ranbir kapoor
-
ప్యార్ మే పడిపోయామే...
బాలీవుడ్లో కొందరు యంగ్ హీరోలు, హీరోయిన్లు ఉల్లాసంగా,ఉత్సాహంగా ప్రేమలో పడుతున్నారు. ప్యార్ మే పడిపోయామే... అంటూ సినిమా సెట్స్లో లవ్ సాంగ్స్, డైలాగ్స్ చెబుతున్నారు. సిల్వర్ స్క్రీన్ కోసం ఈ ప్యార్ ప్రపంచంలో మునిగి తేలుతున్న ఆ జంటల గురించి తెలుసుకుందాం...ముక్కోణపు ప్రేమ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కోసం తొలిసారి కలిసి పని చేశారు రణ్బీర్ కపూర్, ఆలియా భట్. ఈ సినిమా ప్రయాణంలోనే రణ్బీర్కపూర్, ఆలియా భట్ ప్రేమలో పడ్డారు. ఈ సినిమాలోని తొలిపార్టు ‘బ్రహ్మాస్త్ర:పార్టు 1 శివ’ 2022 సెప్టెంబరులో విడుదలైంది. కానీ అంతకు ముందే... అంటే 2022 ఏప్రిల్లోనే రణ్బీర్, ఆలియా పెళ్లి చేసుకున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందనున్న మూవీ ‘లవ్ అండ్ వార్’. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ మరో లీడ్ రోల్ చేయనుండగా, సంజయ్ లీలా భాన్సాలీ డైరెక్షన్ చేయనున్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయిల మధ్య సాగే ముక్కోణపు లవ్స్టోరీగా ఈ మూవీ ఉంటుందని సమాచారం.ఈ ఏడాదిలోనే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ ట్రయాంగిల్ లవ్స్టోరీని ముందుగా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రీ ప్రోడక్షన్కు ఎక్కువ సమయం పట్టడం, హిందీ ‘రామాయణ’ మూవీతో రణ్బీర్ కపూర్ బిజీగా ఉండటం వంటి కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడింది. ‘లవ్ అండ్ వార్’ మూవీని 2026 మార్చిలో రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించారు.దక్షిణాది అమ్మాయి... ఉత్తరాది అబ్బాయిదక్షిణాది అమ్మాయి, ఉత్తరాది అబ్బాయి లవ్ చేసుకుంటే ఏలా ఉంటుంది? వారి కుటుంబాలను ఒప్పించడం కోసం ఈ అబ్బాయి, అమ్మాయిలు ఏ విధంగా కష్టపడ్డారు? పెళ్లి తర్వాత వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనే అంశాలతో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘పరమ్ సుందరి’. ఈ చిత్రో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కేరళలో జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాల్లో కనిపించే అథిరిపిల్లి వాటర్ ఫాల్స్ లోకేషన్స్లోనూ (ఇరువర్, రావన్, దిల్ సే.. వంటి సినిమాల్లో కనిపిస్తాయి) ‘పరమ్ సుందరి’ సినిమా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. ఈ చిత్రంలో నార్త్ అబ్బాయి పరమ్గా సిద్ధార్థ్ మల్హోత్రా, దక్షిణాది అమ్మాయి సుందరిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 25న విడుదల కానుంది.రెండు ప్రేమకథలుతులసీ ప్రేమ కోసం సన్నీ ఎన్నో సాహసాలు చేశాడు. ఈ సాహసాలను ఈ ఏడాది వెండితెరపై చూడొచ్చు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా శశాంక్ ఖైతాన్ డైరెక్షన్లో రూపొందుతున్న రొమాంటిక్ లవ్స్టోరీ ఫిల్మ్ ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. కరణ్ జోహర్ ఈ సినిమాకు నిర్మాత. ఈ మూవీ చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ఈ చిత్రంలో సన్నీగా వరుణ్ ధావన్, కుమారిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాగా ‘బవాల్ (2023)’ అనే ఓ హిందీ చిత్రంలో వరుణ్ ధావన్, జానీ ్వకపూర్ జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.ఇక ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’యే కాకుండా తన తండ్రి డేవిడ్ ధావన్ డైరెక్షన్లో వరుణ్ ధావన్ ఓ లవ్స్టోరీ ఫిల్మ్లో నటించనున్నారు. ఈ మూవీలోని హీరోయిన్స్గా మృణాళ్ ఠాకూర్, పూజా హెగ్డేల పేర్లు తెరపైకి వచ్చాయి. త్వరలోనే ఈ ట్రయాంగిల్ లవ్స్టోరీ ఫిల్మ్ సెట్స్పైకి వెళ్లనుంది. ఇలా రెండు ప్రేమకథలతో వరుణ్ ధావన్ ఫుల్ బిజీ.ఏక్ దిన్ లవ్స్టోరీ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హిందీలో ‘ఏక్ దిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే లవ్స్టోరీ మూవీ చేస్తున్నారు. సునీల్పాండే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ లవ్స్టోరీ ఫిల్మ్లో సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ‘ఏక్ దిన్’ రిలీజ్ కావొచ్చు. ఈ చిత్రంలో జునైద్ ఖాన్పోలీస్ ఆఫీసర్పాత్రలో నటిస్తున్నారని బాలీవుడ్ టాక్. ఈపోలీస్ ఆఫీసర్కు ఓ రోజు ఒక అమ్మాయి పరిచయం అవు తుంది. కానీ ఆ అమ్మాయి నెక్ట్స్ డే ఆ అబ్బాయిని గుర్తుపట్టలేకపోతుంది. అసలు వారిద్దరి మధ్య ఒక్క రోజులో ఏం జరిగింది? అన్నదే ‘ఏక్ దిన్’ కథాంశమని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. అలాగే జునైద్ ఖాన్ హిందీలో ‘లవ్యాపా’ అనే లవ్స్టోరీ ఫిల్మ్ కూడా చేశారు. దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా చేశారు. అద్వైత్ చందన్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్, తమిళ దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాను నిర్మించారు. ప్రదీప్ రంగనాథన్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన తమిళ హిట్ ఫిల్మ్ ‘లవ్ టుడే’కు, హిందీ రీమేక్గా ‘లవ్యాపా’ రూపొందినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఖుషీ కపూర్ హీరోయిన్గా చేసిన మరో లవ్స్టోరీ మూవీ ‘నాదానియన్’. ఇందులో ఇబ్రహాం అలీ ఖాన్ హీరోగా చేస్తున్నారు.ధడక్ సీక్వెల్లో...జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘ధడక్’. ఇందులో ఇషాన్ కట్టర్ హీరోగా నటించారు. ఇప్పుడు ‘ధడక్’కు సీక్వెల్గా ‘ధడక్ 2’ రూపొందుతోంది. కానీ సీక్వెల్లో ఇషాన్, జాన్వీలు హీరోయిన్లుగా నటించడం లేదు. వీరి ప్లేస్లో సిద్ధాంత్ చతుర్వేది, ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ నటిస్తున్నారు. షాజియా డైరెక్షన్లో జీ స్టూడియోస్, ధర్మప్రోడక్షన్స్, క్లౌడ్ 9 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. అలాగే ‘దిల్ కా దర్వాజా ఖోల్నా డార్లింగ్’ అనే రొమాంటిక్ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు సిద్దాంత్ చతుర్వేది. వామికా గబ్బి హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో జయా బచ్చన్ ఓ లీడ్ రోల్లో చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ గోవాలో ప్రారంభమైంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు.చాంద్ మేరా దిల్లక్ష్య, అనన్యాపాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న బాలీవుడ్ రొమాంటిక్ మూవీ ‘చాంద్ మేరా దిల్’. ఆల్రెడీ ఈ మూవీ చిత్రీకరణ గత ఏడాదే మొదలైందని బాలీవుడ్ సమాచారం. వివేక్ సోని దర్శకత్వంలో ఈ మూవీని కరణ్జోహార్ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ లవ్స్టోరీ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.హీరోయిన్ ఎవరు?∙బాలీవుడ్ లవ్స్టోరీ ఫ్రాంచైజీలో ‘ఆషికీ’కి మంచి క్రేజ్ ఉంది. దీంతో ‘ఆషికీ 3’ని రెండు సంవత్సరాల క్రితం ప్రకటించారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరో. అనురాగ్ బసు దర్శకుడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్పైకి వెళ్ల లేదు. అయితే ‘ఆషికీ 3’ షూటింగ్ విషయంలో అన్ని సమస్యలు చక్కబడ్డాయని, ఈ మూవీ ఈ ఏడాది సెట్స్కు వెళ్లనుందని సమాచారం. అయితే ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ, శర్వారీ వంటి కథనాయికల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్ గా ‘ఆషికీ 3’ కోసం కార్తీక్ ప్రేమలో పడే హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయ క తప్పదు. ⇒ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్తో హిందీలో ‘రాంఝాణా, అత్రంగి రే’ వంటి సినిమాలు చేశారు హీరో ధనుష్. వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ‘తేరే ఇష్క్ మే’ అనే లవ్స్టోరీ మూవీ రానుంది. 2023లో ఈ సినిమాను ప్రకటించారు. కానీ ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. ధనుష్ ఆల్రెడీ కమిటైన ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ చిత్రీకరణ ఆలస్యం అవుతోందట. అయితే ఈ ఏడాది ఈ మూవీని సెట్స్పైకి తీసుకుని వెళ్లాలని ఆనంద్ .ఎల్ రాయ్ భావిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వానీ, త్రిప్తీ దిమ్రీ, కృతీసనన్ వంటి తారల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి... ధనుష్ సరసన ఎవరు హీరోయిన్గా నటిస్తారో చూడాలి.⇒ తెలుగు సూపర్హిట్ లవ్స్టోరీ ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్లో నటించి, సాయిరాజేష్ దర్శకత్వం వహించిన ‘బేబీ’ మూవీ 2023లో విడుదలై, సూపర్హిట్ సాధించింది. ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందని తెలుస్తోంది. తెలుగు ‘బేబీ’కి దర్శకత్వం వహించిన సాయిరాజేష్నే హిందీ ‘బేబీ’కి రీమేక్ వహించనున్నట్లుగా తెలిసింది. అయితే బేబీ సినిమా నటీనటుల విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇషాన్ కట్టర్, ఆగస్త్య నంద, బాబిల్ ఖాన్ వంటి బాలీవుడ్ కుర్ర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే హీరోయిన్పాత్ర కోసం ఖుషీ కపూర్, కృతీ శెట్టి వంటి తారల పేర్లు బీటౌన్లో వినిపిస్తున్నాయి. మరి..ఫైనల్గా హిందీ ‘బేబీ’లో ఎవరు యాక్ట్ నటించనున్నారో తెలియా లంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. – ముసిమి శివాంజనేయులు -
పుష్ప-2 రికార్డ్స్ బద్దలు కొడతా : యానిమల్ హీరో
-
కూతురు రాహాతో స్టార్ జంట రణ్బీర్ - ఆలియా వెకేషన్ (ఫోటోలు)
-
ఫ్యాన్స్పై లవ్.. అలియా భట్ను మించిపోతున్న కూతురు రాహా (ఫోటోలు)
-
హీరోకన్నా విలన్ కు ఎక్కువ పేమెంట్
ఏదైనా సినిమాకు సంబంధించి క్యాస్టింగ్ ఖర్చు లెక్క రాసుకుంటే టాప్ రెమ్యునరేషన్ హీరోకు ఉంటుంది.. తరువాత హీరోయిన్.. అలా ఉంటుంది చివరి రేటు విలన్ కు ఉంటుంది. కానీ ఈ సరికొత్త రామాయణం సినిమాకు సంబంధించి హీరో అయిన రాముడి పాత్రధారి కన్నా విలన్ అయినా రావణుడి పాత్రధారికే ఎక్కువ పేమెంట్ ఇస్తున్నారు. ఎక్కువ అంటే అలాంటిలాంటి పేమెంట్ కాదండి.. ఏకంగా రెండొందల కోట్లు ఇస్తున్నారు. ఇంతకూ ఎవరా రాముడు.. ఎవరా రావణుడు అనేదేగా మీ అనుమానం..బాలీవుడ్ నిర్మాత, నటుడు నితీష్ తివారి నిర్మిస్తున్న రామాయణం(Ramayana) సినిమాకు సంబంధించి హీరోగా అంటే శ్రీరాముడిగా రణబీర్ కపూర్ ను ఎంపిక చేయగా అందులో మరో ప్రధాన పాత్రధారి అయిన రావణుడిగా కేజీఎఫ్ సిరీస్ హీరోగా చేసి బాక్సాఫీస్ కొల్లగొట్టిన కన్నడ స్టార్ యష్(Yash) కు మాత్రం హీరోకన్నా ఎక్కువే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. నటుడిగా ఇచ్చిన పారితోషికంతోబాటు డిస్ట్రిబ్యూషన్ హక్కులు.. అన్నీకలిపి మొత్తం రూ. 200 కోట్లవరకు యష్ కు ఇచ్చేనందుకు తివారీ అంగీకరించారట. ఇది హిందీ సూపర్ స్టార్లు అయినా సల్మాన్ ఖాన్.. అమీర్ ఖాన్.. షారూక్ ఖాన్ ల హీరోల పారితోషికం కన్నా ఎక్కువని తెలుస్తోంది.(చదవండి: తగ్గని శంకర్.. పెరిగిన బడ్జెట్)ఇటీవల ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన కల్కి చిత్రంలో విలన్ గా నటించిన కమల్ హాసన్ కూడా రూ. 40 కోట్లలోపే తీసుకున్నారట. కానీ యష్ మాత్రం ఏకంగా రూ. 200 కోట్లు తీసుకోవడాన్ని చూసి బాలీవుడ్ సైతం షాక్ అయిందని అంటున్నారు. సల్మాన్ , షారూక్.. అమీర్ ఖాన్లు సైతం ఇంతవరకూ హీరో పారితోషికంతోబాటు డిస్ట్రిబ్యూషన్ హక్కులు సైతం తీసుకుంటారు. ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ వంటివి అన్నీ కలుపుకున్న వారికి ఇంతవరకూ.. రూ. 150 కోట్లు దాటలేదట. కానీ తన అసాధారణ నటనతో కన్నడ బాక్సాఫీస్ కొల్లగొట్టిన యష్ మాత్రం విలన్ పాత్రకోసం ఏకంగా రూ. 200 కోట్లు తీసుకుంటున్నట్లు నితీష్ తివారి అఫీస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక సూపర్ స్టార్లు కూడా ఈ మార్కును టచ్ చేయలేదంటే ఇక రణబీర్ కపూర్ పారితోషికం ఈయనతో సరికిపోల్చడం కూడా కుదరదు అంటున్నారు. ఇక షారూక్ వంటి స్టార్లతో సమానంగా పారితోషికం తీసుకున్నది సౌత్ ఇండియాలో ముగ్గురే ఉన్నారు. రజనీకాంత్, విజయ్ తలపతి , అల్లు అర్జున్ మాత్రమే ఒక్కో సినిమాకు రూ. 200 కోట్లు తీసుకుంటున్నారట . మొత్తానికి మన సౌత్ ఇండియన్ నటుడు యష్ విలన్ పాత్రలో రెండు వందలకోట్ల పారితోషికం తీసుకుని బాలీవుడ్ హీరోలకు సవాల్ విసిరారు.- సిమ్మాదిరప్పన్న -
రాజ్ కపూర్ 100వ జన్మదినోత్సవం కార్యక్రమంలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
రణబీర్ కపూర్కి నాసల్ డీవియేటెడ్ సెప్టం: అంటే ఏంటి..?
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ యానిమల్ మూవీలో విలక్షణమైన నటనతో ఆకట్టుకుని మంచి హిట్ని అందుకున్నారు. అమ్మాయిల కలల రాకుమారుడు, బాలీవుడ్ చాక్లెట్ బాయ్గా పిలిచే రణబీర్ ఒక ఇంటర్వ్యూలో తాను నాసల్ డీవియేటెడ్ సెప్టెమ్తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. దీని కారణంగా తాను వేగంగా తినడం, మాట్లాడటం వంటివి చేస్తుంటానని అన్నారు. అసలేంటీ వ్యాధి..?,ఎందువల్ల వస్తుందంటే..రణబీర్ ఫేస్ చేస్తున్న నాసల్ డీవియేటెడ్ సెప్టంని తెలుగులో ముక్కు సంబంధిత విచలనం (సెప్టం)గా చెబుతారు. దీని కారణంగా రెండు నాసికా రంధ్రాలను విభజించే సన్నని గోడ మధ్య భాగం ఒకవైపు వాలుగా ఉంటుంది. ఈ అపసవ్యమైన అమరిక రెండు నాసికా మార్గాలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా వివిధ సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి సమస్యలు తలెత్తుతాయంటే..విచలనం సెప్టం శ్యాసను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. నాసికా రంధ్రాలను వేరు చేసే గోడ(సెప్టం) విచలనం అంటే పక్కకు వాలడం. వల్ల రెండు రంధ్రాలు చిన్నగా లేదా మూసుకుపోయినట్లుగా అయిపోతాయి. దీంతో వాయుప్రసరణ సవ్యంగా ఉండదు. ఒక్కోసారి శ్వాసతీసుకోవడం కూడా కష్టమైపోతుంది. ఈ సమస్య కారణంగా ఆయా వ్యక్తులు నిద్రా సమసయంలో నోటి శ్వాసపై ఆధారపడుతుంటారు. ఇలా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల.. ఒక్కసారిగా వాయు మార్గాల్లో గాలి ఎక్కువై ప్రతిఘటన ఏర్పడుతుంది. ఈ గాలిని ఊపిరితిత్తుల వరకు నెట్టేందుకు మరింత శక్తి అవసరమవుతుంది. ఫలితంగా గురకకు దారితీసి అబ్స్ట్రక్టివ స్లీప్ ఆప్నియాకు దారితీస్తుంది. ఈశ్వాస లోపం కారణంగా వేగంగా సంభాషించేందుకు కారణమవుతుంది. ఈ వ్యక్తులో నాసికా రద్దీ ఏర్పుడుతుంటుంది. ఎందుకంటే ఒక వైపు రంధ్రం అత్యంత అధ్వాన్నంగా పనిచేస్తుండమే. పైగా శ్లేష్మం కూడా సరిగా బయటకి రాక సైనస్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే ముక్కు లోపల పొడిబారినట్లు అయిపోయి ముఖం నొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలతో బాధపడతారు. నిర్థారణ..ఈఎన్టీ స్పెషలిస్ట్ వద్ద ఓటోలారిన్జాలజిస్ట్ శారీరక పరీక్ష, నాసికా ఎండోస్కోపీ లేదా సిటీ స్కాన్ వంటి వాటితో ఈ సెప్టం విచలనంని గుర్తిస్తారు. విచలనం తీవ్రతను అనుసరించి చికిత్స ఆధారపడి ఉటుంది.ఎలా నివారిస్తారు..దీన్ని నివారించడమే గాని పూర్తిగా నయం కాదు. తేలికపాటి కేసుల్లో ఎలాంటి చికిత్స అవసరం ఉండదు. అలాకాకుండా కాస్త ప్రమాదకరమైన సమస్యలు ఎదుర్కొంటే..డీకాంగెస్టెంట్లు, యాంటిహిస్టామైన్లు, నాసల్ స్ప్రేలతో ఈ వ్యాదిని నిర్వహిస్తారు. అవన్నీ కేవలం సౌకర్యాన్ని అందిస్తాయే తప్ప సవస్యను పూర్తిగా నివారించలేవు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు పొగ తాగటం, పెయింట్ పొగలు, గృహ రసాయనాలు, పరిమళ ద్రవ్యాలు వంటి అలెర్జీ కారకాలకు దూరంగా ఉండాలి. దీన్ని సక్రమమైన జీవనశైలితో అధిగమించొచ్చని చెబుతున్నారు నిపుణులు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో శస్త్ర చికిత్సతో ఆ సెప్టంని సరిచేయడమే ప్రభావవంతమైన పరిష్కారం అని వెల్లడించారు వైద్య నిపుణులు.(చదవండి: 'సోలో ట్రిప్సే సో బెటర్'..! అంటున్న నిపుణులు..) -
వైభవంగా నటుడి రోకా వేడుక, రణబీర్, కరీనా,సైఫ్, సందడి (ఫొటోలు)
-
రెండు భాగాలుగా 'రామాయణ’ విడుదలపై ప్రకటన
-
స్టార్ హీరోయిన్ ఆలియా ముద్దుల తనయ రాహా కపూర్ బర్త్డే సెలబ్రేషన్స్
-
డాటర్ ఆఫ్ ఆలియ : రాహా ‘ఆహా’ అంటూ వింటుంది
‘ఆలియా భట్ నటి మాత్రమే కాదు, ఎంటర్ప్రెన్యూర్ కూడా’... ఈ వాక్యానికి కొనసాగింపుగా ‘చక్కని స్టోరీ టెల్లర్’ అనే ప్రశంసను కూడా చేర్చవచ్చు. ఎందుకంటే ఆలియా ప్రతి రాత్రి తన కూతురు రాహాకు ఏదో ఒక పిల్లల పుస్తకం చదివి వినిపిస్తుంది. రాహా ‘ఆహా’ అంటూ వింటుంది.‘తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పుస్తకాలు చదవడం అనేది వారి భవిష్యత్కు పెట్టుబడి పెట్టడంలాంటిది’ అంటుది ఆలియాభట్. ‘ఎడ్–ఏ–మమ్మా’ అనే చిల్డ్రన్ బ్రాండ్ (ప్లేవేర్, స్టోరీ బుక్స్, టాయ్స్ అండ్ మోర్) వోనర్ అయినా ఆలియా తన బ్రాండ్లో కొత్త చిల్డ్రన్ బుక్ సిరీస్ను లాంచ్ చేసింది. ‘పిల్లల కోసం తల్లులు స్టోరీ టెల్లింగ్ సెషన్లు నిర్వహించడం అనేది మంచి విధానం’ అంటున్నారు మానసిక నిపుణులు. ‘బెడ్ మీద పిల్లలకు పుస్తకాలు చదివి వినిపించడం అనేది వారి మానసిక వికాసంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉచ్చారణలను, కొత్త పదాలను నేర్చుకుంటారు. పిల్లలకు కొత్త విషయాలు తెలియజేయడానికి ఇదొక అద్భుత సాధనం. ఇది పిల్లలతో తల్లిదండ్రుల భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తుంది. పిల్లల ఏకాగ్రతను పెంచుతుంది. రోజువారీ షెడ్యూల్లో ప్రతి రాత్రి పుస్తక పఠనాన్ని తప్పనిసరి చేయడం పిల్లల్లో క్రమశిక్షణను పెంచుతుంది’ అంటుంది కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ శృతి వస్త. -
రెండు భాగాలుగా 'రామాయణ'.. విడుదలపై ప్రకటన
భారత ఇతిహాసాలను వెండితెరపై చూపించాలంటే పెద్ద సాహసమేనని చెప్పాలి. ఈ క్రమంలో వచ్చిన చిత్రాలు ఇప్పటకే చాలావరకు విజయాన్ని అందుకున్నాయి. బాలీవుడ్ తెరకెక్కిస్తున్న 'రామాయణ' గురించి ఒక ప్రకటన వచ్చింది. ఈ చిత్రం గురించి ఇప్పటికే కన్నడ స్టార్ యశ్ పలు విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడు పోస్టర్స్ విడుదల చేస్తూ విడుదల తేదీలను కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్బీర్కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్సింగ్ కనిపించనున్నట్లు ప్రచారం ఉంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల చేస్తున్నట్లు పోస్టర్స్ను కూడా పంచుకున్నారు.ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారు. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్బీర్ ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ విషయంపై ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణతో పాటు డైట్ కూడా ఫాలో అవుతున్నట్లు తెలిపారు. రాముడి పాత్రలో నటిస్తుండటం వల్ల తాను మద్యపానం మానేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి కూడా పలు విషయాలను పంచుకున్నారు. సీతమ్మ పాత్రలో నటించే అవకాశం దక్కడం తన అదృష్టమని సాయిపల్లవి పేర్కొన్నారు. ఒక నటిగా కాకుండా భక్తురాలిగా నటిస్తున్నట్లు తెలిపారు. -
రణబీర్ - అలియా కొత్త ఇల్లు ధర వింటే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
-
రణబీర్, అలియా కొత్త ఇల్లు రూ. 250 కోట్లు.. వారిద్దరి పేరుతో రిజిస్ట్రేషన్
జీవితంలో ప్రతి ఒక్కరూ సొంతింటి కోసం చాలా కలలు కంటారు. ఈ విషయంలో సినిమా సెలబ్రిటీలు కూడా ఇంకాస్త ఎక్కువగానే ఆలోచిస్తారు. బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, అలియా భట్ల ఇల్లు ఎట్టకేలకు పూర్తి అయింది. సుమారు రెండేళ్లుగా ఈ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా నడిబొడ్డున ఉన్న ఈ కొత్త ఇంట్లోకి వారు షిఫ్ట్ కానున్నారు. సుమారు రూ. 250 కోట్ల విలువ చేసే ఈ ఆస్తిని తన కూతురు రాహా కపూర్ పేరుతో పాటు ఆయన అమ్మగారు నటి నీతూ కపూర్ పేరుతో రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది.బాలీవుడ్ నివేదికల ప్రకారం రణబీర్, అలియా నవంబర్ నెలలో కొత్త ఇంటిలోకి షిఫ్ట్ కానున్నారని తెలుస్తోంది. అదే నెలలో తమ కుమార్తె రెండో పుట్టినరోజు జరుపుకోనుంది. ఆ వేడుకలు అక్కడే జరుపుకోవాలని వారు ప్లాన్ చేస్తున్నారట. ఆరు అంతస్తులు ఉన్న ఆ భవనంలో ఎంతో ఖరీదైన ఫర్నీచర్తో పాటు ఇండోర్ స్విమ్మింగ్ పూల్, జిమ్ అందుకు ఉన్నాయట. రణబీర్, అలియా భట్, నీతూ కపూర్ గత కొన్ని నెలలుగా భవన నిర్మాణ స్థలంలో తరచుగా కనిపించారు.ఇప్పటికే అలియా పేరు మీద మూడు విల్లాలు ఉన్నాయి. అవి కూడా దాదాపు రూ. 100 కోట్లు విలువ చేస్తాయని తెలుస్తోంది. అయితే, రణబీర్ కపూర్కు వారసత్వంగా వచ్చిన ఆస్తి ఎక్కువగా తన తల్లి నీతూ కపూర్ పేరు మీదే ఉంది. ఆమె భర్త దివంగత రిషి కపూర్ తన ఆస్తులన్నింటికి సగం యజమానిగా ఆమెను నియమించారు. దీంతో రణబీర్ కూడా రూ. 250 కోట్ల తన కొత్త ఇంటిని కూతరు రాహా, నీతూ కపూర్ పేరు మీద రిజస్టర్ చేయించారు.యానిమల్ సినిమాతో రణబీర్ కపూర్ భారీ విజయం అందుకున్నారు. తన కొత్త సినిమా 'రామాయణ' కోసం ఆయన కసరత్తులు ప్రారంభించారు. మూడు భాగాలుగా దీన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తొలి పార్ట్ను 2025 దీపావళికి తీసుకురానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. జిగ్రాలో కనిపించిన అలియా భట్ తన రాబోయే చిత్రం సంజయ్ లీలా బన్సాలీ 'లవ్ అండ్ వార్'లో విక్కీ కౌశల్ సరసన నటించడానికి సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పెళ్లికొడుకు గెటప్లో రణబీర్ కపూర్ సందడి (ఫొటోలు)
-
గ్యాప్ ఇవ్వలా... వచ్చింది
నచ్చిన కథ దొరక్క కొందరు, చేసే పాత్రకు తగ్గట్టు మేకోవర్ అవ్వాలని మరికొందరు, వ్యక్తిగత జీవితంతో ఇంకొందరు... ఇలా కారణాలు ఏమైనా యాక్టర్స్ కెరీర్లో కొన్నిసార్లు గ్యాప్లు వస్తుంటాయి. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ గ్యాప్ను ఫిల్ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి గ్యాప్ల కారణంగా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్పై కనిపించకుండా ‘గ్యాప్ ఇవ్వలా... వచ్చింది’ అంటున్న కొందరు బాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం.స్పీడ్ బ్రేకర్ గత ఏడాది బాక్సాఫీస్ను ఓ ఊపు ఊపేశారు షారుక్ ఖాన్. 2023లో షారుక్ ఖాన్ హీరోగా చేసిన ‘పఠాన్, జవాన్’ రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను అధిగమించగా, ‘డంకీ’ రూ. 450 కోట్ల కలెక్షన్స్ను సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఈ మూడు చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత ఏడాది రూ. 2,500 కోట్ల కలెక్షన్స్ పైగా రాబట్టగలిగారు షారుక్. కానీ ఈ ఏడాది షారుక్ జోరుకు స్పీడ్ బ్రేకర్ పడింది. 2024లో సిల్వర్ స్క్రీన్ని మిస్ చేసుకున్నారు షారుక్. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో షారుక్ తనయ సుహానా ఖాన్ మరో లీడ్ రోల్లో నటిస్తారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో ఇంకా ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లలేదు. ‘కింగ్’ 2025 ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ది బుల్ మిస్ అయ్యాడు ‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3’... ఈ రెండు సినిమాలతో సల్మాన్ ఖాన్ గత ఏడాది వెండితెరపై కనిపించారు. ఇదే జోష్లో ఈ ఏడాది ఈద్కు సల్మాన్ ఖాన్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ కుదర్లేదు. ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్తో సల్మాన్ ఖాన్ చేయాల్సిన ‘ది బుల్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా సరైన సమయంలో సెట్స్ పైకి వెళ్లలేదు. దాంతో ఈ ఏడాది సల్మాన్ ఖాన్ వెండితెరపై కనిపించలేకపోయారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్తో సల్మాన్ ఖాన్ ‘సికందర్’ అనే యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ కానున్నట్లు యూనిట్ ప్రకటించింది. మరోవైపు దర్శకుడు విష్ణువర్ధన్తో సల్మాన్ చేయనున్న చిత్రం కూడా 2025లోనే రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. సో.. వచ్చే ఏడాది రెండుసార్లు సల్మాన్ తెరపై కనిపిస్తారని ఊహించవచ్చు. రెండేళ్లు పూర్తయినా... రెండేళ్లు దాటిపోయింది ఆమిర్ ఖాన్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్పై కనిపించి. 2022లో చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా (హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్) తర్వాత ఆమిర్ వెంటనే మరో సినిమా ఒప్పుకోలేదు. మరోవైపు తన కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి పనులతో కొన్నాళ్లు ఆమిర్ ఖాన్ బిజీ అయ్యారు. దాంతో ఆయన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ లేట్గా సెట్స్పైకి వెళ్లింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వచ్చే ఏడాదికి వాయిదా వేశారని సమాచారం. భారీ చిత్రంతో... ‘యానిమల్’ సినిమాతో గత ఏడాది బ్లాక్బస్టర్ అందుకున్నారు రణ్బీర్ కపూర్. అయితే గత ఏడాది ‘తు ఝూతీ మై మక్కర్’ చిత్రంతో ఓ ఫ్లాప్ కూడా అందుకున్నారు ఈ హీరో. ఇక ఈ ఏడాది థియేటర్స్లో కనిపించకుండా బ్రేక్ తీసుకున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘రామాయణ్’ సినిమాతో ప్రస్తుతం రణ్బీర్ కపూర్ బిజీగా ఉన్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, యశ్ వంటి స్టార్స్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఇది భారీ చిత్రం కాబట్టి షూట్కి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో ఈ ఏడాది తెరపై కనిపించలేదు రణ్బీర్. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోందని, తొలి భాగం 2025లో రిలీజ్ అవుతుందని సమాచారం. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్బీర్ హీరోగా నటిస్తున్న ‘లవ్ అండ్ వార్’ 2026లో విడుదల కానుంది. పర్సనల్ టైమ్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది రిలీజ్ కావడం లేదు. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం గత ఏడాది జూలైలో రిలీజ్ అయింది. అయితే వెంటనే మరో మూవీకి సైన్ చేయలేదు రణ్వీర్. ఫిబ్రవరి చివర్లో తాము తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్ వెల్లడించారు. సో... పర్సనల్ లైఫ్కు రణ్వీర్ టైమ్ కేటాయించారు. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. కానీ ఈ చిత్రం 2025లోనే రిలీజ్ అవుతుంది. కాగా అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సింగమ్ ఎగైన్’ సినిమాలో మాత్రం రణ్వీర్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది. ఇక దీపికా పదుకోన్ ఈ ఏడాది సెప్టెంబరులో ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే,. బిజీ బిజీ... కానీ! ‘గదర్ 2’తో బ్లాక్బస్టర్ హిట్ సాధించి, మళ్లీ ఫామ్లోకి వచ్చారు సీనియర్ హీరో సన్నీ డియోల్. 2023లో రిలీజైన ‘గదర్ 2’ సక్సెస్తో సన్నీ డియోల్కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ‘బోర్డర్ 2, లాహోర్ 1947, రామాయణ్’ (కీలక పాత్రధారి)లతో పాటు తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీ. ఈ సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే ఆరంభమైంది. కానీ ఈ ఏడాది సన్నీ థియేటర్స్లోకి వచ్చే చాన్సెస్ కనిపించడం లేదు. అయితే 2025లో ఆయన మూడు చిత్రాలతో కనిపించే అవకాశం ఉంది. -
అలియా-రణబీర్ ఇష్టపడే వంటకాలివే..!
బాలీవుడ్ బ్యూటిఫుల్ స్టార్ జంట అలియా రణబీర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట ఏ ఈవెంట్లో సందడి చేసిన ఫోటోగ్రాఫర్లకు తమ కెమెరాలని క్లిక్మనిపించకుండా ఉండరు. అలాగే ఆ వేడుకలు కూడా మరింత అందంగా కోలహాలంగా మారిపోతుంది. అంతలా ఈ జంట వేడుకల్లో ఎంజాయ్ చేస్తూ..కొత్త సందడిని తీసుకొస్తారు. వీరిద్దరూ తమ గ్లామర్, అభినయంతో వేలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాగే డైట్ పరంగా ఇద్దరు చాలా స్ట్రిట్. ఇరువురు ఫిట్నెస్కి సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు. అయితే ఈ అందమైన జంట ఇష్టంగా వంటకాల గురించి వారి వ్యక్తిగత చెఫ్ ఇన్స్టా వేదికగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీ జంట వ్యక్తిగత చెప్ సూర్యన్ష్ సింగ్ కున్వర్ అలియా-రణబీర్లు ఇష్టమైన వంటకాల గురించి ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. వీడియోలో వాళ్లు కూడా మనలాగానే దోస, ఆమ్లెట్, గుడ్డు అప్పం, హమ్ముస్, మీట్ బాల్స్, స్పెఘెట్టి, ఫ్రైడ్ రైస్, సిన్నమోన్ టోస్ట్, కొబ్బరి చట్నీ, తదితరాలనే ఇష్టంగా తింటారని వివరిస్తున్నట్లు కనిపిస్తుంది. వీరిద్దరు రుచికరంగా ఉండే పోషకాహారానికి ప్రాధ్యాన్యత ఇస్తారని తెలిపాడు. అంతేగాదు అలియా, రణబీర్ గ్రిల్డ్ సాల్మన్, డ్రైఫూట్స్తో నింపిన సూప్, బ్లాక్ బీన్ సాస్ తోకూడిన టోపు, టోర్టెల్లిని పాస్తా, కలమారి, కుడుములు, ఖీర్, కస్టర్డ్ వంటి ఆకర్ణణీయమెన డెజర్ట్ ఇష్టంగా తింటారని చెప్పారు. అంతేగాదు గత కొద్ది రోజులగా తాను వాళ్ల కోసం అద్భుతమైన వంటకాలను అందిస్తున్నట్లు తెలిపాడు. ఈ అందమైన జంట కోసం వడంటం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ వంటకాలను ఆహారప్రియులు కూడా తమ మెనూలో చేర్చుకోవచ్చనేలా ఉన్నాయి ఆ రెసిపీలు. కాగా, అలియా భట్ రణబీర్ కపూర్లు తమ డైట్ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటారు. షూటింగ్, సినిమాల మధ్య కూడా, రణబీర్ తన డైట్ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు. View this post on Instagram A post shared by Suryansh Singh Kanwar (@suryansh.singh.kanwar) (చదవండి: స్ట్రీట్ ఫుడ్ విక్రేతగా పీహెచ్డీ విద్యార్థి..నెటిజన్లు ఫిదా!) -
అక్టోబరులో ఆరంభం
అక్టోబరులో లవ్ అండ్ వార్ అంటున్నారట రణ్బీర్ కపూర్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం ‘లవ్ అండ్ వార్’. రణ్బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ఈ సినిమాలో లీడ్ రోల్స్లో నటించనున్నారు. ఈ ఏడాది జనవరిలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కానీ చిత్రీకరణ ప్రారంభం కాలేదు. అయితే ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ను సెప్టెంబరు లోపు పూర్తి చేసి, అక్టోబరు మొదటి వారంలో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట భన్సాలీ.ముందుగా అక్టోబరులో రణ్బీర్ కపూర్ సోలో సీన్స్తో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం అవుతుందట. ఆ తర్వాత రణ్బీర్ – విక్కీ కౌశల్ల కాంబినేషన్లోని ఫ్రెండ్షిప్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని, ఆ తర్వాత రణ్బీర్ కపూర్ – ఆలియా – విక్కీ కౌశల్ కాంబినేషన్లోని సన్నివేశాలను షూట్ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్ సమాచారం. ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా ‘లవ్ అండ్ వార్’ని తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా 2025 క్రిస్మస్కి రిలీజ్ కానుంది. -
ఆలియా పెద్ద గొంతుతో అరిచేది.. పెళ్లయ్యాక..: రణ్బీర్
ఆలియా భట్ది పెద్ద గొంతు.. పెళ్లికి ముందు వరకు ఎలా ఉన్నా తర్వాత మాత్రం తన కోసం టోన్ మార్చుకుంది అంటున్నాడు స్టార్ హీరో రణ్బీర్ కపూర్. తాజాగా రణ్బీర్.. యూట్యూబర్ నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్కాస్ట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. 'మా నాన్న గొంతుకు నేను భయపడేవాడిని. చిన్నప్పుడు ఆయన గట్టిగా మాట్లాడితే వణికిపోయేవాడిని. నా భార్య ఆలియా స్వరం కూడా పెద్దదే! నేను కూడా అలా చేయాల్సిందికానీ నాకోసం దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించింది. 30 ఏళ్లుగా ఉన్న టోన్ను మార్చుకోవాలంటే అంత ఈజీ కాదు. రాహా(కూతురు) కిందపడగానే వెంటనే రియాక్ట్ అయిపోతుంది. కానీ నా మనసు ఎక్కడా బాధపడకుండా చెప్తోంది. ఎల్లప్పుడూ నన్ను ప్రశాంతంగా ఉంచాలనే ట్రై చేస్తోంది. నేను కూడా ఆమెను ప్రశాంతంగా ఉంచితే బాగుండేది. కానీ అందుకోసం పెద్దగా కృషి చేయడం లేదనుకుంటా!తనతో కలిసుండటం ఇష్టంఆలియా నా జీవితంలో చాలా స్పెషల్. తనపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఎప్పుడూ నన్ను నవ్విస్తూ ఉంటుంది. తనతో కలిసి హాలీడేకు వెళ్లడమన్నా, కలిసి ఇంటికి వెళ్లడమన్నా ఇష్టం. ఆమె చాలా తెలివైనది. పని పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తుంది' అని తెలిపాడు. కాగా రణ్బీర్- ఆలియా.. కొంతకాలం డేటింగ్ తర్వాత 2022లో ముంబైలో పెళ్లి చేసుకున్నారు. గతేడాది వీరికి రాహా అనే కూతురు పుట్టింది. వీళ్లిద్దరూ ప్రస్తుతం లవ్ అండ్ వార్ అనే సినిమాలో నటిస్తున్నారు.చదవండి: చిన్న పిల్లలతో లిప్ కిస్లా.. యాంకర్పై చిన్మయి ఫైర్! -
మోసగాడిగా ముద్ర.. ఇప్పటికీ అదే అంటున్నారు: స్టార్ హీరో
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, బ్రేకప్లు సర్వసాధారణం. సెలబ్రిటీలు వాటిని మర్చిపోయినా జనాలు మాత్రం గుర్తుచేస్తూనే ఉంటారు. అలా తనపై చీటర్ (మోసగాడు) అని ముద్ర వేశాడంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్. తాజాగా యూట్యూబర్ నిఖిల్ కామత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్బీర్ మాట్లాడుతూ.. నేను గతంలో ఇద్దరు సక్సెస్ఫుల్ హీరోయిన్లతో డేటింగ్ చేశాను.మోసగాడుఅప్పటినుంచి వారి మాజీ ప్రియుడు అని నన్ను సంభోదించేవారు. కాసినోవా అని మోసగాడు అని ఇలా ఏవేవో పేర్లు అంటగట్టారు. నా జీవితంలో చాలాభాగం చీటర్ అన్న పేరుతోనే బతికేశాను. ఇప్పటికీ కొందరు నన్ను చీటర్ అని అంటూనే ఉంటారు. నా కూతురు రాహా విషయానికి వస్తే తనంటే నాకు ప్రాణం. రాహాను చూస్తుంటే నా హృదయం తీసి నా చేతులో పెట్టినట్లు అనిపిస్తుంది. మా నాన్న (దివంగత నటుడు రిషి కపూర్)కు కోపం ఎక్కువ. కానీ చాలా మంచివాడు. ఏది చెప్పినా తల దించుకుని సరే అనేవాడిని. ఎన్నడూ నో చెప్పలేదు.థెరపీనా విషయానికి వస్తే గతంలో నేను థెరపీ చేయించుకున్నాను. నా గురించి నేను ఎక్కువగా ఓపెన్ కాను. మనసు విప్పి మాట్లాడేందుకు థెరపీ ఉపయోగపడుతుందని భావించాను అని చెప్పుకొచ్చాడు. కాగా యానిమల్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన రణ్బీర్.. ప్రస్తుతం నితేశ్ తివారి దర్శకత్వంలో రామాయణం సినిమా చేస్తున్నాడు. అలాగే సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో లవ్ అండ్ వార్ మూవీలోనూ నటించనున్నాడు.చదవండి: మూడేళ్లుగా సింగిల్గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు -
భర్తతో హీరోయిన్ ఆలియా భట్ క్యూట్ (ఫొటోలు)
-
చిన్న వయసులోనే స్టార్డమ్, నేషనల్ అవార్డ్.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఈమె స్టార్ హీరోయిన్. టీనేజీలోనే హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్ మూవీ హిట్. ఆ తర్వాత అద్భుతమైన నటనతో చాలా మూవీస్తో హిట్స్ కొట్టింది. తనకంటూ సెపరేట్ బ్రాండ్ సృష్టించుకుంది. పాన్ ఇండియా లెవల్లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న బూరె బుగ్గల చిన్నారి పేరు ఆలియా భట్. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో సీతగా నటించి, దక్షిణాదిలోనూ అభిమానుల్ని సొంతం చేసుకుంది. తండ్రి మహేశ్ భట్ ప్రముఖ దర్శకుడు. తల్లిది బ్రిటన్. ఈమె నటి కూడా. ఫ్యామిలీది మూవీ బ్యాక్ గ్రౌండే కాబట్టి 19 ఏళ్లకే 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.(ఇదీ చదవండి: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటిస్తూ హీరోయిన్గా అద్భుతమైన గుర్తింపు సంపాదించింది. 'గంగూబాయ్' సినిమాలో యాక్టింగ్ దెబ్బకు ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకుంది. ఇక ఆస్కార్ తెచ్చిపెట్టిన 'ఆర్ఆర్ఆర్'లోనూ చిన్న పాత్రలో కనిపించింది. ఇకపోతే ఫాదర్స్ డే సందర్భంగా తండ్రితో తాను చిన్నప్పుడు ఉన్న ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసి విషెస్ చెప్పింది. ఇందులో ఆలియాని చూసి ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఆలియా ఫ్యామిలీ విషయానికొస్తే.. హీరోయిన్గా ఫామ్లో ఉండగానే హీరో రణ్బీర్ కపూర్ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు రహ అనే కూతురు కూడా ఉంది. ఇలా ఓ వైపు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో) -
ఖరీదైన కారు కొన్న స్టార్ కపుల్.. ధర ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ కపుల్స్లో రణ్బీర్ కపూర్, అలియా భట్ జంట ఒకరు. తాజాగా ఈ జంట అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్కు హాజరయ్యారు. ఇటలీలో జరిగిన క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొని తాజాగా ముంబయికి తిరిగివచ్చారు. తమ ముద్దుల కూతురు రాహా కపూర్తో కలిసి ఇండియా చేరుకున్నారు.అయితే తాజాగా ఈ జంట కొత్త కారు కొన్నట్లు తెలుస్తోంది. ఇటలీ నుంచి ముంబయికి వచ్చిన ఈ జంట తమ ఖరీదైన లగ్జరీ కారులో ఇంటికి చేరుకున్నారు. దీంతో అందరి దృష్టి కారుమీదే పడింది. లెక్సస్ ఎల్ఎమ్ బ్రాండ్కు చెందిన ఈ కారు విలువ దాదాపు రూ.2 నుంచి రూ.2.5 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కాగా.. ఇటీవల ఏప్రిల్ నెలలో బెంటెలీ బ్రాండ్ కారును రణ్బీర్ కొనుగోలు చేశాడు. వీటితో పాటు రణ్బీర్ గ్యారేజీలో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆడి, మెర్సిడెస్ కార్లు ఉన్నాయి. అలియాకు సైతం రేంజ్ రోవర్, ఆడి ఏ6, బీఎండబ్ల్యూ, ఆడి క్యూ5, ఆడి క్యూ7 కార్లు కలిగి ఉన్నారు. దీంతో తాజాగా మరో లగ్జరీ కారు వచ్చి చేరింది. కాగా.. గతేడాది యానిమల్ మూవీతో రణ్బీర్ కపూర్ బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అతనికి జోడీగా కనిపించింది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
గాడ్ పవర్?
‘రామాయణ్’ టైటిల్ ‘గాడ్ పవర్’గా మారిందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి రాముడు, సీత పాత్రల్లో నితీష్ తివారీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి ఇప్పటివరకూ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రామాయణం ఆధారంగా ‘రామాయణ్’ టైటిల్తో తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చాయి.అలాగే సీతారాముల గెటప్స్లో సాయి పల్లవి, రణ్బీర్ కపూర్ ఉన్న ఫొటోలు లీక్ అయి, వైరల్గా మారాయి. ముంబైలో చడీ చప్పుడూ లేకుండా కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం షూటింగ్ ఆరంభించారు. ఆ లొకేషన్లోని రణ్బీర్, సాయి పల్లవి ఫొటోలే బయటికొచ్చాయి. కాగా.. ఈ చిత్రానికి ‘రామాయణ్’ టైటిల్కి బదులు ‘గాడ్ పవర్’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని యూనిట్ అనుకుంటోందనే వార్త ప్రచారంలో ఉంది. -
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
‘‘రామాయణ్’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించాలనే ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు? ఆ సినిమాలో నటించమని ఇప్పటివరకూ ఎవరూ నన్ను సంప్రదించలేదు. ఆ అవకాశం వస్తే మాత్రం నటించేందుకు నేను సిద్ధం’’ అన్నారు బాలీవుడ్ బ్యూటీ లారా దత్తా. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో ‘రామాయణ్’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. కాగా ఈ చిత్రంలోని నటీనటులపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ, రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారని లీక్ అయిన ఒక ఫొటో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కైకేయి పాత్రలో లారా దత్తా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించారు లారా దత్తా. ‘‘రామాయణ్’లో నేను కైకేయి పాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవి విన్నప్పుడు సంతోషంగానే ఉంది. ఎందుకంటే.. అంత గొప్ప సినిమాలో నటించాలని ఎవరు కోరుకోరు? ఒకవేళ ఈ మూవీలో నాకు అవకాశం వస్తే కైకేయి పాత్రే కాదు.. శూర్పణఖ, మండోదరి లాంటి క్యారెక్టర్స్ చేయడానికి కూడా నేను రెడీ. ఈ మూడు పాత్రల్లో దేనికైనా నేను చక్కగా సరిపోతాను’’ అంటూ తన మనసులోని మాటని బయటపెట్టారు లారా దత్తా. మరి... ఈ మూడు ్రపాతల్లో ఏదో ఒకటి చేసే చాన్స్ లారా దత్తాకి వస్తుందా? అనేది చూడాలి. -
సీతగా సాయిపల్లవి.. ఎంత ముద్దుగా ఉందో? ఫొటోలు వైరల్
పాన్ ఇండియా భారీ బడ్జెట్ 'రామాయణ్' షూటింగ్ మొదలైపోయింది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టేసినట్లు ఉన్నారు. సాయిపల్లవి సీతగా, రణ్బీర్ కపూర్ రాముడి గెటప్లో ఉన్న పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి నెటిజన్స్ తెగ మురిసిపోతున్నారు. మరీ ముఖ్యంగా సాయిపల్లవి అందానికి ఫిదా అయిపోతున్నారు.ప్రతిష్టాత్మక రామాయణం ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపుగా ఇవన్నీ కూడా ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. గతేడాది రిలీజైన 'ఆదిపురుష్' మాత్రం ఘోరమైన ట్రోలింగ్కి గురైంది. తాజాగా బాలీవుడ్లో రామాయాణాన్ని సినిమాగా తీస్తున్నారు. గతంలో న్యూస్ వచ్చినప్పటికీ దీన్ని ఎవరూ నిర్ధారించలేదు.శ్రీరామ నవమికి అయినా సరే అధికారిక ప్రకటన వస్తుందనుకున్నారు. కానీ అలాంటిదేం రాలేదు. కానీ ఇప్పుడు సెట్స్ నుంచి రాముడు, సీత పాత్రలకు సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఇవి సర్క్యూలేట్ అవుతున్నాయి. లుక్స్ బాగానే ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఇందులో రావణుడిగా 'కేజీఎఫ్' ఫేమ్ యష్ కనిపించబోతున్నాడు. -
Deepika Padukone: ఫైనల్లీ ఆ టాటూని తొలగించిన దీపికా పదుకొణె!
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్లో దీపికొ పదుకొణె- రణ్వీర్ సింగ్ జంట ఒకటి. రామ్ లీలా సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట.. 2018 నవంబర్ 14న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. త్వరలోనే ఈ బ్యూటీ ఓ బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భం దాల్చిందనే విషయాన్ని రణ్వీర్ వెల్లడించాడు. తాజాగా ఈ భామ ఇన్స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో చర్చనీయాంశంగా మారింది. శనివారం దీపికా తన ఇన్స్టా ఖాతాలో ఓ ఫోటోని షేర్ చేసింది.అందులో ఆమె మెడ కనిపించేలా వెనుక వైపు తిరిగి ఉంది. గతంలో ఆమె వీపు భాగంపై ఓ టాటూ ఉండేది. ఇప్పుడది కనిపించలేదు. ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో రణ్వీర్ సింగ్తో పెళ్లి కంటే ముందు దీపికా పదుకొణె మరో స్టార్ హీరో రణ్బీర్ కపూర్తో ప్రేమాయణం కొనసాగించింది. ఈ ఇద్దరి ప్రేమ విషయం బాలీవుడ్ అంతా తెలుసు. పెళ్లి కూడా చేసుకుంటారని అంతా భావించారు. కానీ కారణం ఏంటో తెలియదు కానీ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రణ్బీర్తో స్నేహం ఏర్పడడం..అది కాస్త ప్రేమగా మారడంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే రణ్బీర్తో ప్రేమలో ఉన్న సమయంలో దీపికా తన వీపుపై RK(రణ్బీర్ కపూర్ షార్ట్ కట్) అని టాటూ వేయించుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆ టాటూని చెరిపేయలేదు. దీంతో అప్పట్లో ఈ టాటూపై బాలీవుడ్లో పెద్ద చర్చే జరిగింది. కానీ దీపికా మాత్రం ఆ టాటూపై స్పందించలేదు. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలో ఆ టాటూ కనిపించకపోవడంతో.. ప్రెగ్నెంట్ అయిన తర్వాత దీపికా ఆ టాటూని తొలగించిందనే నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన కల్కీ 2898 ఏడీ చిత్రంలో నటిస్తోంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
పెళ్లిలో కోట్లు ఇచ్చావట, నిజమేనా? హీరో ఆన్సరిదే!
బాలీవుడ్ కామెడీ కింగ్ కపిల్ శర్మ 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో'తో వెబ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఈ కామెడీ షో తొలి ఎపిసోడ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. ఫస్ట్ ఎపిసోడ్లో యానిమల్ హీరో రణ్బీర్ కపూర్ గెస్టుగా వచ్చాడు. అతడి వెంట నీతూ కపూర్, రిద్ధిమా కపూర్ కూడా ఉన్నారు. రూ.12 కోట్లు? రణ్బీర్కు ఇక్కడ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 'నీ పెళ్లిలో ఆలియా అక్కాచెల్లెళ్లకు, స్నేహితులకు డబ్బులిచ్చావట! వాళ్లు నీ చెప్పులు దాచిపెట్టి రూ.12 కోట్ల దాకా డిమాండ్ చేశారని విన్నాం. నువ్వు బేరాలాడి దాన్ని లక్షల్లోకి తీసుకువచ్చావట, నిజమేనా?' అని కపిల్ అడిగాడు. దీనికి ఫక్కున నవ్వేసిన హీరో.. 'మేము ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాం. ఒకవేళ వాళ్లు నా షూ దాచిపెట్టాలన్నా అవి ఇంట్లోనే కదా ఉంటాయి' అని చెప్పుకొచ్చాడు. దీంతో కపిల్ తన పెళ్లి సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. నా భార్య తరపు వాళ్లయితే ఏకంగా రూ.11 లక్షలడిగారని గుర్తు చేసుకున్నాడు. మీ చెల్లితో పాటు నా షూలు కూడా మీ దగ్గరే పెట్టుకోండి. అయినా నాకోసం క్షణం ఆలోచించకుండా వచ్చేంత ప్రేమ ఆమెకుంది. షూలంటారా? కావాలనుకుంటే కొత్తవి కొనుక్కుంటాను అని సరదాగా చెప్పానని పేర్కొన్నాడు. తర్వాత అందరూ అనేక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో రణ్బీర్.. తన తల్లి నగలను.. గతంలో ప్రేమించిన ప్రియురాళ్లకు బహుమతిగా ఇచ్చినట్లు అంగీకరించాడు. కాగా రణ్బీర్- ఆలియా 2022 ఏప్రిల్లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది నవంబర్లో కూతురు రాహాకు జన్మనిచ్చారు. చదవండి: పెరిగిన 'ఫ్యామిలీ స్టార్' బడ్జెట్.. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎంతంటే? -
విల్లు ఎక్కు పెట్టి..!
రెండు రోజుల క్రితం రణ్బీర్ కపూర్ తలకిందులుగా నిలబడిన ఫొటో వైరల్ అయ్యింది. ఈ శీర్షాసనం ఎందుకూ అంటే.. శిక్షణలో భాగంగా. రామాయణం ఆధారంగా నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందనున్న ‘రామాయణ్’ చిత్రం కోసమే రణ్బీర్ వర్కవుట్స్ మొదలుపెట్టారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్ని ఆరంభించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా నియమించిన ట్రైనర్ ఆధ్వర్యంలో రణ్బీర్ కపూర్ మేకోవర్ అవుతున్నారు. ఒకవైపు ఫిజికల్ మేకోవర్ మరోవైపు యుద్ధ విద్యలు నేర్చుకుంటూ బిజీగా ఉన్నారు రణ్బీర్. మొన్న శీర్షాసనం ఫొటో వైరల్ కాగా తాజాగా విలు విద్య నేర్చుకోవడానికి రణ్బీర్ సిద్ధమవుతున్న ఫొటోలు బయటికొచ్చాయి. మేకోవర్ ట్రైనర్ వేరు... విలు విద్య నేర్పిస్తున్న ట్రైనర్ వేరు. రాముడంటే యుద్ధ విద్యల్లో సూపర్ కాబట్టి ఆ పాత్రకు న్యాయం చేయడానికి ఏమేం చేయాలో అన్నీ చేయడానికి రణ్బీర్ రెడీ అయిపోయారు. ఇక ఈ చిత్రంలో సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడిగా యశ్, కైకేయీగా లారా దత్తా నటిస్తారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. -
నిరాశే మిగిల్చనున్న రామాయణం మూవీ డైరెక్టర్
-
ఏప్రిల్ 17న 'రామాయణ' ప్రకటన.. అదే రోజు ఎందుకంటే
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా హిందీలో 'రామాయణ' అనే సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, రావణుడి పాత్రలో యశ్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇతిహాస గాథను తెరపై అద్భుతంగా చూపించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది వేసవిలో ప్రారంభించాలనుకుంటున్నారట. అంతేకాకుండా ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించిన విషయాలను శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారని బాలీవుడ్ సమాచారం. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్బీర్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారట. ఇక ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, మధు మంతెన, అల్లు అరవింద్లు భారీ బడ్జెట్తో నిర్మిస్తారనే ప్రచారం సాగుతోంది. -
స్టార్ హీరో మూవీ.. నన్ను తీసేశారు: ప్రముఖ హీరోయిన్
'బచ్నా యే హసీనో'.. 2008లో రిలీజైన బాలీవుడ్లో మూవీ.. ఇందులో రణ్బీర్ కపూర్ హీరోగా నటించాడు. కథలో భాగంగా అతడు ముగ్గురు హీరోయిన్లతో ప్రేమలో పడతాడు. అయితే అతడు నాలుగో హీరోయిన్తో కూడా ప్రేమపాఠాలు నడుపుతాడని కథలో రాసుకున్నారట! కానీ ఫైనల్ స్క్రిప్ట్లో మాత్రం ఆ పాత్రనే లేపేశారంటోంది స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. ఆ నాలుగో హీరోయిన్ కోసం తనను సంప్రదించారని చెప్తోంది. నా రోల్ తీసేశారు తాజాగా కత్రినా కైఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'బచ్నా యే హసీనో సినిమాలో నన్ను నాలుగో అమ్మాయిగా అనుకున్నారు. కానీ చివరకు ఆ పాత్రను తీసేశారు. ఇకపోతే జీరో మూవీలో అనుష్క పాత్రను చేయాలనుకున్నాను. అదే సమయంలో బబిత ఆఫర్ రావడంతో దాన్ని చేశాను' అని చెప్పుకొచ్చింది. జీరో బాక్సాఫీస్ దగ్గర చతికిలపడగా బబిత హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా టైంలోనే డేటింగ్ కాగా బచ్నా యే హసీనో మూవీకి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా సిద్దార్థ్ ఆనంద్ నిర్మించారు. ఇందులో మనీషా లంబ, బిపాషా బసు, దీపిక పదుకోణ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో రణ్బీర్-దీపికాలు లవ్లో పడ్డారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కత్రినాతోనూ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. చివరకు ఆలియా భట్ను పెళ్లాడాడు. కత్రినా సినిమాల విషయానికి వస్తే ఆమె చివరగా మేరీ క్రిస్మస్ సినిమాలో నటించింది. ఈ మూవీ జనవరి 12న రిలీజైంది. చదవండి: హైదరాబాద్ టు ముంబై... బాలీవుడ్లో ఫేమస్ విలన్.. హీరోల వల్ల కెరీర్ నాశనం! -
శరవేగంగా రణబీర్ కపూర్ రామాయణం..
-
శూర్పణఖ?
రామాయణం ఆధారంగా హిందీలో దర్శకుడు నితీష్ తివారి ఓ భారీ బడ్జెట్ ట్రయాలజీ ఫిల్మ్ను తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా జరుగు తున్న ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయి. దీంతో నితీష్ తివారి ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై దృష్టి సారించారు. ఈ సినిమాలోని రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, హనుమంతునిగా బాబీ డియోల్, విభూషణుడిగా విజయ్ సేతుపతి, రావణుడిగా యశ్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా శూర్పణఖ పాత్రలో రకుల్ప్రీత్ సింగ్ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. రకుల్కు ఆల్రెడీ నితీష్ స్టోరీ చెప్పారని, లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని టాక్. కాగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన ఈ వేసవిలో రానుందని, 2025 చివర్లో తొలి భాగం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ టాక్. మరోవైపు ఈ నెలలో రకుల్ప్రీత్ సింగ్ వివాహం జాకీ భగ్నానీతో జరగనుంది. -
రామాయణంలో రకుల్.. ఆ పాత్రకు సెట్ అయ్యేనా?
రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు టాలీవుడ్లో ఈ పేరు మారుమ్రోగింది. వరుస సినిమాల్లో నటిస్తూ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మొదలు రవితేజ లాంటి స్టార్ హీరోల వరకు అందరితో రకుల్ నటించింది. ఇక్కడ వచ్చిన ఫేమ్తో బాలీవుడ్కు చక్కెసింది. అక్కడ అనుకున్న స్థాయిలో క్లిక్ కాలేదు. ఇటీవల అయితే ఈ బ్యూటీకి అటు బాలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ ఒక్క సినిమా లేదు. తాజాగా తమిళ్లో అలయాన్ సినిమాతో ఓ మోస్తరు కమర్షియల్ హిట్ అందుకుంది. అయినా కూడా ఈ బ్యూటి చేతికి పెద్ద ప్రాజెక్టులు రాలేదు. దీంతో వెస్ సిరీస్ల మీదనే ఎక్కువ దృష్టిపెట్టింది. ఇక వెండితెరకు రకుల్ దూరమైనట్లే అనుకుంటున్న సమయంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో రకుల్ నటించబోతుందని ఆ వార్త సారాంశం. (చదవండి: పెళ్లయి ఏడాది కూడా కాలేదు, అంతలోనే నటి విడాకులు!) బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారి రామాయణాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రొడ్యూసర్లతో కలిసి నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కాస్టింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. ఇందులో రాముడిగా రణ్బీర్ కపూర్ నటించబోతున్నారు. సీత పాత్రలో సాయి పల్లవి లేదా జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. హనుమంతుడిగా నటించేందుకు సన్నీ డియోల్ అంగీకారం తెలిపాడు. తాజాగా మరో కీలకమైన పాత్ర కోసం మేకర్స్ రకుల్ని సంప్రదించారట. రామాయణంలో కీలకమైన శూర్పణఖ పాత్రను రకుల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం మేకర్స్ ఆమెను సంప్రదించగా..వెంటనే ఓకే చెప్పిందట. త్వరలోనే లుక్ టెస్ట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రావణుడిగా యష్, విభీషణుడిగా విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
రాముడి కోసం శిక్షణ
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, రావణుడి పాత్రలో యశ్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది వేసవిలో ప్రారంభించాలనుకుంటున్నారట. ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారని బాలీవుడ్ సమాచారం. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్బీర్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారట. ఇక ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, మధు మంతెన, అల్లు అరవింద్లు భారీ బడ్జెట్తో నిర్మిస్తారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు హిందీలో ‘లవ్ అండ్ వార్’, ‘బ్రహ్మాస్త్రం’, ‘యానిమల్’ ఫ్రాంచైజీలు కమిటయ్యారు రణ్బీర్ కపూర్. -
'యానిమల్'లో ఆ సీన్స్.. నా భార్యకు నచ్చలేదు: సందీప్ రెడ్డి
'యానిమల్' సినిమా రిలీజై రెండు నెలలకు పైనే అయిపోయింది. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం ఇప్పటికీ ఏదో ఓ ఇంటర్వ్యూ ఇస్తూనే ఉన్నాడు. రీసెంట్గా తనపై విమర్శలు చేసిన హీరో ఆమిర్ భార్య కిరణ్ రావ్, దిగ్గజ రైటర్ జావేద్ అక్తర్కి ఇచ్చిపడేశాడు. అది అలా ఉంచితే తాజాగా 'యానిమల్' చూసిన తర్వాత తన భార్య, కొడుకు ఎలా రియాక్ట్ అయ్యారనేది బయటపెట్టాడు. (ఇదీ చదవండి: టీవీ షోలో కుమారి ఆంటీ.. 'బిగ్బాస్ 7' బ్యాచ్తో కలిసి స్కిట్!) సందీప్ రెడ్డిని ఈ మధ్య ఇంటర్వ్యూ చేసిన సిద్ధార్థ్ కన్నన్.. ఈ సినిమా మీ ఏడేళ్ల కొడుక్కి చూపించారా? అతడి రియాక్షన్ ఏంటి? అని అడిగాడు. దీనికి సమాధానమిచ్చిన సందీప్.. 'చూపించకూడని కొన్ని సీన్స్ ఎడిట్ చేసి 'యానిమల్' మూవీని ఓ హార్ట్ డిస్క్లో ఉంచా. ఏ రేటింగ్స్ సన్నివేశాలు లేని వెర్షన్ని గోవాలో న్యూ ఇయర్ సందర్భంగా నా కొడుకు అర్జున్ రెడ్డికి చూపించాను. అది వాడికి బాగా నచ్చింది. అండర్వేర్ యాక్షన్ సీన్స్ చాలా కామెడీగా ఉన్నాయని చెప్పాడు' 'నా భార్య మనీషా మాత్రం ఈ సినిమాలోని రక్తపాతం సీన్స్ విషయంలో కాస్త డిసప్పాయింట్ అయింది. స్త్రీ పాత్రలని చూపించిన విధానం గురించి మాత్రం పెద్దగా ఏం చెప్పలేదు. అయితే నేను తీసే చిత్రాలకు సరైన ఫీడ్ బ్యాక్ నా సోదరుడు ప్రణయ్ రెడ్డి నుంచి వస్తుంది' అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కనబెడితే సందీప్.. ప్రభాస్తో 'స్పిరిట్' తీస్తాడు. దీని తర్వాత 'యానిమల్' సీక్వెల్, అనంతరం అల్లు అర్జున్తో మూవీ ఉంది. (ఇదీ చదవండి: మాజీ భర్త గురించి ప్రశ్న.. క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్) -
Filmfare Awards 2024: దుమ్ము రేపిన బాలీవుడ్ కపుల్, స్వీట్ కిస్, పిక్స్ వైరల్
ప్రతిష్టాత్మక 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోబాలీవుడ్ జంట రణబీర్ కపూర్-అలియాభట్ దుమ్ము రేపారు. అలియా, రణబీర్ ఇద్దరూ ఉత్తమ నటీ, ఉత్తన నటుడు అవార్డులను గెల్చుకుని రీల్ లైఫ్లో కూడా బెస్ట్ కపుల్గా నిలిచారు. రణబీర్ చిత్రం యానిమల్లోని జమాల్ కుడు అనే పాటకు ఇద్దరూ స్టెప్స్ వేయడం అక్కడున్న వారందరిన్నీ ఉత్సాహపరిచింది. ఈ డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు ఆఖరులో రణ్బీర్ అలియాను ముద్దుపెట్టుకోవడం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అలియా భట్ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మూవీకిగాను ఉత్తమ నటి అవార్డును అందుకోగా, ఆమె భర్త రణబీర్ కపూర్ యానిమల్లో తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' మూవీ ఏకంగా ఆరు అవార్డులను కైవసం చేసుకుంది. అంతేకాదు ఓటీటీ రికార్డుల మోత మోగించిన '12 త్ ఫెయిల్' ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా దర్శకుడు విధు వినోద్ చోప్రా ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ వేదికగా అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలో 2023 లో విడుదలైన చిత్రాలకు సంబంధించి అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
భార్యతో స్టార్ హీరో డ్యాన్స్..
-
భార్యతో స్టార్ హీరో డ్యాన్స్.. తలపై గ్లాసు పెట్టుకుని..
బాలీవుడ్ పవర్ఫుల్ కపుల్ రణ్బీర్ కపూర్- ఆలియా భట్ అరుదైన ఘనత సాధించారు. 69వ ఫిలింఫేర్ అవార్డుల్లో ఇద్దరూ ఉత్తమ హీరో, ఉత్తమ హీరోయిన్లుగా పురస్కారాలు అందుకున్నారు. దీంతో సంతోషంలో మునిగి తేలుతోందీ జంట. గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన అవార్డుల వేడుకలో ఈ దంపతులు డ్యాన్స్తో కనువిందు చేశారు. అంతేనా.. యానిమల్ సినిమాలో హైలెట్ అయిన 'జమల్ కుదు' హుక్ స్టెప్ను రీక్రియేట్ చేశాడు రణ్బీర్. స్టేడియం ముందు వరుసలో ఉన్న భార్య దగ్గరకు వచ్చి చిందులేశాడు. తలపై గ్లాసు పెట్టుకుని డ్యాన్స్ చేశాడు. దీంతో ఆలియా కూడా భర్తతో కలిసి పాదం కదిపింది. ఈ జోష్లో భార్యను ఆప్యాయంగా ముద్దాడాడు హీరో. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మీ జంటను చూస్తే ముచ్చటేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. కాగా 'యానిమల్' సినిమాకుగానూ రణ్బీర్ ఉత్తమ నటుడిగా, 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని' చిత్రానికిగానూ ఆలియా భట్ ఉత్త నటిగా అవార్డులు అందుకున్నారు. #RanbirKapoor comes in all guns blazing at the 69th #HyundaiFilmfareAwards2024 with #GujaratTourism.@GujaratTourism @HyundaiIndia @VimalElaichi pic.twitter.com/N3ULAMvTsw — Filmfare (@filmfare) January 28, 2024 ఫిలింఫేర్ అవార్డులు ఏయే సినిమాలకు వచ్చాయో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
భార్య రికార్డును బద్ధలు కొట్టిన రణ్బీర్.. పప్పా అని ఎన్నిసార్లు..
కొందరు మాటకు ముందోసారి, వెనుకోసారి పేరు పెట్టి పిలుస్తూనే ఉంటారు. సినిమాల్లో కూడా ఇది జరుగుతుంది. అందుకు బ్రహ్మాస్త్ర మూవీ నిదర్శనం. ఈ సినిమాలో రియల్ జంట రణ్బీర్ కపూర్-ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించారు. రణ్బీర్.. శివ అనే పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రంలో ఆలియా.. అతడిని పదేపదే శివ శివ అంటూ పిలిచేది. కొందరు దీన్ని లెక్కగట్టి సోషల్ మీడియాలో వదిలారు. సినిమా మొత్తమ్మీద రణ్బీర్ను 104 సార్లు శివ అని పిలిచిందని లెక్క తేల్చారు. ఇప్పుడీ రికార్డును బద్ధలు కొట్టాడు రణ్బీర్. అదెలాగంటే.. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో యానిమల్ రణ్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ యానిమల్. రూ.890 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా తండ్రీకొడుకుల అనుబంధం చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో అనిల్ కపూర్ తండ్రి పాత్రను పోషించాడు. పదేపదే పప్పా (నాన్న).. పప్పా అని తండ్రి గురించి ఆరాటపడతాడు హీరో. సినిమా మొత్తం ఈ తండ్రి ప్రేమ పొందాలన్న హీరో తపన గురించే కథ నడుస్తూ ఉంటుంది. పప్పా అన్న పదం ఎన్నిసార్లు వచ్చిందంటే? అలా ఈ సినిమాలో పప్పా అన్న పదం ఏకంగా 196 సార్లు వచ్చిందట. ఒక్క రణ్బీర్ నోటి నుంచే 150 కంటే ఎక్కువసార్లు పప్పా అన్న పదం వచ్చినట్లు తెలుస్తోంది. ఇది చూసిన జనాలు మొత్తానికి బ్రహ్మాస్త్ర రికార్డును యానిమల్ బద్ధలు కొట్టిందని కామెంట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా భార్య రికార్డును రణ్బీర్ బ్రేక్ చేశాడని ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు. #Animal papa count. pic.twitter.com/ltaaIJzK1l — LetsCinema (@letscinema) January 27, 2024 చదవండి: సాయిపల్లవి సోదరి వీడియో.. అక్కనే మించిపోయిందిగా! -
'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి
మూవీ లవర్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న 'యానిమల్' సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే కానుకగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే అందరూ మూవీన చూసేస్తున్నారు. అయితే గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో గట్టిగా వినిపించిన ఓ విషయం మాత్రం జరగలేదు. దీంతో అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) 'అర్జున్ రెడ్డి'తో సెన్సేషన్ సృష్టించిన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాత బాలీవుడ్లో వరస సినిమాలు తీశాడు. 'అర్జున్ రెడ్డి' రీమేక్గా 'కబీర్ సింగ్' తీసి బ్లాక్బస్టర్ కొట్టాడు. స్టార్ హీరో రణ్బీర్ కపూర్తో 'యానిమల్' మూవీ తీశాడు. ఫ్యామిలీ డ్రామాకు తోడు వయలెన్స్ బ్యాక్డ్రాప్ స్టోరీ కొంతమందికి తెగ నచ్చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. అలా డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని.. జనవరి 26న ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. అయితే సినిమా ప్రమోషన్స్ సందర్భంగా 'యానిమల్' గురించి ఎన్నో విషయాలు చెప్పిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల మూవీ కాకుండా మరిన్ని సీన్లు ఉన్నాయని చెప్పాడు. ఈ క్రమంలోనే ఓటీటీలోకి ఎడిట్ చేసిన సన్నివేశాలు కూడా జోడిస్తారని తెగ ఊరించారు. తీరా ఇప్పుడు చూస్తే థియేటర్లలో చూసిన సినిమా కట్నే ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. దీంతో అదనపు సన్నివేశాలు ఉంటాయని భావించిన వాళ్లు మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) -
చెంపదెబ్బ వల్ల చాలా గట్టిగా ఏడ్చేశాను: హీరోయిన్ రష్మిక
పాన్ ఇండియా రష్మిక కన్నీళ్లు పెట్టుకుంది. అవును మీరు సరిగానే విన్నారు. ఓ చెంపదెబ్బ వల్లే ఇదంతా జరిగింది. అప్పుడేం జరిగిందనే విషయాన్ని స్వయంగా ఈ బ్యూటీనే బయటపెట్టింది. ఈ సంఘటన జరిగిన సమయంలో తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయానని.. ఏడుస్తూ అరిచేశానని చెప్పుకొచ్చింది. ఇంతకీ అసలేం జరిగింది? కన్నడ బ్యూటీ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. కొన్నాళ్ల క్రితం 'యానిమల్' మూవీలో నటించిన రష్మిక.. అద్భుతమైన సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. అలానే ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర సంగతుల్ని బయటపెట్టింది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 21 సినిమాలు) యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో రష్మిక, రణ్ విజయ్ పాత్రలో రణ్బీర్ కపూర్ నటించారు. జోయా పాత్రలో తృప్తి దిమ్రి యాక్ట్ చేసింది. ఓ సీన్లో భాగంగా జోయాతో శృంగారంలో పాల్గొన్నానని రణ్ విజయ్ వచ్చి తన భార్య గీతాంజలితో చెబుతాడు. దీంతో ఈమెకు కోపమొచ్చి భర్త చెంపపై గట్టిగా లాగి పెట్టి కొడుతుంది. అయితే ఈ సీన్ పూర్తయిన తర్వాత తను ఏడవడంతో పాటు గట్టిగట్టిగా అరిచానని రష్మిక చెప్పింది. 'ఆ సీక్వెన్స్ మొత్తం ఒకే టేక్లో కంప్లీట్ చేశాం. అయితే ఈ సీన్లో యాక్ట్ చేస్తున్నప్పుడు నేనేం చేస్తున్నాననేది కూడా నాకు గుర్తులేదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఓ భార్య ఎలా ఫీల్ అవుతుందో అలానే రియాక్ట్ అవ్వాలని సందీప్ నాకు చెప్పాడు. నాకు అది మాత్రమే గుర్తుంది. యాక్షన్-కట్ తప్పితే మధ్యలో ఏం జరిగిందో గుర్తులేదు. అయితే సీన్లో రణ్బీర్ చెంపపై కొట్టిన తర్వాత గట్టిగా ఏడవడంతో పాటు అరిచేశాను. ఆ తర్వాత రణ్బీర్ దగ్గరకు వెళ్లి అంతా ఓకేనా అని అడిగాను. అయితే ఈ సినిమా, ఈ సీన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పాలంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది' అని రష్మిక చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: హనుమాన్ సినిమాపై హీరోయిన్ సమంత రివ్యూ) -
రాముడిగా రణ్బీర్.. కుంభకర్ణుడుగా బాబీ డియోల్!
‘యానిమల్’ సినిమాలో రణ్విజయ్ సింగ్గా రణ్బీర్ కపూర్, అబ్రార్గా బాబీ డియోల్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. కాగా రణ్బీర్, బాబీ డియోల్లు మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారన్నది బాలీవుడ్లో వినిపిస్తున్న తాజా కబురు. రామాయణం ఆధారంగా హిందీలో దర్శకుడు నితీష్ తివారి ‘రామాయణ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్లుగా నితీష్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నారని, ఈ పనులు తుది దశకు చేరుకున్న తరుణంలో నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారని టాక్. (చదవండి: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది) ఈ నేపథ్యంలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో దేవ్ దత్తా, రావణుడి పాత్రలో యశ్ నటించనున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాలోని కుంభకర్ణుడి పాత్రలో బాబీ డియోల్, కైకేయి పాత్రలో లారా దత్తా కనిపించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. (చదవండి: జూ. ఎన్టీఆర్పై బాలకృష్ణ ద్వేషం.. చిచ్చు పెట్టింది ఎవరు..?) అన్నీ కుదిరి ‘రామాయణ్’ సినిమాలో రణ్బీర్, బాబీ డియోల్ సెట్ అయితే.. ‘యానిమల్’ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించే సినిమా ఇదే అవుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ వేసవిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందట. మధు మంతెన, నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్లు కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించనున్నారనే వార్తలు గతంలో వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?
ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా చాలా అంటే చాలా మాట్లాడుకున్నారా అంటే అందరికీ గుర్తొచ్చేది 'యానిమల్'. థియేటర్లలోకి వచ్చేంతవరకు ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. కానీ ఒక్కసారి బిగ్ స్క్రీన్పైకి వచ్చేసిన తర్వాత ఆడియెన్స్కి ఎందుకో తెగ నచ్చేసింది. ఇప్పటికీ చాలాచోట్ల ఇంకా స్క్రీనింగ్ అవుతోంది. ఇలాంటి టైంలో ఓటీటీ న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా పేరు చెప్పగానే 'అర్జున్ రెడ్డి' గుర్తొస్తుంది. ఈ సినిమాతో ట్రెండ్ సృష్టించాడు. ఇప్పుడు 'యానిమల్'తో దీన్ని మించిపోయేలా చేశాడు. తీసింది బాలీవుడ్ హీరోతోనే అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని చాలా ఓన్ చేసుకున్నారు. ఈ క్రమంలో మూవీ గురించి ఇప్పటికీ తెగ మాట్లాడుకుంటున్నారు. సీన్స్, సాంగ్స్, ఇందులోని యాక్టర్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) ఇకపోతే డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన 'యానిమల్' సినిమా డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. లెక్క ప్రకారం అయితే జనవరి 26న స్ట్రీమింగ్ చేస్తారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆలోచన మారినట్లు కనిపిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 15నే ఓటీటీలోకి తీసుకొచ్చేయాలని అనుకున్నారట. ఈ తేదీ ఫిక్స్ అని, కాకపోతే అధికారిక ప్రకటన రావాల్సి ఉందని అంటున్నారు. ఒకవేళ సంక్రాంతికి వస్తే మాత్రం 'యానిమల్'కి ప్లస్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. థియేటర్లలో కొత్త సినిమాలకు వెళ్లే ఇంట్రెస్ట్ లేని వాళ్లు.. ఈ బ్లాక్బస్టర్పై లుక్కేసే అవకాశముంటుంది. అయితే ఈ సినిమా ఓటీటీ వెర్షన్.. థియేటర్ కంటే కాస్త పెద్దగానే ఉంటుందని సమాచారం. ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే.. కొన్నిరోజులు ఆగితే సరి. (ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!) -
Alia Ranbir Daughter Raha Photos: ఏడాది తర్వాత కూతురి ముఖం చూపించిన రణ్బీర్-ఆలియా (ఫోటోలు)
-
నిద్రలేని రాత్రులు గడుపుతున్నా!
‘యానిమల్’ సినిమాతో ఒక్కసారిగా ట్రెండింగ్ స్టార్ అయ్యారు బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయర్స్ పెరిగిపోయారు. ఈ సడన్ స్టార్డమ్ గురించి త్రిప్తి దిమ్రీ స్పందిస్తూ– ‘‘ప్రేక్షకులు, అభిమానుల నుంచి నాకు లభిస్తున్న ప్రేమ ఆనందాన్నిస్తోంది. ఈ అనుభూతి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. చెప్పాలంటే నా మొబైల్ ఫోన్ మెసేజ్లతో మోగుతూనే ఉంది. చివరికి ఈ మెసేజ్ల వల్ల నేను నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తోంది. అన్ని వస్తున్నాయి. అవి చదువుతూ రాత్రి సమయాన్ని గడిపేస్తున్నాను. కానీ ఇది బాగుంది. ఇక రణ్బీర్ కపూర్ అమేజింగ్ యాక్టర్. చాలా సపోర్టివ్. రష్మికా మందన్నా కూడా చాలా కో–ఆపరేటివ్’’ అని చెప్పుకొచ్చారు. రణ్బీర్ కపూర్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా, త్రిప్తి దిమ్రీ, బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’ సినిమా ఈ నెల 1న విడుదలైన విషయం తెలిసిందే. సూపర్ హిట్ టాక్తో ఈ చిత్రం దూసుకెళుతోంది. -
బాక్సాఫీస్ వేటలో యానిమల్ బ్లాక్ బస్టర్
బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ వసూళ్ల వేట కొనసాగుతోంది. తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తోనే సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆ తర్వాత హిందీ పరిశ్రమ వైపు వెళ్లారు. అక్కడ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్నే ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి, మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ రెండు చిత్రాలు ఒక ఎత్తయితే సందీప్ తెరకెక్కించిన మూడో చిత్రం ‘యానిమల్’ వసూళ్ల పరంగా మరో ఎత్తు అనాలి. రణ్బీర్ కపూర్ కథానాయకునిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలై, సంచలన వసూళ్లతో దూసుకెళుతోంది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 116 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక తొలి వారాంతానికి రూ. 356 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా 16 రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ. 817.36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రణ్బీర్ కపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించే దిశగా ఈ చిత్రం దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ సాధించిన వసూళ్ల ప్రకారం ఈ ఏడాది విడుదలై, అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో ‘యానిమల్’ టాప్ ఫైవ్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్ ’, ‘పఠాన్ ’ చిత్రాలు రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక ‘యానిమల్’ చిత్రం తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. తెలుగు అనువాదాన్ని ‘దిల్’ రాజు విడుదల చేశారు. రిలీజ్ అయిన తొలి రోజే రూ. 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని ‘దిల్’ రాజు పేర్కొన్నారు. తెలుగు వెర్షన్ ఇప్పటివరకూ దాదాపు రూ. 60 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఇలా ఈ ఏడాది సందీప్ రెడ్డి బాక్సాఫీస్ని షేక్ చేసే చిత్రం తీశారు. ఈ చిత్రానికి ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా ఓ నిర్మాత. రష్మికా మందన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రి కీలక పాత్రలు పోషించారు. ‘యానిమల్’కి రెండో భాగం ‘యానిమల్ పార్క్’ రానున్న సంగతి తెలిసిందే. -
100 కోట్లు కొల్లగొడుతున్న భార్య,భర్తలు
-
రణబీర్, సాయి పల్లవి కాంబినేషన్ లో సినిమా?
-
రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతున్న యానిమల్ మూవీ
-
1000 కోట్లు మార్క్ వైపు యానిమల్ పరుగులు
-
ఇండస్ట్రీలో మరో సూపర్ స్టార్
-
యానిమల్ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా రణబీర్ కపూర్
-
ఈ ఏడాది కలిసొచ్చింది
రణ్బీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్’. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ ఖేతని, క్రిషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 1న రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో ‘యానిమల్’ చిత్రాన్ని పంపిణీ చేసిన ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 15 కోట్ల మేరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తొలి వారాంతంలోనే ‘యానిమల్’ రూ. 35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను రాబడుతుందని అంచనా వేస్తున్నాం. ఈ ఏడాది మాకు బాగా కలిసొచ్చింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నాలుగు, ‘దిల్’ రాజుప్రోడక్షన్స్ బ్యానర్లో మూడు సినిమాలు.. ఇలా మొత్తంగా ఏడు సినిమాలు చేస్తున్నాం. రామ్చరణ్గారి ‘గేమ్ చేంజర్’ సినిమా చిత్రీకరణ 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ మేన్ ’ను మార్చిలో రిలీజ్ చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు. -
సెంచరీ కొట్టిన యానిమల్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం యానిమల్. ఫస్ట్ లుక్ రిలీజైనప్పటి నుంచి ఈ సినిమాకు బోలెడంత హైప్ వచ్చింది. టీజర్, ట్రైలర్ రిలీజయ్యాక ఆ అంచనాలు ఆకాశాన్నంటాయి. రణ్బీర్ యాక్టింగ్ చూసి మెంటలొచ్చేసిందని సూపర్స్టార్ మహేశ్బాబే చెప్పడం విశేషం. తండ్రీకొడుకుల భావోద్వేగం చుట్టూ తిరిగే ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడుగంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన లభిస్తోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహించిన సినిమా కావడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా ఈ సినిమా తొలిరోజు ఎంత రాబట్టిందనే విషయాన్ని యానిమల్ మూవీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధికారికంగా వెల్లడించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల కలెక్షన్లు సాధించిందని పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే యానిమల్ రూ.500 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి యానిమల్ రానున్న రోజుల్లో ఎటువంటి రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి! He has come to conquer all the records 🤙🏼🔥🪓#AnimalHuntBegins Book Your Tickets 🎟️ https://t.co/QvCXnEetUb#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar… pic.twitter.com/bF8nV2Nw09 — T-Series (@TSeries) December 2, 2023 చదవండి: అందుకే నా సినిమా కలెక్షన్స్ తగ్గుతున్నాయి: సల్మాన్ ఖాన్ -
'యానిమల్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అందులోనే
మూవీ లవర్స్ చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్న మూవీ 'యానిమల్'. విడుదలకు ముందే ఓ రేంజు అంచనాలు సెట్ చేసిన ఈ చిత్రాన్ని.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేశారు. సినిమా ఎలా ఉంది? టాక్ ఏంటి? లాంటి విషయాలు పక్కనబెడితే ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ని అప్పుడే ఫిక్స్ చేసుకుంది. డేట్ కూడా చెప్పేస్తున్నారు. (ఇదీ చదవండి: Dhootha Web Series Review: నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ రివ్యూ) బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించిన సినిమా 'యానిమల్'. తండ్రి-కొడుకుల మధ్య బాండింగ్ అనే పాయింట్ ఆధారంగా ఈ మూవీ తీశారు. ఇందులో రణ్బీర్, రష్మిక, అనిల్ కపూర్ తదితరులు తమ తమ యాక్టింగ్తో అదరగొట్టేశారు. అయితే సెకండాఫ్లో ల్యాగ్ అయ్యేసరికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇకపోతే థియేటర్లలో సినిమా రిలీజ్ కావడానికి ముందే 'యానిమల్'.. ఓటీటీ పార్ట్నర్ని ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. బిగ్స్క్రీన్పై 6-8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డేన 'యానిమల్' మూవీ ఓటీటీలోకి రావొచ్చనిపిస్తోంది. (ఇదీ చదవండి: Animal Review: ‘యానిమల్’మూవీ రివ్యూ) -
ప్రమోషన్ లో ‘Animal’ మూవీ టీమ్ (ఫొటోలు)
-
‘యానిమల్’ మూవీ ట్విటర్ రివ్యూ
‘అర్జున్రెడ్డి’సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు సందీప్రెడ్డి వంగ. అదే సినిమాను కబీర్సింగ్ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత సందీప్ చాలా గ్యాప్ తీసుకొని ‘యానిమల్’సినిమాను తెరకెక్కించాడు. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ చిత్రం నేడు(డిసెంబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ చిత్రం ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. యానిమల్ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. యానిమల్ చిత్రానికి ఎక్స్లో మంచి స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని ఎక్కువ మంది చెబుతున్నారు. రణ్బీర్, అనిల్ కపూర్, రష్మిక, బాబీ డియోల్ల నటన అదిరిపోయిందంటున్నారు. వయోలెన్స్ ఎక్కువైందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. Big day for the Indian box office 🥵 Anticipate the cinematic magic as #AnimalMovie hits screens tomorrow, promising an exhilarating experience. 💥💥💥💥💥 Also, get ready for the much-awaited #SalaarCeaseFire trailer dropping tomorrow. Double the excitement, double the… pic.twitter.com/h0evNakiCL — Thyview (@Thyview) November 30, 2023 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో బిగ్డే ఇది. సినిమాటిక్ మ్యాజిక్ ఊహించబోతున్నాం. ఈ సినిమా అద్బుతమైన అనుభూతిని అందిస్తుందని ఆశిస్తున్నాం. ఈ రోజు డబుల్ ధమాకా. సలార్ ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతున్నది. నాకు డబుల్ ఎక్సైట్మెంట్ అంటూ ఓ నెటిజన్ ట్విట్ చేశాడు. Very good 1st half 👌👌 Ranbir like never before and Vanga has written a simply mind blowing character for him. Everything on point so far. Waiting for 2nd half #Animal — RGK 🍀 (@iamrgk_) December 1, 2023 ఫస్టాఫ్ చాలా బాగుంది. కర్బీర్ కపూర్ని ఇలాంటి పాత్రలో ఎప్పుడు చూడలేదు. అతనికి సందీప్ వంగ మంచి పాత్రను ఇచ్చాడు. ప్రతి పాయింట్ బాగుంది. సెకండాఫ్ కోసం ఎదురు చూస్తున్నానంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #OneWordReview...#Animal: BLOCKBUSTER Rating: ⭐️⭐⭐️⭐️½#RanbirKapoor𓃵 in a never seen before avatar his career best performance #AnimalReview#AnimalTheFilm #RanbirKapoor #Svr #AnimalOn1stDec #AnimalReview #BobbyDeol #AnilKapoor #AnimalOn1stDec #RashmikaMandanna #AnimalMovie pic.twitter.com/Kz4IXMFTSl — himesh (@himeshmankada) November 30, 2023 ఒక్కమాటలో చెప్పాలంటే.. యానిమల్ బ్లాక్ బస్టర్. ఇలాంటి పాత్రలో రణ్బీర్ని ఎప్పుడు చూడలేదు. అతని కెరీర్లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు’అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు. #Animal Blood batting fight Goosebumps 🔥🔥🔥#RanbirKapoor𓃵 #AnimalMovie #AnimalReview #AnimalTheFilm #Animal #AnimalAdvanceBooking #AnimalOn1stDec@Portalcoin $Portal #AnimalPremieres pic.twitter.com/nfAJJRtoDb — BTC6660 ll 🔥Champions Tactics (@BTC6660) December 1, 2023 Blockbuster first half.. Sandeep Reddy Vanga just hit this out of the park.. Terrific drama, Shot making, sound design, Ranbir intensity, supremely quality product from once in a generation talented director. Such a Feast to watch it on silver screen #Animal — PST (@PSTtwtz) December 1, 2023 I Really Wish #Animal to be biggest Blockbuster for Ranbir Kapoor, Bobby Deol , Sandeep Vanga ,Anil Kapoor for showing their Love &Respect towards @urstrulyMahesh Their gesture and way of receiving is so heart warming❤️ All The Best Sandeep & Ranbir#AnimalMovie #AnimalTheFilm pic.twitter.com/nWeQOFayyN — Hemanth Kiara (@ursHemanthRKO) November 30, 2023 Ranbir 🔥🔥🔥#AnimalMovie One of the best climax 😢#AnimalTheFilm #Animal #AnimalOn1stDec #AnimalAdvanceBooking #AnimalPremieres #AnimalReview #RanbirKapoor𓃵 pic.twitter.com/DXHF05TK1C — Abhishek (@Abhishek09kk) December 1, 2023 Inside reports ..everywhere positive#AnimalReview#ANIMAL : BLOCKBUSTER. Rating: 🌟🌟🌟🌟🌟½#SandeepReddyVanga immerses us into the world of #Animal, delivers a KING-SIZED ENTERTAINER… Imagine SPIRIT 🥵 #spirit #Prabhas #salaar pic.twitter.com/zcbo47vEAy — Film Royce (@film_royce) December 1, 2023 #Animal Blood batting fight Goosebumps 🔥🔥🔥#RanbirKapoor𓃵 #AnimalMovie #AnimalReview #AnimalTheFilm #Animal #AnimalAdvanceBooking #AnimalOn1stDec@Portalcoin $Portal #AnimalPremieres pic.twitter.com/nfAJJRtoDb — BTC6660 ll 🔥Champions Tactics (@BTC6660) December 1, 2023 Blockbuster first half.. Sandeep Reddy Vanga just hit this out of the park.. Terrific drama, Shot making, sound design, Ranbir intensity, supremely quality product from once in a generation talented director. Such a Feast to watch it on silver screen #Animal — PST (@PSTtwtz) December 1, 2023 -
తెలుగు డైరెక్టర్ - హిందీ హీరో సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా ?
-
యానిమల్కు 'A' సర్టిఫికెట్.. ఆనందించిన సందీప్ రెడ్డి వంగా
యానిమల్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. రణ్బీర్ కపూర్ - రష్మిక కాంబినేషన్లో వస్తున్న ‘యానిమల్’ సినిమాను సందీప్రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. విభిన్న కథతో యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రన్ టైమ్ 3:20 నిమిషాలు అని డైరెక్టర్ ప్రకటించడంతో అందరూ చూడటం కష్టం అంటూ కామెంట్లు చేశారు. తీరా ట్రైలర్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ భారీగా జరిగిపోయాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలివే!) యానిమల్ మూవీకి సెన్సార్ వాళ్లు 'A' సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయంలో చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అనడం గమనార్హం. ఈ సినిమా పిల్లలు చూసేది కాదని ఆయన క్లియర్గా చెప్పాడు. డిసెంబర్ 1న వచ్చే ఈ సినిమాకు పిల్లలతో వెళ్లకండని ఆయన ఓపెన్గానే చెప్పాడు. 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ సినిమా చూడాల్సి ఉంటుంది. నిజానికి ఈ సినిమా పిల్లలు చూసేలా లేదని సందీప్ బహిరంగంగా చెప్పడం విశేషం. చిన్నపిల్లలకు యానిమల్ సినిమా సెట్ కాదని .. తన కుమారుడితో పాటు కజిన్స్ పిల్లలను కూడా ఈ సినిమాకు తీసుకుపోనని ఆయన చెప్పాడు. అవకాశం ఉంటే ఈ సినిమాలో కొంత భాగాన్ని కట్ చేసి ఆ తర్వాత వారికి చూపించే ప్రయత్నం చేస్తానని సందీప్ తెలిపాడు. ఇలా సినిమా గురించి ఓపెన్గా చెప్పడం ఇండస్ట్రీలో చాలా అరుదు. తన వంతు బాధ్యతాయుతంగా సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులకు ఇలా చెప్పడంతో నెటిజన్ల నుంచి ఆయన ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇందులో అశ్లీలత అంతగా లేకున్నా కొంచెం వయలెన్స్ ఎక్కువుగా ఉంటుందని టాక్. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ... ఏ మేరకు రాబడుతుందో ఇప్పుడే అంచనా వేయలేమని చెప్పిన సందీప్ సినిమా మాత్రం ఆందరనీ ఆలోచింపజేస్తుందని తెలిపాడు. కానీ యానిమల్ రూ.800 కోట్ల మార్క్ను దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
మహేష్ బాబు డైలాగ్ తో అదరగొట్టిన రణబీర్ కపూర్
-
‘యానిమల్’ ప్రీ రిలీజ్లో మహేశ్బాబు,రణ్బీర్ సందడి (ఫొటోలు)
-
రణ్బీర్.. ఇక్కడికి షిఫ్ట్ అయిపో.. తెలుగువాళ్లు బాలీవుడ్ను..
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరో వయొలెంట్ సినిమాతో ముందుకు వస్తున్నాడు. తండ్రీకొడుకుల బంధం నేపథ్యంలో యానిమల్ మూవీ తెరకెక్కించాడు. రణ్బీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. సోమవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై మంత్రి మల్లారెడ్డి మైక్ పట్టుకుని ఊగిపోయారు. ముంబై, బెంగళూరు వద్దు.. హైదరాబాదే బెస్ట్.. ఆయన మాట్లాడుతూ.. 'మహేశ్బాబు గారు.. నేను మీ బిజినెస్మెన్ సినిమా చూసి రాజకీయాల్లోకి వచ్చాను. పదిసార్లు ఆ సినిమా చూసే ఎంపీనయ్యాను. సేమ్ మోడల్.. సేమ్ సిస్టమ్.. అంతా సేమ్! రణ్బీర్.. మీకో విషయం చెప్పాలి. మరో ఐదేళ్లలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ.. బాలీవుడ్, హాలీవుడ్ అంతటినీ ఏలుతుంది. ఏడాది తర్వాత మీరు కూడా హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోండి. ముంబై పాతదైపోయింది. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ ఎక్కువుంది. ఇప్పుడు ఇండియాలో అనుకూలంగా ఉన్న ఏకైక నగరం హైదరాబాదే! తెలుగువాళ్లు తెలివైనవారు తెలుగు ప్రజలు చాలా తెలివైనవారు. రాజమౌళి, దిల్ రాజు, సందీప్ రెడ్డి వంగా, రష్మిక మందన్నా.. వీరంతా కూడా ఎంతో తెలివైనవారు. పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే! మీ యానిమల్ సినిమా కూడా రూ.500 కోట్ల కలెక్షన్లు రాబడుతుంది' అని చెప్పుకొచ్చారు. ఈయన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. మల్లారెడ్డి.. బాలీవుడ్ సెలబ్రిటీల ముందే హిందీ చిత్రపరిశ్రమను రోస్ట్ చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతిథులుగా వచ్చిన వారిని చులకన చేసి మాట్లాడటం కరెక్ట్ కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Minister #MallaReddy sparked controversy at the #AnimalPreReleaseEvent, making bold statements. He declared, 'Telugu people will lead India; you must move to Hyderabad in a year. Mumbai is outdated Hyderabad is the only city for India.' #Animal pic.twitter.com/AhnSKmhTrZ — Anil Tiwari (@Anil_Kumar_ti) November 27, 2023 చదవండి: పెద్ద తప్పు చేసిన అమర్, అర్జున్.. గేమ్ చేతులారా నాశనం చేసుకోవడమంటే ఇదే! -
Animal: ‘యానిమల్’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
తండ్రిని తలుచుకుని ఎమోషనలైన స్టార్ హీరో
‘‘కొన్నేళ్ల క్రితం మా నాన్నను(రిషీ కపూర్) కోల్పోయా. నా చిన్నప్పుడు నాన్న షూటింగ్స్తో బిజీగా ఉండటంతో సరైన సమయాన్ని గడపలేకపోయాను. నాన్నపై నాకు ప్రేమ, గౌరవం ఉంది. కానీ, మా మధ్య స్నేహబంధం లేదు. ఆయనతో ఫ్రెండ్లీగా ఉండి మరెన్నో విషయాలు పంచుకుని ఉంటే బాగుండేదనే బాధ నాకు ఉంది. నా జీవితాంతం ఆ బాధ ఉంటుంది’’ అని హీరో రణ్బీర్ కపూర్ అన్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, రష్మికా మందన్న జంటగా నటించిన చిత్రం ‘యానిమల్’. తండ్రీకొడుకుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రల్లో నటించారు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 1న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో రణ్బీర్ కపూర్ మాట్లాడుతూ–‘‘తెలుగు ప్రేక్షకులంటే నాకెంతో అభిమానం. ఇక్కడ వాళ్లు చూపించే ప్రేమాభిమానం మరో స్థాయిలో ఉంటాయి. సినిమాలు మానేసి నా కుమార్తె రాహ కోసం నా సమయాన్ని కేటాయించాలని ఉంది. కాకపోతే నేనూ నా కలలను సాకారం చేసుకోవాలి కాబట్టి అలా చేయలేను (నవ్వుతూ)’’ అన్నారు. సందీప్ రెడ్డి మాట్లాడుతూ–‘‘మహేశ్బాబుకు ‘యానిమల్’ కథ చెప్పలేదు. ‘డెవిల్’ కథ చెప్పాను. కానీ మా కాంబో కుదరలేదు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘అన్ని చిత్రాలకు మన దగ్గర టికెట్ రేట్స్ ఎలా ఉంటాయో ‘యానిమల్’కి అలానే ఉంటాయి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశాం. అద్భుతమైన స్పందన లభించింది. ‘అర్జున్ రెడ్డి’ని మిస్ అయ్యాను. అప్పటి నుంచి సందీప్ సినిమా కోసం ప్రయత్నిస్తున్నాను. భూషణ్గారు నన్ను నమ్మి ఈ సినిమా మా చేతిలో పెట్టారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నేను రణ్బీర్ తండ్రి పాత్ర చేశాను’’ అన్నారు అనిల్ కపూర్. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘డీప్ ఫేక్ వీడియో’ గురించి రష్మిక మాట్లాడుతూ – ‘‘ఆ వీడియో చూసినప్పుడు ఇలాంటివాటికి రియాక్ట్ అయితే ఏమనుకుంటారో అనిపించింది. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడంతో.. తప్పకుండా స్పందించాలని నిర్ణయించుకున్నాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత భూషణ్ కుమార్, నటుడు బాబీ డియోల్ మాట్లాడారు. -
అప్పుడు రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా : రాజమౌళి
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) హైదరాబాద్లో ఘనంగా జరిగింది.ఈ ఈవెంట్కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా విచ్చేసారు. ఈ సందర్బంగా దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఎంతోమంది కొత్త కొత్త డైరెక్టర్లు వస్తారు. హిట్లు, సూపర్ హిట్ సినిమాలు తీస్తారు. చాలా పెద్ద పేరు కూడా సంపాదిస్తారు. అవి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడో ఓ సారి మాత్రమే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ మొతాన్ని షేక్ చేసే డైరెక్టర్ వస్తాడు. అతడు సినిమా అంటే ఇలాగే తీయాలన్న ఫార్ములాను కూడా షేక్ చేస్తాడు. అలాంటి డైరెక్టర్ నాకు తెలిసి నా తరంలో రాంగోపాల్ వర్మ. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా అలాంటి డైరెక్టర్. సినిమా ఇలాగే తీయాలన్న రూల్ పక్కన పెట్టి.. నేను ఇలాగే సినిమా తీస్తా అనే డైరెక్టర్ అతడు. నిన్ను చూసి చాలా గర్విస్తున్నా" అని సందీప్ ను ఉద్దేశించి రాజమౌళి అనడం విశేషం. యానిమల్ చిత్ర టీజర్ చూడగానే ఈ సినిమా నేను చూడాలని వెంటనే అనిపించింది. రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా టీజర్ చూడగానే మొదటి రోజే చూడాలనిపించిన చిత్రం యానిమల్ అంటూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై దర్శక ధీరుడు ప్రశంసలు కురిపించాడు. నా ఫేవరేట్ యాక్టర్ రణ్బీర్ కపూర్: రాజమౌళి బాలీవుడ్ సూపర్స్టార్ రణ్బీర్ కపూర్ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. నా ఫేవరేట్ బాలీవుడ్ యాక్టర్ ఎవరు అంటూ నన్ను చాలా మంది అడిగితే ఏ మాత్రం ఆలోచించకుండ రణ్బీర్ కపూర్ అని చెప్తాను. నేను చూసిన తన సినిమాలు తక్కువే కానీ చాలా ఇంటెన్సిటీ ఉన్న నటుడు. తన 15 ఏళ్ల కెరీర్లో తన టాలెంట్ చూపించుకునేలాంటి చిత్రాలు చాలా తక్కువ వచ్చాయి. యానిమల్తో తనకు ఆ లోటు తీరుతుంది. రణ్బీర్ కపూర్ ఇండస్ట్రీలోనే టాప్లో ఉంటాడని జక్కన్న అన్నారు. -
యానిమల్ ట్రైలర్ చూసి నాకు మెంటలొచ్చేసింది: మహేష్ బాబు
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలివుడ్ సూపర్స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) హైదరాబాద్లో ఘనంగా జరిగింది.ఈ ఈవెంట్కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా విఛ్చేసారు. ఇక యానిమల్ మూవీ టీమ్ నుంచి రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ఈవెంట్లో సందడి చేశారు. ఈ సందర్బంగా మహేష్ బాబు మాట్లాడుతూ యానిమల్ ట్రైలర్ చూసి నాకు మెంటలొచ్చేసింది. ఇంత ఒరిజనల్ ట్రైలర్ నేనెప్పుడూ చూడలేదు. డైరెక్టర్ సందీప్ అంటే నాకు చాలా ఇష్టం. తను చాలా స్పెషల్, యూనిక్ డైరెక్టర్. దేశంలోనే సందీప్ ఓ ఒరిజనల్ ఫిల్మ్ మేకర్ అన్నారు. అలానే ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ తాను రణ్బీర్ కపూర్కి చాలా పెద్ద అభిమానిని అని చెప్పడం విశేషం. ఇంతకుముందు కూడా ఈ విషయం రణ్బీర్కి చెప్పాను. కానీ అతడు దాన్ని అంత సీరియస్గా తీసుకున్నట్లు లేడు. ఈ స్టేజ్ పై మరోసారి చెబుతున్నాను. నేను రణ్బీర్కి వీరాభిమానిని. ఇండియాలోనే అతడు బెస్ట్ యాక్టర్. యానిమల్ చిత్రంలో తను అత్యుత్తమ నటన కనబరిచాడు. ఆల్ ద బెస్ట్ మై బ్రదర్ అని మహేష్ అన్నాడు. ఇక డిసెంబర్ 1వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. -
Rashmika Mandanna: ‘యానిమల్’ మూవీ ప్రెస్మీట్లో రష్మిక మందన్న గ్లామర్ షో (ఫొటోలు)
-
లైవ్ లో దొరికిపోయిన రష్మిక..అడ్డంగా బుక్ చేసిన హీరో..
-
ప్రభాస్ స్పిరిట్ లో రణబీర్ కపూర్!
-
పెద్దల కోసం రెడీ అయిన 'పేద్ద' సినిమా.. కాకపోతే!
ప్రస్తుతం సినిమా ప్రేక్షకుల ఇంట్రెస్ట్ పూర్తిగా మారిపోయింది. ల్యాగ్ ఉంటే అస్సలు లెక్క చేయట్లేదు. నిర్దాక్షిణ్యంగా ట్రోల్ చేసి పడేస్తున్నారు. దీంతో దర్శకనిర్మాతలు చాలావరకు తమ తమ సినిమాల్ని రెండున్నర గంటల నిడివికి కాస్త అటు ఇటు ఉండేలానే చూసుకుంటున్నారు. అలాంటిది ఓ స్టార్ డైరెక్టర్ పెద్ద రిస్క్ చేయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడా విషయమే పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. 'అర్జున్ రెడ్డి' పేరు చెప్పగానే చాలామందికి విజయ్ దేవరకొండ గుర్తొస్తాడు. మరికొందరికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గుర్తొస్తాడు. ఆ సందీప్.. ఇప్పుడు 'యానిమల్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తీసిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, కన్నడ బ్యూటీ రష్మిక హీరోహీరోయిన్లుగా నటించారు. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా మూడున్నర గంటల నిడివి రాబోతుందని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడదే నిజమైంది. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?) లేటెస్ట్గా 'యానిమల్' సెన్సార్ జరగ్గా.. సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే ఈ సినిమా పెద్దలకు మాత్రమే. అలానే 201 నిమిషాల నిడివితో అంటే 3 గంటల 21 నిమిషాల మూవీ ఇది అని స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డినే సోషల్ మీడియాలో ప్రకటించాడు. అయితే సినిమాలో కంటెంట్ ఉంటే.. ఈ నిడివి అనేది అస్సలు సమస్యే కాదు. ఒకవేళ ఏమైనా తేడా కొడితే మాత్రం మొదటికే మోసపోయే ఛాన్స్ ఉంది. అయితే సందీప్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. 'యానిమల్'తో ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తున్నాడు. గురవారం (నవంబరు 23) ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. అయితే ట్రైలర్ మాత్రం పెద్దలు-పిల్లల మాత్రం చూసేలా కట్ చేసినట్లు తెలుస్తోంది. అలానే పెద్ద సినిమా కాబట్టి రెండు ఇంటర్వెల్స్ ఉంటాయా? అనేది కూడా చూడాలి. ఒకవేళ నిడివితో సంబంధం లేకుండా ఈ మూవీ హిట్ అయితే మాత్రం సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసినట్లే! ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే డిసెంబరు 1 వరకు ఆగితే సరి! (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే?) View this post on Instagram A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga) View this post on Instagram A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga) -
దుబాయ్లో యానిమల్
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. గుల్షన్ కుమార్, టి.సిరీస్ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషణ్ కుమార్, మురాద్ ఖేతాని నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబరు 1న విడుదలవుతోంది. ఈ సినిమాలోని ‘అర్జన్ వైలీ..’ అనే పాటను దుబాయ్లోని ఐకానిక్ గ్లోబల్ విలేజ్లో అభిమానుల మధ్య ఘనంగా విడుదల చేశారు మేకర్స్. ఈ వేడుకలో రణబీర్ కపూర్, బాబీ డియోల్ పాల్గొన్నారు. వేదికపై ‘అర్జన్ వైలీ...’ పాటకు స్టార్ కాస్ట్తో పాటు అభిమానులు చేసిన డ్యాన్స్ వైరల్గా మారింది. -
యానిమల్ నుంచి 'నాన్న నువ్ నా ప్రాణం' ఎమోషనల్ సాంగ్ రిలీజ్
ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న సినిమా ‘యానిమల్’. సందీప్ వంగా దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రష్మిక మందన్న కథానాయిక. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ మొదటి పాటను కూడా విడుదల చేశారు. తాజాగా ఎమోషనల్గా ఉన్న రెండో సాంగ్ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. 'నాన్న నువ్ నా ప్రాణం' అంటూ సాగే ఈ సాంగ్ ఎంతో ఎమోషనల్గా ఉంది. తండ్రీకొడుకుల రిలేషన్ షిప్ నేపథ్యంలో సాగనున్న ఈ మూవీలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ పాటను అనంత శ్రీరామ్ రచించగా.. సోను నిగమ్ అద్భుతంగా ఆలపించారు. తాజాగా విడుదలైన పాటలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్ మధ్య ఉన్న బంధాన్ని చూపించారు. దీంతో సినిమా తండ్రి – కొడుకుల మధ్య జరిగే కథలా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎక్కువగా భావోద్వేగాలకు సంబంధించిన సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. యానిమల్ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
69th National Film Awards: జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అలియా,రణబీర్ సందడి (ఫొటోలు)
-
స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!
న్యూఢిల్లీ: ముంబైలో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ మ్యాచ్లో బాలీవుడ్ లవబుల్ కపుల్ సందడి చేశారు. బ్రహ్మాస్త్ర జంట అలియా భట్, రణబీర్ కపూర్ తళుక్కున మెరిసారు. అదీ ISLని నిర్వహించే ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్పర్సన్ నీతా అంబానీతో కలిసి ఆదివారం సందడి చేశారు. ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ముంబై సిటీ FC vs కేరళ బ్లాస్టర్ ఫుట్బాల్ మ్యాచ్కు బాలీవుడ్ తారలతో పాటు, నీతా అంబానీ ,అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అలియా, రణబీర్ జంటను నీతా ప్రత్యేకంగా అభినందించారు. ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ ముంబై సిటీ FC సహ-యజమాని ఏ దిల్ హై ముష్కిల్ హీరో రణబీర్ తన జట్టుకు మద్దతుగా స్పోర్ట్స్ ఈవెంట్లో, ఇనీషియల్స్తో పాటు వెనుక ఎనిమిది నంబర్ ప్రింట్ చేసిన బ్లాక్ జెర్సీలో బ్యూటిఫుల్గా ఫ్యాన్స్ను అలరించాడు. బ్లాక్ కార్గో-స్టైల్ ప్యాంటు,మ్యాచింగ్ బ్లాక్ క్యాప్ను ధరించగా, ప్లస్ వన్ బ్లూ జెర్సీలో అలియా చేతులు పట్టుకుని స్టేడియంలోకి ప్రవేసించారు. అక్కడ ఫ్యాన్స్తో, సెల్పీలకు పోజులిచ్చారు. ఈ క్రమంలో ఒలింపిక్ అధ్యక్షురాలు నీతి అంబానీతో కలిసి పోజులివ్వడం విశేషంగా నిలిచింది. రణబీర్, అలియా జంట క్రీడాభిమాన్లు. గత నెలలో న్యూయార్క్లో విహారయాత్ర చేస్తున్నప్పుడు, ఈ జంట యూఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో కూడా మెరిసిన సంగతి తెలిసిందే . కాగా అంబానీ నివాసంలో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు గత నెలలో, అలియా, బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీతో కలిసి హాజరయ్యారు. అయితే ఈ వేడుకుకు భర్త రణ్బీర్ ఈవెంట్కు మిస్సయ్యాడు. ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే నేషనల్ అవార్డు విన్నర్ అలియాస్వయంగా నిర్మిస్తున్న జిగ్రా అనే యాక్షన్ చిత్రంలోనూ నటిస్తూ, నిర్మిస్తోంది. రణవీర్ సింగ్తో కలిసి బైజు బావ్రా అనే పీరియాడికల్ డ్రామాలో నటిస్తోంది. అలాగే రణబీర్ కపూర్ యానిమల్ కోసం సిద్ధమవుతున్నాడు. బాబీ డియోల్, అనిల్ కపూర్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా నటించిన ఈ మూవీ డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది. -
మూడు పార్టులుగా 'రామాయణం' సినిమా.. సీతగా ఆ బ్యూటీ?
తింటే గారెలే తినాలి వింటే రామాయణమే వినాలి అన్నది ఫేమస్ సామెత. రామాయణ ఇతిహాసాన్ని ఎన్నిసార్లు, ఎన్నో భాషల్లో సినిమాగా తీసినా ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. అది ఆ పుణ్య పురుషులైన సీతారాముల చరితం విశేషం. రామాయణం గురించి విపులంగా టీవీ సీరియలే తీశారు. ఇక చిత్రాలు చాలానే వచ్చాయి. ఇకపై కూడా వస్తూనే ఉంటాయి అనడానికి మరో నిదర్శనం తాజాగా రెడీ అవుతున్న రామాయణం మూవీనే. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్, మధు మంతెన ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటికీ బండి ముందుకు కదల్లేదు. ఇప్పుడు దీని గురించి అప్డేట్ వచ్చింది. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణాసురుడిగా 'కేజీఎఫ్' యష్ నటించనున్నట్లు టాక్. కాగా రామాయణాన్ని మూడు భాగాలుగా తీయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెడతారట. మొదటి భాగంలో సీతారాములకు సంబంధించిన సీన్స్, రెండవ భాగంలో రావణుడు సీతని లంకకు తీసుకెళ్లడం.. రామ, రావణాసురుల యుద్ధ సన్నివేశాలు ఉంటాయని ఇక మూడో భాగంలో లవకుశల పుట్టుకకు సంబంధించిన అంశాలు ఉంటాయని తెలుస్తోంది. పదేళ్ల ముందు తెలుగులో 'శ్రీరామరాజ్యం' చిత్రంలో నయనతార సీతగా మెప్పించారు. 'ఆదిపురుష్'లో కృతిసనన్ సీతగా నప్పలేదని అన్నారు. దీంతో సాయిపల్లవి సీతగా ఎలా ఉంటుందా అని ఇప్పటి నుంచే డిస్కషన్ మొదలైంది. (ఇదీ చదవండి: మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!) -
‘మహాదేవ్’ లూటీ రోజుకు రూ.200 కోట్లు
మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన వ్యవహారమిది. బాలీవుడ్ ప్రముఖ నటులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. యాప్పై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గత నెలలో భారత్లో 39 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.417 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, నగదు స్వా«దీనం చేసుకుంది. యాప్ కోసం ప్రచారం చేసిన బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, శ్రద్ధ కపూర్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురి నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ యాప్ బాగోతం బయటపడింది. ► ఛత్తీస్గఢ్లోని భిలాయి పట్టణానికి చెందిన సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ దుబాయ్లో మకాం వేసి, మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను ఆపరేట్ చేస్తున్నారు. ► కొత్తకొత్త వెబ్సైట్లు, చాటింగ్ యాప్ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తారు. ఆన్లైన్లో బెట్టింగ్ల్లో భారీగా లాభాలు వస్తాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ► తమ వలలో చిక్కిన కస్టమర్లతో వాట్సాప్లో గ్రూప్లు ఏర్పాటు చేస్తారు. వారితో నేరుగా ఫోన్లలో మాట్లాడరు. వాట్సాప్ ద్వారానే సంప్రదిస్తుంటారు. ► కస్టమర్లను బెట్టింగ్ యాప్లో సభ్యులుగా చేర్చి, యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. తర్వాత వారితో నగదు జమ చేయించుకుంటారు. ఈ వ్యవహారాన్ని మహాదేవ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్లు పర్యవేక్షిస్తుంటారు. ఈ డబ్బంతా తప్పుడు పత్రాలతో తెరిచిన యాప్ నిర్వాహకుల బినామీ బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది. ► యాప్లో బెట్టింగ్లు కాస్తే తొలుత లాభాలు వచి్చనట్లు నమ్మిస్తారు. దాంతో కస్టమర్లో ఆశ పెరిగిపోతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా అతడిని ప్రేరేపిస్తారు. చివరకు అదంతా నష్టపోయేలా బెట్టింగ్ యాప్లో రిగ్గింగ్ చేస్తారు. మళ్లీ కొత్త బకరా కోసం వేట మొదలవుతుంది. ► మహాదేవ్ బెట్టింగ్ యాప్ సంపాదన ప్రతిరోజూ రూ.200 కోట్లు ఉంటుందని ఈడీ దర్యాప్తులో తేలింది. ► భారత్, మలేసియా, థాయ్లాండ్, యూఏఈలో మహాదేవ్ యాప్నకు వందలాది కాల్ సెంటర్లు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం యూఏఈలో ఉంది. నాలుగు దేశాల్లో పెద్ద సంఖ్యలో బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచారు. ► భారత్లోని 30 కాల్ సెంటర్లను అనిల్ దమానీ, సునీల్ దమానీ నిర్వహిస్తున్నారు. వీరిద్దరిని ఈడీ అరెస్టు చేసింది. ► బెట్టింగ్ యాప్ జోలికి రాకుండా ఉండడానికి పోలీసులకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు నిర్వాహకులు హవాలా మార్గాల్లో లంచాలు ఇచి్చనట్లు వెల్లడయ్యింది. ► బెట్టింగ్ సిండికేట్ నడిపిస్తున్న ఓ యాప్ను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రమోట్ చేస్తున్నట్లు ఈడీ చెబుతోంది. ► ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్లో ఓ పెళ్లి నిర్వహణకు రూ.200 కోట్లు నగదు రూపంలో చెల్లించారు. దీనిపై దర్యాప్తు చేయగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ గురించి బయటపడింది. ఈ పెళ్లిలో రణబీర్ కపూర్, శ్రద్ధాకపూర్, కపిల్ శర్మ, హీనా ఖాన్తోపాటు మరికొందరు బాలీవుడ్ నటులు ప్రదర్శన ఇచ్చారు. వారికి హవాలా మార్గంలో రూ.కోట్లలో చెల్లింపులు చేసినట్లు తేలింది. పెళ్లిలో ప్రదర్శన ఇవ్వడానికి 17 మంది బాలీవుడ్ సెలబ్రిటీలను చార్టర్డ్ విమానంలో దుబాయ్కి తీసుకెళ్లారని ఈడీ అధికారులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ కు ఈడీ నోటీసులు
-
ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్.. స్టార్ హీరో రణ్బీర్కు షాక్..
ముంబై: మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసు బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో బాలీవుడ్ ప్రముఖులకు సమన్లు ఇచ్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సిద్ధమయ్యినట్లు ప్రచారం జరగ్గా అదే నిజమైంది. ఆన్లైన్ బెట్టింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్కు ఈడీ బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. మహాదేవ్ క్రికెట్ బెట్టింగ్ యాప్కు రణ్బీర్ ప్రచారకర్తగా వ్యవహరించాడు. తాజాగా అతడికి నోటీసులు జారీ చేసిన ఈడీ అక్టోబర్ 6న విచారణకు రావాలని ఆదేశించింది. దుబాయ్లో ఉంటూ భారత్లో బెట్టింగ్ వ్యాపారం కాగా సౌరభ్ చంద్రకర్, అతని భాగస్వామి రవి ఉప్పల్ ‘మహదేవ్ బెట్టింగ్ యాప్’ ప్రమోటర్లు. దుబాయ్లో ఉంటూ వారు భారత్లో బెట్టింగ్ వ్యాపారం సాగిస్తున్నారు. సౌరభ్ చంద్రకర్ వివాహం ఇటీవల యూఎఈలోని ఆరవ అతిపెద్ద నగరమైన రాక్లో జరిగింది. ఈ పెళ్లికి ఆయన ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. బంధువులను, సెలబ్రిటీలను దుబాయ్ తీసుకొచ్చేందుకు ప్రైవేట్ జెట్స్ సైతం ఏర్పాటు చేశాడు. పెళ్లికి హాజరైన వారికి షాక్? దీనికి సంబంధించిన చెల్లింపులను హవాలా ద్వారా నగదు రూపంలో చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలకు ఈడీ షాక్ ఇవ్వనున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. బాలీవుడ్ పెద్దలు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల నుంచి హవాలా ద్వారా నగదు చెల్లింపులు అందుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే మహాదేవ్ బుక్ యాప్ ఆన్లైన్ బెట్టింగ్ కుంభకోణంపై అనేక రాష్ట్రాల్లో ఈడీ విచారణ జరుపుతోంది. చదవండి: నాకున్న కోరికల్లా ఒక్కటే.. దానికోసం ఎంతవరకైనా, ఎక్కడిదాకానైనా వెళ్తా.. మనోజ్ పోస్ట్