
ఎయిమ్స్లో అందుబాటులోకి మరిన్ని వైద్య సేవలు
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్లో రాబోయే రోజుల్లో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. బుధవారం ఎయిమ్స్ వైద్య కళాశాల రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ప్రెసిడెంట్ డాక్టర్ జార్జ్ ఏ డిసౌజా వర్చువల్గా మాట్లాడారు. అదేవిధంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం వికాస్ భాటియా మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ ప్రకారం రాబోయే రోజుల్లో ఎయిమ్స్ పురోగతి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ బుక్లెట్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీఎంఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సంఘమిత్ర పతి, డీన్ రాహుల్ నారంగ్, డాక్టర్లు సంగీత సంపత్, అభిషేక్ ఆరోరా, నితిన్జాన్, వర్గీస్ పాల్గొన్నారు.
ఫ బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్
వికాస్ భాటియా