నిర్వాసితులకు పరిహారం చెల్లించేదెన్నడు?
భువనగిరి : బస్వాపూర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఏడుళ్లు కావస్తున్నా నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్లో భాగంగా భువనగిరి మండలం వడపర్తి పరిధిలో వాగు చెరువు, చోక్లతండా వద్ద నిర్మిస్తున్న కాల్వలను బుధవారం ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. నిర్వాసితుల కోసం తక్షణమే రూ.300 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే బస్వాపూర్ ప్రాజెక్టు నుంచి వడపర్తి కత్వ వరకు కాల్వను పూర్తి చేసేందుకు రూ. 6 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఇందుకోసం జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. వడపర్తి కత్వ నింపితే భువనగిరి, బీబీనగర్ మండలాల పరిధిలోని చెరువుల్లోకి నీరు చేరి వందలాది ఎకరాలు సాగవుతుందన్నారు. నిధులు విడుదల చేయని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో అందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, నాయకులు ఏదునూరి మల్లేశం, మైసయ్య,అంజనేయులు, మాణిక్యం, రైతులు పాల్గొన్నారు.
వైభవంగా రాచకొండ పర్యాటక ఉత్సవాలు
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని రాచకొండ పర్యాటక ఉత్సవాలు బుధవారం రాచప్ప కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమ య్యాయి. ఎస్ఐ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. రాచకొండ చ రిత్రను తెలియజేసే ఫొటో గ్యాలరీ, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
సాగునీటికి ప్రాధాన్యం
భువనగిరి : కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి తెలిపారు. భువనగిరిలోని దీప్తి హోటల్ సమీంలో బస్వాపురం రిజర్వాయర్ కాలువ పనులను బుధవారం రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. అందులో భాగంగా మూసీ ఆధారిత కాలువల సుందరీకరణకు రూ.500 కోట్లకు పైగా నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు. బైపాస్ రోడ్డు కాలువ పనుల్లో జా ప్యాన్ని నివారించి త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి కాలువ పనుల గురించి చర్చించారు.
నిర్వాసితులకు పరిహారం చెల్లించేదెన్నడు?
Comments
Please login to add a commentAdd a comment