రాష్ట్ర పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక

Published Wed, Feb 19 2025 1:26 AM | Last Updated on Wed, Feb 19 2025 1:24 AM

రాష్ట్ర పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక

రాష్ట్ర పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక

ఎంవీపీకాలనీ: జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ పురుషుల కబడ్డీ జట్టు ఎంపికై ంది. ఈ మేరకు విశాఖ కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాదరెడ్డి తెలిపారు. గత కొన్ని రోజులుగా 19 మంది క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించగా సెలక్షన్‌ కమిటీ సభ్యులు మంగళవారం 12 మందితో కూడిన తుదిజట్టును ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఎంపికై న రాష్ట్ర కబడ్డీ పురుషుల జట్టు ఒడిశాలోని కటక్‌ వేదికగా జరగనున్న 71వ జాతీయ కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కటక్‌లో ఈ పోటీలు జరగనున్నట్లు తెలిపారు. సెలక్షన్‌ కమిటీ సభ్యులుగా కబడ్డీ నేషనల్‌ మెడలిస్ట్‌, విశాఖ కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి ప్రసాదరెడ్డి, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు సీహెచ్‌ పద్మరాజు, వైవీ శ్రీనివాస్‌లు వ్యవహరించారు. ఎంపికై న రాష్ట్ర జట్టును జి.రామకృష్ణ చౌదరి, లాలం రమేష్‌, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి వై.శ్రీకాంత్‌, సీనియర్‌ జాతీయ క్రీడాకారుడు వీవీ రమణ, సీహెచ్‌ పద్మరాజు తదితర క్రీడా ప్రముఖులు అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement