు పాల్గొన్నారు. పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలి అనంతగిరి: దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ పెంచిన అదనపు బస్సు చార్జీలను వెంటనే విరమించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్కుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ఆయన వికారాబాద్ ఆర్టీసీ డీఎంకు వినతిపత్రం అందజేశారు. పండుగల వేళ బస్సు చార్జీలు పెంచి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. సొంత గ్రామాలకు సంతోషంగా వెళ్లే ప్రయాణికులకు పెరిగిన చార్జీలు భారంగా మారాయన్నారు. ఆయన వెంట ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, వెంకటేశం, విద్యాసాగర్, ప్రభాకర్ తదితరులు ఉన్నారు. -
కిశోర బాలికలతో ఎస్హెచ్జీలు
తాండూరు రూరల్: గ్రామాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల తరహాలో కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయాలని డీఆర్డీఏ శ్రీనివాస్ ఆదేశించారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట్ మండలాల్లోని ఐకేపీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 14 ఏళ్ల నుంచి 18 సంవత్సరాల బాలికలతో 70 వేల కిషోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. మహిళ జీవితంలో కిషోర బాలిక దశ కీలకమైనదని.. వారికి సరైన దారి చూపితే సమాజానికి మార్గదర్శకురాలు అవుంతుందన్నారు. సంఘాలు ఏర్పాటు తర్వాత బాలికల భద్రత, ఆరోగ్యం, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం సహాకరిస్తోందని వివరించారు. స్నేహ యాప్లో కిషోర బాలికల వివరాలు నమోదు చేయాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగుల సంఘాలు సైతం ఏర్పాటు చేయాలన్నారు. నవంబర్ 20వ తేదీలోపు అన్ని సంఘాల ఏర్పాటు పూర్తి చేయాలని ఐకేపీ సిబ్బందిని ఆదేశించారు. ఎన్ఆర్ఎల్ఎం(నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్) పథకం కింద గొర్రెలు, మేకల పెంపకం యూనిట్లు మంజూరయ్యాయని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ నర్సింలు, డీపీఎంలు నర్సింలు, కొమరయ్య, మ హిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జానకి, శ్రీనిధి ఆర్ఎం ఉదయ్కుమారి, ఏపీఎంలు బాలయ్య, శ్రీనివాస్, పద్మారావు, గోపాల్, వెంకన్న, బందెయ్య, సీసీలు పాల్గొన్నారు. -
రైల్వే లైన్ మారింది!
కొడంగల్: వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ రూటు మారింది. నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ మీదుగా రైలు మార్గం నిర్మించడానికి అలైన్మెంట్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో గత వారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైల్వేశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 130 కిలో మీటర్ల దూరం నిర్మించనున్న కొత్త రైల్వే లైన్కు సుమారు రూ.2,785 కోట్ల ఖర్చు కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దసర పండుగ తర్వాత సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను రైల్వే బోర్డుకు అధికారులు సమర్పించే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లాలో పరిగి, తుంకిమెట్ల, కొడంగల్, బాలంపేట శివారులో కొత్తగా రైల్వే స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నిరీక్షణకు మోక్షం కొడంగల్, పరిగి నియోజకవర్గ ప్రజలు 45 ఏళ్లుగా నిరీక్షిస్తున్న వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్కు మోక్షం లభించింది. ఈ మార్గంతో ఇక్కడి ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. రైల్వే లైన్తో రవాణా వ్యవస్థ మెరుగు పడడంతో పాటు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కొడంగల్ మీదుగా రైల్వే లైన్ వేసేందుకు 1980–81లో అప్పటి మహబూబ్నగర్ ఎంపీ, రైల్వేశాఖ సహాయ మంత్రి మల్లికార్జున్ సర్వేకు ఆదేశించారు. వికారాబాద్ నుంచి పరిగి, దోమ, సర్జఖాన్పేట, మద్దూరు, నారాయణపేట, ఊట్కూ ర్, మక్తల్, మాగనూర్ మీదుగా కృష్ణ వరకు రైల్వే లైన్ నిర్మాణానికి సర్వే చేయించారు. కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మీదుగా రైల్వే లైన్ వేస్తే ఆదాయం వస్తుందని గణాంకాలను విశ్లేషిస్తూ ఇక్కడి ప్రజలు కేంద్రానికి నివేదిక పంపించారు. దీంతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆదేశాల మేరకు రెండో సారి సర్వే చేపట్టారు. కొడంగల్ మీదుగా రైల్వే లైన్ వేస్తే బాగుంటుందని నిపుణులు నివేదిక సమర్పించారు. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాల పునర్విభజనలో కోస్గి, మద్దూరు మండలాలు నారాయణపేట జిల్లాలోకి వెళ్లాయి. కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాలు వికారాబాద్ జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొడంగల్ మీదుగా రైల్వే లైన్ వేస్తే వికారాబాద్ జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించడానికి వీలుగా ఉంటుందని స్థానికులు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చారు. డీపీఆర్కు సీఎం ఆదేశాలు కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో రైల్వే అధికారులతో పలుమార్లు సమాలోచనలు చేశారు. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్తో పాటు కొడంగల్ మండలం టేకుల్కోడ్ దగ్గర నిర్మించనున్న సిమెంట్ ఫ్యాక్టరీ మీదుగా రైల్వే నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు పరిగి, తుంకిమెట్ల, కొడంగల్, మద్దూరు, నారాయణపేట మీదుగా కృష్ణ వరకు రైల్వే లైన్కు మార్గం సుగమమైంది. ముందుగా అనుకున్న రూటు: పరిగి, కొడంగల్, హస్నాబాద్, దౌల్తాబాద్, నారాయణపేట, కున్సి, కృష్ణ రూటు మారిన తర్వాత: పరిగి, తుంకిమెట్ల, కొడంగల్, బాలంపేట, మద్దూరు, నారాయణపేట, మక్తల్, కృష్ణ -
జిల్లాస్థాయి పోటీలకు విద్యార్థినుల ఎంపిక
పూడూరు: వికారాబాద్ పట్టణంలో మూడు రోజుల పాటు జరిగిన అండర్ – 14, –17 బాలికల విభాగం వాలీబాల్, ఖోఖో పోటీల్లో మండలంలోని అంగడిచిట్టంపల్లి పాఠశాల విద్యార్థినులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం నరేందర్రెడ్డి తెలిపారు. విద్యార్థినులు జోనల్ స్థాయిలో ప్రతిభ చాటి మెడల్స్ సాధించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఈటీ సత్యనారాయణ, ఉపాధ్యాయులుశ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు తాండూరు టౌన్: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత మాట్లాడుతూ.. మోదీ జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ ముదిరాజ్, నాగారం మల్లేశం, భద్రేశ్వర్, కృష్ణ, కిరణ్, ప్రహ్లాద్, ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, అనంతప్ప తదితరులు పాల్గొన్నారు. ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం తాండూరు టౌన్: ఆత్మరక్షణకు తైక్వాండో ఎంతగానో దోహదపడుతుందని జిల్లా తైక్వాండోఅసోసియేషన్ సెక్రటరీ ఆర్ రాజు అన్నారు. శుక్రవారం స్థానిక సెయింట్ మార్క్స్ జూబ్లీ పాఠశాల ఆవరణలో శిక్షితులైన తైక్వాండో క్రీడాకారులకు ఫిట్నెస్, టెక్నికల్ విభాగాల్లో పరీక్ష నిర్వహించారు. అనంతరం బెల్టులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జోసెఫ్, డీన్ సతీషన్, తైక్వాండో కోచ్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. వీధి వ్యాపారులకు రుణాలు అనంతగిరి: వీధి వ్యాపారులు లోక్ కళ్యాణ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ సూచించారు. శుక్రవారం వికారాబాద్లోని మెప్మా కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 2వ తేదీ వరకు లోక్ కళ్యాణ్ మేళా శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద వీధి వ్యాపారులకు మూడు దశల్లో రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో రూ.15 వేలు, రెండో దశలో రూ.25 వేలు, మూడో దశలో రూ.50 వేల వరకు రుణాలు ఇస్తారన్నారు. ఈ మొత్తాన్ని 12, 18, 36 నెలల్లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. రుణాలు సక్రమంగా చెల్లించే వారికి రూ.30 వేల విలువ చేసే రూపే క్రెడిట్ కార్డులు అందేలా చూస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలు కొనసాగించాని ఇలా చేస్తే ఏడాదికి రూ.1,600 క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కొత్తగా వ్యాపారం చేయాలనుకూనే వారు రుణాల కోసం మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవి కుమార్, వికారాబాద్ టీఎంసీ వెంకటేష్, కెనరా బ్యాంక్ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి, మెప్మా సిబ్బంది, పలువురు వీధివిక్రయదారులు తదితరులు పాల్గొన్నారు. -
చెంచుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కుల్కచర్ల: చెంచుల సంక్షేమానికి ప్రభుత్వాలు అందిస్తున్న సదుపాయాలు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి కమలాకర్రెడ్డి సూచించారు. శుక్రవారం కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలోని చెంచు కాలనీలో జిల్లా అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. చెంచుల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని వివరించారు. వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి జహంగీర్, ఎంపీడీఓ రామకృష్ణ ఆధ్వర్యంలో స్వచ్ఛతే సేవ కార్యక్రమాన్ని నిర్వహించా రు. విద్యార్థులతో అవగాహన ర్యాలీ తీశారు. కా ర్యక్రమంలో హౌసింగ్ శాఖ పీడీ సయ్యద్ మక్రం, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రవికుమార్, మిషన్ భగీరథ డీఈ సుబ్రహ్మణ్యం, ఏఈ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగ్రోస్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి
పరిగి: ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఆగ్రోస్ కేంద్రాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మా ట్లాడుతూ.. ఈ కేంద్రాల్లో రైతులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల మందులు, ఎరువులు ఉంటాయన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మందులు, ఎరువులు విక్రయించాలని సూచించారు. రై తులు నానో యూరియా, నానో డీఏపీ వాడాలన్నా రు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభు త్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, నాయకులు రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
పని ఒత్తిడి తగ్గించండి
అనంతగిరి: జిల్లాలో ఆయా హోదాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గించాలని తెలంగాణ మెడికల్ అండ్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ చంద్రప్రకాష్ కోరారు. శుక్రవారం ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, డీఎంహెచ్ఓ లలితాదేవికి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ను రద్దు చేయాలన్నారు. క్షేత్రస్టాయి సేవలో నిమగ్నమవుతుండటంతో ఆరోగ్య కేంద్రాలకు వచ్చి హాజరు నమోదు చేసుకోవాలంటే చాల ఇబ్బంది కలుగుతుందన్నారు. ఆన్లైన్ యాప్లు, ఆన్లైన్ ఎంట్రీలు లేకుండా చేయాలన్నారు. తప్పనిసరైతే ప్రతి పీహెచ్సీకి ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ను నియమించి ఆన్లైన్ పనులు చేయించాలన్నారు. పని ఒత్తిడితో అనారోగ్యాల బారిన పడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనివాస్, రేణుకుమార్, వెంకన్న, తిరుపతయ్య, రవీందర్రెడ్డి, ప్రకాష్, ఫకీరప్ప, అమరేశ్వరి, విజయలక్ష్మి, అనిత, విమల, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ అల్లంవెల్లుల్లి పట్టివేత
● పేస్ట్తో పాటు రసాయనాలు, రంగుల స్వాధీనం ● ఇద్దరికి రిమాండ్ తాండూరు టౌన్: నకిలీ అల్లంవెల్లుల్లి తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం వారిని రిమాండ్కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలోని మణికంఠ కిరాణా దుకాణంలో గురువారం టాస్క్ఫోర్స్ సీఐ అన్వర్ పాషా తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. 30 కిలోల నకిలీ అల్లంవెల్లుల్లి పేస్టుతో పాటు, పేస్టు నింపి ఉన్న 111 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దుకాణ యజమాని వీరన్నను అదుపులోకి తీసుకుని విచారించారు. తాను హైదరాబాద్ ఆసిఫ్నగర్కు చెందిన ఇమ్రాన్ సలీం అనే వ్యక్తి వద్ద నకిలీ అల్లంతో పాటు తయారీకి వినియోగించే రసాయనాలు, కృత్రిమ రంగులను కొనుగోలు చేసినట్లు చెప్పాడు. దీంతో ఇమ్రాన్ దుకాణంపై దాడి చేసి 166 కిలోల నకిలీ అల్లంవెల్లుల్లి పేస్టుతో పాటు పేస్టు నింపిన 38 బాటిళ్లు, 30 కిలోల కల్తీఅల్లం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఇద్దరినీ రిమాండ్కు తరలించారు. -
టీఎల్ఎం మేళాతో బోధన సులభతరం
అనంతగిరి: టీఎల్ఎం మేళాతో విద్యార్థులకు సులభతరంగా బోధన చేయడానికి అవకాశం ఉంటుందని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు టీఎల్ఎం మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన 200లకు పైగా ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. తొమ్మిది ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, మండల విద్యాధికారి బాబుసింగ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఉపాధ్యాయులు దోమ: టీఎల్ఎం రాష్ట్రస్థాయి మేళాకు మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. మోత్కూర్ పాఠశాలకు చెందిన పాండురంగాచారి(తెగులు), దాదాపూర్ పాఠశాలకు చెందిన యాదగిరి(ఈవీఎస్, పరిసరాల విజ్ఞానం) విద్యార్థులకు అందిస్తున్న టీఎల్ఎం మేళాలో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కార్యాలయంలో జిల్లా విద్యాధికారి రేణుకాదేవి వానికి ప్రశంస పత్రాన్ని అందించి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు తమ తమ వృత్తిని బాధ్యతతో నిర్వహిస్తే ఎన్నో ప్రశంస పత్రాలను అందుకుంటారని తెలిపారు. జిల్లాస్థాయిలో శ్వేతారాణి ప్రతిభ తాండూరు రూరల్: జిల్లాస్థాయిలో నిర్వహించిన టీఎల్ఎం మేళాలో తాండూరు మండలం కొత్లాపూర్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు శ్వేతారాణి ప్రతిభ చాటారు. ఇంగ్లిష్ పాఠ్యాంశాలను నూతన పద్ధతుల్లో బోధన చేయడంపై టీఎల్ఎం మేళాలో నమూనాలు ప్రదర్శించారు. దీంతో శ్వేతరాణికి జిల్లాస్థాయిలో రెండో బహుమతి లభించింది. డీఈఓ రేణుకాదేవి చేతులమీదగా సర్టిఫికెట్ అందుకున్నారు. తమ పాఠశాల ఉపాధ్యాయురాలు టీఎల్ఎం మేళాలో రెండో బహుమతి సాధించడంపై పీఆర్టీయూ మండల అధ్యక్షుడు, పాఠశాల హెచ్ఎం వినోద్కుమార్ అభినందించారు. ఉపాధ్యాయురాలి కృషిని సృజనాత్మకతతో పిల్లలకు సులభతరంగా బోధన చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. తాండూరు రూరల్: నమూనాతో శ్వేతారాణి వికారాబాద్లో టీఎల్ఎం మేళా అడిషనల్ కలెక్టర్ సుధీర్ -
మండలానికి జీపీవోల కేటాయింపు
దుద్యాల్: గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ అధికారులను నియమించింది. అందుకు గాను మొదటి విడుత ఎంపికలో భాగంగా గతంలో పని చేసిన వీఆర్వోలు, వీర్ఏలను ఎంపిక చేసింది. దుద్యాల మండలానికి ఆరుగురిని కేటాయించినట్లు తహసీల్దార్ కిషన్ తెలిపారు. పి గోపాల్, కావలి శ్రీనివాస్, ఆర్ రమేశ్ శుక్రవారం తహసీల్దార్కు రిపోర్ట్ చేశారు. మిగత ముగ్గురు కూడా త్వరలో రిపోర్ట్ చేస్తారని తెలిసింది. ఈ సందర్భంగా తహసీల్దార్ కిషన్ మాట్లాడుతూ..గ్రామాల్లో నెలకొన్న రెవెన్యూ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. రేడియల్ రోడ్డు వద్దంటూ నిరసన పరిగి: రైతుల పొలాల నుంచి చేపట్టనున్న రేడియల్ రోడ్డు వద్దని రైతులు, గ్రామస్తులు శుక్రవారం రంగాపూర్లో నిరసన చేపట్టారు. దామగుండం నేవీరాడర్ స్టేషన్కు వెళ్లేందుకు శంషాబాద్ నుంచి రంగాపూర్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి ఇటీవల సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పాత రోడ్డు నుంచే రోడ్డు వేయాలని వారు అధికారులను కోరారు. సర్వే చేసిన విధంగానే వేయనున్నట్లు చెప్పడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నామన్నారు. రేడియల్ రోడ్డు నిర్మాణంతో తమ ఉపాధి హరించకపోతోందని చిన్నకారు, సన్నకారు రైతులు వివరిస్తున్నారు. ఈ విషయం గురించి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి మ్యాప్ను మార్చాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న కాలంలో ధర్నాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. జిల్లాస్థాయి క్రికెట్ పోటీలకు విద్యార్థుల ఎంపిక శంకర్పల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జోనల్ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించినట్లు జోనల్ సెక్రెటరీ ప్రభాకర్ అన్నారు. మండలం పరిధిలోని జన్వాడలో ఏర్పాటు చేసిన ఈ ఎంపికలకు జోన్ (చేవెళ్ల, శంకర్పల్లి మండలాలు) నుంచి 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో అండర్–14లో 18 మంది, అండర్–17 విభాగంలో 18 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. జోనల్ స్థాయిలో ఎంపికై న విద్యార్థులు త్వరలో హైదరాబాద్లో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. అత్యాచార నిందితుడి అరెస్ట్ ఇబ్రహీంపట్నం: వృద్ధ యాచకురాలిని గాయపరిచి, అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుడిని ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం కటకటాల వెనక్కు నెట్టారు. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన ప్రకారం.. ఇబ్రహీంపట్నం కొత్త బస్టాండ్ వెనుక ఉన్న షాపు వరండాలో బుధవారం అర్థరాత్రి ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధ యాచకురాలిపై లైంగికదాడికి పాల్పడిన విషయం విదితమే. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన పల్లాటి రవీందర్(38)గా గుర్తించి ఆయన్ను చర్లపల్లి జైల్కు తరలించామన్నారు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసే ఇతనిపై గతంలోనూ పలు కేసులున్నాయన్నారు. ఈ ఘటన విషయం తెలియగానే నాలుగు ప్రత్యేక బృందాలు సీసీ ఫుటేజీలు పరిశీలించి, నిందితుడిని పట్టుకున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది. ట్రాక్టర్ బోల్తా ఆమనగల్లు: ట్రాక్టర్ బోల్తాపడడంతో ఒకరు మృతిచెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన తలకొండపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన జంగయ్య (50) రెండు నెలలుగా మిడ్జిల్లో సిమెంట్ ఇటుకల తయారీ పనులకు వెళ్తున్నాడు. శుక్రవారం మరో నలుగురు కూలీల తో కలిసి సిమెంట్ ఇటుకలను ట్రాక్టర్లో నింపుకొని తలకొండపల్లి మండలం మాదాయిపల్లికి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. జంగయ్యపై ఇటుకలు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నలుగురికి గాయా లు కాగా చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాది చేతల ప్రభుత్వం
షాబాద్: మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ కృషి చేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం వారు మండల పరిధిలోని చందనవెళ్లిలో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు వస్తాయన్నారు. గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు మందుకు సాగుతోందన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చిన ఘతన తమదే అన్నారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కుమ్మరి చెన్నయ్య, మాజీ సర్పంచ్లు మహేందర్గౌడ్, రవీందర్నాయక్, పార్టీ నాయకులు స్వామి, రాహుల్గుప్తా, వేమారెడ్డి, బేగరి యాదయ్య, ప్రభాకర్రెడ్డి, కిషోర్నాయక్, మాధవరెడ్డి, శేఖర్, గౌరీ, రాఘవేందర్, శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
దాడికి పాల్పడిన వ్యక్తికి రిమాండ్
తాండూరు రూరల్: సిగరెట్ ఇవ్వలేదనే కోపంతో దుకాణా యజమానిపై దాడికి పాల్పడిన వ్యక్తిని శుక్రవారం రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించి కరన్కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ కథనం ప్రకారం.. చిట్టిఘనాపూర్ గ్రామానికి చెందిన ఈడ్గి అంజయ్యగౌడ్ అదాని సిమెంట్ ఫ్యాక్టరీ గేటు ఎదుట కిరాణషాపు నిర్వహిస్తున్నాడు. ఈనెల 10న బెల్కటూర్కు చెందిన అడివప్ప మద్యం తాగి, అంజయ్యగౌడ్ షాపు వద్దకు వెళ్లి సిగరెట్ ఇవ్వాలని కోరాడు. రాత్రి కావడంతో షాపు బంద్ చేస్తున్నానని, సిగరెట్ కూడా లేదని యజమాని చెప్పడంతో ఆగ్రహానికి గురైన అడివప్ప అతనిపై కర్రతో దాడి చేశాడు. బాధిత కుటుంబ సభ్యులు వెంటనే అంజయ్యగౌడ్ను చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో అతని కుడిచేయి విరిగిపోయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో అడివప్పపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన కరన్కోట్ పోలీసులు శుక్రవారం అతన్ని కొడంగల్ న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. -
నిత్యం వేధిస్తున్నాడని భర్తను చంపేసింది
మణికొండ: తనను తరచూ వేధిస్తున్నాడనే కోపంతో భర్తను కూరగాయలు కోసే కత్తితో పొడిచి చంపేసింది ఓ భార్య. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి కోకాపేటలో జరిగింది. నార్సింగి ఇన్చార్జి సీఐ రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అసోం రాష్ట్రానికి చెందిన కృష్ణంజ్యోతి బోరా (30), బర్క బోరా భార్యాభర్తలు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కోకాపేటలోని ఓ నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. వారం రోజుల క్రితం భార్యను కొట్టి ఆమెతో గొడవ పడి ఇంట్లోంచి కృష్ణంజ్యోతి వెళ్లిపోయాడు. గురువారం అర్ధరాత్రి మద్యం మత్తులో వచ్చి తలుపులు కొట్టినా ఆమె తీయలేదు. తలుపులను కృష్ణంజ్యోతి బలంగా తన్నటంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. బర్క బోరాను కర్రతో కొట్టేందుకు యత్నించగా.. ఆమె పక్కనే ఉన్న కూరగాయలు కోసే కత్తితో అతనిపై దాడి చేసింది. తల, మెడ, కుడి భుజంపై కత్తితో పొడవటంతో కృష్ణంజ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి అరుపులు వినిపించడటంతో లేబర్ క్యాంపులో ఉన్న చుట్టు పక్కల వారు వచ్చి చూసే సరికి అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు నిందితురాలు బర్క బోరాని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భయం నీడన బాలిక!
తాండూరు: పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో బాలికలపై వేధింపులు పెచ్చుమీరాయి. వీటిని తట్టుకోలేక అభంశుభం తెలియని విద్యార్థినులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో బాలికలు అదృశ్యమవుతున్నా వీటిని కట్టడం చేయడంలో పోలీస్ శాఖ విఫలమవుతోందనే విమర్శలున్నాయి. 14 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు వయసున్న బాలికల భద్రత తల్లిదండ్రులకు సవాలుగా మారింది. స్కూల్కు వెళ్తున్న మైనర్లపై దాడులు జరుగుతున్నాయి. మరోవైపు తెలిసీతెలియని వయసులో ఉన్న బాలికలను కొంతమంది ఆకతాయిలు ప్రేమ పేరుతో వంచిస్తున్నారు. తాండూరు పరిధిలో 2024 జనవరి నుంచి 2025 ఆగస్టు వరకు గడిచిన ఇరవై నెలల కాలంలో 37 మంది బాలికలు అదృశ్యమయ్యారు. మరోవైపు మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై 65 పోక్సో కేసులు నమోదయ్యాయి. పోలీసుల అధికారిక లెక్కలు ఇలా ఉండగా.. ఫిర్యాదు చేయని ఘటనలు ఇంతకు మించి ఉంటాయనేది బహిరంగ రహస్యం. తాండూరులోని సెయింట్ మార్క్స్ హైస్కూల్లో చదువుతున్న ఓ బాలికతో వైస్ ప్రిన్సిపల్ బాలస్వామి అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. అతని అకృత్యాలను భరించలేని విద్యార్థిని ఈనెల 10న తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో మరుసటి రోజు పాఠశాలకు వెళ్లిన బాలిక కుటుంబ సభ్యులు అతడిని చితకబాదారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువుపోతుందనే కారణంతో అక్కడితోనే ఆగిపోయారు. కూతుళ్లను బాగా చదివించాలనే ఉద్దేశంతో ఓ కుటుంబం పట్టణంలోని సాయిపూర్లో ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటోంది. పదో తరగతి చదువుతున్న బాలిక ఉన్నట్టుండి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణానికి లైంగిక వేధింపులే కారణమని తెలియడంతో శవాన్ని తీసుకెళ్లి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. బిడ్డను పోగొట్టుకున్న పుట్టెడు దుఖఃంలో.. పరువును కూడా పోగొట్టుకోలేక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు. మైనర్లకు రక్షణ కరువు ఏటా పెరుగుతున్న అదృశ్యాలు, అఘాయిత్యాలు పరువు పోతుందని ఫిర్యాదుకువెనకాడుతున్న బాధిత తల్లిదండ్రులు బాలికలపై నమోదైన కేసులు పోలీస్ స్టేషన్ 2024లో 2025లో మిస్సింగ్ పోక్సో మిస్సింగ్ పోక్సో తాండూరు 02 13 03 15 కరన్కోట్ 08 03 03 06 పెద్దేముల్ 03 05 04 10 బషీరాబాద్ 03 01 0 02 యాలాల 04 05 07 05 మొత్తం 20 27 17 38 -
రక్షణ చట్టాన్ని అమలు చేయాలి
● నిందితులను కఠినంగా శిక్షించాలి ● న్యాయవాదుల విధుల బహిష్కరణ కొడంగల్ రూరల్: న్యాయవాదులపై దాడులకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని కొడంగల్ బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం విధులు బహిష్కరించి, నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంసీసీబీఏ, నాంపల్లి కోర్టు జీవితకాల సభ్యులు, సీఓపీ న్యాయవాదులు అనిల్కుమార్బోగా, హనుమాన్నాయక్పై దాడికి పాల్పడటం దారుణమన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు కోసం నిరిహార దీక్ష చేస్తున్న సంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని తెలిపారు. ప్రభుత్వం స్పందించి వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టును అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బా ర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, ప్రధాన కా ర్యదర్శి బి.వెంకటయ్య, ఉపాధ్యక్షుడు బస్వరాజు, న్యాయవాదులు ఏవీ.ఆనంద్, టి.కరుణాకర్రెడ్డి, వెంకటయ్యగౌడ్, కె.రాములు, బి.కృష్ణయ్య, కె.రమే శ్, భానుప్రసాద్, రవీందర్నాయక్, మోహిద్, జి.శివరెడ్డి, చంద్రమోహన్, భీమయ్య పాల్గొన్నారు. -
మట్టి తవ్వకాలకు అనుమతులా?
● కేవీపీఎస్ మండల అధ్యక్షుడు సురేశ్ మండిపాటు ● రైతుల నుంచి తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వాలి ఇప్పట్లో ‘దారి’కొచ్చేనా..! చిత్రంలో కనిపిస్తున్నది వరదనీటి కాలువ అనుకుంటే మీరు గుంతలో కాలేసినట్లే. ఇది అక్షరాలా ఆర్అండ్బీ ప్రధాన రోడ్డు. బషీరాబాద్లోని పశువుల దవాఖానా నుంచి అంబేడ్కర్ ప్రధాన కూడలి మీదుగా పాత బీఎస్ఎన్ఎల్ భవనం వరకు రహదారి దుస్థితి ఇలా తయారైంది. విస్తరణ పనుల్లో భాగంగా పది రోజుల క్రితం రోడ్డును తవ్విన కాంట్రాక్టర్ అలాగే వదిలేయడంతో భారీ వర్షాలకు నీళ్లు నిండి ఏటి కాలువను తలపిస్తోంది. మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు ఇలా మారడంతో ప్రయాణికులు, స్థానికులు అవస్థలు పడుతున్నారు. – బషీరాబాద్ బషీరాబాద్: దళితులకు ఇచ్చిన భూముల్లో మట్టి తవ్వకాలకు ఎలా అనుమతులు ఇస్తారని అధికారులపై కేవీపీఎస్ మండల అధ్యక్షుడు సురేశ్ మండిపడ్డారు. ఐదు దశాబ్దాల కిందటా అప్పటి దివంగత ఇందిరమ్మ ప్రభుత్వంలో దళితులకు సీలింగ్పట్టాలు ఇస్తే, వాటిని సదరు వ్యక్తులకు తెలియకుండానే అధికారులు లాక్కున్నారని సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని నావంద్గీ గ్రామానికి చెందిన 60దళిత కుటుంబాలకు సర్వేనంబర్ 182, 183లో 60 ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చారు. ఈ విషయం గురించి రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు తిరిగి లాక్కున్నారన్నారు. నాటి ఇందిరమ్మ కాలంలో భూములు పంపిణీ చేస్తే నేటి రేవంత్రెడ్డి ప్రజా పాలనలో దళితుల భూములు గుంజుకున్నారని విమర్శించారు. ఆ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులకు మట్టి తవ్వకాల కోసం రెవెన్యూ అధికారులు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా లాక్కోవడం అన్యాయమన్నారు. వెంటనే సదరు భూముల్లో మట్టి తవ్వకాలు నిలిపివేసి, రైతులకు పరిహారం ఇప్పించాలని తహసీల్దార్ షాహెదాబేగానికి వినతిపత్రం అందజేశారు. -
రైతులకు అండగా ప్రభుత్వం
బొంరాస్పేట: రైతులకు అండగా సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటోందని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రం సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వ్యవసాయశాఖ నుంచి సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు అందజేశారు. వీసీసీ, బీఎల్డీ రకాల వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ తెలిపారు. ఎకరానికి నాలుగు బస్తాల చొప్పున మండలంలోని మెట్లకుంట, మదన్పల్లి, బురాన్పేట గ్రామాల రైతులకు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. మిగిలిన గ్రామాలకు సైతం వేరుశనగ విత్తనాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి పోలప్ప, ఏఈఓలు స్వాతి, హేమ, శైలజ, పవన్, జగదీశ్, నాయకులు సురేందర్రెడ్డి, సత్యప్ప తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్రెడ్డి -
పశువులకు మెరుగైన సేవలు
తాండూరు రూరల్: స్థానిక పశు వైద్యశాలలో అధికారి లేరని సాక్షి దినపత్రికలో ఇటీవల ప్రచురితమైన ‘ఏడీఏ లేక.. సేవలు సాగక’ వార్తకు ఉన్నతాధికారులు స్పందించారు. ధారూరు మండలం కుక్కింద పశువైద్యశాల సబ్ సెంటర్లో పని చేస్తున్న ఫ్యారమేట్ సైదులును తాండూరు పశువైద్యశాల ఏడీఏ కార్యాలయానికి డిప్యూటేషన్పై పంపించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారంలో మూడు రోజులు కుక్కింద పశువైద్యశాలలో.. మరో మూడు రోజులు తాండూరు ఏడీఏ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సైదులను ఆదేశించారు. ఇక నుంచి తాండూరులో గురు, శుక్ర, శనివారం మూడు రోజులు అందుబాటులో ఉండనున్నారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడి మృతి దిక్కులేనివారైన భార్యాపిల్లలు తాండూరు రూరల్: అనారోగ్యంతో ఓ పంచాయతీ కార్మికుడు మృతి చెందాడు. దీంతో భార్య, కూతురు అనాథలయ్యారు. పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన బోడ సంగప్ప(33) పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పదిహేను రోజుల క్రితం జాండిస్కు గురికావడంతో పాటు కిడ్నీలో ఇన్ఫెన్షన్ సోకి ఉస్మానియా ఆస్పత్రిలో చేరాడు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి లాలప్ప, కారోబార్ నర్సిరెడ్డి నగరానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంగప్ప తల్లితండ్రులు కూడా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూనే మృతిచెందారు. సంగప్ప మృతితో అతని భార్య అక్షిత, ఏడాదిన్నర కూతురు ఆరోగ్య దిక్కులేనివారయ్యారు. ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. శుక్రవారం పెద్దేముల్లో సంగప్ప అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెట్టు కొమ్మ విరిగిపడి విద్యార్థికి గాయాలు బషీరాబాద్: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అండర్–14 క్రీడా పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన ఓ విద్యార్థిపై గురువారం చెట్టు కొమ్మ విరిగి పడింది. దీంతో అతడి తలకు తీవ్రగాయమైంది. వివరాల్లోకి వెళితే.. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కింద యాలల, బషీరాబాద్, తాండూరు టౌన్, తాండూరు రూరల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. తాండూరు పట్టణం వాల్మీకీ నగర్కు చెందిన సుశాంత్ అనే విద్యార్థి మండలంలోని జినుగుర్తి మోడల్ స్కూల్ నుంచి కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు హాజరయ్యాడు. తోటి విద్యార్థులతో పాఠశాల మైదానంలో చెట్టు కింద నిలబడ్డారు. అదేసమయంలో అకస్మాత్తుగా చెట్టు కొమ్మ విరిగికింద పడింది. మరో ఇద్దరు విద్యార్థులతో నిలబడి ఉన్న సుశాంత్ తలపై కొమ్మ పడింది. దీంతో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఉపాధ్యాయులు వెంటనే చికిత్స నిమిత్తం బాలుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు రెఫర్ చేశారు. దీంతో ఫైనల్ కబడ్డీ పోటీలు వాయిదా పడ్డాయి. పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఇబ్రహీంపట్నం రూరల్: నిర్మానుష్య ప్రదేశంలో పేకాట ఆడుతుండగా ఎస్ఓటీ, ఆదిబట్ల పోలీసులు దాడి చేసి, ఐదుగురు జూదరులను అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. రావిర్యాల సమీపంలోని మైల్ స్టోన్ వెంచర్లో పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో సుజీవన్, తిరుపతయ్య, మహేష్, శేఖర్, సురేష్లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.13,250 నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యార్థులను ఉత్తములుగా తీర్చాలి
నవాబుపేట: విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి ఉపయోగపడే పౌరులను అందించాల్సిన బాధ్యత గురువుపైనే ఉందన్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు.. వారి చేతిలోనే ఈ దేశ భవిష్యత్ ఉందన్నారు. ప్రభుత్వం పాఠశాలలకు అన్ని విధాలా సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్నాయక్, ఎంపీడీఓ అనురాధ, ఎంఈఓ అబ్దుల్ రెహమాన్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత, నాయకులు నాగిరెడ్డి, మల్లారెడ్డి, వెంకట్రెడ్డి, ఎక్బాల్, ప్రభాకర్, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే కాలె యాదయ్య -
బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
తాండూరు టౌన్: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా గురువారం స్థానిక తులసీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బీజేపీశ్రేణులు రక్తదాన శిబిరం నిర్వహించాయి. ఈ సందర్భంగా బీజేపీ, బీజేవైఎం, ఏబీవీపీ, వీహెచ్పీ, భజరంగ్దళ్, హిందూవాహిని, పలు స్వచ్ఛంధ సంస్థల సభ్యులు, మోదీ అభిమానులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ.. ప్రపంచానికి భారతదేశ గొప్పదనాన్ని చాటి చెప్పిన ఘనత మోదీకే దక్కిందన్నారు. ఆయన పాలనలో దేశ ప్రజలు సుభిక్షంగా వర్దిల్లుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయమన్నారు. ఈ శిబిరంలో నాయకులు సుభాన్ రెడ్డి, రజినీకాంత్, శ్రీలత, శ్రీహరి, గోపి, మల్లేశం, జగన్, వీరేందర్, మల్లు, శ్రీకాంత్, జగదీష్, కృష్ణ, కిరణ్, ప్రకాష్, శ్రీనివాస్, చందు, రఘు, శివాజీ తదితరులు పాల్గొన్నారు. -
వికారాబాద్లో పరిస్థితి ఇదీ..
వికారాబాద్: ఏడాది క్రితం నుంచి వికారాబాద్లో 330 పడకల బోధనాస్పత్రి కొనసాగుతోంది. రెండు నెలల క్రితం కొత్త భవనంలోకి ఆస్పత్రిని మార్చారు. అత్యవసర విభాగానికి చెందిన భవనం ఒక్కటే అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇక్కడ 86 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 70 మంది రెగ్యులర్, నలుగురు కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. 135 మంది హెడ్ నర్సులు, 36 మంది నాల్గో తరగతి ఉద్యోగులు సేవలందిస్తున్నారు. కుటుంబ నియంత్రణ, అపెండెక్స్ తదితన ఆపరేషన్లు చేస్తున్నారు. అనుమతులు వచ్చినా ఇంకా సిటీ స్కానింగ్ యంత్రాన్ని కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం రోజుకు సగటున 400 నుంచి 500 మంది వరకు ఓపీ నమోదవుతోంది. 20 నుంచి 30 మంది వరకు ఇన్ పేషంట్లు ఉన్నారు. టీ హబ్ ల్యాబ్లో అందుబాటులో ఉన్నా ఇంకా టూడీ ఈకో( గుండె సంబంధిత) పరీక్షల మిషన్ రాలేదు. సాధారణ మందులు అందుబాటులో ఉన్నాయి. -
సరైన వైద్యం అందక..
పరిగి: పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులు లేకపోవడం, సరైన వైద్య సేవలు అందక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పరిగి మండలం తోపాటు, దోమ, కుల్కచర్ల, బొంరాస్పేట్ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. రోజూ 300 నుంచి 350 మంది వరకు ఓపీ ఉంటుంది. 20 మందికిపైగా ఇన్పేషెంట్లు ఉన్నారు. ఇంత రద్దీ ఉండే ఆస్పత్రిలో వైద్యులు రోగులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 8 మంది డాక్టర్లు, 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి నెలా 20కి పైగా ప్రసవాలు చేస్తున్నారు. షిఫ్ట్ల వారీగా డెంటల్, గైనకాలజిస్ట్, చిన్న పిల్లల వైద్యులు పని చేస్తున్నారు. అత్యవసర చికిత్సలు రోడ్డు ప్రమాదాలు ఇతర కేసులు వస్తే వైద్యులు వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నేను పరిగి పట్టణంలోని తుంకుల్గడ్డలో ఉంటా. తెలిసిన మహిళ కడుపుతో ఉండటంతో ఆస్పత్రికి తీసుకొచ్చా. ఇక్కడి వైద్యులు పట్టించుకోవడం లేదు. ఆశావర్కర్లతో రావాలని అంటున్నారు. వారు లేరని చెప్పినా చికిత్స చేయలేదు. మా కాలనీ నుంచి నిత్యం ప్రజలు వస్తుంటారు. ఎవ్వరికీ సరైన వైద్యం అందడం లేదు. – భారతి, తుంకుల్గడ్డ, పరిగి -
వాహనాలు కదలక
పనులు సాగక..● మహబూబ్నగర్–చించోలి జాతీయ రహదారి నిర్మాణంలో జాప్యం ● ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే రోడ్డు ● పట్టించుకోని అధికారులు కొడంగల్: నత్తనడకన కొనసాగుతున్న రోడ్డు పను లతో కొడంగల్వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మహబూబ్నగర్–చించోలి జాతీయ రహదారి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏళ్లు గడుస్తున్నా రోడ్డు నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. కొడంగల్కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్సాపూర్లో ఇటీవల వాహనాలు రోడ్డులో కూరుకుపోతున్నాయి. చివరకు బస్సులు, ఇతర వాహనాలను దారి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డంతా బురదమయంగా మారింది. ద్విచక్ర వాహనదా రులు జారి కింద పడిన సంఘటనలు సైతం ఉన్నా యి. పనులు చేయించడంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాహనదారులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. జాతీయ నిర్మాణ పనులను రెండు బిట్లుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించారు. మహబూబ్నగర్ నుంచి దుద్యాల గేటు వరకు ఒక మోస్తరుగా పనులు జరిగాయి. ద్విచక్ర వాహనదారులకు తిప్పలు దుద్యాల నుంచి కొడంగల్, తాండూరు మీదుగా నిర్మిస్తున్న రహదారి పనులు మందకొడిగా సాగుతున్నాయి. రోడ్డు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ రహదారిపై వెళ్లాలంటే గగనంగా మారింది. భారీ వాహనాలు వెళ్లాలంటే డ్రైవర్లు భయపడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డును కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా గుర్తించి 167ఎన్ గా నామకరణం చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బూత్పూరు నుంచి కొడంగల్, తాండూరు, చించోలీ మీదుగా కర్ణాటక రాష్ట్రం మన్నెకెళ్లి వరకు జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. మన్నాకెళ్లి దగ్గర ముంబయి జాతీయ రహదారితో కలుస్తుంది. మొత్తం 150 కిలోమీటర్లు పొడవు గల ఈ జాతీయ రహదారి వికారాబాద్ జిల్లాలో 45 కిలోమీటర్లు ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రోడ్డును అధికారులు, నాయకులు పట్టించుకొని త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికుల అభ్యర్థన. -
లైసెన్స్ సస్పెన్షన్
బషీరాబాద్: ‘విచారణ మమ’శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం స్పందించారు. ఆయన ఆదేశంతో బషీరాబాద్లోని ‘సాయి ధనలక్ష్మి’ ఫర్టిలైజర్ షాపు లైసెన్స్ను మరో పది రోజుల పాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు ఏడీఏ కొమురయ్య ప్రకటించారు. అప్పటి వరకు షాపులో ఎరువుల విక్రయాలు నిర్వహించవద్దని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యజమానిని హెచ్చరించారు. అనంతరం నావంద్గీ సొసైటీలో యూరియా విక్రయాలపై సీఈఓ వెంకటయ్య నుంచి వివరాలు తెలుసుకున్నారు. అధిక ధరలకు విక్రయించినట్లు ఫిర్యాదులు వస్తే సొసైటీలకు సైతం యూరియా సరఫరా నిలిపివేస్తామన్నారు. మండలానికి మరో వంద టన్నుల యూరియా అవసరమని అధికారులు ఏడీఏకు తెలిపారు. రికార్డుల తనిఖీ.. యూరియా, డీఏపీ వంటి ఎరువుల కోసం అష్టకష్టాలు పడుతున్న సమయంలో తమ అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ధరలకు విక్రయించారని పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై వారం రోజుల క్రితం విచారణ చేపట్టిన వ్యవసాయ శాఖ అధికారులు దుకాణ నిర్వాహకులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతరం కంటి తుడుపు చర్యలతో సరిపెట్టే ప్రయత్నం చేయగా, సాక్షి ఈఅంశాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈనేపథ్యంలో ఏఓ అనితతో కలిసి గురువారం ఏడీఏ కొమురయ్య గురువారం మరోసారి బషీరాబాద్లోని ఫర్టిలైజర్ షాపు రికార్డులను తనిఖీ చేశారు. వారం రోజుల క్రితం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంతృప్తికర సమాధానం చెప్పకపోవడంతో మరో పది రోజుల పాటు లైసెన్స్ను సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై రైతులు హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయించేలా చూడాలని కోరారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించిన షాపుపై చర్యలు ఆదేశాలు జారీ చేసిన తాండూరు ఏడీఏ కొమురయ్య హర్షం వ్యక్తం చేసిన రైతులు -
ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని జిల్లా ఈవీఎం గోదాంను గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి పరిశీలించారు. ముందుగా ఆయన కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టర్ ప్రతీక్జైన్ బొకే అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్తో కలిసి ఈవీఎంలు భద్రపరిచిన గోదాంకు వెళ్లారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్ తీశారు. అనంతరం ఈవీఎంలు, బ్యాలెట్, కంట్రోల యూనిట్లు, ఎన్నికల సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత రిజిస్టర్లను పరిశీలించి సంతకాలు చేశారు. అనంతరం ఆయా రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడారు. బీఎల్ఓల పేర్లు ఇచ్చారా..? ఓటరు జాబితా పూర్తయ్యిందా అని అడిగారు. కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఆర్ఓ మంగీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నెమత్ అలీ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈవీఎంల గోదాంను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
యాలాల: పాత తాండూరు కాగ్నా నది నుంచి ఇసుక అనుమతి పొందిన ఓ ట్రాక్టర్ మండల పరిధి నుంచి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు రెవెన్యూ అధికారుల నుంచి ఇసుక తరలింపునకు అనుమతి పొందిన ఓ ట్రాక్టర్ గురువారం మండల పరిధిలోని గోవిందరావుపేట కాకరవేణి నది నుంచి ఇసుకను దర్జాగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వాహన డ్రైవర్ వద్ద పాత తాండూరు కాగ్నా నది నుంచి ఇసుక తరలింపునకు తహసీల్దార్ జారీ చేసిన అనుమతిని పోలీసులు గుర్తించారు. కాగా పట్టుబడిన ట్రాక్టర్ ఓ రాజకీయ నాయకుడిది కావడంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయమై సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. పట్టుబడిన ట్రాక్టరును శాఖపరమైన చర్యల నిమిత్తం యాలాల తహసీల్దార్కు అప్పగించనున్నట్లు ఎస్ఐ తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్టు బషీరాబాద్: పేకాట ఆడుతున్న ముగ్గురిని బషీరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఎస్ఐ నుమాన్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మైల్వార్ గ్రామానికి చెందిన బక్కప్ప ఇంట్లో మద్యం తాగుతూ యాదప్ప, అశోక్లు పేకాట ఆడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరి నుంచి రూ.2వేల నగదు, రెండు సెల్ఫోన్లు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. దత్త పీఠాన్ని సందర్శించుకున్న స్పీకర్ అనంతగిరి: దిండిగల్లోని అవధూత దత్త పీఠాన్ని గురువారం స్పీకర్ ప్రసాద్కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు స్పీకర్కు తీర్థ ప్రసాదాలు అందజేసీ ఆశీర్వచనాలు అందచేశారు. సీఎంను కలిసిన లగచర్ల నాయకులు దుద్యాల్: మండలంలోని లగచర్ల, హకీంపేట్ గ్రామాల నాయకులు గురువారం నగరంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు. మండలంలో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక వాడ పనులు వేగవంతంగా చేయాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో మాజీ సర్పంచ్ అనంతయ్య, నాయకులు యుగంధర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రభాకర్ ఉన్నారు. విద్యుత్ షాక్తో రైతు మృతి షాబాద్: విద్యుత్ షాక్తో ఓ రైతు మృతిచెందిన ఘటన షాబాద్ పీఎస్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఊబగుంట గ్రామానికి చెందిన బుడ్డమోళ్ల చంద్రయ్య(60) రోజు మాదిరిగానే ఉదయం పొలానికి వెళ్లాడు. వరి పంటకు నీరు పెట్టేందుకు మోటారు ఆన్ చేస్తుండగా షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో చేవెళ్ల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యు లు నిర్ధారించారు. మృతుడి తమ్ముడు దరశథ ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నేడు డయల్ యువర్ డీఎం
తాండూరు టౌన్: ప్రయాణికులు బస్సుల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తాండూరు ఆర్టీసీ డిపో మేనేజన్ సురేష్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రయాణికులు సెల్ నంబర్ 9959226251కు కాల్ చేసి సమస్యలు తెలియజేయాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు. తాండూరు టౌన్: చిన్నారులు ఎదుర్కొంటున్న వ్యాధులు, నిర్ధారణ, నివారణ, చికిత్స కోసం నేడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ గిరిధర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరులోని ఇందిరానగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత వైద్య శిబిరం కొనసాగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను వైద్య శిబిరానికి తీసుకురావాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ ధారూరు: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంపై బీజేపీకి మాట్లాడే హక్కు లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ అన్నారు. గురువారం ధారూరులోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజాం పాలన తరహాలోనే ప్రధాని మోదీ పాలన సాగుతోందని ఆరోపించారు. కమ్యునిస్టుల పోరాట చరిత్రను వక్రీకరించారని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు లక్ష్మయ్య, మల్లయ్య, వెంకటేశ్, సుదర్శన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. కొడంగల్ రూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన కమిటీని గురువారం పట్టణంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొడంగల్ శాఖ అధ్యక్షుడిగా కె.రాధాకృష్ణ, కార్యదర్శిగా డి.వెంకటయ్య, కోశాధికారిగా చంద్రప్ప, అసోసియేట్ అధ్యక్షుడిగా హన్మయ్య, ఉపాధ్యక్షులుగా నర్సప్ప, కె.యాదగిరి, సహాయ కార్యదర్శిగా కె.ప్రభాకర, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సిహెచ్.నరేందర్, ప్రచార కార్యదర్శిగా మోహన్రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్లుగా బాబుసింగ్, రఘువీర్సింగ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. అదనపు కలెక్టర్ సుధీర్ అనంతగిరి: మహిళా సంఘాలను బలోపేతం చేయాలని అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మెప్మా సిబ్బంది, రిసోర్స్ పర్సన్స్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంటే ఉంటే ఆ కుటుంబం బాగుంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది 800 సంఘాలకు రూ.100 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పించాలన్నారు. సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్, డిస్ట్రిక్ మిషన్ కోఆర్డినేటర్ రవి కుమార్, వెంకటేష్, రాజేంద్రప్రసాద్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. -
పర్యాటక కేంద్రంగా ‘పాంబండ’
● ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ● టూరిజం శాఖ ఈడీ ఉపేందర్రెడ్డితో కలిసి ఆలయం సందర్శన కుల్కచర్ల: పాంబండ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ టూరిజం శాఖ ఈడీ ఉపేందర్ రెడ్డితో కలిసి శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రోప్ వే, రిసార్ట్స్ నిర్మించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఆలయ అర్చకులు పాండు శర్మ, డీసీసీ కార్యదర్శి యాదయ్య, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, యూత్ విభాగం అధ్యక్షుడు జంగయ్య, నాయకులు గోవర్ధన్ రెడ్డి, భరత్కుమార్ రెడ్డి, వెంకటేష్, వెంకటయ్య, రాధారెడ్డి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో మానసికోల్లాసం పరిగి: క్రీడలు ఆడటంతో మానసిక ఉల్లాసం పెంపొందుందని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని మినీ గ్రౌండ్లో 69వ ఎస్జీఎఫ్ పరిగి జోనల్స్థాయి అండర్ 14, 17 కబడ్డీ పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు క్రీడల్లో రాణించి పరిగికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. క్రీడల్లో రాణించడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడల ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణ, పట్టుదల, స్ఫూర్తి, శారీరక క్రమశిక్షణ పొందుతాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో క్రీడాకారులకు ప్రత్యేక కోటా ఉంటుందన్నారు. ప్రతి పేదవాడికీ నాణ్యమైన వైద్యం అంతకుముందు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఆర్ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. గతంలో కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. పరిగిలో త్వరలోనే వంద పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు హన్మంతుముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
‘పాలమూరు’ను పూర్తి చేయండి
● ఎన్నికల హామీలను అమలు చేయాలి ● ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి ● మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కొడంగల్: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి సకాలంలో పనులు పూర్తి చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజల వద్దకు వెళ్లాలని డిమాండ్ చేశారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.4 వేల కోట్లు కేటాయిస్తే కొడంగల్తో పాటు నారాయణపేటకు సాగునీరు అందుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు నిధులు కేటాయించడం లేదని, తులం బంగారం ఇస్తామని మాట తప్పారని అన్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, రైతు బంధు రావడం లేదన్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దామోదర్రెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుయాదవ్, నాయకులు విష్ణువర్ధన్రెడ్డి, యాదగిరి, రమేష్బాబు, నర్మద కిష్టప్ప, మహిపాల్, భీములు, శేరి నారాయణరెడ్డి, మధుసూదన్రెడ్డి, సముద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రూ.కోట్ల భూమి స్వాహా
● పనిమనిషికి మాయమాటలు చెప్పి అక్రమ రిజిస్ట్రేషన్ ● సర్వే చేస్తుండగా నిలదీసిన బాధితుడు ● కిరాయి గుండాలతో దాడికి యత్నం పూడూరు: ఇంట్లో పని చేసే మనిషికి ఆసరాగా ఉండాల్సిన యజమానులు దౌర్జన్యానికి పాల్పడి ఆమె భూమినే కాజేసిన సంఘటన మండలంలో కలకలం రేపింది. రూ.ఐదు కోట్ల విలువ చేసే భూమికి కేవలం రూ.ఐదు లక్షలకే దక్కించుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాకంచర్ల గ్రామానికి చెందిన పద్మమ్మ నగరంలోని లింగంపల్లిలో ఓ ఇంట్లో పని చేస్తుంది(పనిమనిషి). ఆమెకు మండలంలోని పెద్ద ఉమ్మెంతాల్లో సర్వే నంబర్ 401లో రెండు ఎకరాల భూమి ఉంది. సదరు ఇంటి యజమానులు పద్మమ్మకు మాయమాటలు చెప్పి గుట్టుగా కుటుంబసభ్యులకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రూ.5 కోట్లకు విలువ చేసే భూమికి కేవలం రూ.5 లక్షలకే చేజిక్కించుకున్నారు. గురువారం సదరు భూమిలో సర్వే చేస్తుండగా పద్మమ్మ కొడుకు సురేశ్ అడ్డుకొని నిలదీశాడు. తామే భూమిని కొనుగోలు చేశామని పోచమ్మ 20 మంది కిరాయి గుండాలతో(సిక్కు) కలిసి తెలపడంతో అవాక్కయ్యాడు. ఎలా జరిగిందని ప్రశ్నించడంతో అతడిపై ఒక్కసారిగా దాడికి యత్నించారు. వెంటనే సురేశ్ గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి వచ్చి సర్వే ఆపే ప్రయత్నం చేశారు. న్యాయం చేయండి ఈ మేరకు పోలీసులు గుండాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి వద్ద కత్తులు, లాఠీలు, కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వెనుక పోచమ్మ కుమారుడు సంపత్ ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అతడు కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడని, ఈ వ్యవహారానికి మొత్తం సూత్రధారి అతడేనని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ పెంటయ్య ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. అమాయకుల భూములను కాజేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధితుడు సురేశ్కు న్యాయం చేయాలని గ్రామస్తులు పార్టీలకతీతంగా పోలీసులను కోరారు. ఈ మేరకు చన్గోముల్ కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భరత్రెడ్డి తెలిపారు. -
రోజూ 300 మందికి పైగా..
కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల పాటు వైద్యలు అందుబాటులో ఉంటున్నారు. నిత్యం 300 మందికి పైగా రోగులు వస్తున్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆస్పత్రి స్థాయిని పెంచి 220 పడకల టీచింగ్ హాస్పిటల్గా అప్ గ్రేడ్ చేశారు. ఇందులో భాగంగా అన్ని వసతులతో కూడిన నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 134 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. బయో కెమిస్ట్రీలో 56, పాథలాజీలో 37, మైక్రో బయోలజీలో 41 రకాల పరీక్షలు చేస్తున్నారు. ప్రతి రోజూ రక్త, మూత్ర, ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్స్రే, ఈసీజీ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. -
సీఎంఆర్ తక్షణం అందజేయాలి
అనంతగిరి: యాసంగి సీజన్ 2024–25కు సంబంధించి బకాయి కస్టమ్ మిల్లింగ్ బియ్యం(సీఎంఆర్)ను మిల్లర్లు తక్షణం అందజేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. అలాగే ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన బియ్యం డెలివరీని వేగవంతం చేయాలని సూచించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రైస్ మిల్లర్లతోసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిల్లు సామర్థ్యం మేరకు సీఎంఆర్ ను ఎఫ్సీఐకి అందజేయాలన్నారు. బ్యాంక్ గ్యారంటీ లేకుండా వడ్లు ఇవ్వడానికి వీలు లేదన్నారు. ఎఫ్సీఐ అధికారులు డెలివరీకి అనుగుణంగా గోదాంలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ మోహన్కృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శన్, శ్రీనివాస్ గుప్తా, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ -
రోగులు కిటకిట వైద్యం వెలవెల
తాండూరు: పేరుకే జిల్లా ఆస్పత్రి.. వైద్య సేవలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. వైద్యులు మాత్రం అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సివిల్ సర్జన్లు, డిప్యూటీ సివిల్ సర్జన్లు, స్పెషలిస్టు వైద్యులు 50 మంది వరకు ఉండాలి. కానీ 20మంది మాత్రమే ఉన్నారు. 12కు గాను 7 సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న ఐదు మందిలో ఒకరు మెదక్ ఆస్పత్రికి డిప్యూటేషన్పై వెళ్లారు. ఎస్ఆర్ఎంఓ పోస్టు ఖాళీగా ఉంది. 25 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు గాను 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 16 మంది వైద్యులకు గాను 5 మంది ఇతర ఆస్పత్రులకు డిప్యూటేషన్పై వెళ్లారు. డిప్యూటీ సివిల్ సర్జన్లు 8 పోస్టులకు గాను 5 ఖాళీగా ఉన్నాయి. ఉన్న 5 మందిలో ఇద్దరు డిప్యూటేషన్పై వెళ్లారు. దీంతో 24 గంటల వైద్య సేవలకు ఇబ్బందికరంగా మారింది.గంటల తరబడి క్యూలో..గురువారం ఒక్క రోజే 710 మంది రోగులు వివిధ ఆరోగ్య సమస్యలపై ఆస్పత్రికి వచ్చారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఔట్ పేషెంట్లు క్యూ కట్టారు. రోగుల సంఖ్యకు తగినంత మంది వైద్యులు లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. సకాలంలో వైద్యం అందక రోగులు డాక్టర్లతో గొడవకు దిగారు. 12 గంటల తర్వాత ఓపీ సేవలు ఆపేశారు. మాతాశిశు ఆస్పత్రిలో 5 మంది గైనకాలజిస్టులు, 5 మంది చిన్నపిల్లల వైద్యులు ఉండాలి. కానీ అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ రెండు విభాగాల్లో ఇద్దరు వైద్యులు కాంట్రాక్ట్ పద్ధతిన సేవలు అందిస్తున్నారు. గురువారం 435 మహిళలు, చిన్నారులు వైద్య సేవలు పొందారు.జిల్లాలోని ప్రధాన ఆస్పత్రుల్లో రోగులకు నామమాత్రపు వైద్య సేవలు అందుతున్నాయి. పీహెచ్సీల నుంచి మెరుగైన వైద్యం కోసం వచ్చే వారిలో ఎక్కువ మంది ప్రైవేటు బాట పడుతున్నారు. జిల్లాలో నాలుగు పెద్దాస్పత్రులు ఉన్నాయి. అందులో పరిగి, కొడంగల్లో కమ్యునిటీ హెల్త్ సెంటర్లు,తాండూరు జనరల్ ఆస్పత్రి, వికారాబాద్లో బోధనాస్పత్రి ఉంది. వీటిలో పరీక్షలకు సరిపడా పరికరాలు లేకపోవడం, వైద్యులు నగరం నుంచి వస్తుండటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఓపీకి అనుకున్నంత మేర రోగులు రావడం లేదు. జిల్లాలోని సీహెచ్సీల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై గురువారం ‘సాక్షి’ విజిట్ చేసింది. – వికారాబాద్ -
సెమీ స్కిల్డ్ కార్మికులుగా గుర్తించండి
తాండూరు టౌన్: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న స్పాట్ బిల్లింగ్ కార్మికులను టీజీఎస్పీడీసీఎల్(దక్షిణ విభాగం) సెమీ స్కిల్డ్ కార్మికులుగా గుర్తించి ఆర్డర్ కాపీని ఇవ్వాలని పలువురు తాండూరు విద్యుత్ డీఈ భానుప్రసాద్కు గురువారం వినతిపత్రం అందజేశారు. గత 20 ఏళ్లుగా ఫీస్ రేట్ బేసిస్పై టీజీఎస్పీడీసీఎల్లో పని చేస్తున్న 1,300 మంది స్పాట్ బిల్లింగ్ కార్మికులకు పల్లెల్లో రూ.5 వేలు, పట్టణాల్లో రూ.7వేలు చెల్లిస్తున్నారన్నారు. చాలీ చాలని జీతాలతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. అయితే గత నెలలో టీజీఎన్పీడీసీఎల్(ఉత్తర విభాగం) బిల్లింగ్ కార్మికులనుసెమీ స్కిల్డ్ కార్మికులుగా గుర్తించి ఆర్డర్ కాపీలను అందజేసిందన్నారు. ఒకే రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మికులకు ఒకే విధమైన విధానం లేకపోవడం సమంజసం కాదన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి బిల్లింగ్ కార్మికులకు ఆర్డర్ కాపీలు ఇవ్వాలని, లేని ఎడల విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. లక్ష్మీకాంత్రెడ్డి, రఫీక్, ప్రతాప్ రెడ్డి, నర్సిములు, సంపత్, హన్మంతు తదితరులు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు. -
ఫేక్ ఓటర్లపై విచారణ
● హాజరైన 26 మందిలో 22 మంది నకిలీ ఓటర్లేనని తేల్చిన అధికారులు ● మిగిలిన నలుగురిపైనా అనుమానం, పూర్తి వివరాలు సేకరిస్తామని వెల్లడి ● ఎంకై ్వరీకి రాని మరో 26 మంది ధారూరు: మండల పరిధిలోని ఎబ్బనూర్లో పెద్ద సంఖ్యలో ఫేక్ ఓటర్లు ఉన్నారనే ఫిర్యాదులపై డీఆర్ఓ మంగీలాల్ విచారణ చేపట్టారు. ఓటరు జాబితాలో పేర్లున్న సుమారు 52 మందికి అధికారులు ముందుగానే నోటీసులు అందజేశారు. ఫేక్ ఓటర్లు కాని వారు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈఅంశంపై గత బుధ, గురువారాల్లో స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఎంకై ్వరీ చేపట్టారు. మొదటి రోజు 12 మంది, రెండో రోజు 14 మంది మొత్తం 26 మంది హాజరు కాగా వీరిలో 22 మంది ఫేక్ ఓటర్లేనని అధికారులు తేల్చారు. మిగిలిన నలుగురు తమకు కేవలం ఎబ్బనూరులో మాత్రమే ఓటు హక్కు ఉందని వాదించారు. అయితే వీరి ఓట్లు కూడా తాండూరులో ఉన్నాయనే అనుమానం ఉందని, దీనిపై కూడా విచారణ జరుపుతామని తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. మరో 26 మంది విచారణకు హాజరు కాలేదు. వీరు రాకపోతే ఫేక్ ఓటర్లుగా నిర్ధారిస్తామని స్పష్టంచేశారు. -
జీవన్గీ పాఠశాలకు మహర్దశ
బషీరాబాద్: వరండా చదువులు ఇంకెన్నాళ్లు శీర్షికన గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. మండలంలోని జీవన్గీ ఉన్నత పాఠశాలలో తరగతి గదులు, వసతులు లేక విద్యార్థులు పడుతున్న బాధలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఉదయం పాఠశాలను మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ యశ్వంత్, సిబ్బంది సందర్శించారు. రూ.40 లక్షలతో కొత్త భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం విజయ్కుమార్, మాజీ సర్పంచ్ రాములు, కాంగ్రెస్ నాయకులు దేశ్ముఖ్ సంగారెడ్డి, తలారి చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఆలయ ఆవరణలో స్వచ్ఛ భారత్
యాలాల: ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా మండలంలోని రసూల్పూర్ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గురువారం బీజేపీ నాయకులు నిర్వహించారు. మాజీ ఎంపీపీ, బీజేపీ ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. అంతకుముందు ఆలయంలో పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా మండలంలో రోజుకో కార్యక్రమం చేపడుతున్నట్లు బాలేశ్వర్గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్కుమార్, ఉపాధ్యక్షుడు సుదర్శన్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు శివకుమార్, ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రామ్యనాయక్ తదితరులు ఉన్నారు. యాలాలలో మరో కొత్త బోరు మండల కేంద్రంలో ఎంపీ నిధుల్లో భాగంగా సగర కాలనీలో కొత్త బోరును మాజీ ఎంపీపీ బాలేశ్వర్గుప్తా వేయించారు. సగర కమిటీ హాల్ సమీపంలో పూజల అనంతరం బోరును తవ్వించారు. సగర సంఘం నాయకులు, గ్రామస్తులు ఉన్నారు. -
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
అనంతగిరి: మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం వికారాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ మెగా హెల్త్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో 56 రకాల పరీక్షలు, 17 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అనంతరం వికారాబాద్లోని బాలికల ఉన్నత పాఠశాలలో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా ఆధునీకరణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, డీఎంహెచ్ఓ లలితాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలి
కుల్కచర్ల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. బుధవారం మండలంలోని అనంతసాగర్ గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన పేదలను గుర్తించి వారికి నీడ కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. లబ్ధిదారులు ఇంటి పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాంచంద్రయ్య, భరత్కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మహేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, నాయకులు కుర్మయ్య, రఘు, కేశవులు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి -
విశ్వకర్మల అభ్యున్నతికి కృషి
తాండూరు రూరల్: విశ్వకర్మల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఖాంజాపూర్ గుట్ట వద్ద విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుట్ట ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీసీ రోడ్లు, విద్యుత్ సదుపాయం, వంటగదుల ని ర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. నేటి నుంచి విధుల్లోకి జీపీఓలు అనంతగిరి: భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. క్లస్టర్ల వారీగా గ్రామ పరిపాలన అధికారుల(జీపీఓలు) కేటాయింపు ప్రక్రియను బుధవారం పారదర్శకంగా నిర్వహించనట్లు తెలిపారు. భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం జీపీఓలను నియమించిందన్నారు. 139 మందికి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. గురువారం నుంచి విధుల్లో చేరాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, డీఆర్ఓ మంగీలాల్, ఏఓ ఫర్హీన్ కాతున్, తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛత కార్యక్రమాలను విజయవంతం చేద్దాం తాండూరు టౌన్: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ యాదగిరి తెలిపారు. మున్సిపల్ సిబ్బందితో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి 20వ తేదీ వరకు పరిశుభ్రత కార్యక్రమాలు, 23, 24వ తేదీల్లో విద్యాలయాల వద్ద శుభ్రత, 25న చెరువుల వద్ద, 26న ప్రభుత్వ కార్యాలయాల వద్ద, 27న ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద, 29, 30న పార్కుల్లో శుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నీరజా బాల్రెడ్డి, ప్రభాకర్ గౌడ్, సోమశేఖర్, విజయాదేవి, రవి, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఏఈ ఖాజా హుస్సేన్, ఉద్యోగులు ఉదయ్, వెంకటయ్య ఉమేష్, ప్రవీణ్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐను కలిసిన కాంగ్రెస్ యూత్ నాయకులు యాలాల: ఇటీవల యాలాల ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన విఠల్రెడ్డిని బుధవారం కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. యూత్ విభాగం మండల అధ్యక్షుడు వీరేశం ఎస్ఐను సన్మానించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు యూత్ కాంగ్రెస్ తరఫున అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఖాసీం, కిషన్, కేఎన్ఎస్, ప్రశాంత్కుమార్, రమేష్, నగేష్, మహిపాల్, పాల శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు జోనల్ స్థాయి పోటీలు కొడంగల్ రూరల్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం ఉదయం 10 గంటలకు జోనల్ స్థాయి ఎస్జీఎఫ్ కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు జోనల్ కార్యదర్శి అజీజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, దుద్యాల్ మండలాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అండర్–14, అండర్–17 విభాగాలకు సంబంధించి క్రీడా కారుల ఎంపిక ఉంటుందని తెలిపారు. -
మా భూములను కాపాడండి
అనంతగిరి/మోమిన్పేట: ట్రిపుల్ ఆర్ భూ బాధితులకు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందరాని హామీ ఇచ్చారు. మండలంలోని టేకులపల్లి, దేవరంపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు బుధవారం నగరంలోని తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడం ద్వారా తమ భూములు పోతున్నాయని, ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల ఆస్తులను కాపాడేందుకు పేద రైతుల పొట్ట కొడుతోందని ఆరోపించారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా సర్వే చేయడం ఏమిటని ప్రశ్నించారు. అభివృద్ధికి పేదల భూములే కావాలా అని నిలదీశారు. రైతులు మెచ్చేలా పరిహారం చెల్లించిన తర్వాతే భూములు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. బలవంతపు భూసేకరణ మంచిది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. గతంలో ఓఆర్ఆర్ విషయంలో కూడా ఇదే విధంగా సొంత ఎజెండాతో పేద రైతులను ముంచిందన్నారు. ఇప్పుడు అలైన్మెంట్ మార్చడం వెనుక పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. కేటీఆర్ను కలిసిన వారిలో పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్థన్రెడ్డి, మర్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్, భూములు కోల్పోతున్న రైతులు ఉన్నారు.