ఖుష్బూ పవర్‌ఫుల్‌ రీ–ఎంట్రీ ! | Powerful re-entry! | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 29 2016 8:12 AM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవి ‘స్టాలిన్‌’ చిత్రంలో చిరూకి అక్కగా నటించారు ఖుష్బూ. ఆ చిత్రం విడుదలై పదేళ్లవుతోంది. ఇప్పుడు తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ సినిమాతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి రీ–ఎంట్రీ ఇస్తున్నారు. ‘స్టాలిన్‌’ తర్వాత ‘యమదొంగ’లో అతిథి పాత్రలో కనిపించిన ఖుష్బూ తొమ్మిదేళ్ల తర్వాత నటించనున్న తెలుగు చిత్రం ఇది. పవన్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) ఓ చిత్రం నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందులో కీలక పాత్రకి ఖుష్బూని తీసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement