
బైక్ను ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి
● అతడి భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలు
మంచాల, మర్రిగూడ: నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారిపై రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగాపల్లి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన మైలారం జంగయ్య(27) మృతిచెందాడు. అతడి భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగయ్య కుటుంబంతో కలిసి హైదరాబాద్లో నివాసముంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జంగయ్యకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వ్యక్తిగత పని నిమిత్తం భార్య పార్వతమ్మ, కుమార్తె అశ్వితతో కలిసి స్వగ్రామం యరగండ్లపల్లికి వచ్చిన జంగయ్య సోమవారం తిరిగి బైక్పై హైదరాబాద్ వెళ్తుండగా.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగాపల్లి సమీపంలోని జేబీ వెంచర్ వద్ద వీరి బైక్ను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జంగయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. పార్వతమ్మ, అశ్వితకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జంగయ్య మృతితో యరగండ్లపల్లి విషాదఛాయలు అలుముకున్నాయి.
అనారోగ్యంతో వ్యక్తి బలవన్మరణం
ఆత్మకూరు(ఎం): అనారోగ్యంతో బాధపడుతూ గడ్డి మందు తాగిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ సంఘటన ఆత్మకూరు(ఎం) మండలంలోని కొరటికల్ గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరటికల్ గ్రామానికి చెందిన పల్ల్లపు విజయేందర్(38) గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది నుంచి విజయేందర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లోనే గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య సౌందర్య, కుమారుడు రాకేష్, కుమార్తె శృతి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment