‘సినిమా వాళ్లు మాత్రమే అని భ్రమ కలిగిస్తున్నారు’ | actor narayanamurthy respond on durgs mafia in tollywood | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 24 2017 2:15 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

డ్రగ్స్‌ కేసులో కేవలం సినిమా రంగాన్నే టార్గెట్‌ చేయడం సరికాదని సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. సిట్‌ అధికారులు, మీడియా కలిసి సినిమాలు తీసేవాళ్లకే సినిమా చూపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్‌. నారాయణమూర్తి సోమవారమిక్కడ మాట్లాడుతూ సినిమా వాళ్లు మాత్రమే డ్రగ్స్‌ వాడుతున్నట్లు భ్రమ కలిగిస్తున్నారన్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు చెందిన ఉద్యోగులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు కూడా డ్రగ్స్‌ వాడుతున్నారని నారాయణమూర్తి అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement