రణ్బీర్ కపూర్, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మలు ప్రధాన పాత్రల్లో దర్శక, నిర్మాత కరణ్ జోహర్ తెరకెక్కిస్తున్న 'యే దిల్ హై ముష్కిల్' ఫస్ట్ టీజర్ విడుదలయ్యింది. కరణ్ తన ట్విట్టర్ ద్వారా మంగళవారం టీజర్ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. ముఖ్యంగా ఐశ్వర్యకు, రణ్బీర్కు మధ్య కుదిరిన కెమిస్ట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఐశ్వర్య కళ్లు చెదిరే అందంతో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమా ఆమెకు అదిరే సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వడం ఖాయమంటున్నారు. వన్ సైడ్ లవ్, డీప్ ఫ్రెండ్షిప్, హార్ట్ బ్రేక్ అంశాలతో హృదయాలను కదిలించే పనిపెట్టుకున్నారు కరణ్ జోహర్.
Published Tue, Aug 30 2016 4:41 PM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement