-
అకాయ్ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్డే సెలబ్రేషన్స్
-
Anushka Sharma Rare Photos: బర్త్డే స్పెషల్.. అన్నింట్లోనూ అనుష్క శర్మ టాపే (ఫొటోలు)
-
అందుకే ఆ రెండు నెలలు అక్కడే ఉన్నాం: కోహ్లి
రెండు నెలల పాటు ఆటకు దూరంగా.. కుటుంబానికి దగ్గరగా ఉండటం వింత అనుభూతినిచ్చిందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. తన ఇద్దరు పిల్లలతో కలిసి గడిపిన మధుర క్షణాలు వెలకట్టలేనివని పేర్కొన్నాడు. ఇప్పుడిక మళ్లీ ఆట మొదలుపెట్టానన్న కోహ్లి.. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు విరాట్ కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో సెలవు తీసుకున్న ఈ రన్మెషీన్.. ఫిబ్రవరి 15న తమకు కుమారుడు జన్మించాడని ప్రకటించాడు. పిల్లాడికి అకాయ్గా నామకరణం చేసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు ఈ ఆర్సీబీ(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) బ్యాటర్. సీఎస్కేతో జరిగిన ఆరంభ మ్యాచ్లో కేవలం 21 పరుగులకే పరిమితమైన కోహ్లి.. సోమవారం నాటి మ్యాచ్లో మాత్రం అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్తో బెంగళూరులో జరిగిన మ్యాచ్లో 49 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. ఆర్సీబీని గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 𝗙𝗹𝘂𝗲𝗻𝘁! ✨ King Kohli is off the mark in the chase and how 😎 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvPBKS | @imVkohli pic.twitter.com/mgYvM716Gs — IndianPremierLeague (@IPL) March 25, 2024 ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆ రెండు నెలల పాటు సాధారణ జీవితం గడిపే అవకాశం వచ్చింది. అప్పుడు మేము మన దేశానికి దూరంగా.. రోడ్డు మీద నడుస్తున్నా మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టని ప్రదేశంలో ఉన్నాం. కుటుంబమంతా కలిసే ఉన్నాం. అదొక వింతైన అనుభూతి. ఇద్దరు పిల్లలు ఉన్నపుడు వారితో గడిపే సమయాన్ని కూడా పెంచుకోవాలి కదా! ఏదేమైనా ఆ రెండు నెలలు మొత్తంగా ఫ్యామిలీతో ఉండేందుకు అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ మధురానుభూతులను అస్సలు మర్చిపోలేను. ఇప్పుడిక ఆట మొదలైంది. కచ్చితంగా నా బెస్ట్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నా’’ అని కోహ్లి పేర్కొన్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అనంతరం ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా ఆర్సీబీ తదుపరి శుక్రవారం నాటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. కాగా కోహ్లి- అనుష్క శర్మ దంపతులకు తొలి సంతానంగా కూతురు వామిక జన్మించిన సంగతి తెలిసిందే. -
విరాట్ కోహ్లి షాకింగ్ నిర్ణయం?!
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు శాశ్వతంగా భారత్ను వీడనున్నారా? ముంబైకి గుడ్బై చెప్పి యునైటెడ్ కింగ్డంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా?.. విరుష్క జోడీ గురించి సోషల్ మీడియాలో తాజాగా నడుస్తున్న చర్చ ఇది. భారత క్రికెట్ జట్టులో అడుగుపెట్టిన అనతికాలంలోనే కీలక సభ్యుడిగా ఎదిగి.. కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు ఢిల్లీ బ్యాటర్ విరాట్ కోహ్లి. నాటి సారథి మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా టీమిండియా పగ్గాలు చేపట్టి జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాడు. నాయకుడిగా తన పాత్ర పూర్తైన తర్వాత కేవలం ఆటగాడిగానే కొనసాగాలని నిర్ణయించుకున్న ఈ రన్మెషీన్ ప్రస్తుతం పూర్తిగా బ్యాటింగ్పైనే దృష్టి పెట్టాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇక కోహ్లి వ్యక్తిగత జీవితానికొస్తే.. బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మను 2017లో పెళ్లాడాడు. ఈ జంటకు 2021, జనవరిలో తొలి సంతానంగా కుమార్తె వామిక జన్మించింది. అయితే, బాహ్య ప్రపంచానికి, సోషల్ మీడియాకు వామికను దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆమె ఫేస్ను రివీల్ చేయలేదు విరుష్క. ఇక ఇటీవలే లండన్లో జన్మించిన(ఫిబ్రవరి 15) తమ కుమారుడు అకాయ్ విషయంలోనూ ఇదే సూత్రం పాటిస్తోంది ఈ స్టార్ జోడీ. పిల్లల గోప్యత, భద్రత దృష్ట్యా వారికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రానివ్వడం లేదు. ఈ నేపథ్యంలో కోహ్లి- అనుష్క దేశాన్ని వీడి యూకేలోనే సెటిల్ అవ్వనున్నారంటూ నెటిజన్లు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ మేరకు రెడిట్లో.. ‘‘విరాట్ ఐపీఎల్ కోసం ఇండియాకు వచ్చాడు. అయితే, అతడి కుటుంబం యూకేకు షిఫ్ట్ కానున్నట్లు తెలుస్తోంది.కోహ్లి క్రికెట్కు దూరమైన తర్వాత శాశ్వతంగా అక్కడే సెటిల్ అవుతారనిపిస్తోంది. అవును.. నిజమే తనకు యూకే అంటే ఇష్టమని కోహ్లి చాలాసార్లు చెప్పాడు. అక్కడైతే సామాన్య పౌరుడిలా జీవనం గడపవచ్చని అన్నాడు. తన పిల్లల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో తప్పేం లేదు. నిజానికి డబ్బున్నవాళ్లు యూకేలో ప్రశాంత జీవనం గడపవచ్చు. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఈ పాపరాజీల గోల ఉండదు. ముంబైలో విరుష్క కూతురిని ఫొటోలు తీసేందుకు వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేశారో చూశాం కదా!’’ అంటూ నెటిజన్ల మధ్య సంభాషణ సాగింది. ఇది చూసిన కోహ్లి ఫ్యాన్స్ సదరు పోస్టులపై మండిపడుతున్నారు. కావాలంటే లండన్కు వెళ్లివస్తారే తప్ప విరాట్ కోహ్లి- అనుష్క శర్మ ఎప్పటికీ దేశాన్ని వీడరని తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా కోహ్లి ఐపీఎల్-2024 కోసం ఇటీవలే స్వదేశానికి తిరిగి రాగా.. పిల్లలతో కలిసి అనుష్క లండన్లోనే ఉన్నట్లు సమాచారం! It’s time for the arrival video you were waiting for! ❤️👑 Virat Kohli returns to his den in Namma Bengaluru, ahead of the #IPL. Watch what he has to say on @bigbasket_com presents Bold Diaries! Download the Big Basket App now. 📱#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #Homecoming… pic.twitter.com/t3MPYtORAF — Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2024 -
కోహ్లీ, అనుష్క శర్మల కంపెనీకి లైన్ క్లియర్
వ్యాపారవేత్తలే కాకుండా ప్రముఖులు సైతం కంపెనీలు స్థాపిస్తున్నారు. అందులో పెట్టుబడి పెడుతున్నారు. భవిష్యత్తులో అభివృద్ధి అయ్యే మంచి బిజినెస్ మోడల్ ఉన్నవారికి ఇన్వెస్టర్లుగా మారుతున్నారు. దాంతో ఇరువురికి లాభం జరిగేలా వ్యవహరిస్తున్నారు. అందులో కొన్ని కంపెనీలు మరింత వృద్ధి చెంది ఐపీవోగా స్టాక్మార్కెట్లోనూ లిస్ట్ అవుతున్నాయి. అలాంటి సంస్థ ‘గో డిజిట్’ ఐపీవోకు తాజాగా సెబీ ఆమోదం తెలిపింది. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పెట్టుబడి పెట్టిన ‘గో డిజిట్’ ఐపిఓకి వెళ్లేందుకు లైన్క్లియర్ అయింది. అందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపింది. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్లో ఇన్వెస్టర్ అయిన కెనడాకు చెందిన ఫెయిర్ఫాక్స్ గ్రూప్ కూడా మద్దతు తెలిపింది. ఆగస్టు 2022లో కంపెనీ ఐపీఓ కోసం ప్రిలిమినరీ పత్రాలను దాఖలు చేసింది. డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) వివరాల ప్రకారం..గో డిజిట్ ఐపీఓలో రూ.1,250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నట్లు తెలిసింది. ఐపీఓ ద్వారా సమకూరే మూలధనాన్ని కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐపీవో ద్వారా నిధులు సేకరించేందుకు కంపెనీ మొదటగా ఆగస్టు 2022లో సెబీకు డీఆర్హెచ్పీ దాఖలు చేసింది. అయినప్పటికీ, ఉద్యోగులకు సంబంధించి స్టాక్ అప్రిసియేషన్ రైట్స్ స్కీమ్లోని కొన్ని కారణాల వల్ల కొద్దికాలంపాటు నిలిచిపోయింది. సెబీ జనవరి 30, 2023న గో డిజిట్ డ్రాఫ్ట్ ఐపీఓ పేపర్లను తిరిగి ఇచ్చింది. కంపెనీ నుంచి మరింత సమాచారం కోరింది. ఇదీ చదవండి: మరో సంస్థపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ సవరించిన సమాచారంతో ఏప్రిల్ 2023లో ప్రిలిమినరీ ఐపీఓ పత్రాలను సెబీకి దాఖలు చేసింది. అన్ని పరిశీలించిన సెబీ తాజాగా ఐపీవోకు లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది. -
Virushka: అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కోహ్లి?!
భారత కుబేరుడు ముకేశ్ అంబానీ- నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. క్రీడా, సినీ సెలబ్రిటీలు.. వ్యాపార దిగ్గజాలు మూడు రోజుల పాటు జరిగే ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో భాగమయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్నారు. గుజరాత్లోని జామ్నగర్కు విచ్చేసి అంబానీ కుటుంబ ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సంబరాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ‘‘విరాట్ కోహ్లి- అనుష్క శర్మ.. అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. రాజు- రాణి వచ్చేశారు’’ అంటూ ఎయిర్పోర్టులో కోహ్లి- అనుష్క దంపతులు నిల్చుని ఉన్న ఫొటోను షేర్ చేస్తున్నారు. అయితే, ఇది పాత ఫొటో. గతేడాది జూన్లో ఈ జంట ఎయిర్పోర్టు వద్ద ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మానవ్ మంగ్లానీ అనే పాపరాజీ అప్పట్లో షేర్ చేశాడు. అయితే, తాజాగా కొంతమంది ఇందులోని ఫొటోలు గ్రాబ్ చేసి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కోహ్లి వెళ్తున్నాడా? విరాట్ కోహ్లి 2017లో బాలీవుడ్ నటి అనుష్క శర్మను పెళ్లాడాడు. ఇటలీ వేదికగా పెళ్లి జరుగగా.. ముంబైలో రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీతో కలిసి హాజరయ్యారు. అయితే, ప్రస్తుతం అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడులకు కోహ్లి దంపతులు హాజరుకావడం లేదని సమాచారం. ఇటీవలే అనుష్క శర్మ లండన్లో తమ రెండో సంతానం అకాయ్కు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు దూరమైన విరాట్.. కుటుంబంతో కలిసి లండన్లోనే ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జామ్నగర్కు విరుష్క జోడీ రావడం లేదని తెలుస్తోంది. ఇక ఇప్పటికే క్రికెట్ సూపర్స్టార్లు సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్ తదితరులు అంబానీ ఇంట సంబరాల్లో పాల్గొనేందుకు గుజరాత్కు విచ్చేశారు. -
Ind Vs Eng: టీమిండియా గెలుపుపై కోహ్లి స్పందన.. పోస్ట్ వైరల్
టీమిండియా సిరీస్ విజయంపై భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి స్పందించాడు. ఇంగ్లండ్పై భారత యువ జట్టు అద్భుత రీతిలో గెలుపొందిందని ప్రశంసించాడు. ఆటగాళ్ల పట్టుదల, అంకిత భావమే.. కఠిన సవాళ్లను దాటి ఇక్కడిదాకా తీసుకువచ్చిందని కోహ్లి కొనియాడాడు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 కాగా స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. భార్య అనుష్క శర్మ తమ రెండో బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో అతడు తన కుటుంబానికి సమయం కేటాయించాడు. ఈ నేపథ్యంలో దాదాపు 13 ఏళ్ల తర్వాత కోహ్లి లేకుండా టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్ బరిలో దిగింది. మరోవైపు.. కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కాగా.. శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ సమస్యలతో అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలో రెండో టెస్టులో రజత్ పాటిదార్, మూడో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అరంగేట్రం చేశారు. ఇక నాలుగో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. వీళ్లలో రజత్ పాటిదార్ మినహా మిగతా ముగ్గురు తమదైన ముద్ర వేయగలిగారు. ముఖ్యంగా సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో ధ్రువ్ జురెల్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా విరాట్ కోహ్లి స్పందిస్తూ.. ‘‘అవును.. టీమిండియా గెలిచింది. అద్భుతమైన సిరీస్లో యువ జట్టు దేశాన్ని గెలిపించింది. పట్టుదల, అంకిత భావం.. సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే తత్వమే ఈ విజయానికి కారణం’’ అని పేర్కొన్నాడు. YES!!! 🇮🇳 Phenomenal series win by our young team. Showed grit, determination and resilience.@BCCI — Virat Kohli (@imVkohli) February 26, 2024 కాగా హైదరాబాద్ టెస్టులో ఓడి పరాజయంతో సిరీస్ ఆరంభించిన టీమిండియా ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్కోట్.. తాజాగా రాంచి టెస్టులో విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. ఇక కోహ్లి- అనుష్క శర్మ దంపతులకు ఫిబ్రవరి 15న కుమారుడు అకాయ్ జన్మించిన విషయం తెలిసిందే. కుమారుడి రాక గురించి తెలియజేసే పోస్ట్ తర్వాత.. కోహ్లి తాజాగా టీమిండియా విజయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. చదవండి: #Rohit Sharma: కష్టపడాల్సి వచ్చింది.. అతడు అత్యద్భుతం.. వాళ్లు లేకపోయినా గెలిచాం! -
సన్నాఫ్ విరాట్ కోహ్లీ
అనుష్క శర్మ ఈ నెల 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అబ్బాయికి ‘అకాయ్’ అని పేరు పెట్టినట్లు తెలియజేశాడు విరాట్ కోహ్లీ. అయితే ‘అకాయ్’ ఫొటోను ఎక్కడా షేర్ చేయలేదు. దీంతో ‘అకాయ్’ రూ΄ాన్ని రకరకాలుగా ఊహించుకుంటూ అభిమానులు ఏఐ జెనరేటెడ్ ఫొటోలను క్రియేట్ చేశారు. అకాయ్ను విరాట్ ఎత్తుకున్నట్లు, విరాట్–అనుష్కలు అకాయ్తో ఆడుకుంటున్నట్లు... ఇలా రకరకాలుగా క్రియేట్ చేశారు. ‘అకాయ్ ఫొటో షేర్ చేయకుండా విరాట్ కోహ్లీ మంచి పని చేశాడు. చేసి ఉంటే ఇంత అద్భుతమైన చిత్రాలను చూసి ఉండేవాళ్లం కాదు’ అంటూ నెటిజనులు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రశంసల వర్షం ఒక కోణం అయితే... సాంకేతిక ఆసక్తి మరో కోణం. ‘మీరు ఉపయోగించిన ఏఐ టూల్స్ గురించి వివరంగా తెలుసుకోవాలని ఉంది’ అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. -
విరాట్ కోహ్లి షాకింగ్ నిర్ణయం..!?
విరాట్ కోహ్లి.. గత కొన్ని రోజుల నుంచి క్రికెట్ వర్గాల్లో హాట్టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. విరాట్కు ఏమైంది..? ఎక్కడ ఉన్నాడు? అన్న ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే కోహ్లి తాజా పోస్టుతో ఈ ప్రశ్నలకు తెరపడింది. కింగ్ కోహ్లి రెండో సారి తండ్రయ్యాడు. అతడి భార్య అనుష్క శర్మ ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ ముద్దుల కొడుకుకు అకాయ్గా పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని విరుష్క జోడీ కాస్త ఆలస్యంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే అభిమానులు ఓవైపు శుభాకాంక్షలు తెలుపుతూనే.. మరోవైపు కోహ్లి రీ ఎంట్రీపై చర్చ మొదలెట్టేశారు. కోహ్లి రీ ఎంట్రీ డౌటే.. ఇక విరాట్ సతీమణి అనుష్క అనారోగ్య సమస్యలతో రెండో బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అనుష్క ప్రెగ్నెన్సీలో సమస్యలు ఉన్నాయని, అందుకే లండన్కు తీసుకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుష్కకు తోడుగా కోహ్లి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతో ఇంగ్లండ్ సిరీస్ మొత్తానికి దూరమైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే మరి కొంత కాలం పాటు విరాట్ ఫ్యామిలీ లండన్లో ఉండనున్నట్లు సమాచారం. దీంతో కోహ్లి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడు సైతం వారితో పాటు కొద్ది రోజులు లండన్లోనే నిర్ణయించుకున్నట్లు వినికిడి. ఈ క్రమంలో ఐపీఎల్-2024 సీజన్ ఫస్ట్హాఫ్కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటివరకు అయితే ఆర్సీబీ ఫ్రాంఛైజీ నుంచి గానీ కోహ్లి నుంచి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలవడలేదు. కాగా ఐపీఎల్-17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్యాష్ రిచ్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: Virat Kohli- Akaay: కోహ్లి కొడుకుకి బ్రిటన్ పౌరసత్వం?!.. అందుకే లండన్లో..? -
Virat Kohli- Akaay: బ్రిటన్ పౌరుడిగా కోహ్లి కుమారుడు?
Virat Kohli And Anushka Sharma Son Akaay: క్రికెట్, సినీ అభిమాన వర్గాల్లో ఇప్పుడంతా ‘అకాయ్’ గురించే చర్చ. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తమ ముద్దుల కుమారుడికి అకాయ్గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. వామికకు తమ్ముడు పుట్టాడంటూ ఈ సెలబ్రిటీ జంట ప్రకటించగానే బాబు పేరుకు అర్థమేమిటి? చూడటానికి ఎలా ఉంటాడు? లండన్లో జన్మించాడు కాబట్టి అతడికి బ్రిటిష్ పౌరసత్వం ఇస్తారా? వంటి అంశాల గురించి ఇటు కింగ్ కోహ్లి అభిమానులు.. అటు అనుష్క ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో అకాయ్ అన్న పేరుకు అర్థం టర్కిష్ భాషలో ప్రకాశించే చంద్రుడు అని కొందరు.. హిందీలో అయితే.. ‘భౌతిక శరీరానికి మించి అతీతమైన వ్యక్తి’ అని ఇంకొందరు పేర్కొంటున్నారు. మరోవైపు.. కోహ్లి దంపతులు ఇప్పట్లో అకాయ్ రూపాన్ని చూపించే చేసే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకొందరు కృత్రిమ మేధతో ఫొటోలు సృష్టించి వాటితోనే సరిపెట్టుకుంటున్నారు. అకాయ్’ బ్రిటిష్ పౌరుడు అవుతాడా? మరి ‘అకాయ్’ బ్రిటిష్ పౌరుడు అవుతాడా? స్పోర్ట్స్ తక్ అందించిన వివరాల ప్రకారం.. కేవలం యునైటైడ్ కింగ్డం ఆస్పత్రిలో జన్మించాడు కాబట్టి జన్మతః అకాయ్కు బ్రిటిష్ పౌరసత్వం ఇవ్వరు. తల్లిదండ్రుల్లో ఒక్కరైనా బ్రిటిష్ సిటిజన్ అయి ఉండాలి/ లేదంటే అక్కడ సుదీర్ఘకాలంగా స్థిర నివాసం ఏర్పరచుకుంటేనే యూకేలో పుట్టిన బిడ్డకు బ్రిటిష్ సిటిజన్గా గుర్తింపు లభిస్తుంది. అదే విధంగా.. బ్రిటన్ పౌరసత్వం కలిగిన తల్లిదండ్రులకు యూకే వెలుపల జన్మించిన బిడ్డకు తమ సిటిజన్గా గుర్తింపునిస్తుంది అక్కడి ప్రభుత్వం. అయితే, బిడ్డ పుట్టేనాటికి తల్లిదండ్రుల సిటిజన్షిప్ స్టేటస్ ఏమిటన్న దానిపైనే ఈ అంశం ఆధారపడి ఉంటుంది. కేవలం అదొక్కటే ఇక అకాయ్ విషయానికొస్తే.. ఈ చిన్నారి లండన్లో జన్మించినా అతడి తల్లిదండ్రులు ఇద్దరూ ‘విరుష్క’ భారత పౌరులు అన్న విషయం తెలిసిందే. కాబట్టి అకాయ్ బ్రిటిష్ పౌరసత్వం పొందేందుకు అనర్హుడు. భారత పౌరుడిగానే అతడికి గుర్తింపు ఉంటుంది. అయితే, అకాయ్ పాస్పోర్ట్ మాత్రం బ్రిటన్లో తయారు చేస్తారు. కాగా 2017లో ఇటలీ వేదికగా పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లి- అనుష్క శర్మలకు తొలుత కుమార్తె వామిక(2021, జనవరి) జన్మించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఈ జంట తమ రెండో సంతానానికి లండన్లో జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సంతోష సమయంలో కుటుంబానికే పూర్తి సమయం కేటాయించిన కోహ్లి.. స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. చదవండి: ఆటలో విఫలం..! ఖరీదైన కారు కొన్న రహానే.. ధర ఎన్ని కోట్లంటే?! -
#Virat Kohli- Akay: కోహ్లి కొడుకు అకాయ్ ఫోటో.. వైరల్!?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ పండింట మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ గుడ్ న్యూస్ను కాస్త ఆలస్యంగా మంగళవారం(ఫిబ్రవరి 20) అభిమానులతో పంచుకున్నారు. తమ కుమారుడుకి అకాయ్ అని పేరు పెట్టినట్లు విరుష్క జోడీ వెల్లడించింది. అదే విధంగా తమ గోప్యతను గౌరవించాలని విరాట్ సోషల్ మీడియా వేదికగా విజ్ణప్తి చేశాడు. కాగా తన పిల్లల విషయంలో కోహ్లి చాలా జాగ్రత్తగా ఉంటాడు. తన గారాలపట్టి వామికను పుట్టినప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంచుతూ కోహ్లి వస్తున్నాడు. ఇప్పటివరకు విరుష్క దంపతులు ఆమె ఫొటోను సైతం బయటకు రానివ్వలేదు. ఇప్పుడు ఆకాయ్ విషయంలోనూ అదే జాగ్రత్తలను ఈ సూపర్ కపుల్ పాటిస్తోంది. తమ మరోసారి తల్లిదండ్రులమయ్యామని ప్రకటించిన విరుష్క జోడీ.. ఎక్కడ కూడా ఆకాయ్ ఫోటోను షేర్ చేయలేదు. కానీ అభిమానులు మాత్రం జూనియర్ విరాట్ ఎలా ఉంటాడో చూడటానికి తహతహలడుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది ఫ్యాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(ఏఐ) సాయంతో అకాయ్ ఫొటోలను క్రియేట్ చేస్తున్నారు. అకాయ్ టీమిండియా జెర్సీలో.. అనుష్క, విరాట్తో కలిసి ఉన్నట్లు ఫోటోను క్రియేట్ చేశారు. అది కూడా కోహ్లి జెర్సీ నెం18తో కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతేకాకుండా అకాయ్ పేరు మీద సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సైతం పుట్టుకుట్టుకొచ్చాయి. నాకు జన్మనిచ్చినందుకు నాన్న విరాట్ కోహ్లి, అమ్మ అనుష్క శర్మకు ధన్యవాదాలు అంటూ అకాయ్ పేరిట ఓ పోస్ట్ ఎక్స్లో వైరలవుతోంది. కాగా విరాట్ ప్రస్తుతం లండన్లో ఉన్నట్లు తెలుస్తోంది. A cute ai generated family photo of Virushka 💖😍#Akaay #akaaykohli #ViratKohli #AnushkaSharma #Vamika pic.twitter.com/zq63tXinNM — ꧁Priyanshu꧁ (@Hey_ImPriyanshu) February 21, 2024 AI images of akaay ❤️🔥#akaaykohli#Akaay#AnushkaSharma #ViratKohli pic.twitter.com/cre7GGmvna — kikuuuuuu (@MemeCreatorrr) February 21, 2024 -
Virat Kohli: ఇక ఇండియా హాయిగా నిద్రపోతుంది!
Virat Kohli And Anushka Sharma Son Akaay: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడు వచ్చాడు. తమ గారాలపట్టి వామికకు చిట్టి తమ్ముడినిచ్చింది విరుష్క జంట. ఈ నేపథ్యంలో క్రీడా, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఈ జోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘అకాయ్.. మీ అందమైన కుటుంబంలో అడుగుపెట్టిన అత్యంత విలువైన వ్యక్తి. శుభాకాంక్షలు విరాట్, అనుష్క. ప్రకాశించే చంద్రుడన్న అర్థం గల తన పేరు లాగే అతడు.. మీ ప్రపంచాన్ని సంతోషం, అందమైన జ్ఞాపకాలతో నింపేయాలి. లిటిల్ చాంప్.. ఈ ప్రపంచంలోకి నీకు స్వాగతం’’ అని విరుష్కను విష్ చేశాడు. ఇండియా హాయిగా నిద్రపోతుంది ఇక కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది. ‘‘ఇప్పుడు నలుగురు సభ్యులు.. అనుష్క, విరాట్లకు కంగ్రాట్స్. ఆర్సీబీ కుటుంబంలోకి అకాయ్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అత్యంత సంతోషకరమైన వార్త ఇది. ఈరోజు ఇండియా మొత్తం హాయిగా నిద్రపోతుంది’’ అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. అదే విధంగా ముంబై ఇండియన్స్ సహా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్, బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ముఖ్ తదితరులు విరుష్కను విష్ చేశారు. ఫిబ్రవరి 15న జననం కాగా గత గురువారమే తన భార్య అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చినట్టు, కుమారుడికి ‘అకాయ్’గా నామకరణం చేసినట్లు కోహ్లి సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘ఫిబ్రవరి 15న మా జీవితాల్లోకి వామిక సోదరుడు అకాయ్ వచ్చాడు. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాం. ఈ ఆనందకర క్షణాల్లో మీ దీవెనలు మాకు కావాలి. మా ఏకాంతాన్ని గౌరవించండి’ అని కోహ్లి విజ్ఞప్తి చేశాడు. కోహ్లి, అనుష్కకు 2017 డిసెంబర్లో వివాహం కాగా... 2021 జనవరిలో కూతురు వామిక పుట్టింది. వ్యక్తిగత కారణాలతోనే కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. అయితే, సిరీస్కు దూరంగా ఉండటానికి గల అసలు కారణం వెల్లడికాకపోవడంతో విరాట్ తల్లికి అనారోగ్యం, అనుష్క ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు అంటూ వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఈమేరకు ట్వీట్ చేయడం గమనార్హం. చదవండి: Shoaib Malik’s 3rd wife: షోయబ్ మాలిక్ భార్యకు చేదు అనుభవం Congratulations to Virat and Anushka on the arrival of Akaay, a precious addition to your beautiful family! Just like his name lights up the room, may he fill your world with endless joy and laughter. Here's to the adventures and memories you'll cherish forever. Welcome to the… https://t.co/kjuoUtQ5WB — Sachin Tendulkar (@sachin_rt) February 20, 2024 ❤️ pic.twitter.com/BgpfycayI4 — Virat Kohli (@imVkohli) February 20, 2024 -
జూనియర్ విరాట్ ‘అకాయ్’.. అర్థమేంటో తెలుసా?
టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు రెండవ సంతానానికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డ పుట్టాడంటే ఈ జంట(Virushka Second Baby) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తమ బాబుకు ‘అకాయ్’ (Akaay)గా నామకరణం చేసినట్లు తెలిపారు. అయితే.. కాస్త కొత్తగా అనిపిస్తుండడంతో విరాట్ కొడుకు ‘అకాయ్’ పేరుకు అర్థం ఏమిటనేది చర్చ మొదలైంది. కోహ్లీ ప్రకటన తర్వాత ఈ పేరుకి అర్థంపై సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెడుతున్నారు. హిందీ పదం 'కాయ' నుంచి ఈ పేరు వచ్చిందని, కాయ అంటే 'శరీరం' అని అంటున్నారు. ఇక అకాయ్ అంటే ‘భౌతిక శరీరాన్ని మించిన ఎవరైనా ఓ వ్యక్తి’ అని చెబుతున్నారు. ఇక టర్కిష్ భాషలో 'అకాయ్' అంటే 'ప్రకాశవంతమైన చంద్రుడు' అని అర్థమని నెటిజన్లు చెబుతున్నారు. అయితే తమ బాబుకి అకాయ్ అని పేరు పెట్టడానికి విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ దంపతులు ఏ పదాన్ని మూలంగా తీసుకున్నారో ఇంకా ధృవీకరించలేదనే విషయం తెలిసిందే. అంతకు ముందు.. ‘‘ ఫిబ్రవరి 15న మేము మా బేబీ బాయ్ ‘అకాయ్’.. వామికా చిట్టి సోదరుడిని ఈ ప్రపంచంలోకి స్వాగతించామని అంతులేని ఆనందం, ప్రేమతో నిండిన హృదయంతో ప్రతిఒక్కరికీ తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. మా జీవితాల్లోనే అందమైన ఈ క్షణంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలను ఆశిస్తున్నాం. మా గోప్యతను గౌరవించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం’’ అని విరాట్-అనుష్క జంట సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇన్స్టాగ్రామ్ వేదికగా విరాట్ కోహ్లీ పెట్టిన పోస్ట్ తెగ వైరల్గా మారింది. గంట వ్యవధిలో మిలియన్లకు పైగా లైక్లను అందుకుంది. క్రీడా, సినీ రంగంతో ఇరువురి ఫ్యాన్స్ శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. కాగా, 2017లో ఇటలీలో టీమిండియా స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరికి 2021, జనవరి 11న ఓ పాప జన్మించింది. ఆ చిన్నారికి వామిక అని పేరు పెట్టారు. -
మరోసారి తండ్రి అయిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి రెండోసారి తండ్రి అయ్యాడు. విరాట్ భార్య అనుష్క శర్మ ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరుష్క దంపతులు కొద్ది సేపటి క్రితం ఇన్స్టా వేదికగా వెల్లడించారు. బిడ్డకు 'అకాయ్' (Akaay) అని నామకరణం చేసినట్లు వారు పేర్కొన్నారు. మా జీవితంలోని ఈ అందమైన సమయంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నాము. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించాలని అభ్యర్థిస్తున్నాము. ప్రేమ మరియు కృతజ్ఞతతో విరాట్ మరియు అనుష్క అంటూ విరుష్క దంపతులు ఇన్స్టాలో రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) కాగా, విరాట్ తండ్రి కాబోతున్నాడని గతకొంతకాలంగా సోషల్మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా, కోహ్లి సహచరుడు, దక్షిణాఫ్రికా లెజెండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ సోషల్మీడియాలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. 2017లో విరాట్ కోహ్లిని పెళ్లాడిన అనుష్క శర్మ.. 2021లో మొదటి సంతానం వామికకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే, విరాట్ ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లకు విరాట్ దూరంగా ఉన్నాడు. సిరీస్ ప్రారంభానికి ముందే విరాట్ బీసీసీఐ వద్ద పర్మిషన్ తీసుకున్నాడు. -
Virat Kohli: సెలవులో ఉన్న కోహ్లి.. విష ప్రచారం!
Virat Kohli- Deepfake: సులభంగా డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కే సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసి నకిలీ వీడియోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వదులుతున్నారు. ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ఫేక్ వీడియో తర్వాత ఈ విపరీత ధోరణి మరింత ఎక్కువైంది. సినీ సెలబ్రిటీలతో పాటు సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజ క్రికెటర్లను సైతం సైబర్ క్రిమినల్స్ వదలడం లేదు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా తాజాగా ఈ బాధిత జాబితాలో చేరాడు. ఓ బెట్టింగ్ యాప్ను కోహ్లి ప్రమోట్ చేస్తున్నట్లు డీప్ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. తాను తక్కువ డబ్బులు పెట్టుబడిగా పెట్టి.. భారీ మొత్తంలో ఆర్జించినట్లు కోహ్లి చెబుతున్నట్లుగా ఉన్న వీడియోను... ఏకంగా ఓ టీవీ చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు క్రియేట్ చేశారు సైబర్ మాయగాళ్లు. ఇది నిజమా? ఏఐ మాయా? గతంలో కోహ్లి ఇచ్చిన ఇంటర్వ్యూలోని మాటలను టెక్నాలజీని ఉపయోగించి తమకు అనుగుణంగా మార్చుకుని.. నిజమైన వీడియో అన్నట్లుగా నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలను నెట్టింట షేర్ చేసిన ఓ జర్నలిస్టు.. ‘‘నిజంగా విరాట్ కోహ్లి ఇలాంటివి ప్రోత్సహిస్తున్నాడా? లేదంటే ఇదంతా ఏఐ(కృత్రిమ మేధ) మాయా? ఒకవేళ అదే నిజమైతే.. వీడియో అసలైనదానిలా చిత్రీకరించడంలో సృష్టికర్తలు సఫలమయ్యారు. టెక్నాలజీని మరీ ఇంత దుర్వినియోగం చేస్తారా? ఒకవేళ ఈ వీడియో నిజమే అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు! మీలో ఎవరికైనా వాస్తవం ఏమిటో తెలిస్తే చెప్పండి’’ అని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘ఇది కచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజిన్స్ మాయ అని అర్థమవుతోంది’’ అని అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు దూరం కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా విరాట్ కోహ్లి స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే. కుటుంబానికి సమయం కేటాయించిన అతడు.. సెలవు పొడగించుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లి నిర్ణయాన్ని గౌరవిస్తామని.. అత్యవసరం అయితే తప్ప ఈ దిగ్గజ బ్యాటర్ సెలవు పెట్టడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. ఈ పరిణామాల క్రమంలో కోహ్లి- అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని.. అయితే, ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు తలెత్తాయనే వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త.. విరుష్క జోడీ లండన్లో రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారంటూ ట్వీట్ చేసి దుమారం రేపారు. ఈ నేపథ్యంలో తాజాగా కోహ్లి పేరిట ఇలాంటి వీడియో ప్రత్యక్షం కావడం గమనార్హం. చదవండి: రోహిత్, కోహ్లిలా హీరో అయ్యే వాడిని.. కానీ ఆరోజు ధోని ఎందుకలా చేశాడో? -
Virat Kohli: లండన్లోనే ఆ బిడ్డ జననం
-
Virat Kohli: లండన్లోనే ఆ బిడ్డ జననం.. మీకు ఆ హక్కు లేదు!
Virat Kohli- Anushka Sharma To Be Born 2nd Child Rumours: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతుల గురించి నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంక చేసిన పోస్ట్ ఇందుకు కారణం. కాగా విరుష్క జోడీ రెండో సంతానం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. అనుష్క గర్భవతి అంటూ ఆమె బేబీ బంప్తో ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తికమక పెట్టిన డివిలియర్స్ ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు కోహ్లి వ్యక్తిగత కారణాల వల్ల దూరం కావడం.. ఈ వార్తలకు మరింత బలం ఇచ్చింది. అదే విధంగా.. సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్, కోహ్లి స్నేహితుడు ఏబీ డివిలియర్స్ సైతం విరుష్క రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని తన యూట్యూబ్ చానెల్లో వెల్లడించాడు. అయితే, వెంటనే మాట మార్చి తాను తప్పుడు సమాచార వ్యాప్తికి కారణమయ్యానంటూ కోహ్లి- అనుష్కలను క్షమాపణలు కోరాడు. ఈ క్రమంలో.. డివిలియర్స్ తొలుత చెప్పిందే నిజమని.. అయితే, అనుష్క శర్మ ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు ఉన్న కారణంగానే అతడు ఈ మేరకు ప్రకటన చేశాడని ఓ నెటిజన్ చేసిన కామెంట్ వైరల్ అయింది. దీంతో.. విరుష్క అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. అనుష్క ఆరోగ్యం బాగుండాలని తాము కోరుకుంటున్నామంటూ పోస్టులు పెట్టారు. తాజాగా హర్ష్ గోయెంక పరోక్షంగా కోహ్లి- అనుష్కల రెండో సంతానం గురించి కామెంట్ చేశారు. ఆ బిడ్డ క్రికెటర్ లేదంటే సినిమా స్టార్ ‘‘మరికొన్ని రోజుల్లో ఓ బిడ్డ ఈ ప్రపంచంలోకి రానుంది! ఆ బేబీ తన తండ్రిలాగే క్రికెట్లో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందో.. లేదంటే.. తన తల్లిలా సినిమా స్టార్ అవుతుందో?!’’ అని గోయెంక ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇందుకు #MadeInIndia #ToBeBornInLondon అనే హ్యాష్ట్యాగ్లు జతచేశారు. మీకు ఆ హక్కు లేదు.. చెత్తగా మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రసవం కోసం విరాట్ అనుష్కను లండన్ తీసుకువెళ్లాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం హర్ష్ గోయెంక తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బిడ్డ ఇంకా ఈ ప్రపంచంలోకి రాకముందే.. క్రికెటర్ లేదంటే ఫిల్మ్ స్టార్ అంటూ భారం మోపడం సరికాదు. పుట్టబోయే ఏ బిడ్డకైనా తమకు నచ్చిన రంగం ఎంచుకోవడం, నచ్చిన పని చేయడం వారి హక్కు. దాన్ని కాలరాసేలా మీరు మాట్లాడుతున్నారు. అయినా.. ఇండియాలో తయారై.. లండన్లో అంటూ ఆ హ్యాష్ ట్యాగ్ ఏమిటి? మరీ చెత్తగా ఉంది’’ అని మండిపడుతున్నారు. కాగా క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లి- అనుష్క శర్మను 2017లో పెళ్లి చేసుకున్నాడు. ఈ సెలబ్రిటీ జంటకు 2021లో కుమార్తె వామిక జన్మించింది. ఇక రెండో బిడ్డకు త్వరలోనే స్వాగతం పలికేందుకు వీరు సిద్ధమవుతున్నారనే వార్తలపై విరుష్క అధికారికంగా స్పందిస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు. చదవండి: BCCI: సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు జై షా వార్నింగ్.. ఇకపై A new baby is to be born in the next few days! Hope the baby takes India to great heights like the greatest cricketing father. Or will it follow the mother and be a film star? #MadeInIndia #ToBeBornInLondon — Harsh Goenka (@hvgoenka) February 13, 2024 -
కోహ్లీ భార్య అనుష్క శర్మకు ఏమైంది..?
బాలీవుడ్ నటి అనుష్కశర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె మళ్లీ గర్భం దాల్చిందంటూ వార్తలు హల్చల్ చేశాయి. దీనికి తోడు స్టార్ ఆటగాడైన కోహ్లీ ఇంగ్లండ్తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ సిరీస్ల్లో మూడు సిరీస్లకు దూరంగానే ఉన్నాడు. అదీగాక తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండటంతో ఆఖరి టెస్ట్ మ్యాచ్కి అందుబాటులో ఉంటాడనే అంతా అనుకున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా లండన్లో ఉన్నట్లు సమాచారం. ఇటీవల స్టార్ కపుల్ విరుష్కరెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే ఊహాగానాలొచ్చాయి. ఇంతలోనే అనుష్కకు ప్రెగ్నెన్సీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వార్తలొచ్చాయి. దీంతో అనుష్కకు ఏమైంది అంటూ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. నిజంగానే అనుష్క ఏమైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోందా? అందుకే విదేశాలకు వెళ్లారా? అనే ఊహగానాలకు జర్నలిస్ట్ అభిషేక్ త్రిపాఠి ట్వీట్ మరింత ఊత మిచ్చింది. ఈ మేరకు ఆయన ట్విటర్లో వారితో సంభాషించిన ట్వీట్ను పంచుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ విదేశాలకు వెళ్లినట్లు ఆ పోస్ట్ పేర్కొంది. విరాట్ తన కుటుంబంతో గడిపేందుకు వృత్తిపరమైన విరామం తీసుకున్నారనీ, ముఖ్యంగా అనుష్క ఆరోగ్య సమస్యల కారణంగా విదేశాల్లోని వైద్యుడిని సంప్రదించాలని అనుకున్నట్లు ఆ ట్వీట్లో ఉంది. అందువల్లే కోహ్లీ తన కుటుంబంతో ఉండేందుకు మ్యాచ్లకు కాస్త విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అనుష్కాకు ఏమైందంటూ చర్చలు మొదలయ్యాయి. తొందరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు.అయితే తాజాగా ఇంగ్లండ్తో జరిగే ఐదో టెస్టు నాటికి కోహ్లి అందుబాటులోకి వస్తాడని, జట్టుతో తిరిగి చేరతాడనేవార్త వెలుగులోకి వచ్చింది. సెలబ్రెటీ విషయంలో ఏ చిన్న విషయం బయటకు పొక్కినా.. అదో పెద్ద ఇష్యూగా మారిపోతుంది. ఏం జరిగిందంటూ..సోషల్ మీడియాలో పోస్టుల హడావిడి అంత ఇంతాకాదు. వీటన్నింటికి చెక్ పడాలంటే..పూర్తి స్పష్టత రావాలంటే ఏం జరిగిందనేది విరుష్క అధికారంగా ప్రకటించాల్సి ఉంది. (చదవండి: స్లిమ్గా మారిన టాలీవుడ్ నటుడు సురేష్! ఆయన ఫాలో అయ్యే డైట్ ఇదే..!) -
Virat Kohli: ఓ బ్యాడ్ న్యూస్.. ఓ ‘గుడ్’ న్యూస్!
Is Problem In Anushka Sharma Pregnancy, Rumours Viral: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. అదీ సొంతగడ్డపై అంటే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మెరుపులు ఉండాల్సిందే! ప్రత్యర్థి బజ్బాల్ అంటూ హెచ్చులకు పోతే.. అందుకు మన కింగ్ దూకుడైన ‘విరాట్బాల్’తో అడ్డుకట్ట వేయడం ఖాయం.. అంటూ ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల దృష్ట్యా తప్పుకొన్న విషయం తెలిసిందే. కోహ్లి లేకుండానే జరిగిన ఈ మ్యాచ్లలో తొలుత ఇంగ్లండ్.. తర్వాత టీమిండియా గెలిచి ఐదు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి. సెలక్షన్కు అందుబాటులో లేడు ఇక మూడో టెస్టు నుంచైనా కోహ్లి అందుబాటులోకి వస్తాడనుకుంటే.. అతడి విజ్ఞప్తి మేరకు సెలవు పొడిగించినట్లు ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. కోహ్లి గోప్యతకు భంగం కలగకుండా.. అతడు తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని జట్టు ప్రకటించిన సందర్భంలో తెలిపింది. మాట మార్చిన డివిలియర్స్ మరోవైపు.. విరాట్ కోహ్లి- అనుష్క శర్మ రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని ధ్రువపరిచిన సౌతాఫ్రికా లెజండరీ క్రికెటర్ ఏబి డివిలియర్స్ తర్వాత మాట మార్చాడు. తాను తప్పుడు సమాచారం వ్యాప్తి చేశానని.. కోహ్లి దంపతులను క్షమాపణ కోరాడు. దీంతో అసలు కోహ్లి కుటుంబంలో ఏం జరుగుతుందో అర్థం కాక ఫ్యాన్స్ కలవరపాటుకు గురవుతున్నారు. విరుష్క ప్రెగ్నెన్సీలో సమస్యలంటూ వదంతులు ఈ నేపథ్యంలో ఓ సోషల్ మీడియా యూజర్ వారి ఆందోళనను రెట్టింపు చేసేలా పోస్ట్ పెట్టారు. ఏబి డివిలియర్స్ విరుష్క జోడీ గురించి చెప్పింది నిజమే.. కానీ అనుష్క ప్రెగ్నెన్సీలో సమస్యలు ఉన్నాయని.. అందుకే వాళ్లు విదేశాల్లో చికిత్స తీసుకునేందుకు వెళ్లారని సదరు పోస్ట్ సారాంశం. ఈ క్రమంలో అనుష్క శర్మ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎలాంటి బ్యాడ్న్యూస్ వినాలనుకోవడం లేదంటూ విరుష్క కోసం తాము ప్రార్థిస్తామని పేర్కొంటున్నారు. ఊరట కలిగించే అప్డేట్ మరోవైపు.. తాజాగా ఓ బీసీసీఐ ఒకరు పీటీఐతో మాట్లాడుతూ ఇచ్చిన అప్డేట్ విరాట్ కోహ్లి అభిమానులకు ఊరట కలిగించింది. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగే ఐదో టెస్టు నాటికి కోహ్లి అందుబాటులోకి వస్తాడని.. జట్టుతో తిరిగి చేరతాడని సదరు అధికారి పేర్కొనడం విశేషం. దీంతో అంతా బాగుంది గనుకే కోహ్లి తిరిగి మైదానంలో దిగేందుకు సమాయత్తమవుతున్నాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు ఆరంభం కానుంది. తర్వాత రాంచి(ఫిబ్రవరి 23 నుంచి)లో నాలుగో, ధర్మశాల(మార్చి 7 నుంచి) ఐదో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Sanjana Ganesan: వదినమ్మ అంటూనే వెకిలి కామెంట్.. పో.. ఇక్కడి నుంచి! -
తూచ్.. అంతా అబద్ధం: కోహ్లి విషయంలో డివిలియర్స్ యూటర్న్
AB de Villiers Apology For Spreading False Information: సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మాట మార్చాడు. విరాట్ కోహ్లి- అనుష్క శర్మ దంపతుల గురించి తాను తప్పుడు సమాచారం వ్యాప్తి చేశానంటూ బాంబు పేల్చాడు. కోహ్లి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడి పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. వ్యక్తిగత కారణాలు చూపుతూ తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లి కుటుంబ సభ్యుల గురించి వదంతులు వ్యాపించాయి. సోషల్ మీడియాలో వదంతులు అతడి భార్య అనుష్క గర్భవతి అని.. అందుకే కోహ్లి సెలవు తీసుకున్నాడని కొందరు.. తల్లి అనారోగ్య కారణాల దృష్ట్యానే అతడు ఆటకు దూరమయ్యాడని మరికొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే, తమ తల్లి సరోజ్ ఆరోగ్యంగానే ఉందని కోహ్లి సోదరుడు వికాస్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో ఇటీవల తన యూట్యూబ్ చానెల్లో డివిలియర్స్ మాట్లాడుతున్న సందర్భంలో కోహ్లి గురించి ప్రస్తావన వచ్చింది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘కోహ్లి బాగానే ఉన్నాడు. కోహ్లి దంపతుల రెండో బిడ్డ త్వరలోనే ఈ ప్రపంచంలోకి రానుంది’’ అని ఏబీడీ తెలిపాడు. దీంతో కోహ్లి- అనుష్క రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. అంతా అబద్ధం.. నేనన్న మాటల్లో నిజం లేదు ఏబీ డివిలియర్స్ ఈ వార్తను ధ్రువీకరించాడంటూ పలు వార్తా సంస్థలు కూడా ప్రముఖంగా కథనాలు వెలువరించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏబీ డివిలియర్స్ యూటర్న్ తీసుకోవడం గమనార్హం. ఈ మేరకు జాతీయ మీడియా దైనిక్ భాస్కర్తో మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ కంటే కుటుంబమే ప్రథమ ప్రాధాన్యం. నిజానికి నా యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ ఆరోజు నేను ఓ పెద్ద తప్పు చేశాను. ఆరోజు నేను చెప్పిందంతా అబద్ధం. అందులో ఏమాత్రం నిజం లేదు. మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో తిరిగి రావాలి విరాట్ కుటుంబానికి ఏది మంచిదో అదే జరగాలని కోరుకుంటున్నా. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏదేమైనా అతడు బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నా. ఆట నుంచి తను ఎందుకు విరామం తీసుకున్నాడో తెలియదు. అయితే, మరింత రెట్టించిన ఉత్సాహంతో.. సరికొత్తగా కోహ్లి తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నా’’ అని ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో టెస్టుకు కోహ్లి తిరిగి వస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా ఈ మ్యాచ్ మొదలుకానుంది. చదవండి: మహా క్రీడా సంబరం: విశాఖలో ఫైనల్ మ్యాచ్లు.. పూర్తి వివరాలు! ముగింపు వేడుకలు ఆరోజే -
Ind vs Eng: అఫీషియల్.. అందుకే కోహ్లి టెస్టులకు దూరం
ABD- Virat Kohli-Anushka Sharma: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు దూరం కావడానికి గల కారణం వెల్లడైంది. సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు, ఆర్సీబీలోకి ఒకప్పటి కోహ్లి సహచర ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు. విరాట్ కోహ్లి- అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయాన్ని ఏబీడీ ధ్రువీకరించాడు. భార్య గర్భవతిగా ఉన్నందుకే కోహ్లి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడని పేర్కొన్నాడు. అంతేతప్ప ఆటకు దూరమవ్వాలనే ఉద్దేశం రన్మెషీన్కు లేదంటూ కింగ్ అభిమానులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందించాడు ఏబీడీ. మా అమ్మ బాగానే ఉన్నారు కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి అందుబాటులో లేడు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన బీసీసీఐ.. హైదరాబాద్, వైజాగ్ టెస్టుల నుంచి కోహ్లి వైదొలిగినట్లు తెలిపింది. అయితే, ఇందుకు గల కారణం గురించి స్పష్టతనివ్వకపోవడంతో కోహ్లి కుటుంబం గురించి వదంతులు వ్యాప్తి చెందాయి. గర్భవతి అయిన భార్య కోసం సమయం వెచ్చించేందుకు కోహ్లి బ్రేక్ తీసుకున్నాడని కొందరు.. తల్లి అనారోగ్యం వల్లే సెలవులో ఉన్నాడని ఇంకొందరు.. బీసీసీతో విభేదాల వల్లే ఇలా అని మరికొందరు నెట్టింట ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో విరాట్ సోదరుడు వికాస్ కోహ్లి.. తమ తల్లి సరోజ్ ఆరోగ్యం బాగానే ఉందని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో కోహ్లి రెండోసారి తండ్రి కాబోతున్నాడన్న విషయాన్ని ఏబీ డివిలియర్స్ తాజాగా వెల్లడించాడు. అవును.. మళ్లీ తండ్రికాబోతున్నాడు కోహ్లి గురించి అభిమానులు కంగారు పడవద్దన్న ఏబీడీ.. ‘‘తను బాగున్నాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. తొలి రెండు టెస్టులకు దూరం కావడానికి కారణం ఇదేనని నేను అనుకుంటున్నా. కోహ్లి రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న మాట వాస్తవమే. ఇప్పుడు తను కుటుంబంతో ఉండటం చాలా ముఖ్యం. చాలా మంది విరాట్.. ఇప్పుడు కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తున్నాడని అనుకుంటారేమో. అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. విరాట్ విషయంలో అసలు అలాంటి ఆలోచనలకు తావు ఇవ్వొద్దు’’ అని స్పష్టం చేశాడు. Ab De Villiers said - "Virat Kohli and Anushka Sharma expecting their second child, so Virat Kohli is spending his time with his family". (On ABD YT)#viratkohli #anushkasharma pic.twitter.com/XDqx76ZfeX — 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrogn_edits) February 3, 2024 వామికకు తోబుట్టువు రాబోతోంది కాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను 2017లో పెళ్లాడాడు విరాట్ కోహ్లి. వీరికి 2021లో కుమార్తె వామిక జన్మించగా.. రెండో బిడ్డకు త్వరలోనే స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారని డివిలియర్స్ వ్యాఖ్యలతో తేలిపోయింది. దీంతో మూడో టెస్టు నుంచైనా కోహ్లి అందుబాటులోకి వస్తాడేమో అన్న సందిగ్దానికి తెరపడినట్లయింది. చదవండి: ఇలాంటి బాల్ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్ బౌల్డ్.. రియాక్షన్ వైరల్ -
వ్యక్తిగత కారణాలతో కోహ్లి దూరం.. క్లారిటీ ఇచ్చిన సోదరుడు
Ind vs Eng Virat Kohli: ఇంగ్లండ్తో మూడో టెస్టు నుంచైనా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అందుబాటులోకి వస్తాడా? జట్టుతో చేరతాడా? లేదా? అన్న అంశం మీద క్రీడావర్గాల్లో చర్చ నడుస్తోంది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఢిల్లీ బ్యాటర్ తొలి రెండు మ్యాచ్లకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, ఆ కారాణాలు ఏమిటన్న దానిపై ఇంత వరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కోహ్లి, అతడి కుటుంబం గురించి వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే దూరంగా ఉన్నాడా? ‘‘ప్రస్తుతం గర్భవతిగా ఉన్న భార్య అనుష్క శర్మను దగ్గరుండి చూసుకునేందుకే కోహ్లి సెలవు తీసుకున్నాడు’’ అని కొందరు.. ‘‘లేదు.. కోహ్లి తల్లి సరోజ్ అనారోగ్యం వల్లే అతడు ఆటకు దూరమయ్యాడు’’ అని ఇంకొందరు ఇష్టారీతిన ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై విరాట్ కోహ్లి సోదరుడు వికాస్ కోహ్లి తాజాగా స్పందించాడు. తమ తల్లి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ దుష్ప్రచారాన్ని ఖండించాడు. దయచేసి తప్పుడు వార్తలను నమ్మవద్దని కోహ్లి అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు ‘‘అందరికీ నమస్కారం. మా అమ్మ ఆరోగ్యం గురించి ఫేక్ న్యూస్ ప్రచారమవుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. మా అమ్మ పూర్తి ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియకుండా దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు’’ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా వికాస్ కోహ్లి క్లారిటీ ఇచ్చాడు. కాగా ఢిల్లీలో జన్మించిన విరాట్ తల్లిదండ్రుల పేర్లు సరోజ్- ప్రేమ్ కోహ్లి. విరాట్కు అక్క భావనా కోహ్లి ధింగ్రా, అన్న వికాస్ కోహ్లి ఉన్నారు. భావనా ఎంటర్ప్రెన్యూర్ కాగా.. వికాస్ కూడా వ్యాపారరంగంలో ఉన్నట్లు సమాచారం. కాగా టీమిండియా.. జనవరి 25 నుంచి ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో కోహ్లి పేరు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా జట్టు నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం ధ్రువీకరించింది. విశాఖలో విజయం కోసం ఇదిలా ఉంటే.. హైదరాబాద్ వేదికగా తొలి టెస్టులో ఓటమి పాలైన టీమిండియా.. విశాఖపట్నం మ్యాచ్లో గెలవాలని పట్టుదలగా ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి ఈ టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు విశాఖ చేరుకున్నారు. మరోవైపు.. కోహ్లితో పాటు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ వంటి స్టార్లు కూడా ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు. ఇది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చదవండి: Ind vs Eng: కోహ్లి వస్తే వేటు పడేది నీ మీదే సర్ఫరాజ్! తాడోపేడో తేల్చుకో.. View this post on Instagram A post shared by Vikas Kohli (@vk0681) -
Ind vs Eng Tests: కోహ్లి రీఎంట్రీ డౌటే!.. అసలు కారణాలేంటి?
Ind vs Eng Test Series 2024: బజ్బాల్ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా టీమిండియాతో తొలి టెస్టులో గెలుపు జెండా ఎగురవేసింది ఇంగ్లండ్. హైదరాబాద్ మ్యాచ్లో ఆరంభంలో తడబడ్డా ఆఖరికి విజయం సాధించి ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఊహించని రీతిలో ఓటమిపాలైన రోహిత్ సేనకు రెండో టెస్టుకు ముందే మరో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సహా కీలక ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఆ ముగ్గురికి పిలుపు ఈ నేపథ్యంలో వైజాగ్లో జరిగే టెస్టు కోసం సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లకు పిలుపు వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో ఆఖరి మూడు టెస్టులకు కూడా జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకోసం సెలక్టర్లు మంగళవారం(జనవరి 30) భేటీకాన్నుట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి రీఎంట్రీ ఇస్తాడా? లేదా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ కోహ్లి జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కోహ్లి రీఎంట్రీ ఇస్తాడా.. అసలు ఎందుకు దూరమయ్యాడు? అయితే, కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి దూరమయ్యాడని మేనేజ్మెంట్ చెప్పినప్పటికీ.. అందుకు గల అసలు కారణంపై ఇంత వరకు స్పష్టత రాలేదు. కెప్టెన్ రోహిత్ శర్మతో విభేదాలంటూ రూమర్లు వస్తున్నప్పటికీ.. అవన్నీ వట్టి పుకార్లే అని బీసీసీఐ వర్గాలు కొట్టిపారేశాయి. ఈ క్రమంలో.. భార్య అనుష్క శర్మ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వ్యక్తిగతంగా ఆమెకు దగ్గరగా ఉండేందుకే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడని అభిమానులు అంటున్నారు. కాగా అనుష్క ప్రస్తుతం గర్భవతిగా ఉందంటూ ఇప్పటికే కొన్ని ఫొటోలు వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఏదేమైనా కోహ్లి ఆఖరి మూడు టెస్టులకు అందుబాటులోకి రాకుంటే టీమిండియాకు మాత్రం తిప్పలు తప్పవు. ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత జట్టు(అప్డేటెడ్): రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్. చదవండి: విరాట్ను చూసి నేర్చుకోవాలి: కోహ్లిపై రోహిత్ శర్మ ప్రశంసలు -
ఈ హీరోయిన్కు విరాట్ బావ అవుతాడట! కోహ్లి గురించి ఏమందంటే?
'చి.ల.సౌ.' సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైంది రుహానీ శర్మ. ‘హిట్’, ‘డర్టీ హరి’, ‘101 జిల్లాల అందగాడు’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ హీరోయిన్గా సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె విక్టరీ వెంకటేశ్ 'సైంధవ్' మూవీలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. వెంకీ మామకు అభిమానిని తాజాగా ఓ కార్యక్రమానికి వెళ్లిన ఈ బ్యూటీ తన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నేను చిన్నప్పటినుంచి వెంకీ సర్ సినిమాలు చూస్తూ పెరిగాను. సైంధవ్లో నటించాక ఆయనకు ఇంకా పెద్ద అభిమానిగా మారాను. ఇప్పుడాయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. చిన్నప్పటినుంచి డాక్టర్ అవ్వాలని కోరికగా ఉండేది. కానీ సినిమాల్లోకి వచ్చాను. ఇప్పుడు సైంధవ్లో డాక్టర్ పాత్ర పోషించడం సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది. అక్కడున్న విలేఖరి.. అనుష్క శర్మతో మీ అనుబంధం ఎలా ఉంటుంది? అని ప్రశ్నించింది. విరాట్ బావ ెలా ుంటాడంటే? ఇది విని అవాక్కైన హీరోయిన్.. 'నేను ఈ విషయం గురించి ఎప్పుడూ, ఎక్కడా మీడియా ముందు చెప్పలేదు. గోప్యంగానే ఉంచాను. మీకెలా తెలిసింది? అడిగారు కాబట్టి చెప్తున్నా.. అవును, అనుష్క నాకు సోదరి అవుతుంది' అని చెప్పింది. దీంతో విలేఖరి.. 'అనుష్క అక్క అంటే విరాట్ కోహ్లి బావ అవుతాడు.. మీ బావ మీతో ఎలా ఉంటాడు?' అని అడిగింది. రుహానీ మాట్లాడుతూ.. 'విరాట్ నాతో చాలా బాగుంటాడు. వాళ్లిద్దరూ ఫిల్టర్ లేకుండా చాలా సింపుల్గా ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది' అని చెప్పుకొచ్చింది. రుహానీ శర్మకు విరాట్- అనుష్క దగ్గరి బంధువులే అని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. చదవండి: 'విక్రమ్కు అస్సలు నటించడమే రాదు'.. నటి భర్త, డైరెక్టర్ సంచలన కామెంట్స్! -
ఈ సెలబ్రిటీల పెట్టుబడులు ఎక్కడో తెలుసా?
చదువవగానే లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగానికే స్థిరపడకుండా సొంతంగా ఓ పరిశ్రమ పెట్టాలనుకోవడం ఇప్పుడు ట్రెండ్ అయింది. కొత్తగా పరిశ్రమ స్థాపించాలనే వారి కలలకు పారిశ్రామిక రంగం దన్నుగా నిలుస్తోంది. దాంతో, ప్రపంచంలో స్టార్టప్ అనుకూల వాతావరణం ఉన్న దేశాల్లో మన దేశం మూడోస్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 1,16,000 గుర్తింపు పొందిన అంకుర పరిశ్రమలు ఉన్నాయి. దేశంలో లక్షకు పైగా ఉన్న అంకుర పరిశ్రమలు 56 విభిన్న విభాగాల్లో రకరకాల సమస్యలకు పరిష్కారాలు సూచిస్తున్నాయి. ప్రత్యేకించి టెక్ స్టార్టప్స్లో అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానం మనదే. నాస్కామ్ నివేదిక ప్రకారం 27 వేలదాకా చురుగ్గా పనిచేస్తున్న టెక్ స్టార్టప్స్ ఉన్నాయిక్కడ. యువతరం ఎంతో ఇష్టంగా ఈ రంగంలోకి వస్తోంది. పెట్టుబడిదారులు పెరిగారు, ఇంక్యుబేటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఫలానా ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుందనే కంపెనీల్లో సెలబ్రిటీలు సైతం మదుపు చేసి కోట్లు గడిస్తున్నారు. వీరు ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీలు యూనికార్న్లుగా ఎదుగుతున్నాయి. ఇదీ చదవండి: రూ.12 వేలకోట్ల సంగీత సామ్రాజ్యం.. టాప్ 10లో 7 మన పాటలే! సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసిన స్టార్టప్లు.. శిఖర్ధావన్: అప్స్టాక్స్, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. సచిన్ తెందూల్కర్: స్పిన్నీ, కార్లు సెల్లింగ్ కంపెనీ. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. శ్రద్ధాకపూర్: మైగ్లామ్, నేచురల్ బ్యూటీ కంపెనీ. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. విరాట్కోహ్లీ: ఎంపీఎల్, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్. సెప్టెంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. అనుష్కశర్మ: డిజిట్ ఇన్సూరెన్స్, ఆన్లైన్ ఇన్సూరెన్స్ ఫ్లాట్ఫామ్. జనవరి 2021లో పెట్టుబడి పెట్టారు. ఎంఎస్ ధోని: కార్స్24, ఆన్లైన్ కార్స్ సెల్లింగ్ ప్లాట్ఫామ్. నవంబర్ 2020లో పెట్టుబడి పెట్టారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా
"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్
మీడియాకు థ్యాంక్స్ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే?
బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!
గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..
పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..
కుందనపు బొమ్మలా ప్రియాంకా జైన్ ఫొటోలు
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
పిఠాపురం: సీఎం జగన్ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
తప్పక చదవండి
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement