‘ప్రభుత్వ భూములను పరిరక్షించండి’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వ భూములను పరిరక్షించండి’

Published Mon, Feb 17 2025 1:00 AM | Last Updated on Mon, Feb 17 2025 1:00 AM

-

మధురవాడ: విశాఖ రూరల్‌ మండల పరిధిలో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి ప్రభుత్వ, ప్రజా అవసరాలకు ఉపయోగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్‌ అభియోగాలపై 7 గురు అధికారులకు జేసీ నోటీసులిచ్చి, ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు చెప్పారు. తాము పదేళ్లుగా వినతిపత్రాలు ఇస్తున్నా ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ఇప్పటికై నా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి.. భూకబ్జాదారులు, వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement