నేడు రాష్ట్ర పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక
ఎంవీపీకాలనీ: విశాఖ వేదికగా రాష్ట్ర పురుషుల కబడ్డీ జట్టును సోమవారం ఎంపిక చేస్తున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జేఎస్వీ ప్రసాదరెడ్డి తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర కబడ్డీ సంఘం సెలక్షన్ కమిటీని నియమించిందని ఓ ప్రకటనలో వెల్లడించారు. కమిటీ సభ్యులుగా కబడ్డీ నేషనల్ మెడలిస్ట్ ప్రసాదరెడ్డి, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు సీహెచ్ పద్మరాజు, వైవీ శ్రీనివాస్ ఉన్నారు. ప్రస్తుతం 19 మంది క్రీడాకారులకు నగరంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 12 మందిని కమిటీ తుది జట్టుకు ఎంపిక చేస్తుంది. ఈ జట్టు కటక్ వేదికగా జరగనున్న 71వ జాతీయ కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment