వన్యప్రాణులపై పోస్టర్‌ ప్రదర్శన పోటీలు | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణులపై పోస్టర్‌ ప్రదర్శన పోటీలు

Published Mon, Mar 3 2025 12:46 AM | Last Updated on Mon, Mar 3 2025 12:44 AM

వన్యప్రాణులపై పోస్టర్‌ ప్రదర్శన పోటీలు

వన్యప్రాణులపై పోస్టర్‌ ప్రదర్శన పోటీలు

ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో ఆదివారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జూ అధికారులు విద్యార్థులకు అవగాహన కోసం ఒకటో తరగతి నుంచి పీజీ వరకు వన్యప్రాణులపై పోస్టర్‌ ప్రదర్శన పోటీలు నిర్వహించారు. వారికి కేటగిరీల వారీగా అప్పగించిన అంశాలపై ఇంటి వద్దే పోస్టర్లు సిద్ధం చేసుకొని జూ బయోస్కోప్‌లో జరిగిన పోటీలకు హాజరయ్యారు. నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలల నుంచి సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభ చూపారు. పోస్టర్లను తోటి విద్యార్థులు, అతిథులు, జూ సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. ఉత్తమ పోస్టర్లు ప్రదర్శించిన విద్యార్థులకు ముఖ్య అతిథి ఏయూ జంతు శాస్త్ర విభాగం అధ్యాపకురాలు డాక్టర్‌ సి.మంజులత, జూ క్యూరేటర్‌ బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో జూ అసిస్టెంట్‌ క్యూరేటర్లు గోపి, గోపాలరావు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement