నృసింహుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రోజువారీ పూజా కార్యక్రమాలు బుధవారం ఆగమశాస్త్రం ప్రకారం కొనసా గాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులను అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ముఖమండపంలోని ఉత్సవమూర్తులకు మూర్తులకు అష్టోత్తర పూజలు, అష్టభుజి ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు సంప్రదాయ రీతిలో నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. వేద ఆశీర్వచనం, సువర్ణ పుష్పార్చన, నిత్యకల్యాణ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment