Puri Jagannadh
-
గత సినిమాలు డిజాస్టర్స్.. అయినా పూరీకి మరో ఛాన్స్?
ఇప్పుడంటే రాజమౌళి, సుకుమార్ అంటున్నారు. కానీ ఒకప్పుడు వీళ్లకంటే ఎక్కువగా కల్ట్ సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్ కిక్కిచ్చిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్. తనదైన మాస్ మూవీస్ తీయడంలో స్పెషలిస్ట్ అయిన ఇతడు.. ట్రెండ్ ని పట్టుకోలేక లైన్ తప్పేశాడు. పాన్ ఇండియా ట్రెండ్ వెనకాల పడ్డాడు గానీ భారీ డిజాస్టర్స్ మూటగట్టుకున్నాడు. అలాంటిది ఇప్పుడు ఇతడికి ఓ తమిళ హీరో అవకాశమిచ్చాడట.(ఇదీ చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్)పూరీ జగన్నాథ్ అంటే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు అభిమానమే. కానీ అవే రొట్టకొట్టుడు మూవీస్ తీస్తూ తనపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాడు. 2019లో 'ఇస్మార్ట్ శంకర్' హిట్ కావడంతో పూరీ మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడేమో అనుకున్నారు. కానీ విజయ్ దేవరకొండతో 'లైగర్', రామ్ తో 'డబుల్ ఇస్మార్ట్' అని భారీ డిజాస్టర్స్ అందుకున్నాడు.దీంతో పూరీ పనైపోయింది, ఇక సినిమాలు తీస్తాడా లేదా అని చాలామంది అనుకున్నారు. మరోవైపు ఛార్మితోనూ కటిఫ్ చెప్పేశాడని రూమర్స్ వచ్చాయి. ఇవన్నీ వినిపిస్తున్న టైంలో తమిళ హీరో విజయ్ సేతుపతికి పూరీ ఓ కథ చెప్పి ఒప్పించాడని, మిగతా విషయాలు ఫైనల్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో చూడాలి?(ఇదీ చదవండి: థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్లు) -
పూరితో ఛార్మి కటీఫ్..!
-
టాలీవుడ్ కింగ్ తో పూరీ జగన్నాథ్..
-
పూరి జగన్నాథ్ టెర్రిఫిక్ కమ్ బ్యాక్
-
మరో సీక్వెల్ తో పూరి జగన్నాథ్, హీరో ఎవరంటే
-
దీన స్థితిలో పావలా శ్యామల.. సాయం చేసిన పూరీ తనయుడు
సీనియర్ నటి పావలా శ్యామల (Pavala Syamala) కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది. కనీసం మాట్లాడేందుకు కూడా శరీరం సహకరించడం లేదు. ఎవరైనా దయతలచి ఆదుకోమని చేతులెత్తి వేడుకుంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియో చూసిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ చలించిపోయాడు.ఆర్థిక సాయంహైదరాబాద్ శివార్లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీలో నివాసముంటున్న శ్యామలను కలుసుకున్నాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు. దీంతో శ్యామల ఎమోషనలైంది. డబ్బు ఎవరైనా సంపాదిస్తారు కానీ మంచి మనసు మాత్రం ఎవరూ సంపాదించలేరు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని ఆశీర్వదించింది.చదవండి: సైఫ్ను ఆవేశంతో పొడిచాడు.. నా నగల జోలికి వెళ్లలేదు: కరీనా -
దేవుడి పేరుతో ఉపవాసం ఉండండి : పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh) కొన్నాళ్లుగా యూట్యూబ్ వేదికగా ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. పూరి నిర్వహిస్తున్న ఈ పాడ్కాస్ట్కి మంచి ఫాలోయింగ్ ఉంది. సరికొత్త విషయాలను చెబుతూ తన అభిమానులకు జ్ఞానంతో పాటు కొన్ని విషయాల్లో ధైర్యాన్ని కూడా అందిస్తున్నాడు. తాజాగా ఈ డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ ‘ఆటోఫజీ’ అనే పదానికి అర్థం వివరిస్తూ దాని వెనుక ఉన్న కథను చెప్పాడు.‘‘ఆటోఫజీ’అనేది ఓ గ్రీకు పదం. ఆటో అంటే సెల్ఫ్ అని, ఫజీ అంటే తినడం అని అర్థం. దీన్నే ఇంగ్లీష్లో సెల్ఫ్ ఈటింగ్ అంటారు. ఇది శరీరంలో జరిగే జహన ప్రక్రియ. మన శరీరంలో ఉన్న పనికి రాని, దెబ్బతిన్న కణాలను మన శరీరమే తినేస్తుంది. ఆటోఫజీ(Autophagy) అనేది శరీరంలో జరిగే రీసైక్లింగ్ ప్రక్రియ. మన ఆరోగ్యానికి హానికలిగించే ఏ పదార్థం ఉన్నా, దాన్ని కూడా బయటకు పంపుతుంది. అలాగే, దెబ్బతిన్న ప్రొటీన్లను తీసేస్తుంది. ఈ ఆటోఫజీ వల్ల మన మెటబాలిజం పెరిగి, మరింత శక్తి చేకూరుతుంది. వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్లాంటి రోగాలు రాకుండా చేస్తుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు, వ్యాయామం చేసినప్పుడే ఈ ఆటోఫజీ సక్రమంగా జరుగుతుంది. హీట్ అండ్ కోల్డ్ థెరపీలోనూ బాగా పనిచేస్తుంది. దీని వల్ల మన జీవన కాలం పెరుగుతుంది. మన ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. అందుకే పెద్దలు ఉపవాసం అలవాటు చేశారు. మీరు కూడా ఏదో ఒక దేవుడి పేరు చెప్పి, అప్పుడప్పుడు ఉపవాసాలు చేయండి. మీ వ్యాధి నిరోధకశక్తి, మెదడు పనితీరు పెరుగుతుంది. రోజూ వ్యాయామం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిది. మన టిష్యులు రిపేర్ అయి, శరీరంలో హీలింగ్ ప్రక్రియ వేగం అవుతుంది. జపాన్కు చెందిన యష్నోరి అనే బయాలజిస్ట్ ఈ ఆటోఫజీ గురించి మొదట కనుక్కొన్నాడు. అతడికి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఉపవాసాలు, వ్యాయామాలు, చన్నీటి స్నానాల వల్ల ఆటోఫజీ యాక్టివేట్ అయి, ఆరోగ్యంగా ఉంటారు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే, మీ డాక్టర్ను సంప్రదించండి’ అని పూరి అన్నారు. ఇక సినిమాల విషయాలకొస్తే..పూరి ఇటీవల తెరకెక్కించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్దా బోల్తా కొట్టాయి. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ‘లైగర్’ డిజాస్టర్గా నిలిచింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా తీసిన డబుల్ ఇస్మార్ట్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో పూరి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం పలు కథలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ స్టార్ హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
రవితేజకు 'నంది అవార్డు' తెచ్చిన సినిమా రీరిలీజ్పై ప్రకటన
మాస్ మహారాజా రవితేజ- డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా రీరిలీజ్ కానుంది. ఈమేరకు తాజాగా విడుదులైన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, థియేటర్లలో డిజాస్టర్గా నిలిచిన ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 2008లో విడుదలైన 'నేనింతే' చిత్రంలో రవితేజ,శియా గౌతం జోడీగా మెప్పించారు. పూరి దర్శకత్వానికి చక్రి సంగీతం తోడైతే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మ్యూజికల్గా ఈ చిత్రంలోని చాలా పాటలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.సుమారు 16 ఏళ్ల తర్వాత నేనింతే చిత్రం రీరిలీజ్ కానుంది. రవితేజ బర్త్డే సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు చిత్ర మేకర్స్ ప్రకటించారు. ఈమరకు ఒక పోస్టర్ను కూడా అభిమానులతో పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో తమ టాలెంట్ చూపించాలని చాలామంది హైదరాబాద్ వస్తుంటారు. అలా కృష్ణ నగర్లో అడుగుపెట్టిన వారి కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ.. దర్శకుడు పూరి జగన్నాథ్ నేనింతే మూవీని తెరకెక్కించాడు. చిత్ర పరిశ్రమలో సక్సెస్ కావడం వెనుక దాగి ఉన్న కష్టాలను చాలా ఎమోషనల్గా ఈ మూవీలో పూరి చూపించాడు. ఈ మూవీ కమర్షియల్గా ఫెయిల్యూర్ అయినప్పటికీ ఉత్తమ నటుడిగా రవితేజకు నంది అవార్డు దక్కింది. ఇదే చిత్రానికి గాను ఉత్తమ మాటల రచయితగా పూరీ జగన్నాథ్, ఉత్తమ ఫైట్ మాస్టర్స్గా రామ్ లక్ష్మణ్లకు నంది అవార్డ్స్ లభించాయి.నేనింతే సినిమాలో రవితేజకు జోడీగా శియా గౌతమ్ హీరోయిన్గా తొలి పరిచయం అయింది. ఆమెకు అదితి గౌతమ్ అని మరో పేరు కూడా ఉంది. నేనింతే చిత్రంలో శియా నటనకు మంచి గుర్తింపు దక్కింది. అయినా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే, ముంబయికి చెందిన వ్యాపార వేత్తతో రీసెంట్గా ఆమె పెళ్లి కూడా అయిపోయింది. నేనింతే చిత్రంలో బ్రహ్మానందం, వేణుమాధవ్, సుప్రీత్, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపించారు. ఇదే మూవీలో డైరెక్టర్లు హరీష్ శంకర్, వీవీ వినాయక్, కోన వెంకట్తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కూడా గెస్ట్ రోల్స్ కనిపించడం విశేషం. -
'ఇలాంటివి ఇండియాలో కూడా దొరికితే'.. పూరి జగన్నాధ్ ఆసక్తికర సందేశం
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చివరిసారిగా డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను హీరోయిన్ ఛార్మి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మించారు.ఇక సినిమాల విషయం పక్కనపెడితే పూరి జగన్నాధ్ తన మోటివేషనల్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంటారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీటిని విడుదల చేస్తుంటారు. ఇటీవల వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తున్న డైరెక్టర్ పూరి జగన్నాధ్ తాజాగా మరో ఆసక్తికర సబ్జెక్ట్తో అభిమానులను పలకరించారు. అదేంటో మీరు చూసేయండి.అమెరికాకు చెందిన ప్రముఖ డిజైనర్ ఏంజెలా లూనా తయారు చేసిన జాకెంట్ గురించి ఈ వీడియోలో ప్రస్తావించారు. మనదేశంలో ఎలాంటి నీడ లేని వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఎవరైనా ఇండియాలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తే ఎందరో అభాగ్యులకు మేలు చేసిన వారవుతారని వీడియోలో మాట్లాడారు.పూరి జగన్నాధ్ తన మ్యూజింగ్లో మాట్లాడుతూ..' యుద్ధాల కారణంగా ఇంటిని వదిలి కట్టుబట్టలతో పెళ్లాం పిల్లలను తీసుకుని వేరే ప్రాంతాలకు వలసపోతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇతర దేశాల్లో వీరికి ఇల్లు అనేదే ఉండదు. ముఖ్యంగా నైజీరియా, హోండురస్, ఇరాక్, సూడాన్, ఇండియా, చైనా, ఇథియోపియా, కాలిఫోర్నియా, న్యూయార్క్ ఫ్లోరిడాలో ఇల్లులేని వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇండియాలో 4 కోట్ల మంది అడుక్కు తినేవాళ్లున్నారు. ప్రపంచ జనాభాలో ఐదుశాతం మందికి ఇల్లులేదు. వీళ్ల కష్టాలు వర్ణనాతీతం.కొంతమంది వడదెబ్బ, తీవ్రమైన చలికి తట్టుకోలేక చనిపోతున్నారు. ఇల్లు వాకిళ్లు వదిలేసి ఒక మనిషి, తనకు అవసరమైనవి మాత్రమే తీసుకుని ఒక బ్యాగ్లో వేసుకుని బయలు దేరాల్సి వస్తే ఏం వేయాలో తెలియదు. దేన్నీ వదులుకోలేం. అలాంటి బ్యాగ్ చాలా బరువుగా ఉంటుంది. దాన్ని పట్టుకుని మోసుకుంటూ నడవాలంటే ఎంత కష్టం. బట్టలు, గిన్నెలు, స్టవ్ చాలా బరువు ఉంటాయి. ఆఖరికి దుప్పటి పట్టుకెళ్లాలన్న కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది. ఇక టెంట్ను మోసుకువెళ్లే శక్తి ఉండదు' అని మాట్లాడారు.పూరి చెబుతూ.. 'ఇలాంటి వారు వసతి సౌకర్యం లేకపోవడం వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. ఇలాంటి వారి కోసం న్యూయార్క్కు చెందిన ఏంజెలా లూనా అనే డిజైనర్ అద్బుతమైన ఐడియాతో సరికొత్త జాకెట్ చేసింది. దాని పేరే జాకెంట్. జాకెట్ను, టెంట్ను కలిపి చేసిన డిజైన్. దీన్ని మీరు జాకెట్లా వేసుకోవచ్చు. అలా ఎక్కడైనా పడుకోవాల్సి వస్తే.. టెంట్గా మారిపోతుంది. ఇది ఎంతో మంది సిరియా శరణార్థులను కాపాడింది. చాలా మంది డిజైనర్లు సెలబ్రిటీలు, డబ్బున్న వాళ్లకోసం కోసం లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. వాటన్నింటి కంటే గ్రేట్ డిజైన్ ఇది. ఒక్కసారి మీరు గూగుల్ చేసి ఏంజెలా లూనా జాకెంట్ డిజైన్ చూడండి. దీన్ని అందరూ ప్రశంసించాలి. అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. అయిే ఈ జాకెంట్ ఇండియాలోకి రాలేదు. ఇలాంటివి మనదేశంలో వస్తే అడక్కునేవాళ్లకు దుప్పట్లు గిప్ట్గా ఇవ్వొచ్చు. ఏదైనా కంపెనీ వీటిని ఇండియాలో వీటిని పరిచయం చేస్తే బాగుంటుందని ఆశ. ఇదే ఐడియాను తీసుకుని తయారు చేసినా, సంతోషమే. ఎంతో మందిని కాపాడిన వాళ్లు అవుతారు. త్వరలోనే జాకెంట్ భారత్లో దొరుకుతుందని ఆశిస్తున్నా'అని అన్నారు. -
అలా చేస్తే కచ్చితంగా లీడర్ అవుతారు: పూరి జగన్నాధ్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇటీవల వరుస మ్యూజింగ్స్ రిలీజ్ చేస్తున్నారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా జీవితంలో ఎలా నడుచుకోవాలో తన మాటల ద్వారా మోటివేట్ చేస్తున్నారు. తాజాగా ప్లే ఫూలిష్ అనే కాన్సెప్ట్తో మరో కొత్త మ్యూజింగ్ను విడుదల చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి.పూరి మ్యూజింగ్స్లో మాట్లాడుతూ.. 'ది ఆర్ట్ ఆఫ్ ప్లేయింగ్ ఫూలిష్.. ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి చాలామంది సైకాలజిస్టులు చెప్పే థియరీ ప్లే ఫూలిష్.. అది నీ బిజినెస్, జాబ్లో చాలామంది పోటీదారులు, సీనియర్స్, అనుభవజ్ఞులు ఉంటారు. నీకంటే బాగా సక్సెస్ అయినవాళ్లు ఉంటారు. వాళ్లందరినీ స్మూత్గా డీల్ చేసే థియరీ ప్లే ఫూలిష్. అంటే నిజంగానే ఫూల్లా ఉండటం కాదు. వాళ్ల ముందు తక్కువ నాలెడ్జ్ వాళ్లలా కనిపించడం. ఈ స్ట్రాటజీ మీరింకా నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అవతలి వ్యక్తి చెప్పే మాటలు వినటం నేర్చుకుంటే మనం ఎంత మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? అనే విషయాలు అర్థమవుతాయి. నీ పోటీదారులను ఎప్పుడు శత్రువులుగా చూడొద్దు. వారిని మెంటార్స్గా భావించండి. అతను, నువ్వు ఓకే బిజినెస్ చేస్తున్నా.. అతనికంటే నీకు తక్కువ తెలుసనే ఫీలింగ్ రావాలి' అని సూచించారు.ఇదేమీ మానిపులేటేడ్ టాక్టిక్ కాదు.. వాదించడం మానేసి.. జీనియస్గా వ్యవహరించడం.. నువ్వు తక్కువ నాలెడ్జ్ వాడిలా కనిపించినప్పుడు.. అవతలివాళ్లు నిన్ను ఇబ్బందిగా భావించరు. నీపై ఫోకస్ పెట్టరు. నీకు తెలిసినా సరే బేసిక్స్ చెప్పమని అడగండి. అలా అడిగితేనే అవతలివాళ్లు ఆనందంగా సమాధానం చెబుతారు. వాళ్లు ఏమనుకుంటున్నారో వినాలి.. అప్పుడే ఎక్కువ నేర్చుకుంటాం. నీవల్ల వాళ్లకి ఇబ్బంది లేదని ఫీలవ్వాలి. అప్పుడే వాళ్ల స్ట్రాటజీలు మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో చర్చలు జరపాలంటే నాలెడ్జ్ చాలా అవసరం. అది నీ సీనియర్స్, పోటీదారుల నుంచి నేర్చుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది? వాళ్ల స్కిల్స్ ఏంటో మీకు అర్థమవుతాయి. అందుకే మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైనా చెబితే నేర్చుకుంటా అనేలా ఉండాలి. నీకే ఎక్కువ తెలిసినట్లు మాట్లాడితే.. అవతలి వ్యక్తి ఏది నీతో షేర్ చేసుకోడు. పైగా నువ్వు వాడి దృష్టిలో అహంకారిగా కనిపిస్తావు. అందరితో శత్రుత్వం మనకెందుకు? మీరు ఏదైనా అనుకుంటే అందులో సూచనలు చేయమని అడుగుతూ ఉంటే మంచిది. వాళ్లు మీ జీవితంలో సపోర్టింగ్ పర్సన్ అవుతాం. సోక్రటీస్ ఒకమాట చెప్పాడు. 'నాకు తెలిసింది ఏంటంటే.. ఏమీ తెలియదని'. మనం కూడా అదే ఫాలో అవ్వాలి. ఎప్పుడూ బిగినర్స్ మైండ్ సెట్తోనే ఉండాలి. అబ్రహాం లింకన్ ఇలాగే ఉండేవాడట. ఎదుటి వాడి జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయొద్దు. మీకు ఎన్నో స్ట్రాటజీలు అర్థమవుతాయి. ప్లే ఫూలిష్ పవర్ఫుల్. ఈ ఆర్ట్లో మాస్టర్ అయితే మీరు లీడర్గా మంచి పొజిషన్లో ఉంటారు' అని చెప్పారు.కాగా.. ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ పోతినేని, కావ్యథాపర్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రాన్ని ఛార్మి కౌర్, పూరి జగన్నాధ్ నిర్మించారు. -
అలా చేస్తే సక్సెస్ఫుల్గా పనికి రాకుండా పోతారు: పూరి జగన్నాధ్
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్తో ప్రేక్షకులను అలరించాడు. రామ్ పోతినేని, కావ్యథాపర్ జంటగా నటించిన బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. గతంలో సూపర్ హిట్గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో బిగ్బుల్గా కనిపించారు.సినిమాల విషయం పక్కనపెడితే.. దర్శకుడు పూరి మ్యూజింగ్స్ పేరుతో మోటివేషనల్ సందేశాలు ఇస్తుంటారు. జీవితంలో తను అనుభవాలతో పాటు గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ఇలాంటి వాటిని పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన మరో గొప్ప సందేశాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంటారు. అదేంటో మనం కూడా వినేద్దాం.పూరి మ్యూజింగ్లో మాట్లాడుతూ..' చైనాలో లావోజు అనే గ్రేట్ ఫిలాసఫర్ ఉన్నారు. ఆయన 571 బీసీలో జన్మించారు. ఆయనొక మంచి మాట చెప్పారు. నీ ఆలోచనలను గమనించు. ఎందుకంటే అవే నీ మాటలవుతాయి. నీ మాటలే నీ యాక్షన్స్ అవుతాయి. అవే నీ అలవాట్లు.. ఆ తర్వాత అదే నీ క్యారెక్టర్ అవుతుంది. మరి మనకు థాట్స్ ఎలా వస్తాయి. మనం రోజు దేన్నైతే చూస్తామో అవే గుర్తుకొస్తాయి. చదివే పుస్తకాలు, చూసే వీడియోలు, సంభాషణలన్నీ మన ఆలోచనలు మార్చేస్తాయి. పనికిరానివన్నీ చూస్తూ టైమ్ పాస్ చేస్తే అతి తక్కువ కాలంలో మీరు కూడా సక్సెస్ఫుల్గా పనికి రాకుండా పోతారు. ' అని అన్నారు.ఆ తర్వాత..' మనం మొబైల్లో రోజు ఎన్నో చూస్తుంటాం. రోడ్డెక్కితే ఏదో ఒకటి మనం చూస్తుంటాం. వీటిలో మనం దేనికైనా ఎమోషనల్ అయితే.. అందులోనే మనం కొట్టుకుపోతాం. రోజు నాలెడ్జ్ పెంచుకోకపోయినా ఫర్వాలేదు.. నాన్ సెన్స్ తీసుకోకపోతే చాలు. అందుకే మంచిది, మనకు పనికొచ్చేది మాత్రమే తీసుకుంటే మంచిది. అప్పుడే మన థాట్స్ మారతాయి. మన క్యారెక్టర్తో పాటు రాత కూడా మారుద్ది. ' అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా మన పూరి జగన్నాధ్ చెప్పినవి జీవితంలో పాటిస్తే సక్సెస్ అవ్వాలంటే తప్పకుండా పాటించాల్సిందే. -
ప్రభాస్తో పూరి జగన్నాథ్ సినిమా... ఈ సారి డైరెక్షన్ కాదు!
హీరో ప్రభాస్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూడో సారి కలసి పని చేయనున్నారని ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా ‘బుజ్జిగాడు’(2008), ‘ఏక్ నిరంజన్’(2009) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు పూరి జగన్నాథ్. అయితే మూడోసారి మాత్రం ప్రభాస్ చిత్రాన్ని డైరెక్షన్ చేయడం లేదు పూరి. ‘స్పిరిట్’ చిత్రానికి పూరి జగన్నాథ్ డైలాగులు అందించబోతున్నారని టాక్. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్లనుంది. కాగా ‘స్పిరిట్’ సినిమాకి డైలాగ్స్ రాసే బాధ్యతను పూరి జగన్నాథ్కు సందీప్ రెడ్డి అప్పగించినట్లు సినీ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. సందీప్ స్వయంగా అడగడంతో పూరి కూడా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రభాస్తో తనకున్న స్నేహ బంధం ఓ కారణం అయితే.. సందీప్ స్టోరీకి డైలాగులు రాస్తే అది మరింతగా రీచ్ అవుతుందన్నది మరో ఆలోచన అట. అందువల్లే ఆయన అంగీకరించి ఉంటారని భోగట్టా. అయితే ఈ విషయంపై స్పష్టత రావాలంటే యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకూ వేచిచూడాల్సిందే. ఇదిలా ఉంటే.. ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించే సినిమాపై స్పష్టత రావాల్సి ఉంది. -
యాక్షన్.. కట్.. ఓకే.. చెప్పెదెప్పుడు?
ఓ సినిమా విజయం అనేది డైరెక్టర్ల కెరీర్ని నిర్ణయిస్తుంది అంటారు. హిట్టు పడితే వరుస ఆఫర్లు వస్తాయి. అదే ఫ్లాపులొస్తే కెరీర్కి బ్రేకులు పడతాయి. నెక్ట్స్ చాన్స్ ఇచ్చే హీరో ఎవరు? అనే ప్రశ్న మొదలవుతుంది. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండానూ అవకాశాలు దక్కుతాయనుకోండి. కానీ కారణం ఏదైనా ప్రస్తుతం కొందరు దర్శకులు మాత్రం ఏ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేయలేదు. వాట్ నెక్ట్స్? అనే ప్రశ్నకు జవాబు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి.ఆ వివరాల్లోకి వెళదాం... కృష్ణవంశీ పేరు చెప్పగానే కుటుంబ కథా చిత్రాలు గుర్తొస్తాయి. బంధాలు, బంధుత్వాలు, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగాలను తనదైన శైలిలో తెరకెక్కిస్తుంటారాయన. అంతేకాదు... సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, వాస్తవ ఘటనల నేపథ్యంలోనూ సినిమాలు రూపొందిస్తుంటారు కృష్ణవంశీ. తొలి సినిమా ‘గులాబీ’ నుంచి గత ఏడాది తెరకెక్కించిన ‘రంగ మార్తాండ’ వరకూ మధ్యలో ‘నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ, శశిరేఖా పరిణయం, గోవిందుడు అందరివాడేలే’...’ ఇలా పలు హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు కృష్ణవంశీ. కాగా 2017లో వచ్చిన ‘నక్షత్రం’ తర్వాత దాదాపు ఆరేళ్లు గ్యాప్ తీసుకున్నారాయన. ఆ తర్వాత వచ్చిన ‘రంగమార్తాండ’ (2023) సినిమా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించి, కన్నీరు పెట్టించింది. ఆ చిత్రం తర్వాత కృష్ణవంశీ ప్రాజెక్టుపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా లేదు. సో... నెక్ట్స్ ఏంటి? అంటే వెయిట్ అండ్ సీ. ఒకప్పుడు కమర్షియల్ హిట్స్కి కేరాఫ్గా నిలిచిన పూరి జగన్నాథ్ ఇప్పుడు సక్సెస్ వేటలో ఉన్నారు. ‘బద్రి, ఇడియట్, పోకిరి, దేశ ముదురు, చిరుత, బుజ్జిగాడు, బిజినెస్మేన్, టెంపర్, పైసా వసూల్, ఇస్మార్ట్ శంకర్’ వంటి ఎన్నో హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకున్నారు పూరి. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత ఆయన్ని హిట్ వరించలేదు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి తెరకెక్కించిన పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘లైగర్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్గా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక΄ోయింది. దీంతో నెక్ట్స్ పూరి జగన్నాథ్ ్ర΄ాజెక్ట్ ఏంటి? ఏ హీరోతో ఆయన సినిమా చేయనున్నారు? వంటి ప్రశ్నలకి జవాబు లేదు. ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేశ్బాబు, అల్లు అర్జున్, రామ్చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలకు ఆయన హిట్స్ ఇచ్చారు. ప్రస్తుతం వారంతా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఇప్పటికిప్పుడు పూరి జగన్నాథ్కి డేట్స్ ఇచ్చే వీలు లేదు. ఇలాంటి సమయంలో ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో ΄ాటు ప్రేక్షకుల్లో నెలకొంది. సరైన కథ, కాంబినేషన్ కుదిరితే మళ్లీ ఆయన బౌన్స్ బ్యాక్ అవడం కష్టమేమీ కాదు. మాస్ సినిమాలు తీయడంలో వీవీ వినాయక్ శైలి ప్రత్యేకం. హీరోలకు మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలోనూ ఆయనకి ఆయనే సాటి. అలాగే కమర్షియల్ సినిమాలకు కొత్త విలువలు నేర్పిన దర్శకుడిగా వినాయక్కి పేరుంది. ‘ఆది, చెన్నకేశవ రెడ్డి, దిల్, ఠాగూర్, బన్ని, లక్ష్మి, యోగి, కృష్ణ, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్ 150’ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారాయన. అయితే చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ (2017) సినిమా హిట్ తర్వాత వినాయక్ తీసిన ‘ఇంటెలిజెంట్’ (2018) సినిమా నిరాశపరచింది. ఆ చిత్రం తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు వినాయక్. ప్రభాస్ హిట్ మూవీ ‘ఛత్రపతి’ సినిమాని బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో హిందీలో ‘ఛత్రపతి’ (2023) పేరుతోనే రీమేక్ చేశారు. ఆ తర్వాత ఆయన్నుంచి కొత్త ్ర΄ాజెక్ట్ ప్రకటన ఏదీ రాలేదు. ఆ మధ్య ‘దిల్’ రాజు నిర్మాతగా వీవీ వినాయక్ హీరోగా ఓ సినిమా రానుందంటూ వార్తలు వచ్చాయి. ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్ని సైతం మార్చుకున్నారు వినాయక్. అయితే ఆ సినిమా పట్టాలెక్కలేదు. మరి ఇప్పుడు వినాయక్ ప్రయాణం డైరెక్టర్గానా? నటుడిగానా? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. కల్యాణ్రామ్ హీరోగా రూపొందిన ‘అతనొక్కడే’ (2005) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు సురేందర్ రెడ్డి. ‘కిక్, రేసుగుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారాయన. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. అయితే అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్’(2023) సినిమా భారీ అంచనాలతో విడుదలైనా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేక΄ోయింది. ఆ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి తెరకెక్కించబోయే మూవీపై ఇప్పటివరకూ ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. ఫలానా హీరోతో ఆయన నెక్ట్స్ మూవీ ఉంటుందనే టాక్ కూడా ఇప్పటివరకూ ఎక్కడా వినిపించలేదు. మరి... ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనే ప్రశ్నకు జవాబు రావాలంటే వేచి ఉండాలి. ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ (2007) మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు వంశీ పైడిపల్లి. తెలుగులో ఇప్పటివరకూ ఆయన తీసింది ఐదు చిత్రాలే అయినా (మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి) అన్నీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మహేశ్బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ (2019) సినిమా తర్వాత ఆయన మరో తెలుగు సినిమా చేయలేదు. విజయ్ హీరోగా తమిళంలో ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమా చేశారు. ఈ చిత్రం విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఆయన తర్వాతి ్ర΄ాజెక్టుపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. ఆ మధ్య షాహిద్ కపూర్ హీరోగా వంశీ ఓ బాలీవుడ్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారనే వార్తలొచ్చాయి. తెలుగు సినిమాలని డబ్బింగ్ చేసి హిందీలో విడుదల చేసే గోల్డ్ మైన్ అనే సంస్థ ఈ ్ర΄ాజెక్టును నిర్మించనుందని, ఆగస్టులో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుందనే వార్తలు వినిపించినా ఈ ్ర΄ాజెక్టు ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. మరి వంశీ పైడిపల్లి తర్వాతి చిత్రం టాలీవుడ్లోనా? బాలీవుడ్లోనా? లేకుంటే మరో భాషలో ఉంటుందా? అనేది చూడాలి. దర్శకుడు పరశురాం ‘గీతగోవిందం’ (2018) సినిమాతో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాదు... హీరో విజయ్ దేవరకొండని వంద కోట్ల క్లబ్లోకి తీసుకెళ్లారు పరశురాం. ఆ సినిమా హిట్ అయినా నాలుగేళ్లు వేచి చూశారాయన. ఆ తర్వాత మహేశ్బాబు హీరోగా ‘సర్కారువారి ΄ాట’ (2022) సినిమా తీసి, హిట్ అందుకున్నారు. అనంతరం విజయ్ దేవరకొండ హీరోగా‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం తీశారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. ఈ సినిమా రిలీజై ఆర్నెళ్లు దాటినా పరశురాం తర్వాతి సినిమాపై స్పష్టత లేదు. గతంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా చేయనున్నారనే వార్తలు వినిపించినా ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ‘ఫ్యామిలీ స్టార్’ నిర్మించిన నిర్మాత ‘దిల్’ రాజు బ్యానర్లోనే పరశురామ్ మరో సినిమా చాన్స్ ఉందని టాక్. మరి ఆయన నెక్ట్స్ ్ర΄ాజెక్ట్ ఏంటి? అనేది వేచి చూడాలి. ఇరవయ్యేళ్ల ప్రయాణంలో ఏడు సినిమాలు తీశారు దర్శకుడు మెహర్ రమేశ్. వాటిలో రెండు కన్నడ సినిమాలున్నాయి. ఆయన తీసిన ఐదు తెలుగు చిత్రాలు ‘కంత్రి, బిల్లా, శక్తి, షాడో, బోళా శంకర్’. వెంకటేశ్తో తీసిన ‘షాడో’ (2013) తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు మెహర్ రమేశ్. అయితే ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత చిరంజీవి రూపంలో అదృష్టం ఆయన్ని వరించింది. ‘బోళా శంకర్’ సినిమా చేసే మంచి అవకాశం ఇచ్చారు చిరంజీవి. 2023 ఆగస్టు 11న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా రిలీజై ఏడాదికి పైగా అయినప్పటికీ తన తర్వాతి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి.. మెహర్ రమేశ్ నెక్ట్స్ మూవీ ఏంటి? వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే... 2021న విడుదలైన నితిన్ ‘చెక్’ మూవీ తర్వాత డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి తర్వాతి సినిమాపై ఇప్పటికీ స్పష్టత లేదు. అలాగే ‘అన్నీ మంచి శకునములే’ (2023) తర్వాత దర్శకురాలు నందినీ రెడ్డి నెక్ట్స్ ్ర΄ాజెక్ట్ ఏంటి? అనేదానిపై క్లారిటీ లేదు. అదే విధంగా ‘ఆర్ఎక్స్ 100’ మూవీ ఫేమ్ అజయ్ భూపతి ‘మంగళవారం’ (2023) సినిమా రిలీజై దాదాపు ఏడాది కావస్తున్నా ఆయన తర్వాతి చిత్రంపై ఎలాంటి అప్డేట్ రాలేదు. కాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు 1’ సినిమా 2023లో విడుదలైంది. ఈ మూవీకి సీక్వెల్గా ‘పెదకాపు 2’ ఉంటుందని చిత్రయూనిట్ గతంలో ప్రకటించినా ఇప్పటివరకూ ఎలాంటి వివరాలు తెలియరాలేదు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘ఖుషి’ సినిమా విడుదలై ఏడాది దాటి΄ోయినా ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనేదానిపై ఎలాంటి ప్రకటన లేదు. అదే విధంగా ‘ఘాజీ’ మూవీ ఫేమ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి నెక్ట్స్ ప్రాజెక్ట్పైనా ఎలాంటి అప్డేట్ లేదు. ఆయన తెరకెక్కించిన ‘ఐబీ 71’ (2023) అనే హిందీ చిత్రం రిలీజై ఏడాదిన్నర దాటినా తర్వాతి సినిమా టాలీవుడ్లో ఉంటుందా? బాలీవుడ్లో ఉంటుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.– డేరంగుల జగన్ -
పూరితో అఖిల్ మూవీ ఫిక్స్..
-
టాప్ హీరో ఫ్యామిలీ నుంచి పూరీ జగన్నాథ్కు ఆఫర్
టాలీవుడ్లో మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా పూరీ జగన్నాథ్కు గుర్తింపు ఉంది. తమ హీరో ఒక్క సినిమా అయినా పూరీ డైరెక్షన్లో చేయాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. అయితే, లైగర్,డబుల్ ఇస్మార్ట్ వంటి వరుస ప్లాపులతో ఆయన ప్రస్తుతం సతమతం అవుతున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన ఏ హీరోతో సినిమా చేస్తారా..? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈసారి బలమైన కథతో పాటు ఇండస్ట్రీలో హిట్ కొట్టాలని ఆయన పక్కా ప్లాన్తో రానున్నారని టాక్.వరసు ప్లాపులతో ఉన్న దర్శుకుడితో సినిమా చేసేందుకు చాలామంది హీరోలు జంకుతారు. కానీ, పూరీ కాస్త డిఫరెంట్ ఒటమి వస్తే ఎలా నిలబడాలో తెలిసిన డైరెక్టర్.. అందుకే ఆయనకు అక్కినేని కుటుంబం నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అక్కినేని హీరోలకు కూడా ఈ మధ్య పెద్దగా హిట్లు పడలేదు. నాగార్జున (నా సామి రంగా), నాగ చైతన్య (కస్టడీ) సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసినా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక అఖిల్ చివరి సినిమా ఏజెంట్. ఈ చిత్రం వచ్చి రెండేళ్లు దాటుతుంది. ఆయనా, అతని నుంచి సినిమా ప్రకటన రాలేదు. అయితే, ఇప్పుడు పూరీ- అఖిల్ కాంబినేషన్లో సినిమా రానుందని ఎక్కువ ప్రచారం జరుగుతుంది. భారీ విజయం కోసం ఎదురుచూస్తున్న వారిద్దరూ కసితో ఒక ప్రాజెక్ట్ను తెరకెక్కించాలని ఉన్నారట. నాగార్జునకు శివమణి, సూపర్ వంటి సూపర్ హిట్లు ఇచ్చిన పూరీ ఇప్పుడు అఖిల్తో భారీ హిట్ కొట్టే ప్లాన్లో ఉన్నారట. ఇదే నిజమైతే ఈ భారీ ప్రాజెక్ట్కు రామ్ చరణ్ నిర్మాతగా ఉండే ఛాన్స్ ఉంది. -
టాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోని డైరెక్టర్.. కానీ ఇప్పుడిలా చూస్తుంటే! (ఫొటోలు)
-
బాలయ్య మూవీతో.. పూరి పంజా విసిరేనా..
-
బాలయ్యతో మరోసారి పూరి..
-
సైలెంట్గా ఓటీటీకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. బ్లాక్ బస్టర్ హిట్ ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్ను మెప్పించలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే డబుల్ ఇస్మార్ట్ అమెజాన్ ప్రైమ్లో సందడి చేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్దత్ కీలకపాత్ర పోషించారు. బిగ్బుల్గా అభిమానులను అలరించారు. థియేటర్లలో చూడడం మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.కథేంటంటే..ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) తన తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే పోగొట్టుకుంటాడు. తన తల్లి పోచమ్మ (ఝాన్సీ)ని చంపిన బిగ్ బుల్ (సంజయ్ దత్)ను పట్టుకునే పనిలో ఇస్మార్ట్ శంకర్ పడతాడు. మరో వైపు బ్రెయిన్ ట్యూమర్ వల్ల మూడు నెలల్లోనే చనిపోతానని బిగ్ బుల్కు తెలుస్తుంది. దీంతో తాను ఎలాగైనా బతకాలని అనుకుంటాడు. థామస్ (మకరంద్ దేశ్ పాండే) మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెబుతాడు. ఇస్మార్ట్ శంకర్ అనే వాడికి ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారని, అలా బిగ్ బుల్ మెమోరీనీ ఇస్మార్ట్ శంకర్కు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని థామస్ సూచిస్తాడు.దీంతో ఇస్మార్ట్ శంకర్ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం దిగుతుంది. మరో వైపు బిగ్ బుల్ కోసం ఇస్మార్ట్ శంకర్ కూడా వెతుకుతుంటాడు. ఇండియాలో బిగ్ బుల్ దిగాడని రా ఏజెన్సీకి తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ను పట్టుకుని మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ చేయిస్తాడు బిగ్ బుల్. నాలుగు రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్ కాస్తా బిగ్ బుల్గా మారిపోతాడని చెబుతారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? బిగ్ బుల్ను పట్టుకునేందుకు రా ఏం చేస్తుంది? ఈ కథలో ఇస్మార్ట్ శంకర్ ప్రేయసి జన్నత్ (కావ్యా థాపర్) పాత్ర ఏంటి? చివరకు ఇస్మార్ట్ శంకర్ ఏం చేస్తాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మారాల్సిన టైమ్ వచ్చిందేమో?
'మీరు మారిపోయారు సర్'.. పూరీ జగన్నాథ్ తీసిన టెంపర్ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇదే పూరీ జగన్నాథ్కి ప్రస్తుత పరిస్థితులకు సరిగా యాప్ట్ అవుతుందేమో? ఎందుకంటే ఒకప్పటి పూరీ వేరు. ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి వేరు. మరీ ముఖ్యంగా రీసెంట్ రిలీజ్ 'డబుల్ ఇస్మార్ట్' చూస్తుంటే అసలీ సినిమా తీసింది ఈయనేనా అనే సందేహం.(ఇదీ చదవండి: నేను ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసిన సినిమా ఇది: పూరి జగన్నాథ్)'బద్రి'లో పవన్ కల్యాణ్ 'నువ్వు నంద అయితే ఏంటి? నేను బద్రీ, బద్రీనాథ్' అన్నప్పుడు... 'ఇడియట్'లో రవితేజ 'కమీషనర్ల కూతుళ్లకి మొగుళ్లు రారా' అన్నప్పుడు గానీ... 'శివమణి'లో నాగార్జున 'నాక్కొంచెం మెంటల్' అన్నప్పుడు.. 'పోకిరి'లో మహేశ్ 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంటే ఆడే పండుగాడు' అన్నప్పుడు.. 'బిజినెస్మేన్'లో మహేశ్ 'ముంబైలో బతకడానికి రాలేదు, ఉ* పోయించడానికి వచ్చాను' అన్నప్పుడు.. 'నేనింతే'లో రవితేజ.. సినిమా కోసం డైలాగ్స్ చెప్పినప్పుడు గానీ మూవీ లవర్స్, మాస్ ఆడియెన్స్ ఉర్రూతలూగారు. పూరీపై ఇష్టం పెంచుకున్నారు.కానీ రీసెంట్ టైంలో పూరీ జగన్నాథ్ అంటే ఒక్కటంటే ఒక్క డైలాగ్ గుర్తురాదు. ఎందుకంటే ఆయన మార్క్ ఎప్పుడో మిస్ అయిపోయింది. 'బిజినెస్మేన్' వరకు పూరీ పెన్ను పవర్ వేరు.. ఆ తర్వాత వేరు. దాదాపు గత పదేళ్లుగా పూరీ జగన్నాథ్లోని అసలు సిసలు డైరెక్టర్ ఎక్కడో మిస్సయిపోయిన ఫీలింగ్!(ఇదీ చదవండి: ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ)లైగర్, పైసా వసూల్, రోగ్, మోహబూబా.. తాజాగా 'డబుల్ ఇస్మార్ట్'. ఈ సినిమాలన్నీ బాగున్నాయా బాగోలేవా అనే సంగతి పక్కనబెడితే పూరీ అభిమానుల బాధ వర్ణనాతీతం. మాకు ఇప్పుడు కనిపిస్తున్న పూరీ వద్దు.. ఒకప్పటి డైరెక్టర్ పూరీ జగన్నాథే కావాలని మారం చేసేంత ఇష్టం. మరోవైపు పూరీ జగన్నాథ్ ట్రెండ్కి తగ్గట్లు మారలేక ఒకే తరహా సినిమాలు తీస్తున్నాడో బాధ.ఎందుకంటే ఇప్పటి జనరేషన్ చాలామంది డైరెక్టర్స్కి పూరీ జగన్నాథ్ టెక్స్ట్ బుక్ లాంటోడు. కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నోడు. అలాంటి ఆయన ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం చూసి సగటు టాలీవుడ్ అభిమాని తట్టుకోలేకపోతున్నాడు. పూరీ సర్ మీరు మారాలేమో?(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్పై అధికారిక ప్రకటన) -
‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ
టైటిల్: డబుల్ ఇస్మార్ట్నటినటులు: రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, సాయాజీ షిండే, అలీ, గెటప్ శ్రీను తదితరులునిర్మాణ సంస్థ: పూరి కనెక్ట్స్నిర్మాతలు: పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్దర్శకత్వం:పూరీ జగన్నాథ్సంగీతం: మణిశర్మసినిమాటోగ్రఫీ: సామ్ కె. నాయుడు, జియాని జియానెలివిడుదల తేది: ఆగస్ట్ 15, 2024ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన లభించింది. ప్రమోషన్స్ అంతగా చేయకపోయినా.. బజ్ మాత్రం క్రియేట్ అయింది. మరి భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథ ఏంటంటే..ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) తన తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే పోగొట్టుకుంటాడు. తన తల్లి పోచమ్మ (ఝాన్సీ)ని చంపిన బిగ్ బుల్ (సంజయ్ దత్)ను పట్టుకునే పనిలో ఇస్మార్ట్ శంకర్ పడతాడు. మరో వైపు బ్రెయిన్ ట్యూమర్ వల్ల మూడు నెలల్లోనే చనిపోతానని బిగ్ బుల్కు తెలుస్తుంది. దీంతో తాను ఎలాగైనా బతకాలని అనుకుంటాడు. థామస్ (మకరంద్ దేశ్ పాండే) మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెబుతాడు. ఇస్మార్ట్ శంకర్ అనే వాడికి ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారని, అలా బిగ్ బుల్ మెమోరీనీ ఇస్మార్ట్ శంకర్కు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని థామస్ సూచిస్తాడు.దీంతో ఇస్మార్ట్ శంకర్ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం దిగుతుంది. మరో వైపు బిగ్ బుల్ కోసం ఇస్మార్ట్ శంకర్ కూడా వెతుకుతుంటాడు. ఇండియాలో బిగ్ బుల్ దిగాడని రా ఏజెన్సీకి తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ను పట్టుకుని మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ చేయిస్తాడు బిగ్ బుల్. నాలుగు రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్ కాస్తా బిగ్ బుల్గా మారిపోతాడని చెబుతారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? బిగ్ బుల్ను పట్టుకునేందుకు రా ఏం చేస్తుంది? ఈ కథలో ఇస్మార్ట్ శంకర్ ప్రేయసి జన్నత్ (కావ్యా థాపర్) పాత్ర ఏంటి? చివరకు ఇస్మార్ట్ శంకర్ ఏం చేస్తాడు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.ఎలా ఉందంటే..డబుల్ ఇస్మార్ట్ కథ, కోర్ పాయింట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది చాలా సిల్లీగా ఉంటుంది. చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోవడం, తల్లిని చంపిన వాడి కోసం ఇస్మార్ట్ శంకర్ ప్రయత్నించడం.. ఇక కథలోకి హీరోయిన్ ఎంట్రీ.. ఆమె వెనకాల హీరో పడటం ఇవన్నీ కూడా చాలా రొటీన్గా అనిపిస్తాయి. మధ్య మధ్యలో బోకా అంటూ అలీ అందరినీ విసిగిస్తాడు. ఏదో అలా తెరపై ఒక సీన్లో కనిపిస్తే జనాలు నవ్వుతారేమో. కానీ పదే పదే చూపించడంతో ప్రేక్షకుడికి సహన పరీక్షలా ఉంటుంది.ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇస్మార్ట్ శంకర్ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం చేసే ప్రయత్నాలతో నిండిపోతుంది. ఇక సెకండాఫ్లో అయినా కథ ఇంట్రెస్టింగ్గా సాగుతుందా? ఏమైనా సీరియస్గా ఉంటుందా? అని అనుకుంటే పొరబాటే. సెకండాఫ్లో ఎమోషన్ పార్ట్ కూడా వర్కవుట్ అవ్వలేదు. షాక్ కొట్టినట్టు, అపరిచితుడులో విక్రమ్ రోల్స్ మారినట్టుగా.. ఇస్మార్ట్ శంకర్లో ఎలా అయితే బ్రెయిన్లో మెమోరీ మారిపోతుందో ఇందులోనూ అలానే అనిపిస్తుంది.ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లో ప్రగతి నటన చూస్తే అందరికీ నవ్వొస్తుంది. అక్కడ ఎమోషన్ పండాల్సింది పోయి.. అందరూ నవ్వుకునేలా ఉంటుంది. ఇక సినిమా ఎండ్ కార్డ్ పడక ముందే థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చేలా కనిపిస్తోంది. పరమ రొటీన్ క్లైమాక్స్లా కనిపిస్తుంది. పూరి నుంచి ఇక కొత్తదనం, కొత్త కథలు ఆశించడం కూడా తప్పేమో అన్నట్టుగా కనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..రామ్ పోతినేని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర ఏదైనా సరే అందులో జీవించేస్తాడు. ఇక పక్కా తెలంగాణ యువకుడు శంకర్గా అదరగొట్టేశాడు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు చప్పట్లు కొట్టిస్తాయి. సంజయ్ దత్ ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. విలన్గా ఆయన అదరగొట్టేశాడు. రామ్, సంజయ్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక కావ్య థాపర్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. చాలా కాలం తర్వాత అలీ ఓ మంచి పాత్రలో కనిపించాడు. కానీ ఆయన కామెడీ వర్కౌట్ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు అంతంత మాత్రమే అయినా.. బీజీఎం మాత్రం అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
నేను ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసిన సినిమా ఇది: పూరి జగన్నాథ్
‘‘ఈ మధ్య సోషల్ మీడియాలో, బయట ఓ ట్రెండ్ చూస్తున్నాను. అరే... నీకిది నచ్చిందా? అని అడిగితే... వాళ్లకు నచ్చుతుందేమో... వీళ్లకు నచ్చుతుందేమో అని తోటివారిపైకి తోస్తున్నారు. ముందు మనకు నచ్చిందా? అని చూసుకోవాలి. మీకు నచ్చింది మీరు చేయండి. పక్కోడి గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే పనులు జరగవు. సాధారణంగా నేను సలహాలివ్వను. నా అనుకున్నవాళ్లు అడిగితే ఇస్తా. మీ అందర్నీ (ఫ్యాన్స్) నా వాళ్లుగా ఫీలై ఇస్తున్నాను’’ అని రామ్ అన్నారు.హీరో రామ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కాంబినేషన్లోనే 2019లో వచ్చిన హిట్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందింది. ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రల్లో నటించారు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్లో జరిగిన ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ మాట్లాడుతూ– ‘‘హీరోలు బుల్లెట్స్లాంటివారు. పేల్చే గన్ బాగుంటే బుల్లెట్ చాలా స్పీడ్గా వెళ్తుంది. పూరీగారిలాంటి గన్ ప్రతి ఒక్క యాక్టర్కి కావాలి. ఛార్మీ కౌర్గారు లేకపోతే ‘డబుల్ ఇస్మార్ట్’ లేదు. ఆమె ఓ ఫైటర్. బాస్ లేడీ అని పిలుస్తాను.‘డబుల్ ఇస్మార్ట్’ రేంజ్కి తగ్గట్లు, ప్రేక్షకుల అంచనాలను మించేలా మణిశర్మగారు మ్యూజిక్ ఇచ్చారు’’ అని అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘రామ్ లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. సంజయ్ దత్గారు మా సినిమాలో యాక్ట్ చేసి, కొత్త కలర్ తీసుకొచ్చారు. నా నిర్మాణసంస్థకు ఛార్మీ కౌర్ ఓ బలం. నా దగ్గర రూపాయి లేకపోయినా నాకోసం ఎవరన్నా నిలబడ్డారంటే అది విషురెడ్డి. హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ప్రశంసిస్తారు. నా ఫ్లాప్ సినిమా విడుదలైన వారానికి విజయేంద్రప్రసాద్గారు ఫోన్ చేసి, ‘సార్... నాకో హెల్ప్ చేస్తారా?’ అన్నారు. ఆయన కొడుకే పెద్ద డైరెక్టర్.. రాజమౌళి. అలాంటిది ఆయన నన్ను హెల్ప్ అడుగుతున్నారేంటి? అనుకున్నా. ‘తర్వాతి సినిమా ఎప్పుడు చేస్తున్నారు? చేసే ముందు ఆ సినిమా కథ నాకోసారి చెప్తారా? మీలాంటి దర్శకులు ఫెయిల్ కావడం చూడలేను. చిన్న చిన్న తప్పులేవో ఉంటుంటాయి. తీసే ముందు నాకోసారి చెప్పండి’ అన్నారు. నేను భావోద్వేగానికి గురయ్యాను. అయితే ‘డబుల్ ఇస్మార్ట్’ కథను విజయేంద్రప్రసాద్గారికి చెప్పలేదు. తెలిసిన పనే కదా... ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా తీశా’’ అని తెలిపారు పూరి జగన్నాథ్. ‘‘ఇస్మార్ట్ శంకర్’ను ఆదరించినట్లే ‘డబుల్ ఇస్మార్ట్’నూ ఆదరించండి’’ అన్నారు ఛార్మీ. పూరీ కనెక్ట్స్ సీఈవో విషు రెడ్డి, అలీ తదితరులు పాల్గొన్నారు. -
ముంబైలో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ టీమ్ సందడి (ఫొటోలు)
-
డబుల్ ఇస్మార్ట్ని ఎంజాయ్ చేస్తారు: సంజయ్ దత్
‘‘తెలుగు సినిమా డైనమిక్స్ని మార్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్. ‘డబుల్ ఇస్మార్ట్’లో నన్ను భాగం చేసి, బిగ్ బుల్గా చూపిస్తున్న ఆయనకి థ్యాంక్స్. రామ్తో పని చేయడంతో చాలా మజా వచ్చింది. ‘డబుల్ ఇస్మార్ట్’ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు’’ అని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అన్నారు. రామ్ పోతినేని, కావ్యా థాపర్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 15న ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది.మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘బిగ్ బుల్...’ అంటూ సాగే పాటని ముంబైలో జరిగిన ఈవెంట్లో విడుదల చేశారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించిన ఈ పాటని పృధ్వీ చం, సంజన కల్మంజే పాడారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ– ‘‘డబుల్ ఇస్మార్ట్’తో ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. సంజయ్ దత్గారితో పని చేయడం గౌరవంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘సంజయ్ బాబాకి నేను బిగ్ ఫ్యాన్ని. ఆయన ‘డబుల్ ఇస్మార్ట్’ చేయడం చాలా హ్యాపీగా ఉంది’’ అని పూరి జగన్నాథ్ చె΄్పారు. ఈ వేడుకలో ఛార్మీ, కావ్యా థాపర్, పూరి కనెక్ట్స్ సీఈవో విష్, నటుడు అలీ మాట్లాడారు. -
'ఐదు జంటల లవ్ స్టోరీ'.. ట్రైలర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ తనయుడు!
ఎంఎన్వీ సాగర్, శృతి శంకర్ జంటగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం' కాలం రాసిన కథలు'. ఈ సినిమాను గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. యస్ యమ్ 4 ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాశ్ జగన్నాధ్ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా మంచి విజయం సాధించాలని చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఈ సందర్భంగా దర్శక, నిర్మాత ఎంఎన్వీ సాగర్ మాట్లాడుతూ..' నా గురువుగా భావించే డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ ట్రైలర్ లాంచ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈనెల ఆగస్టు 29న థియేటర్లలో రాబోతున్నాం. పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీసుకొస్తున్నాం. 30 ఏళ్ల క్రితం మొదలైన పరువు హత్యల మధ్యే ఈ కథ సాగుతుంది. ఈ చిత్రం ద్వారా కొంతమంది కొత్తవారు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా ఐదు జంటల మధ్య జరిగే అద్భుతమైన కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలు ఉన్నాయి' అని అన్నారు. ఈ చిత్రంలో వికాస్ , విహారికా చౌదరి, అభిలాష్ గోగుబోయిన, ఉమా రేచర్ల , రోహిత్ కొండ, హాన్విక శ్రీనివాస్, రవితేజ బోనాల ,పల్లవి రాథోడ్ , రేష్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
డబుల్ ఇస్మార్ట్ సెన్సార్ రివ్యూ.. హైలెట్స్ ఇవే
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ , ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్ర పోషించాడు. రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది.పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్కి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ని కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేశారు.ఇద్దరికి కంబ్యాక్ ఫిల్మ్!డబుల్ ఇస్మార్ట్ హిట్ డైరెక్టర్ పూరి, హీరో రామ్కి చాలా అవసరం. ఇద్దరి ఖాతాలో హిట్ లేదు. అందుకే చాలా జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇస్మార్ట్ శంకర్ మాదిరే డబుల్ ఇస్మార్ట్ కూడా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ ముందు నుంచి చెబుతున్నారు.తాజాగా సెన్సార్ సభ్యులు కూడా ఆ విషయాన్నే చెప్పినట్లు తెలుస్తోంది. సినిమా చూసి.. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ అని ప్రశంసించారట. సంజయ్ దత్, రామ్ పోతినేని మధ్య మైండ్ గేమ్ తో సాగే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. హీరో హీరోయిన్ల లవ్ట్రాక్ కూడా అదిరిపోయిందట. ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుందని అంటున్నారు. అలీ కామెడీ, మణి శర్మ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పారట. సెన్సార్ సభ్యుల టాక్ బట్టి చూస్తే.. రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ ఇద్దరికీ కంబ్యాక్ ఫిల్మ్గా అవ్వబోతుందని తెలుస్తోంది. -
ఫైట్స్ చేయడం సవాల్గా అనిపించింది: కావ్యా థాపర్
‘‘నేనిప్పటివరకూ వైవిధ్యమైన పాత్రలు చేశాను. తొలిసారి ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలో యాక్షన్ సీన్స్ చేశాను. మొదటిసారి ఫైట్స్ చేయడం, పాటల్లో ఫుల్ జోష్తో డ్యాన్స్ చేసే అవకాశం రావడం సవాల్గా అనిపించింది’’ అని హీరోయిన్ కావ్యా థాపర్ అన్నారు. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 15న ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా కావ్యా థాపర్ పంచుకున్న విశేషాలు. పూరి జగన్నాథ్గారి దర్శకత్వంలో నటించాలని ఉండేది. ‘ఇస్మార్ట్ శంకర్’కి ఆడిషన్ ఇచ్చాను కానీ కుదరలేదు. ‘డబుల్ ఇస్మార్ట్’కి నా ఆడిషన్స్ నచ్చి పూరి సార్, ఛార్మీగారు చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు డబుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ ఉండే ఈ సినిమాలో అవకాశం రావడం మరింత హ్యాపీగా ఉంది. పూరీగారు గొప్ప డైరెక్టర్. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే చిన్న అమాయకత్వం కూడా ఉంటుంది. రామ్గారితో సాంగ్ షూట్లో ఫస్ట్ డే మార్నింగ్ సిక్ అయ్యాను. చాలా ఎనర్జీ, పవర్ కావాల్సిన సాంగ్ అది. అయినా సెట్కి వెళ్లాను. ఛార్మీగారు హాస్పిటల్కి తీసుకెళ్లారు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మూడు రోజుల తర్వాత డబుల్ ఎనర్జీతో డిస్చార్జ్ అయ్యాను... నా బెస్ట్ డ్యాన్స్ ఇచ్చాను. మణిశర్మగారు లెజండరీ కంపోజర్. ఆయన సాంగ్స్కి డ్యాన్స్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ‘డబుల్ ఇస్మార్ట్’ నేరుగా హిందీలో రిలీజ్ కావడం చాలా ఎగ్జయిటింగ్గా ఉంది. నాకు యాక్షన్ రోల్స్, అడ్వంచరస్ మూవీస్ చేయాలని ఉంది. ప్రస్తుతం గోపీచంద్గారితో ‘విశ్వం’ చిత్రంలో నటిస్తున్నాను. మరికొన్నిప్రాజెక్ట్స్ చర్చల్లో ఉన్నాయి. -
ఈసారి డబుల్ ఇస్మార్ట్ అంటున్న రామ్ పోతినేని.. మూవీ HD స్టిల్స్
-
ఆ పిచ్చి తగ్గక డైరెక్టర్ ని అయ్యా..
-
రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్'.. మ్యాడ్ ట్రైలర్ వచ్చేసింది!
రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో వస్తోన్న ఫుల్ యాక్షన్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో బ్లాక్బస్టర్గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా ఈ మూవీని తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైజాగ్లో నిర్వహించిన ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే రామ్ డైలాగ్స్ ఫ్యాన్స్కు గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బిగ్బుల్ పాత్రలో మెప్పించనున్నారు. కాగా.. ఈనెల 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. Mamaaaaaa! #DoubleiSmartTrailer aaagayyaaaa! https://t.co/6PHbKXHj1Z -Ustaad #DoubleiSmart Shankar pic.twitter.com/7BtSgW5AeC— RAm POthineni (@ramsayz) August 4, 2024 -
'డబుల్ ఇస్మార్ట్' నుంచి మరో సాంగ్ విడుదల
రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' సినిమా నుంచి మరో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ.. ఛార్మితో కలిసి పూరి కనెక్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తుంది. సుమారు ఐదేళ్ల తర్వాత రామ్,పూరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.2019లో వచ్చిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తుంది. కావ్యా థాపర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అలీ, గెటప్ శ్రీను కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. అదేరోజున రవితేజ- హరీష్ శంకర్ల సినిమా మిస్టర్ బచ్చన్ విడుదల కానున్నడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. -
హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?
ఒకప్పుడు హీరోయిన్, ఇప్పుడు నిర్మాతగా సినిమాలు తీస్తున్న ఛార్మీ.. హీరో రవితేజతో పాటు డైరెక్టర్ హరీశ్ శంకర్ని ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. అయితే స్నేహితులుగా ఉన్న వీళ్ల మధ్య అసలేం జరిగింది? ఛార్మీ ఎందుకిలా చేశారు అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?)డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీసిన 'డబుల్ ఇస్మార్ట్'.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తవగా.. ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు పూరీతో పాటు ఛార్మీ నిర్మాతలు. ఇకపోతే ఇదే తేదీన రవితేజ-హరీశ్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' కూడా రిలీజ్ చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు.పూరీ జగన్నాథ్ శిష్యుడు హరీశ్ శంకర్. అలానే పూరీతో రవితేజకు మంచి బాండింగ్ ఉంది. వీళ్ల కాంబోలో ఐదు సినిమాలు వచ్చాయి. ఛార్మీ కూడా పూరీతో గత కొన్నేళ్ల నుంచి ట్రావెల్ అవుతోంది. ఇకపోతే వీళ్లంతా స్నేహితులే. అలాంటిది ఇప్పుడు ఛార్మీ.. రవితేజతో పాటు హరీశ్ శంకర్ని అన్ ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఒకే తేదీన రిలీజ్ అవుతున్నాయి. బహుశా వాయిదా వేయాలని ఏమైనా అనుకుని, సయోధ్య కుదరకపోవడంతో స్నేహితుల మధ్య మనస్పర్థలు వచ్చాయా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఛార్మీ క్లారిటీ ఇస్తే తప్ప అసలు నిజం ఏంటనేది బయటకురాదు.(ఇదీ చదవండి: హీరో విశాల్ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?) -
పేరు మార్చుకున్న ఆకాశ్.. 'పూరి' అనే పదాన్ని తొలగించి ఆపై..
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి తాజాగా తన పేరు మార్చుకున్నాడు. నేడు (జులై 25) తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇదే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన ఇతడు.. ఆపై హీరోగా పలు సినిమాల్లో మెప్పించాడు.చివరగా 2022లో 'చోర్ బజార్' అనే మూవీతో వచ్చాడు ఆకాశ్. కానీ ఫ్లాప్ అయింది. సుమారు రెండేళ్లు సమయం పూర్తి అయినా కూడా ఆకాశ్ నుంచి సినిమా ప్రకటన రాలేదు. కనీసం ఆయన ఎక్కడా కూడా కనిపిమచలేదు. అయితే, చాలారోజుల తర్వాత ఓ క్లాతింగ్ బ్రాండ్కి ఆకాశ్ అంబాసిడర్గా కనిపించాడు. తాజాగా తన పేరును 'ఆకాశ్ జగన్నాథ్'గా మార్చుకున్నాడు. ఆకాశ్ పేరు పక్కన తన తండ్రి పేరు నుంచి 'జగన్నాథ్' అనే పదాన్ని ఆయన తీసుకున్నాడు. గతంలో కూడా తన తండ్రి పేరు నుంచే పూరి అనే పదాన్ని తీసుకున్నాడు.ఇక నుంచి 'ఆకాశ్ జగన్నాథ్' అనే తనను పిలవాల్సి ఉంటుంది. ఈ పేరు మార్పులు వెనుక అసలు కారణాలు ఆయన వెళ్లడించలేదు. సినీ కెరియర్ పరంగా మరిన్ని అవకాశాలు వచ్చేందుకే ఇలా పేరు మార్చుకున్నాడని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. ఆకాశ్ అనుకుంటే తన తండ్రి డైరెక్షన్లో మరో సినిమా తీయగలడు. కానీ, దానిని ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఇండస్ట్రీలో తానేంటు నిరూపంచకున్న తర్వాతే తన తండ్రి డైరెక్షన్లో సినిమా చేస్తానిని గతంలో ఆకాశ్ జగన్నాథ్ తెలిపారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన ఆకాష్ 2018లో ‘మెహబూబా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 2007లో చిరుతు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్.. ఆపై బుజ్జిగాడు, ఏక్నిరంజన్,బిజినెస్మేన్,గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా మెరిశాడు. ఆ తర్వాత 2015లో ఆంధ్రాపోరి, మెహబూబా,రొమాంటిక్ వంటి సినిమాల్లో నటించాడు. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం ఆకాశ్ జగన్నాథ్ కథలు -
డబ్బింగ్ డన్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తొలిసారి తెలుగులో పూర్తి స్థాయి పాత్ర పోషించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన హిందీ వెర్షన్ డబ్బింగ్ని పూర్తి చేశారు సంజయ్ దత్. హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్ ’(2019)కి సీక్వెల్గా ఇదే కాంబినేషన్లో ‘డబుల్ ఇస్మార్ట్’ రూ΄÷ందింది. ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్గా చేశారు. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. -
మార్ ముంత చోర్ చింత సాంగ్ థియేటర్ లో అదరగొడతాది
-
ఇస్మార్ట్ శంకర్కు ఐదేళ్లు.. రామ్ పోతినేని స్పెషల్ పోస్ట్!
టాలీవుడ్ మాస్ హీరో రామ్ పోతినేని-పూరి జగన్నాధ్ కాంబోలో వస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు.అయితే 2019 జూలై 18 ఇస్మార్ట్ శంకర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ మాస్ యాక్షన్ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ను షేక్ చేసింది. రూ.20 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ విడుదలై 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రామ్ స్పెషల్ పోస్టర్ను పంచుకున్నారు. 'ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మెంటల్ మాస్ మ్యాడ్నెస్.. ఇస్మార్ట్ శంకర్' అంటూ పోస్ట్ చేశారు. ఆగస్టు 15న డబుల్ మ్యాడ్నెస్ను ఎంజాయ్ చేయండి అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 5 Years for this Mental Mass Madness! #iSmartShankar Let’s Celebrate this Double Madness on 15th of August! -USTAAD #DoubleiSmart SHANKAR pic.twitter.com/0pSbqTkX6N— RAm POthineni (@ramsayz) July 18, 2024 -
పూరి జగన్నాథ్పై భగ్గుమంటున్న కేసీఆర్ అభిమానులు
రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ.. ఛార్మితో కలిసి పూరి కనెక్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఒక పాటను విడుదల చేశారు. 'మార్ ముంత... చోడ్ చింత' అనే పాట ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. అందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ను ఉపయోగించడంతో అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. పూరి జగనన్నాథ్పై తెలంగాణ వాదులతో పాటు కేసీఆర్ అభిమానులు మండిపడుతున్నారు.'డబుల్ ఇస్మార్ట్' సినిమాలోని 'మార్ ముంత చోడ్ చింత..' అనే 'కల్లు కంపౌండ్' పాటలో హీరో, హీరోయిన్ కల్లు బాటిళ్లు పట్టుకొని చిందేస్తుంటారు. పాట మధ్యలో కేసీఆర్ పాపులర్ ఊతపదం 'ఏం జేద్దామంటవ్ మరీ..' పదాల్ని యథాతథంగా ఆయన వాయిస్నే ఉపయోగించారు. అది కూడా పాటలో రెండుసార్లు వినిపిస్తుంది. దీంతో కేసీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు. కేసీఆర్ అంటే తాగుడు.. తెలంగాణ అంటే తాగుడు అనే భావన వచ్చేలా పాట మధ్యలో ఆయన టోన్ ఉపయోగించారంటూ ఫైర్ అవుతున్నారు. తెలంగాణ కల్చర్ను తాగుడు సంస్కృతిగా ప్రొజెక్ట్ చేసేలా సాంగ్ ఉందంటూ కేసీఆర్ అభిమానులు తెలుపుతున్నారు. ఈ పాటలో కేసీఆర్ హుక్ లైన్ ఉపయోగించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటూ వారు మండిపడుతున్నారు.ఓ దర్శకుడిగా తన అభిరుచితో పాటను తెరకెక్కించడంలో అభ్యంతరం లేదు. కానీ, కల్లు పంపౌండ్ పాటలో ఒక రాష్ట్రానికి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి టోన్ను ఉపయోగించడమంటే ఆయన్ను అవమానించడమేనని కేసీఆర్ అభిమానులు అంటున్నారు. పాట విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా వేదికగా తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పూరీపై మండిపడుతున్నారు.ఈ పాట రచయిత కాసర్ల శ్యామ్తో పాటు రాహుల్ సిప్లిగంజ్ల పైనా సోషల్మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరూ తెలంగాణ ప్రాంతం వారై ఉండి అలాంటి కేసీఆర్ హుక్లైన్ను ఎందుకు రాయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. సొంత ప్రాంతాన్ని ఇలా కించపరచడం ఏంటి అంటూ.. పలువురు తెలంగాణ వాదులు కూడా తమ అభిప్రాయాన్ని నెట్టింట తెలుపుతున్నారు. -
'మార్ ముంత.. చోడ్ చింత'.. కేసీఆర్ డైలాగ్ అదిరిపోయింది!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని మోస్ట్ అవేటైడ్ చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. ఈ మూవీని ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన కావ్యా థాపర్ కనిపించనుంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే స్టెప్ మార్ అనే పాటను రిలీజ్ చేసిన టీమ్ తాజాగా మరో సాంగ్ను విడుదల చేసింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కీర్తన శర్మ ఆలపించారు. అయితే ఈ సాంగ్ మధ్యలో మాజీ సీఎం కేసీఆర్ వాయిస్ డైలాగ్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. పూరి- రామ్ కాంబోలో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ భారీగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా డబుల్ ఇస్మార్ట్తో రామ్ పోతినేని ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. Yo boys! #MaarMunthaChodChinta …Enjoy! https://t.co/9IMWg4rcUb-USTAAD #DoubleIsmart Shankar pic.twitter.com/IjB7f6gWtV— RAm POthineni (@ramsayz) July 16, 2024 -
గుమ్మడికాయ కొట్టారు
‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాకు గుమ్మడికాయ కొట్టారు హీరో రామ్. 2019లో హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్గా వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. కావ్యా థాపర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అలీ, గెటప్ శ్రీను కీలక పాత్రధారులు.ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని, పోస్ట్ప్రోడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయని చిత్రయూనిట్ ప్రకటించింది. సో.. షూటింగ్ పూర్తయిన సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’ యూనిట్ గుమ్మడికాయ కొట్టింది. పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. -
మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ
‘ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్... మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ’ అంటూ మొదలయ్యే ‘స్టెప్పా మార్’ పాట ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలోనిది. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019). ఈ సినిమాకు సీక్వెల్గా రామ్, పూరి కాంబినేషన్లోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కావ్యా థాపర్ హీరో యిన్. పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.ఈ సినిమా నుంచి ‘స్టెప్పా మార్..’ అనే పాట లిరికల్ వీడియోను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సోమవారం విడుదల చేశారు. ‘‘ఇస్మార్ట్ శంకరే.. ఏక్ దమ్ డేంజరే... ఔర్ ఏక్ బార్ ఆయారే.. బేజారే..’ అంటూ సాగుతుంది ‘స్టెప్పామార్’ సాంగ్. తెలుగు వెర్షన్ పాటకు మణిశర్మ సంగీత సారథ్యంలో భాస్కరభట్ల సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి, సాహితి పాడారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలో సంజయ్ దత్, అలీ, గెటప్ శీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి సాంగ్ విడుదల.. ఫ్యాన్స్ ఫిదా
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్' (2019) కి సీక్వెల్గా 'డబుల్ ఇస్మార్ట్' రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘స్టెప్ మార్’ అంటూ ఫ్యాన్స్లో పూనకాలు తెప్పించే లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. రి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తుంటే.. సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు.మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. మణిశర్మ సంగీతం ఈ మూవీకి ప్రధాన బలం కానుంది. పార్ట్-1 కోసం ఆయన అందించిన మ్యూజిక్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు సీక్వెల్లో కూడా ఆయన దుమ్మురేపాడని తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మా సినిమా విడుదల కానుంది. -
కౌంట్డౌన్ స్టార్ట్
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. ఆగష్టు 15న సినిమాని విడుదల చేయనున్నాం. సినిమా రిలీజ్కి సరిగ్గా 50 రోజులు ఉంది. అందుకే 50 రోజుల కౌంట్డౌన్ను మార్క్ చేస్తూ రామ్ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశాం. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ టైటిల్ సాంగ్ షూట్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మా సినిమా విడుదల కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఇస్మార్ట్ నిర్ణయం
ఇస్మార్ట్ (తెలివి)గా ఆలోచించి, ఓ నిర్ణయం తీసుకుంది ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్. ఈ చిత్రం విడుదల తేదీని తెలివిగా నిర్ణయించింది. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఆగస్ట్ 15 గురువారం సెలవు. అలాగే సోమవారం రక్షాబంధన్. మధ్యలో శని, ఆదివారాల వీకెండ్ కలిసొస్తుంది.ఇలా మా ‘డబుల్ ఇస్మార్ట్’ విడుదలకు ఆగస్ట్ 15 పర్ఫెక్ట్ డేట్’’ అని చిత్రబృందం పేర్కొని, రామ్ కొత్త పోస్టర్ని విడుదల చేసింది. రామ్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. రామ్–పూరి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. పూరి జగన్నా«థ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ గొడవపై క్లారిటీ
-
గాడ్ ఆఫ్ మాసెస్.. రీఎంట్రీ
-
Double Ismart: రామ్ 'డబుల్ ఇస్మార్ట్' మూవీ స్టిల్స్
-
రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
'లైగర్' దెబ్బకు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. 'డబుల్ ఇస్మార్ట్'తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయాడు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు? ఇంతకీ ఎలా ఉంది? హిట్ కొడతారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)2019లో రిలీజైన 'ఇస్మార్ట్ శంకర్'.. ఊహించిన విధంగా హిట్ అయింది. పూరీ జగన్నాథ్కి చాన్నాళ్ల తర్వాత సక్సెస్ రుచి చూపించింది. రామ్ కూడా ఫుల్ ఖుషీ అయిపోయాడు. కానీ దీని తర్వాత పూరీకి 'లైగర్' రూపంలో ఘోరమైన డిజాస్టర్ ఎదురైంది. రామ్ది ఇదే పరిస్థితి. చేసిన సినిమా చేసినట్లే ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో వీళ్లిద్దరూ కలిసి 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ చేశారు. అదే 'డబుల్ ఇస్మార్ట్'. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.పూరీ జగన్నాథ్ సినిమాలంటే పంచ్ డైలాగ్స్, మాస్ మూమెంట్స్ని ఆడియెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ టీజర్లో ఆ రెండూ మిస్ అయ్యాయి. టీజర్ అంతా కూడా పాత్రల పరిచయానికే ఉపయోగించినట్లు కనిపిస్తుంది. 'డబుల్ ఇస్మార్ట్'లో రామ్ తనదైన మేనరిజమ్ చూపించగా.. హీరోయిన్గా కావ్య థాపర్ కనిపించింది. అలీకి ఆది మానవుడి తరహా కామెడీ పాత్ర ఇచ్చినట్లు ఉన్నారు. సంజయ్ దత్ గన్స్తో కనిపించాడు. రామ్ రెండు డైలాగ్స్ చెప్పాడు గానీ వీటిలో పంచ్ అయితే లేదు. ఎప్పటిలానే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో ఆకట్టుకోగా.. చివర్లో శివ లింగాన్ని చూపించి సినిమాలో డివోషనల్ టచ్ కూడా ఉందని చెప్పకనే చెప్పారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్పై అలా) -
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో వస్తోన్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో పూరి దర్శకత్వంలో రూపొందించిన బ్లాక్బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2019లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. డబుల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్ తేదీని ప్రకటించారు. రామ్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రూపొందించారు. ఈనెల 15న టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఉదయం 10:03 నిమిషాలకు టీజర్ విడుదల చేయనున్నారు. తాజాగా రిలీజైన వీడియోలో ఇస్మార్ట్ శంకర్ సీన్స్ను జోడించారు. ఈ మూవీలోని సన్నివేశాలతో పాటు అప్పుడు థియేటర్స్లో అభిమానులు చేసిన సందడితో కూడిన సన్నివేశాలు మాస్ ఇమేజ్ను గుర్తుచేస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్ టీజర్తో రామ్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు మేకర్స్. A proud film of @PuriConnects which created a Never Before Mass Hysteria in every nook and corner🔥Here's a sizzling recap of a Mass phenomenon called #iSmartShankar before you experience the Madness of #DoubleISMART 😎𝗱𝗶𝗠𝗔𝗔𝗞𝗜𝗞𝗜𝗥𝗜𝗞𝗜𝗥𝗜 #DoubleISMARTTeaser… pic.twitter.com/n0kL1HkTbQ— Puri Connects (@PuriConnects) May 14, 2024 -
డబుల్ యాక్షన్
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’(2019) మూవీ సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రూపొందుతోంది. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించి, రామ్ సరికొత్త పోస్టర్ విడుదల చేశారు. ఫేస్ మాస్క్, పులి చారల చొక్కా, టోర్న్ జీన్స్ ధరించి ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో క్రాకర్స్ పట్టుకుని ఇంటెన్స్ లుక్తో కనిపించారు రామ్. ‘‘డబుల్ ఇస్మార్ట్’ లో డబుల్ యాక్షన్, డబుల్ మాస్, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ హై–బడ్జెట్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి, సంగీతం: మణిశర్మ, కెమెరా: సామ్ కె. నాయుడు, జియాని జియాన్నెలి. -
అంతకు మించి...
‘ఇస్మార్ట్ శంకర్’లో హీరో రామ్ని ఫుల్ మాస్గా చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రంలో మాస్, కామెడీ, యాక్షన్, రొమాన్స్... ఇలా అన్నీ కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’లో అంతకు మించి ఉంటాయి. ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్గా రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రం కోసం రామ్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. తొలి భాగంలోకన్నా ఇంకా మాస్గా కనిపించ డంతో పాటు స్టయిలిష్గానూ కనిపించనున్నారు.‘‘ఈ చిత్రంలో రెట్టింపు యాక్షన్, రెట్టింపు మాస్, ఎంటర్టైన్మెంట్ ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ పాన్ ఇండియా చిత్రం తాజా షెడ్యూల్ ముంబైలో ఆరంభమైంది. ఈ లెన్తీ షెడ్యూల్లో చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో ఎక్కువ శాతం సినిమా పూర్తవుతుంది. సంజయ్ దత్ పవర్ఫుల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నా«థ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’కి స్వరాలు అందించిన మణిశర్మ ఈ చిత్రానికి కూడా సంగీతదర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగువారికి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. లైగర్ తర్వాత ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లోనే ఉంటున్నారు. ఇప్పటికే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పూరి మ్యూజింగ్స్ పేరుతో వాయిస్ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వీడియోను విడుదల చేశారు. ఇందులో ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.పూరి జగన్నాథ్ మాట్లాడుతూ..'జీవితంలో చాలామంది ప్రేమలో ఫెయిల్ చూస్తారు. తిండి, నిద్ర ఉండదు. గుండెల్లో తెలియని మంట. దానికితోడు మద్యానికి బానిస అవుతాం. స్నేహితులు ఎంత ఓదార్చినా తీరని బాధ. కన్నీళ్లు ధారలుగా కారుతుంటాయి. అదొ రకమైన నరకం. నా ప్రేమను అమ్మాయి అర్థం చేసుకోలేదని కుంగిపోతాం. నిజానికి అదంతా ప్రేమ కాదు.. ఈగో.. నీకు ఎంత ఈగో ఉంటే అంత నరకం చూస్తావు. ఇది నిజం. నీకు దక్కలేదన్న ఉక్రోశమది. పాపం ఆ అబ్బాయి నీ గురించి తాగుబోతు అయ్యాడే అని అందరూ తనకు చెప్పాలి. అది నీ అసలు ఉద్దేశం' అని అన్నారు.మీ అమ్మ అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఎప్పుడైనా అమ్మ కోసం కత్తిపెట్టి చేయి కోసుకున్నావా? ఏడ్చావా? లేదు. మన ప్రేమలన్నీ శృంగారం కోసమే. అందమైన అమ్మాయిలనే ఎందుకు ప్రేమిస్తావ్. కాళ్లు, చేతులు లేని వాళ్లను కూడా ప్రేమించొచ్చు కదా? నిజంగా అమ్మాయిని ప్రేమిస్తే.. ఆమె డెసిషన్కు రెస్పెక్ట్ ఇచ్చేవాడివి. ప్రేమలో ఉన్నప్పుడు నీకోసం పుట్టిన దేవతలా కనిపిస్తుంది. ఆ అమ్మాయి దొరక్కపోతే చనిపోవాలనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే నిన్నే పెళ్లి చేసుకుంటే రెండేళ్లు కూడా సరిగా కాపురం చేయలేవు. మోజు తీరిపోద్ది. మళ్లీ కొత్త కోరికలు మొదలవుతాయి. వేరే అమ్మాయిలు కావాలి. ఎంజెల్స్ అందరినీ మగాళ్లు పెళ్లి తర్వాత డోర్ మ్యాట్స్లా తయారు చేస్తారు. సైన్స్ ప్రకారం ఆడ, మగ మధ్య ఎట్రాక్షన్ 18 నెలలు మాత్రమే' అనిలవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్లందరూ ప్రామిస్ చేయగలరా? వేరే ఏ అమ్మాయిని చూడమని? చేయలేరు. ప్రేమించడం, ఇంట్లో వద్దంటే గొడవ పడడం.. అమ్మాయి కాదంటే దేవదాసులా మారడాలు.. ఇవన్నీ డ్రామాలు. మనం ఈ డ్రామాలనే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాం. లవ్ ఫెయిల్యూర్ అయిన అమ్మాయిలను ఎక్కడైనా చూశారా?. వాళ్లు ఎప్పుడూ ఏడుస్తూ ఉండరు. చాలా ప్రాక్టికల్గా ఉంటారు. మరీ మీకెందుకు ఇంత ఓవరాక్షన్. వాళ్లను చూసి బుద్ది తెచ్చుకో. లవ్ ఫెయిల్ అవడం ఎప్పుడూ మంచిదే. దానివల్ల మీరు మరింత స్ట్రాంగ్ అవుతారు. కానీ ప్రేమించమని ఏడుస్తూ.. బతిమిలాడుతూ.. అడుక్కుంటూ బెగ్గర్స్లా తయారవుతాం. రోజు ఇంత ఏడుస్తున్నావు కదా.. ఏడాది తర్వాత అది చాలా చిన్న విషయంగా అనిపిస్తుందని' వివరించారు.నిజంగా అమ్మాయి మోసం చేస్తే.. ఆ బాధను మీ కెరీర్ కోసం వాడండి. ప్రేమ కంటే గొప్పది ఒంటరితనం. ఒంటరిగా తినండి, ప్రయాణాలు చేయండి. కొన్నేళ్ల తర్వాత మిమ్మల్ని చూసి మీరే నవ్వుకుంటారు. మీ లవ్ ఫెయిల్యూర్ మీద మీరే జోకులు వేసుకుంటారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఎంజెలినా జోలి లాంటి సెలబ్రిటీలే విడాకులు తీసుకున్నారు. వాళ్లతో పోలిస్తే.. నువ్వు ఎంత? నీ ప్రేమ ఎంత? దయచేసి ఆలోచించు. నిన్ను నమ్ముకొని మీ కుటుంబం ఉంది' అని పూరి జగన్నాథ్ సలహాలిచ్చారు. -
ఆ సీన్ నా కళ్లముందే కనిపిస్తోంది: రాజ్ తరుణ్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు, పూరి జగన్నాథ్ల కాంబోలో వచ్చిన చిత్రం పోకిరి. 2006లో రిలీజైన ఈ చిత్రం ఇండస్ట్రీని షేక్ చేసింది. అప్పట్లో ఓ సెన్సేషన్ సృష్టించింది. తాజాగా ఈ మూవీ విడుదలై 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీని సినీ ప్రియులు, మహేశ్ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలోని 'ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుద్దో ఆడే పండుగాడు' అనే పవర్ఫుల్ డైలాగ్ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాను యంగ్ హీరో రాజ్ తరుణ్ గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.రాజ్ తరుణ్ తన ట్విటర్లో రాస్తూ..' గోపాలపట్నంలోని శంకర థియేటర్లో చూసిన పోకిరి సినిమా ఇప్పటికీ గుర్తుంది. కృష్ణ మనోహర్ ఐపీఎస్ సన్నివేశానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఇప్పటికీ నా కళ్ల ముందే కనిపించినట్లు ఉంది. దిమ్మ తిరిగి బాక్సాఫీస్ బ్లాక్ అయిపోయింది... ఇండియా మొత్తం షేక్ అయిపోయింది ' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా.. పూరి, మహేశ్బాబు కాంబోలో వచ్చిన బిజినెస్మెన్ సైతం బాక్సాఫీస్ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. The streets will never forget the BULLET-FIRING performance of our Superstar @urstrulyMahesh in Indian Cinema History!!! 🤗🤗🔥🔥#18YearsOfSouthIndustryHitPokiri #Pokiri— Raj Tarun (@itsRajTarun) April 28, 2024 -
హీరోగా సెట్ అయిన తర్వాత అది చేస్తా: హీరో ఆకాశ్ పూరీ
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ చాలామందికి తెలుసు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన ఇతడు.. ప్రస్తుతం హీరోగా చేస్తున్నాడు. చివరగా 2022లో 'చోర్ బజార్' అనే మూవీతో వచ్చాడు. కానీ ఫ్లాప్ అయింది. ఇలా చాలారోజుల తర్వాత ఇప్పుడు కనిపించాడు. ఓ క్లాతింగ్ బ్రాండ్కి ఆకాశ్ అంబాసిడర్గా చేస్తున్నాడు. తాజాగా హైదరాబాద్లో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ)) 'నా కెరీర్ పరంగా చూస్తే గత సినిమా 'చోర్ బజార్' అంతగా ఆదరణ దక్కించుకోలేదు. అందుకే ఈసారి నేను చేసే సినిమా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాను. లవ్ స్టోరీ, యాక్షన్ కథలు విన్నాను. అవి ఫైనలైజ్ దశలో ఉన్నాయి. ప్రాజెక్ట్ లాక్ అయ్యాక మీకు వివరాలు చెబుతాను. ఇప్పటికీ నేను చిన్న పిల్లాడిలా ఉంటాననే కంప్లైంట్ ఉంది. హీరోగా సెట్ అయిన తర్వాతే విలన్ తరహా క్యారెక్టర్స్ చేయడం గురించి ఆలోచిస్తా. నాన్న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇప్పట్లో నటించకూడదని అనుకున్నా' 'నాకు నేనుగా హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాతే నాన్న డైరెక్షన్లో మూవీ చేస్తా. నాకు అమ్మా నాన్న ఇద్దరి సపోర్ట్ పూర్తిగా ఉంది. నా స్క్రిప్ట్స్ నాన్న చదువుతారు. మన ఇండస్ట్రీలో చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయి. కార్తికేయ 2, హనుమాన్ లాంటివి చూసినప్పుడు ఇలాంటి వాటిలో నటించాలనే కోరిక కలుగుతుంటుంది. ఇప్పుడు నేను సింగిల్గానే ఉన్నా. ఏ అమ్మాయినీ ప్రేమించడం లేదు' అని ఆకాశ్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 100 కోట్ల కలెక్షన్ సూపర్ హిట్ సినిమా.. ఏ ఓటీటీ సంస్థ కొనట్లేదు!) -
నాన్న డైరెక్షన్లో సినిమా చేయను: ఆకాశ్ పూరి
టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్లుగా ఎంట్రీ ఇచ్చి హీరోలుగా మారిన నటులు చాలా మంది ఉన్నారు. వారిలో ఆకాశ్ పూరి కూడా ఒకరు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడిగా ఇంటస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆకాశ్. చిరుత, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్తో పాటు పలు సినిమాల్లోనూ హీరోల చిన్ననాటి పాత్రను పోషించాడు. ‘ఆంధ్రా పోరి’తో హీరోగా మారాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో స్వయంగా పూరినే రంగంలోకి దిగాడు. కొడుకుతో డిఫరెంట్ లవ్స్టోరీ ‘మెహబూబా’ తీశాడు. అయితే అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘రొమాంటిక్’ ఫిల్మ్తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అదీ కూడా ఫ్లాప్ అయింది. చివరగా చోర్ బజార్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ చిత్రానికి కూడా తొలి రోజే ప్లాప్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కథల వేటలో పడ్డాయి. అయితే ఎంతో మందిని స్టార్ హీరోలుగా మలిచిన పూరి జగన్నాథ్.. కొడుకును మాత్రం హీరోగా పెట్టి మరో సినిమా తీయలేకపోయాడు. పూరి అనుకుంటే.. ఆకాశ్ను ఓ మాస్ హీరోగా నిలబెట్టగలడు. కానీ అది ఆకాశ్కి ఇష్టం లేదు. తండ్రి డైరెక్షన్లో ఇప్పుడే సినిమా చేయాలని లేదట. తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్లో ఇదే విషయాన్ని చెప్పాడు ఆకాశ్. ‘నాన్న డైరెక్షన్లో ఇప్పుడే సినిమా చేయాలని లేదు. నటుడిగా నన్ను నేను ఫ్రూవ్ చేసుకున్న తర్వాత నాన్నతో సినిమా చేస్తాను. అప్పటి వరకు నేను నాన్నతో సినిమా చేయను. ఒకవేళ సినిమా చేయాల్సి వస్తే.. ‘పూరి జగన్నాథ్-ఆకాశ్ కాంబోలో ఓ సినిమా రాబోతుంది’ అనుకునే స్థాయికి వచ్చినప్పుడే చేస్తాను’ అన్నాడు. నేనింతే సినిమాకు సీక్వెల్ వస్తే.. అందులో హీరోగా నటించాలని ఉందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనూహ్య మలుపు..
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో పలువురు తారలపై నమోదు కేసిన ఆరు కేసులను న్యాయస్థానం కొట్టిపారేసింది. సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసును కొట్టివేసినట్లు తెలిపింది. కాగా 2018 నుంచి టాలీవుడ్ సెలబ్రిటీలే టార్గెట్గా ఎక్సైజ్ శాఖ దూకుడు ప్రదర్శించింది. పూరీ జగన్నాథ్, చార్మీ, తరుణ్, నవదీప్, రవితేజ, శ్యామ్ కె నాయుడు, ముమైత్ ఖాన్, తనీష్ సహా పలువురిపై డ్రగ్స్ కేసు నమోదు చేసింది. డ్రగ్స్ ఆనవాళ్లు లేవు! ఈ డ్రగ్స్ కేసుపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నవారిని నెలల తరబడి వారిని విచారించినా ఫలితం లేకపోయింది. వారి నుంచి వెంట్రుకలు, గోళ్లను శాంపిల్ తీసుకున్నారు. కానీ కేవలం పూరీ జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అక్కడ ఈ ఇద్దరి శరీరంలో ఎటువంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేలింది. ఆరు కేసులు కొట్టివేత పైగా డ్రగ్స్ కేసులో పాటించాల్సిన విధివిధానాలు అధికారులు సరిగా ఫాలో అవకపోవడంతో కోర్టులో ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. ఆరు కేసుల్లో ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదని న్యాయస్థానం గుర్తించింది. పూరీ జగన్నాథ్, తరుణ్ శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లభ్యం కాలేదంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించిన రిపోర్టులను పరిశీలించిన అనంతరం ఎనిమిది కేసుల్లో ఆరింటిని కొట్టివేసింది. చదవండి: 30 ఏళ్లుగా వెండితెరకు దూరం.. మర్చిపోయినా పర్లేదు, గుర్తుపెట్టుకునేలా చేస్తానంటూ.. -
మంచి నీళ్లే ఆహారం.. రూ.80 కోట్లు మోసపోయాడు: పూరీ తల్లి
టాలీవుడ్ తోపు డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన బద్రి సినిమాతో దర్శకరచయితగా కెరీర్ ఆరంభించాడు. ఇడియట్తో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. ఈయన తనయుడు ఆకాశ్ పూరి కూడా హీరోగా రాణిస్తున్నాడు. తాజాగా పూరీ తల్లి అమ్మాజీ తన కుమారుడి గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. తన కష్టం చూసి ఏడ్చేశా.. ఆమె మాట్లాడుతూ.. 'ఏడో తరగతి నుంచే పూరీకి సినిమాలంటే ఇష్టం. అనకాపల్లిలో డిగ్రీ చదివాడు. తను సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలని ప్రయత్నించిన రోజుల్లో ఇంటి నుంచి డబ్బులు పంపించేవాళ్లం. అవి సరిపోక తను కూడా కష్టపడేవాడు. ఆఫీసుల చుట్టూ కాలినడకన తిరిగేవాడు. ఒకసారి నేను వెళ్లినప్పుడు తన పాదాలు వాచిపోయి సాక్సులు వేసుకోవడానికి రాలేదు. అది చూసి ఏడ్చేశాను. ఇంత కష్టమెందుకు? ఊరికి వచ్చేయ్, పొలం పని చేసుకుందామన్నాను. కానీ తను ఒప్పుకోలేదు. దేవుడు నా కష్టం చూడకపోతాడా? అని అలాగే ప్రయత్నించాడు. పన్నెండు సంవత్సరాలు కష్టపడ్డాడు. అన్నం తినకుండా మంచినీళ్లు మాత్రమే తాగిన రోజులున్నాయి. నా కొడుకు పడ్డ కష్టాలు ఎవరూ పడకూడదు. కోట్లు మోసం చేశాడు పూరీ దగ్గర పనిచేసే ఓ కుర్రాడు దాదాపు రూ.80 కోట్లు కొట్టేశాడు. మేమందరం ఏడ్చేశాం. ఓ సినిమా తీసి కూడా నష్టపోయాడు. ఈ అప్పు తీర్చేందుకు ఐదారు ఇళ్లు అమ్మేశాడు. తనను మోసం చేసినవాడి కాళ్లూచేతులు విరిచేద్దామా అని ఎవరో సలహా ఇస్తే ఒప్పుకోలేదు. ఏ జన్మలో అతడికి రుణపడి ఉన్నామో అని వదిలేశాడు. ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు కష్టపడతానన్నాడు. నా కుమారుడు అంతటి దయామయుడు. ఒకసారి ఓ వ్యక్తి సాయం కావాలని వస్తే ఇంట్లో ఉన్న రూ.4 లక్షలూ ఇచ్చేశాడు. తనకంటూ ఏదీ ఉంచుకోడు. ఊరిలో కూడా ఓ గుడి కట్టించాడు' అని చెప్పుకొచ్చింది అమ్మాజి. చదవండి: బర్రెలక్కకు రైతుబిడ్డతో పెళ్లా..? -
ఇస్మార్ట్ మ్యూజిక్
‘డబుల్ ఇస్మార్ట్’ మ్యూజిక్ సిట్టింగ్స్ జోరందుకున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఈ విషయాన్ని ‘ఎక్స్’లో షేర్ చేసి, ‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ను వెల్లడించింది చిత్రబృందం. ‘ఇస్మార్ట్ శంకర్’కు సంగీతం అందించిన మణిశర్మనే సీక్వెల్కూ సంగీతం అందిస్తున్నారు. గతంలోనూ పూరి–మణిశర్మ కాంబినేషన్లో ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ పోర్షన్స్ చిత్రీకరణ కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా సమాచారం. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను మార్చి 18న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్నది ఫిల్మ్నగర్ తాజా కబురు. -
'నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం'.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. గంగోత్రి సినిమాతో కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ టాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బన్నీ మూవీ సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకుల గుండెల్లో బన్నీగా స్థిరపడిపోయారు. అనంతరం 2007లో అల్లు అర్జున్ దేశముదురు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో హన్సిక మోత్వానీ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం రిలీజై సరిగ్గా నేటికి 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. దేశముదురు డైరెక్టర్ పూరి జగన్నాధ్, నిర్మాత డీవీవీ దానయ్యకు అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్ తన ట్వీట్లో రాస్తూ.. 'దేశముదురు చిత్రం ఈ రోజుకు 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం. డైరెక్టర్ పూరి జగన్నాధ్, నిర్మాత డీవీవీ దానయ్య, చిత్రబృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా కెరీర్లో చిరస్మరణీయమైన విజయం అందించిన నా అభిమానులకు, ప్రేక్షకులకు ఎప్పటికీ కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు బన్నీకి సైతం అభినందనలు చెబుతున్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తోన్న పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఐకాన్ స్టార్కు జోడీగా శ్రీవల్లి రష్మిక మందన్నా నటిస్తోంది. Celebrating 17 MASSive years of Icon Star @alluarjun's #Desamuduru 🤙🏻 Every dialogue and song from this film continues to send electrifying chills down our spine!#PuriJagannadh @ihansika #Chakri#17YearsForDesamuduru pic.twitter.com/AxxFJpo4Kd — DVV Entertainment (@DVVMovies) January 12, 2024 17 years of #Desamuduru Movie . What a beautiful moment in time . Thanks to my director @PuriConnects , my producer @DVVMovies and the entire cast & crew . Gratitude forever to my fans and audience for a memorable blessing 🙏🏽 — Allu Arjun (@alluarjun) January 12, 2024 -
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుక్కి పెళ్లి కుదిరిందా?
టాలీవుడ్లో మరో హీరో పెళ్లికి రెడీ అయ్యాడా? ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే ఈ కుర్రాడు మరెవరో కాదు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వారసుడే అని తెలుస్తోంది. అలానే అమ్మాయికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో నిజమెంత? అసలేం జరుగుతోంది? (ఇదీ చదవండి: హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) దర్శకుడు పూరీ జగన్నాథ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో బెంచ్ మార్క్ సెట్ చేశాడు. తనదైన స్టైల్ ఆఫ్ మూవీస్తో అప్పట్లో ఊపు ఊపాడు. ఇతడి కొడుకు ఆకాశ్.. చైల్డ్ ఆర్టిస్టుగా బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు మూడు సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. కానీ పెద్దగా లక్ కలిసి రాలేదు. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేస్తున్నట్లు లేడు. కొన్నాళ్ల నుంచి అసలెక్కడ వినిపించని ఆకాశ్ పూరీ పేరు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిపోయింది. చిన్నప్పటి క్లాస్మేట్ ఒకమ్మాయితో ఆకాశ్ ప్రేమలో ఉన్నాడని.. త్వరలో వీళ్ల నిశ్చితార్థం-పెళ్లి ఉండబోతున్నాయని అంటున్నారు. అలానే అమ్మాయి తాత పెద్ద పొలిటికల్ లీడర్ అని అంటున్నారు. అయితే ఇది నిజమా? కాదా? అనేది తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాలి. లేదంటే స్వయంగా ఆకాశ్ స్పందిస్తే గానీ క్లారిటీ రాదు! (ఇదీ చదవండి: 'సలార్' సినిమాలో దాన్ని కావాలనే మిస్ చేశారా? లేదంటే..?) -
డబుల్ ఇస్మార్ట్కు మణిశర్మ స్వరాలు
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) సూపర్హిట్గా నిలిచింది. ప్రస్తుతం రామ్, పూరి కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చనున్నట్లు చిత్రయూనిట్ శనివారం వెల్లడించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి, చిరుత, ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ సినిమాలకు మణిశర్మ సంగీతం అందించిన సంగతి గుర్తుండే ఉంటుంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చే ఏడాది మార్చి 8న విడుదల కానుంది. -
ముంబైలో డబుల్ ఇస్మార్ట్
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. తాజాగా రామ్, పూరి కాంబినేషన్లోనే ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఇందులో సంజయ్ దత్ కీలక ΄ాత్రధారి. ఈ సినిమా కోసం ముంబైలో రామ్ ΄ాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘స్కంద’ కోసం బరువు పెరిగిన రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం బరువు తగ్గి, సిక్స్ ΄్యాక్తో మేకోవర్ అయ్యారు’’ అని యూనిట్ పేర్కొంది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 8న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. -
కథ అందరికీ నచ్చింది... కానీ ఎందుకో అలా జరిగింది
-
లైఫ్ లో చాలా పోగొట్టుకున్నా కానీ ధైర్యంగా బతిక
-
నాకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చింది అతనే.. షాయాజీ షిండే ఆసక్తికర కామెంట్స్!
షాయాజీ షిండే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబు పోకిరీ సినిమాలో ఆయన యాక్టింగ్కు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా పోలీసు ఆఫీసర్ పాత్రలో ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. 'తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా.. అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు' అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది. (ఇది చదవండి: షారుక్ ఖాన్కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!) ఈ చిత్రంలో పోలీసు అధికారిగా షాయాజీ షిండే చాలా వ్యంగ్యంగా మాట్లాడే సీన్ అప్పట్లో అభిమానులను అలరించింది. ఆ తర్వాత అరుంధతి చిత్రంలో విభిన్నమైన పాత్రలో మెప్పించారు. మహారాష్ట్రకు చెందిన షాయాజీ షిండే తెలుగులో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షాయాజీ తెలుగులో నటించండపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షాయాజీ షిండే మాట్లాడుతూ..' నాకు ముఖ్యంగా తెలుగు డైరెక్టర్స్ ఎక్కువ ఛాన్సులు ఇచ్చారు. పూరి జగన్నాధ్ నా కెరీర్ను పూర్తిగా మార్చేశారు. పోకిరీ సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. పోకిరీ తర్వాతే నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే అవకాశం వచ్చింది. కానీ హిందీలో తెరకెక్కించిన పోకిరీ చిత్రంలో నటించలేకపోయాను. అప్పుడు డేట్స్ కుదరకపోవడంతో తప్పుకోవాల్సి వచ్చింది. చిరంజీవి చాలా బాగా మాట్లాడుతారు. మొదటి సారి ఆయన చిత్రంలో నటించేటప్పుడు నీకేమైనా ప్రాబ్లమ్ వచ్చినా నాకు చెప్పండి. మనందరం ఆర్టిస్టులం. మనది ఒకటే ఫ్యామిలీ అని చెప్పేవారు. నన్ను తన కుటుంబ సభ్యునిలాగా చూసుకున్నారు. మహేశ్ బాబు, ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎప్పుడు గ్రేట్ స్టార్స్గా ఉంటారు.' అని అన్నారు. కాగా.. ఈ ఏడాదిలో ఘర్ బంధుక్ బిర్యానీ చిత్రంలో కనిపించారు. (ఇది చదవండి: మూడు దశాబ్దాల పాటు సినిమాలు.. ఇప్పుడేమో అత్యంత దీన స్థితిలో !) -
ఇస్మార్ట్ యాక్షన్
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా రామ్, పూరీల కాంబినేషన్లోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం రూపొందుతోంది. హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా గురువారం పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా హీరో రామ్, కీలక పాత్ర చేస్తున్న సంజయ్ దత్తో పూరి జగన్నాథ్ ఉన్న వర్కింగ్ స్టిల్ను రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 18న రిలీజ్ కానుంది. -
సినిమా ఇండస్ట్రీలో ఈ గురుశిష్యుల బంధం గురించి తెలుసా?
శిష్యుల ప్రతిభను, అర్హతలను కచ్చితంగా అంచనావేసి, ఎప్పుడు, ఎవరికి, వేటిని ప్రసాదించాలో తెలిసినవారే నిజమైన గురువులు. అలా జీవిత పాఠాలతో పాటు తమ శిష్యులకు సినిమా పాఠాలు కూడా నేర్పించి సక్సెస్ఫుల్ హీరోలు,డైరెక్టర్లు, సంగీత దర్శకులను అందించిన గురువులు ఎందరో ఉన్నారు.. నేడు గురుపూజోత్సవం సందర్భంగా వారిలో కొందరిని గుర్తు చేసుకుందాం. తన డైరెక్షన్తో పాటు రైటింగ్స్తో టాలీవుడ్లో ఓ మార్క్ వేశారు దర్శకుడు సుకుమార్. 'ఆర్య' చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన ఈ స్టార్ డైరెక్టర్.. తన తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. తన మాస్టర్ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ లెక్కల మాస్టర్.. 'పుష్ప: ది రైజ్ ' తో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే సుక్కూ లాగానే ఆయన శిష్యులు కూడా తమ సినిమాలతో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నారు.తొలి సినిమాలతోనే బ్లాక్బస్టర్లను తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. తన వద్ద పని చేసిన ఎంతో మందికి మార్గదర్శిగా ఉంటూ తన శిష్యగణాన్ని టాలీవుడ్లో పాపులరయ్యేలా చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ద్వారా వారిని సపోర్ట్ చేస్తూ అండగా నిలుస్తున్నారు. సుక్కు స్కూల్ నుంచి వచ్చినవారందరూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా స్థిరపడుతున్నారు. ► 'ఉప్పెన' సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన బుచ్చిబాబు సనా.. మెగా మేనల్లుడితో కలసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్తో పాటు జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. సుకుమార్కు ఆయన ప్రియ శిష్యుడు. ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్లో డైరెక్టర్గా లాంఛ్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్తో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ► టాలీవుడ్లో మరో సెన్సేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. ఆయన కూడా సుకుమార్ శిష్యుడే. 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' వంటి చిత్రాలకు పనిచేసిన శ్రీకాంత్.. 'దసరా' చిత్రంతో డైరెక్టర్గా పరిచయమయ్యాడు. నాని, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల క్రేజీ డైరెక్టర్గా మారిపోయాడు. ► 'కరెంట్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుక్కు దగ్గర శిష్యరికం చేసినవాడే. ఫస్ట్ సినిమా నిరాశ పరిచినా, గురువు నేతృత్వంలో రెండో సినిమా 'కుమారి 21F'తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ► జక్కా హరి ప్రసాద్ ఎన్నో సినిమాలకు సుక్కుతో కలసి వర్క్ చేశాడు. 100% లవ్ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన హరి.. '1 నేనొక్కడినే' సినిమాకు రచయితగా చేశాడు. 'ప్లే బ్యాక్' మూవీతో మంచి గుర్తింపు ► యాంకర్ ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమా తీసిన దర్శకుడు మున్నా కూడా సుకుమార్ శిష్యుడే. ► డైరెక్టర్ 'బొమ్మరిల్లు' భాస్కర్ కూడా 'ఆర్య' సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. ► 'భమ్ భోలేనాథ్' ఫేమ్ కార్తీక్ దండు కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసినవాడే. సుకుమార్ బ్యానర్లో సాయి ధరమ్ తేజ్ హీరోగా 'విరూపాక్ష' అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ► ఇండస్ట్రీలో స్టార్ రైటర్గా రాణిస్తున్న శ్రీకాంత్ విస్సా కూడా సుకుమార్ దగ్గర వర్క్ చేశాడు. పుష్ప, పుష్ప 2, 18 పేజీస్ వంటి సినిమాల స్క్రిప్టు విషయంలో సుకుమార్కు సపోర్ట్గా శ్రీకాంత్ నిలిచారు. డెవిల్, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు కూడా ఆయన రైటర్గా పనిచేస్తున్నారు. ఆర్జీవీ ఫ్యాక్టరీలో ఎందరో... ఒకప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుంచి ఎందరో డైరెక్టర్లు బయటకు వచ్చి వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్డమ్ను తెచ్చుకున్నారు. వర్మ శిష్యుల్లో ఆయన తర్వాత అంత పేరు తెచ్చుకున్న వాళ్లలో కృష్ణవంశీ, తేజ, పూరి జగన్నాథ్, గుణశేఖర్, శివనాగేశ్వరరావు, నివాస్, అజయ్ భూపతి, జీవన్ రెడ్డి, హరీశ్ శంకర్, జేడీ చక్రవర్తి, బాలీవుడ్ నుంచి అనురాగ్ కశ్యప్, బాలీవుడ్ అగ్రదర్శకుడు మధుర్ బండార్కర్ ఉన్నారు. వర్మ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో ఆర్జీవీ బోలెడంతమందిని తన శిష్యులుగా తయారు చేసి వారికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. సంగీత ప్రపంచంలో సంగీతంలో స్వరబ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ ఒక దశాబ్దం పాటు ఆయన తెలుగు సినిమాను ఏలారు. టాప్ హీరో మూవీ అంటే సంగీతం మణిశర్మ ఇవ్వాల్సిందే. ఆయనకు చాలా మంది శిష్యులే ఉన్నారు వారిలో దేవిశ్రీ, హారీష్ జైరాజ్, థమన్ వంటి వారు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న వారు కావడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి కూడా ఎందరో శిష్యులు ఉన్నారు. వారిలో ఏఆర్ రెహమాన్,మణిశర్మ ముందు వరుసలో ఉంటారు. దేవీశ్రీ ప్రసాద్, తమన్, హారీశ్జై శంకర్లు కూడా ఆయన వద్ద శిక్షణ పొందారు. సూపర్ స్టార్ కృష్ణకు గురువు ఎవరంటే... కృష్ణ నటించిన తొలి చిత్రం తేనె మనసులు. ఈ సినిమాకి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. ఆయనను కృష్ణ గురువుగా భావించేవారు. ఆదుర్తి వారు మరణించినప్పుడు పాడిపంటలు సినిమా షూటింగ్లో భాగంగా గుంటూరులో ఉన్నారు కృష్ణ. తన గురువు గారిని ఆఖరిచూపు చూసేందుకు ఎంతగానో తాపత్రయపడ్డారు. కానీ రవాణా సదుపాయాలేవీ అందుబాటులో లేవు. ఆఖరికి ది హిందూ పత్రిక యాజమాన్యం వారిని అభ్యర్థించి, వారి ప్రత్యేక విమానంలో హుటాహుటిన మద్రాసు చేరుకున్నారు. కమల్ హాసన్కు వారిద్దరూ గురువులే అగ్ర దర్శకుడు కె.విశ్వనాథ్ - ప్రముఖ కథానాయకుడు కమల్హాసన్ మధ్య గురు శిష్యుల బంధం ఉంది. ఈ ఇద్దరి కలయికలో ఎప్పటికీ గుర్తుండిపోయే సాగర సంగమం, శుభ సంకల్పం చిత్రాలొచ్చాయి. కె.విశ్వనాథ్ జీవించి ఉన్న రోజుల్లో ఆయనతో కొంత సమయం గడిపేవారు కమల్హాసన్.. మరో దిగ్గజ దర్శకుడు కె బాల చందర్ కూడా కమల్కు గురువే.. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. చిరంజీవి- విశ్వనాథ్ల గురు శిష్యుల బంధం తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి, తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు విశ్వనాథ్కు మెగాస్టార్ చిరంజీవికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు నటించిన శుభలేఖ, ఆపద్భాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి, వంటి సినిమాలు మెగాస్టార్ కెరియర్లో మైలురాయిగా సుస్థిరస్థానం సంపాదించుకున్నాయి. మెగాస్టార్ మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించి ఏ సినిమాకు అయినా వన్నె తేగలరు అని నిరూపించాయి వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు. ఇప్పటికీ కూడా ఒక క్లాసిక్గా నిలుస్తాయనడంలో సందేహం ఉండదు. (ఇదీ చదవండి: Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కోసం వీళ్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. టాప్లో ఎవరంటే?) -
'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్లో ప్రమాదం.. సంజయ్ దత్కు గాయాలు!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2019లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ సినిమా మాస్ ఆడియన్స్ను ఎంతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటిస్తోంది. మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాని పూరి కనెక్ట్స్ సంస్థ నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: పూరి 'ఇస్మార్ట్ శంకర్' వచ్చేస్తున్నాడు.. ఈసారి బాలీవుడ్ హీరోయిన్) అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్లాండ్లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్లో సంజయ్ దత్కు గాయాలైనట్లు తెలుస్తోంది. కత్తితో ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించే సమయంలో సంజయ్ దత్ గాయపడినట్లు సమాచారం. అతని తలకు గాయం కాగా.. రెండు కుట్లు పడినట్లు చిత్రబృందం తెలిపింది. అయినప్పటికీ అతను వెంటనే సెట్కి తిరిగి వచ్చి షూటింగ్ని ప్రారంభించాడని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటికే ముంబయిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్ థాయ్లాండ్లో కొనసాగుతోంది. కాగా.. సంజయ్ దత్ కేజీఎఫ్-2 చిత్రంలో కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాగా.. జూలైలో మేకర్స్ సంజయ్ దత్ పాత్రను 'బిగ్ బుల్'గా అభిమానులకు పరిచయం చేశారు. అతని ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ చిత్రం మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కాగా.. ఇప్పటికే రామ్- బోయపాటి కాంబోలో భారీ యాక్షన్ మూవీ 'స్కంద' చేస్తున్నాడు. దీనిని సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. (ఇది చదవండి: తీసింది నాలుగు సినిమాలు.. అన్నింటికీ సీక్వెల్స్ చేస్తానంటున్న డైరెక్టర్) -
పూరి జగన్నాథ్, రామ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి చైతన్య !
-
`డబుల్ ఇస్మార్ట్’కి సంజయ్ దత్ భారీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే..
ఒకప్పుడు స్టార్ హీరోలుగా రాణించిన కొంతమంది ఇప్పుడు విలన్గాను దూసుకెళ్తున్నారు. తెలుగులో జగపతిబాబు విలన్గా రాణిస్తుంటే.. బాలీవుడ్లో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా అదరగొడుతున్నాడు. ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’లో అధీరగా సంజయ్ పండించిన విలనిజం సినిమా స్థాయిని పెంచేసింది. ఆ చిత్రం తర్వాత సంజయ్కి వరుసగా ప్రతినాయక పాత్రలే వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న ‘లియో’చిత్రంలో సంజయ్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. అలాగే చాలా కాలంగా తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు సంజయ్. (చదవండి: బిగ్బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే! గ్లామర్కు ఢోకానే లేదుగా!) పూరి జగన్నాథ్ తెరకెక్కించబోతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలో విలన్ బిగ్బుల్ పాత్రలో నటిస్తున్నాడు. రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్(2019)’ చిత్రానికి సీక్వెల్ ఇది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు పూరీ. అందుకే విలన్ పాత్ర కోసం సంజయ్ని ఎంపిక చేసుకున్నారు. పూరీ రాసుకున్న విలన్ పాత్రకు సంజయ్ మాత్రమే న్యాయం చేయగలరని, అందుకే ఆయనను ఎంపిక చేసుకున్నామని చిత్రబృందం పేర్కొంది. (చదవండి: పెళ్లి రూమర్స్పై హీరో తరుణ్ క్లారిటీ!) అయితే ఇందుకుగాను భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ సినిమాకు గాను సంజయ్ దాదాపు 60 రోజుల కాల్షీట్లను ఇచ్చారు. ఇందుకుగాను రూ. 15 కోట్ల పారితోషికం అందించినట్లు అటు బాలీవుడ్లోనూ, ఇటు టాలీవుడ్లోనూ టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రం విడుదల కానుంది. -
డబుల్ ఇస్మార్ట్: బిగ్బుల్ ఎంట్రీ
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’లో సంజయ్ దత్ కీలకపాత్ర చేయ నున్నారనే వార్త శుక్రవారం గుప్పు మన్న విషయం తెలిసిందే. ఆ వార్త నిజమే అని, బిగ్ బుల్గా సంజయ్ దత్ పవర్ఫుల్ రోల్ చేస్తున్నారని ఈ చిత్ర యూనిట్ శనివారం ప్రకటించి, లుక్ని కూడా విడుదల చేసింది. ‘‘డబుల్ ఇస్మార్ట్’లో సంజయ్ దత్ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ తెలియజేసింది. ‘‘మాస్కే డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ రామ్తో కలిసి ఈ సైన్స్ ఫిక్షన్ మాస్ ఎంటర్టైనర్లో నటించడం ఆనందంగా, గర్వంగా ఉంది. వచ్చే ఏడాది మార్చి 8 (‘డబుల్ ఇస్మార్ట్’ విడుదల) కోసం ఎదురు చూస్తున్నాను’’ అని సంజయ్ దత్ ట్వీట్ చేశారు. పూరి జగన్నా«థ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హాలీ వుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పని చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
'డబుల్ ఇస్మార్ట్' కోసం బిగ్ బుల్ను దించిన పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబోలో 'డబుల్ ఇస్మార్ట్' తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించిన వార్త ఏదో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటుంది. 'లైగర్'తో దెబ్బతిన్న పూరీ 'డబుల్ ఇస్మార్ట్' కోసం పక్కా ప్లాన్తో అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ను తీసుకున్నారు. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. (ఇదీ చదవండి: సౌత్ ఇండియాలో రిచ్చెస్ట్ హీరో ఆయనే.. ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే) ఇక సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్ను కుడా రిలీజ్ చేశారు. అందులో సిగరెట్ తాగుతూ సంజయ్ దత్ కనిపిస్తుండగా ఆయనపై గన్స్ అన్నీ పాయింట్ చేసి ఉన్నాయి. ఇందులో 'బిగ్ బుల్'గా సంజయ్ దత్ కనిపిస్తారని మేకర్స్ తెలిపారు. గతంలో కేజీఎఫ్ 2లో అధీర పాత్రలో ఆయన మెప్పించిన విషయం తెలిసిందే. ఈ మూవీపై సంజయ్ కూడా ట్వీట్ చేశాడు. డైరెక్టర్ పూరిజగన్నాధ్, రామ్ పోతినేనితో కలిసి పనిచేయడం గర్వంగా ఉందని ఆయన తెలిపాడు. ఈ సైన్స్ ఫిక్షన్ మాస్ ఎంటర్టైనర్లో తాను భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందంటూ సంజయ్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: శోభన ఇంట్లో చోరీ.. పనిమనిషి వేడుకోవడంతో ఆమె నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా) ఇక 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్గా రానున్న ఈ సినిమాలో రామ్కు జోడిగా మీనాక్షి చౌదరి కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. పూరీ సొంత నిర్మాణంలో ఛార్మీతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి8న ప్రేక్షకుల ముందుకు రానుంది. It takes me immense pride to be working with the director of the masses #PuriJagannadh ji and the young energetic Ustaad @ramsayz 🤗 Glad to be Playing the #BIGBULL in this sci-fi mass entertainer #DoubleISMART Excited to be teaming up with this super-talented team and Looking… pic.twitter.com/SrIAJv6yy1 — Sanjay Dutt (@duttsanjay) July 29, 2023 -
నాగార్జున బ్లాక్ బస్టర్ మూవీ.. సైడ్ ఆర్టిస్ట్గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్!
సినిమా ఇండస్ట్రీలో సొంతంగా ఎదగడం అనుకున్నంత సులభం కాదు. ఓవర్నైట్ స్టార్ గుర్తింపు వచ్చినా గ్లామర్ ఫీల్డ్లో నిలదొక్కుకోవటం అంతా ఆషామాషీ కాదు. కానీ ఏకంగా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ డైరెక్టర్గా ఎదగడమంటే మాటలు కాదు. అంతకుమించిన సక్సెస్ ఉండదు కూడా. అలాంటి అసాధ్యం కానీ విషయాన్ని చేసి చూపించాడు మన టాలీవుడ్ ఆర్టిస్ట్. అతనెవరో కాదు.. పోకిరీ మూవీతో చరిత్ర సృష్టించిన పూరి జగన్నాథ్. (ఇది చదవండి: మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గేస్తోంది సార్: సీఎం తీరుపై సింగర్ ఫైర్) అప్పట్లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ శివ. ఈ చిత్రంలో నాగార్జున హీరోగా నటించిగా.. ఆయన పక్కనే పూరి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా నటించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆర్జీవీ ట్విటర్లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆర్జీవీ ట్వీట్లో రాస్తూ..' ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా శివ సెట్స్లో సూపర్ స్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ . అతని విజయం నిజంగా స్ఫూర్తిదాయకం.' అంటూ శివ సినిమాలోని ఫోటోను షేర్ చేశారు. టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. బద్రి నుంచి లైగర్ దాకా ఆయన ప్రభంజనం కొనసాగింది. తెలుగులో ఇప్పటివరకు ఆయన 33 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దేశముదురు, పోకిరి, చిరుత, గోలీమార్, నేను నా రాక్షసి, బిజినెస్ మేన్, కెమెరామెన్ గంగతో రాంబాబు, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించారు. కాగా.. గతేడాది విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ సినిమాతో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు సైతం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ముంబయిలో ఉంటున్నారు. (ఇది చదవండి: నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి) A would be Super Smart director #PuriJagan on the sets of SHIVA as a background artiste ..His is a truly inspirational RISE ! pic.twitter.com/BPJ6rOfgf1 — Ram Gopal Varma (@RGVzoomin) July 13, 2023 -
సొంతూరిలో ఫ్యామిలీతో కలిసి పూజ చేసిన పూరీ జగన్నాథ్ ఫోటోలు చూశారా?
-
ఐదు భాషల్లో డబుల్ ఇస్మార్ట్
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా షురూ అయింది. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారంప్రారంభమైంది. ‘ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్’ అంటూ రామ్ డైలాగ్ చెప్పిన తొలి సీన్కి చార్మి క్లాప్ ఇవ్వగా, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ‘‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూ΄పొందుతోంది. పూరి జగన్నాథ్ చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ రాశారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందనుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ కంటే ఈ సినిమాలో రామ్ని మాసియర్ క్యారెక్టర్లో చూపించబోతున్నారు పూరి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2024 మార్చి 8న ‘డబుల్ ఇస్మార్ట్’ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి. -
పూరి 'ఇస్మార్ట్ శంకర్' వచ్చేస్తున్నాడు.. ఈసారి బాలీవుడ్ హీరోయిన్
2019లో పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' భారీ హిట్ అందుకుంది. ఆ సినిమా మాస్ ఆడియన్స్ను ఎంతగానో మెప్పించి వారిద్దరికీ బ్లాక్ బస్టర్గా నిలించింది. ఈ సినిమా సీక్వెల్ సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ఓ ఇస్మార్ట్ అప్డేట్ను చిత్ర యూనిట్ షేర్ చేసింది. లైగర్ రిజల్ట్ తనను తీవ్రంగా బాదించినా మళ్లీ తన మార్క్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు పూరి. తనలో ఉన్న ప్రత్యేకత ఇదేనని చెప్పవచ్చు. హీరోలకు ఏ మాత్రం తగ్గని ఫ్యాన్ బేస్ పూరికి ఉంది. (ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్) నేడు జులై 10న ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగినట్లు యూనిట్ తెలిపింది. అందుకు సంబంధించిన పలు షేర్ చేసింది. జులై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దీనికి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్ను కన్ఫామ్ చేసిన విషయం తెలిసిందే. 2024 మార్చి 8న డబుల్ ఇస్మార్ట్ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రామ్- బోయపాటి కాంబోలో భారీ యాక్షన్ మూవీ 'స్కంద' చేస్తున్నాడు. దీనిని సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. అది హిట్ అయితే డబుల్ ఇస్మార్ట్ కి డబుల్ కిక్ ఇవ్వడమే కాకుండా.. లైగర్తో నష్టపోయిన పూరి బౌన్స్ బ్యాక్ ఇవ్వడం ఖాయం. బాలీవుడ్ హీరోయిన్ రామ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరోక హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారని సమాచారం. మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. With the blessings of Lord Shiva 🔱 Ustaad @ramsayz & Dashing Director #PuriJagannadh's#DoubleISMART Pooja ceremony commenced 🪔 Shoot Begins on July 12th❤️🔥 Mass Action Entertainer at the cinemas on MARCH 8th, 2024💥@Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/Kj9vDRHiIg — Puri Connects (@PuriConnects) July 10, 2023 (ఇదీ చదవండి: అల్లర్ల మధ్య హోటల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఊర్వశి!) -
Bahuda yatra : ఘనంగా పూరీ జగన్నాథుని బహుడా యాత్ర (ఫొటోలు)
-
దేవుడిని నమ్మిన వాళ్లందరూ స్వార్థపరులు.. చచ్చిపోండి.
-
దీక్ష విరమించిన లైగర్ ఎగ్జిబిటర్లు
భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ ఎంతటి పరాజయాన్ని మూటగట్టుకుందో తెలిసిందే! విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకనిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ఈ సినిమా వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని ఎగ్జిబిటర్లకు మాటిచ్చాడు పూరీ. అయితే హామీ ఇచ్చి ఆరు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మే 12న ఎగ్జిబిటర్లు ఫిలిం ఛాంబర్ ఎదుట నిరవధిక దీక్ష చేపట్టారు. నిర్మాతల మండలి సహా తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమస్య పరిష్కారం చేస్తామని మాటివ్వడంతో ఎగ్జిబిటర్లు గురువారం దీక్ష విరమించారు. పూరీ జగన్నాథ్, చార్మి త్వరలో అంతా సర్దుబాటు చేస్తామని చెప్పడం వల్లే దీక్ష విరమించామని పేర్కొన్నారు. చదవండి: సింహాద్రి రీరిలీజ్ కలెక్షన్లు ఏం చేస్తారంటే? -
ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్!
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లోనే ఈ సినిమాకు సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం రానుంది. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. నేడు (మే 15) రామ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆదివారం ‘డబుల్ ఇస్మార్ట్’ని ప్రకటించి, ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ‘‘అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, హై బడ్జెట్తో ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం తెరకెక్కనుంది. ఈసారి రెట్టింపు మాస్, రెట్టింపు వినోదాన్ని ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
రోడ్డెక్కిన లైగర్ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు
-
'లైగర్' మూవీ ఎఫెక్ట్.. ఆందోళనకు దిగిన ఎగ్జిబిటర్స్!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'లైగర్'. అనన్యా పాండే కథానాయికగా నటించింది. పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై ఛార్మి, పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. (ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డులు.. నెటిజన్స్ ట్రోలింగ్) అయితే భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. తాజాగా ఈ సినిమా వల్ల తాము ఎంతో డబ్బు నష్టపోయామంటూ నైజాంకు చెందిన ఎగ్జిబిటర్లు హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే నష్టాన్ని భర్తీ చేస్తామని చిత్ర నిర్మాత పూరి జగన్నాథ్, డిస్ట్రిబ్యూటర్ తమకు మాటిచ్చి ఆరునెలలు అయిందని తెలిపారు. కానీ ఇప్పటి వరకూ తమకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన గడువు ముగియడంతో ఎగ్జిబిటర్లు ఆందోళనకు దిగారు. (ఇది చదవండి: బీస్ట్ మోడ్లో హీరో సూర్య.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో) -
భార్యను దూరం పెట్టాడంటూ రూమర్స్.. చెక్ పెట్టిన పూరీ జగన్నాథ్
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడంటూ ఎప్పటినుంచో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యామిలీని దూరం పెట్టి హీరోయిన్ చార్మీతో కలిసి తిరుగుతున్నాడని, అందుకే హైదరాబాద్కు రావడం తగ్గించేశాడని పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాకుండా తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సైతం సిద్ధపడ్డాడంటూ వార్తలు వచ్చాయి. గతంలో ఈ విడాకుల రూమర్స్పై పూరీ తనయుడు ఆకాశ్ స్పందిస్తూ అదంతా అబద్ధమని స్పష్టం చేశాడు. అయినా ఆ వదంతులకు చెక్ పడలేదు. తాజాగా ఆ వార్తలను కొట్టిపారేస్తూ తన కుటుంబంతో కలిసి కనిపించాడు పూరీ. తన సొంతూరు అయిన నర్సీపట్నంలో అన్నదమ్ములు, కుటుంబసభ్యులతో కలిసి సందడి చేశాడు. భార్య లావణ్యతో పాటు పిల్లలతో కలిసి హోమాన్ని ఆచరించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇకపోతే పూరీ జగన్నాథ్ చివరగా లైగర్ సినిమాకు దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ మూవీ ఘోర పరాజయం పాలై తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ డిజాస్టర్ రిజల్ట్ ఫలితంగా ఇకనైనా పట్టాలెక్కుతుందనుకున్న జనగణమన సినిమా మొదలుపెట్టకముందే మళ్లీ ఆగిపోయింది. పూరీ.. చిరంజీవితో, విశ్వక్సేన్తో సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగినా అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: రజనీకాంత్ చిన్నకూతురి ఇంట్లో దొంగతనం -
Director Puri Jagannadh : సొంతూరిలో ఫ్యామిలీతో కలిసి పూజ చేసిన పూరీ జగన్నాథ్ (ఫొటోలు)
-
పూరి జగన్నాథుడు: మూల విరాటుల అంగాలకు ముప్పు? వినకుంటే విపత్తే!
భువనేశ్వర్: మూల విరాటుల అంగాలకు ముప్పు వాటిల్లే విపత్కర చర్యల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. శ్రీమందిరం సింహద్వారం ఆవరణలో ఇటీవల తారు రోడ్డు పనులు చేపట్టారు. ప్రస్తుత నిర్మాణ శైలి రథయాత్ర ప్రక్రియలో రత్నవేదిక నుంచి యాత్రకు తరలివచ్చే మూలవిరాట్ల శ్రీఅంగాల (విగ్రహాల)కు భారీ ముప్పు కలిగించే రీతిలో తారస పడుతున్నాయి. సువిశాల బొడొదండొ మార్గం పొడవునా తారుపూత పూస్తున్నారు. ఈ సందర్భంగా స్వల్ప విభజనతో రెండు అంచెల రోడ్డుగా మలుస్తున్నట్లు వర్ధమాన నిర్మాణశైలి ప్రతిబింబిస్తుంది. ఈ విభజన రథాల కదలికకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. అలాగే శ్రీమందిరం గర్భగుడి రత్నవేదిక నుంచి మూలవిరాట్ లను రథాల పైకి తరలించే పొహొండి కార్యక్రమంలో కాలు జారడం వంటి చిరు ప్రమాదాలతో పెద్ద తప్పిదాలను ప్రేరేపిస్తాయని కలవర పడుతున్నారు. యాత్ర పొడవునా పలుమార్లు 3 భారీ రథాలను మలుపు తిప్పాల్సిన పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఇటువంటి సందర్భాల్లో నిర్మాణశైలి తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. యాత్ర నిర్వహణ దృష్టిలో పెట్టుకుని సింహద్వారం ఆవరణ, బొడొదండొ మార్గం తారుపూత పనులు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విభజన, ఎగుడు దిగుడులు తొలగించాలని శ్రీమందిరం పాలకమండలి సీనియర్ సభ్యుడు దుర్గాప్రసాద్ దాస్ మహాపాత్ర కోరారు. దీనిపై ప్రధాన పాలనాధికారి (సీఏఓ) దృష్టి సారించాలన్నారు. రథ వాకిలిలో భద్రత.. రథయాత్ర ఆద్యంతాల్లో మూల విరాట్ల రథాలు శ్రీమందిరం సింహద్వారం ముంగిట నిలుపుతారు. యాత్ర ప్రారంభం పురస్కరించుకుని ఈ వాకిలిలో రథ ప్రతిష్ట ముగించి మూల విరాట్లను గొట్టి పొహొండి ప్రక్రియలో ఒక్కొక్కటిగా రథాల పైకి తరలిస్తారు. అలాగే యాత్ర చిట్టచివరి ఘట్టం నీలాద్రి విజే పురస్కరించుకుని రథాలపై ఆసీనులైన మూర్తులను సురక్షితంగా శ్రీమందిరం రత్న వేదికకు తరలించాల్సి ఉంటుంది. ఈ ప్రాంగణంలో సిద్ధం చేసిన తారురోడ్డు ఉపరితలమంతా ఎగుడు దిగు డుగా తయారైంది. ఈ పరిస్థితిని సవరించి పూర్తిగా చదును చేయకుంటే గొట్టి పొహండి, నీలాద్రి విజే పురస్కరించుకుని జరిగే మూల విరాట్ల తరలింపు సందర్భంగా కాలు జారుడు వంటి ప్రమాదాలతో మూల విరాట్ల భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం తలెత్తుతుంది. యాత్ర ఆద్యంతాలు మలుపు తిప్పే పరిస్థితుల్లో చకచకా తరలే రథాల కదలికకు ఆటంకం కలగవచ్చు. ఈ అభ్యంతరాల దృష్ట్యా రోడ్డు చదును చేసేందుకు సంబంధిత అధికారులు సుముఖంగా స్పందించారు. దశమహాపాత్ర నిర్మాణ సంస్థ అధికారులు ఈ నెలలోగా ఎగుడు దిగుడులు తొలగించి కొత్తగా నిర్మితం అవుతున్న రహదారి చదును చేసే పనులు పూర్తి చేస్తామని అనుబంధ అధికార వర్గాలు హామీ ఇచ్చారు. సర్దుబాటుకు ఆదేశాలు.. తారుపూతలో ఎగుడు దిగుడుల కారణంగా యాత్ర ఆద్యంతాల్లో రథాన్ని మలుపు తిప్పడంలో పలు ఇబ్బందులు తలెత్తుతాయని అనుబంధ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అభ్యంతరాలను ఆలయ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పూరీ జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో నిర్మాణ శైలిలో స్వల్ప మార్పుతో అనుకూల రీతిలో సర్దుబాటు చేయాలని నిర్మాణ సంస్థ ఓబీసీసీని ఆదేశించారు. రథశాల ప్రాంగణంలో.. శ్రీమందిరం కార్యాలయం పరిసరాల్లో స్వామి వార్షిక రథయాత్ర కోసం కొత్త రథాల తయారీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రథాల పలు భాగాల నిర్మాణం అంచెలంచెలుగా పూర్తి కావడంతో క్రమ పద్ధతిలో అమర్చి, రథం రూపుదిద్దుతారు. అనంతరం ఈ ప్రాంగణం నుంచి మలుపు తిప్పి శ్రీమందిరం సింహద్వారం ఆవరణకు తరలించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాంగణంలో తారురోడ్డుపై రాళ్లు తేలుతున్నాయి. రథ భాగాల అమరిక పురస్కరించుకుని భారీ కొయ్య భాగాల తరలింపు, రథాల మలుపు పురస్కరించుకుని రోడ్డుపై తేలియాడుతున్న రాళ్లతో ఊహాతీత ప్రమాదాలు తలెత్తే అవకాశం లేకపోలేదని భొయి సేవకవర్గం ప్రముఖుడు సర్దార్ రవిభొయి తెలిపారు. ఈ ప్రాంగణంలో తారురోడ్డుపై రాళ్లు తొలగించి చదును చేయడం అనివార్యంగా పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు తెలియజేసినట్లు వివరించారు. -
ఆ హీరో తో పూరీ జగన్నాథ్ సినిమా షూటింగ్ ఎప్పుడంటే?
-
చాలా రోజుల తర్వాత జంటగా కనిపించిన పూరి జగన్నాథ్-ఛార్మీ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మీ పేర్లు లైగర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో పాన్ ఇండియా రేంజ్లో వినిపించాయి. కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఛార్మీ అయితే కొన్నాళ్ల పాటు సోషల్ మీడియా నుంచి కూడా దూరంగా ఉంది. ఇప్పటికీ ఆమె నెట్టింట అంతగా యాక్టివ్గా కనిపించడం లేదు. లైగర్ రిలీజై సుమారు 6-7 నెలలు అయినా నిమా ఫంక్షన్లు, పార్టీలు ఇలా బయట కూడా వీరు అంతగా కనిపించలేదు. అలాంటిది తాజాగా ఛార్మీ-పూరీలు ముంబై ఎయిర్పోర్టులో దర్శనమిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా లైగర్ అనంతరం విజయ్తో అనౌన్స్ చేసిన ‘జనగణమన’ ప్రాజెక్ట్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పూరి జగన్నాథ్ కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. మరి త్వరలోనే ఏదైనా ప్రాజెక్ట్ గురించి కబురు చెబుతారేమో చూడాలి మరి. -
ఆ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా.. 30 రోజుల్లో షూటింగ్ కంప్లీట్
-
ఆ డైరక్టర్ తో చిరంజీవి సినిమా 30 రోజుల్లో షూటింగ్ కంప్లీట్
-
ఏయే హీరో ఏయే దర్శకుడు చెప్పిన కథ విన్నారో చూద్దాం!
షూటింగ్ చేయడం.. కొత్త సినిమా కోసం కథలు వినడం... ప్రస్తుతం సీనియర్ స్టార్స్ ఇలా కథలు వినే పని మీద ఉన్నారు. ఫలానా దర్శకుడు చెప్పిన కథను ఫలానా హీరో విన్నారట అనే టాక్ రావడంతో విన్నారా? నిజమేనా? అనే చర్చ మొదలైంది. ఇక వార్తల్లో ఉన్న ప్రకారం ఏయే హీరో ఏయే దర్శకుడు చెప్పిన కథ విన్నారో చూద్దాం. చిరంజీవి ఖాతాలో ప్రస్తుతం ఉన్న రెండు చిత్రాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘బోళా శంకర్’. వీటిలో ‘వాల్తేరు వీరయ్య’ ఈ 13న విడుదల కానుండగా, ‘బోళా శంకర్’ ఏప్రిల్ 14న రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ రెండు చిత్రాల తర్వాత యువ దర్శకుడు వెంకీ కుడుములతో చిరంజీవి హీరోగా నటించే సినిమా తెర కెక్కాల్సింది. కానీ ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం హోల్డ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి తర్వాతి సినిమా ఏ దర్శకుడితో అనే చర్చ మొదలైంది. అయితే గత ఏడాది వేసవిలో చిరంజీవి హీరోగా తాను నిర్మాతగా ఓ సినిమా చేయనున్నట్లు నటి రాధిక ట్వీట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. చిరంజీవి నెక్ట్స్ చేయబోయేది ఈ సినిమాయే అని, ఇటీవలే కథా చర్చలు కూడా ఊపందుకున్నాయన్నది ఫిల్మ్నగర్ లేటెస్ట్ టాక్. ఆల్రెడీ కొంతమంది దర్శకులు చెప్పిన కథలు విన్నారట చిరంజీవి. ఇటు రాధిక కూడా కొంతమంది రచయితలను సంప్రదించగా, వారు చిరంజీవికి స్టోరీ లైన్ చెప్పారట. మరోవైపు దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా చిరంజీవి కోసం ఓ కథను రెడీ చేస్తున్నారని తెలిసింది. అలాగే ప్రభుదేవా కూడా ఓ కథ సిద్ధం చేశారట. మరి.. చిరంజీవి ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? అనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇటు ‘వీరసింహారెడ్డి’ సినిమాను ఈ సంక్రాంతి బరిలో ఉంచిన బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కాగా బాలకృష్ణకు ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి సూపర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను ఇటీవల ఆయనకు ఓ కథ వినిపించారట. అలాగే దర్శకుడు పరశురామ్ కూడా బాలకృష్ణకు కథ చెప్పారట. మరోవైపు ‘ఆదిత్య 369’కు సీక్వెల్గా ‘ఆదిత్య మ్యాక్స్ 999’ సినిమా చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారు. మరి.. బాలకృష్ణ 109వ దర్శకుడు ఎవరు? అనే విషయంపై క్లారిటీ రావాలంటే కొంత సమయం పడుతుంది. ఇక మరో ఇద్దరు సీనియర్ హీరోలు వెంకటేశ్, నాగార్జున కూడా ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నారు. నాగార్జునకు గతంలో కథలు వినిపించిన వారిలో తమిళ దర్శకుడు మోహన్రాజా, రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుతానికి ప్రసన్న కుమార్ కథ పట్ల నాగార్జున మొగ్గు చూపారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన సంక్రాంతి సమయంలో రానున్నట్లు తెలిసింది. కాగా, గత ఏడాది రిలీజైన ‘ఎఫ్ 3’ తర్వాత మరో కొత్త సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లలేదు వెంకటేశ్. ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు కేవీ అనుదీప్, దర్శక–రచయిత తరుణ్ భాస్కర్ కథలు వినిపించినప్పటికీ... ఇంకా ఏ ప్రాజెక్ట్కీ పచ్చజెండా ఊపలేదు వెంకీ. కాగా వెంకటేశ్కి కథ వినిపించిన దర్శకుల జాబితాలో తాజాగా ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను పేరు కూడా చేరిందని, శైలేష్ చెప్పిన కథకు వెంకీ ఇంప్రెస్ అయ్యారని టాక్. వెంకటేశ్ నెక్ట్స్ మూవీ శైలేష్ దర్శకత్వంలోనే అనే ప్రచారం ఊపందుకుంది. ఇక ఈ నలుగురి హీరోల నెక్ట్స్ డైరెక్టర్ ఎవరో అధికారిక ప్రకటన వస్తేనే తెలుస్తుంది. -
నీకు దమ్ముంటే ఈరోజే కుమ్మేయ్.. రేపటి కోసం నాటకాలొద్దు: పూరి జగన్నాధ్
ప్రతి ఒక్కరూ భవిష్యత్ కోసం బతుకుతూ వర్తమానం ఎంజాయ్ చేయడాన్ని మర్చిపోతున్నారని దర్శకుడు పూరి జగన్నాధ్ అన్నారు. మనం ప్రజెంట్ సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యమన్నారు. ఇప్పటి ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించాలని కోరారు. అంతేకానీ రేపటి పేరు చెప్పి ఇప్పుడు ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదన్నారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. హ్యాహీ నౌ హియర్ అంటూ వీడియో విడుదల చేశారు. (ఇది చదవండి: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో..!) పూరి మాట్లాడుతూ.. 'మనందరి కోరిక ఒకటే. హ్యాపీగా ఉండటం. దీని కోసం ముందు కష్టపడాలి. ఎందుకంటే అది మనకు తెలుసు. కానీ మనమేం చేస్తున్నాం. అలా కాకుండా హమ్మయ్య రేపటి నుంచి మన కష్టాలు తీరిపోతాయనుకుంటున్నాం. మనం నెక్ట్స్ ఇయర్ కుమ్మేద్దాం అనుకుంటాం. నీకు దమ్ముంటే ఈరోజే కుమ్మేయ్. రేపటికి వాయిదా వేయడం ఎందుకు? నీకు దమ్ముంటే ఈ రోజు తాగకుండా ఉండగలవా? రాత్రంతా తాగడం మానేయ్. చక్కగా భోంచేసి పడుకో. కానీ అలా చేయవు. తాగి తందనాలు ఆడతావు. రేపటి ఆనందం కోసం ఈరోజు నాశనం చేస్తున్నాం. వర్తమానాన్ని మంటగలుపుతూ.. భవిష్యత్తు కోసం బతుకుతున్నాం.' అని అన్నారు. 'ఇప్పుడు నువ్వు ఆనందంగా లేకపోతే న్యూ ఇయర్ ఎప్పుడు బాగుండదు. ఆలాగే రేపటి కోసం బతుకుతున్నావంటే నీకు ఆనందం గురించి తెలియదు. నీ కష్టాలు తీరిపోయే రోజు ఎప్పుడు రాదు. ఈ రోజు డిసెంబర్ 31 ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారన్నది మనకు అనవసరం. వారితో కలిసి ఎంజాయ్ చేయ్ తప్ప.. రేపటి న్యూ ఇయర్ కోసం తాగకు. ఈ క్షణం నా లైఫ్ బాగుందనుకుని తాగు. దయచేసి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకోవద్దు. నేను మారిపోవాలి అనుకుంటే ఈ రోజే మారిపో. రేపు పేరు చెప్పి నాటకాలాడొద్దు. హ్యాపీనెస్ ఎప్పుడు ఫ్యూచర్లో ఉండదు.. ప్రజెంట్లోనే ఉంటుంది. హ్యూపీ నౌ హియర్.' అంటూ సందేశమిచ్చారు. (ఇది చదవండి: ఆ హీరోయిన్ చేస్తే 'యశోద' ఇంకా బాగుండేది: పరుచూరి) -
ఏం చేయాలో సరిగ్గా చెప్పి చావు.. పూరీపై హీరోయిన్ ఫైర్
లైగర్ డిజాస్టర్ తర్వాత సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ తిరిగి అభిమానులతో టచ్లోకి వస్తున్నాడు. పూరీ మ్యూజింగ్స్ పేరిట నిత్యం ఏదో ఒక అంశంపై ఫిలాసఫీ బోధిస్తున్నాడు. తాజాగా ఆయన బ్యాలెన్స్డ్గా రిప్లై ఇవ్వడం ఎలా? అనేది వివరించాడు. అంతేకాకుండా దీనికి ఇడియట్ మూవీ షూటింగ్లో జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. 'జీవితంలో చాలా జరుగుతుంటాయి. వాటిమీద మనకు ఎలాంటి కంట్రోల్ ఉండదు. ఏం జరిగితే ఎలా రియాక్ట్ అవుతున్నామనేదే మన చేతుల్లో ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా కామ్గా రియాక్ట్ అవాలి. అరిచి గోల చేయడం, తల గోడకేసి కొట్టుకోవడం వంటివి చేయకూడదు. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సమస్య ఎప్పుడూ సమస్య కాదు. ఆ సమస్యకు మీరు స్పందించే విధానమే అసలైన సమస్య. మనుషులకు ఎలా రియాక్ట్ అవుతున్నాం? పరిస్థితులకు ఎలా రియాక్ట్ అవుతున్నాం? లేదా ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే దానికి ఎలా సమాధానమిస్తున్నామన్నది ముఖ్యం. బ్యాలెన్సెడ్గా, ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం. ఏం మాట్లాడినా మన భావోద్వేగాలను నియంత్రణలో పెట్టుకుని మాట్లాడాలి. విపరీతమైన కోపంలో ఉంటే అస్సలు ఆన్సర్ చేయకండి, సైలెంట్గా అక్కడి నుంచి వెళ్లిపోండి. చాలాసార్లు ఏమీ ఎక్స్ప్రెస్ చేయకపోవడం చాలా మంచిది. అవతలి మనిషి కోపంలో ఉన్నప్పుడు నవ్వుతూ రియాక్ట్ అవండి, వాళ్లకు ఏం చేయాలో అర్థం కాదు. ఇడియట్ సినిమా షూటింగ్లో ఏడ్చే సన్నివేశంలో రక్షిత విపరీతంగా పగలబడి నవ్వుతోంది. నాకు కోపం వచ్చింది. సెట్లో అందరూ వింటుండగా చాలా గట్టిగా చెప్పా.. రక్షిత నువ్వు ఫోకస్ చేయట్లేదు, ఇలాగైతే నెక్స్ట్ సినిమాలో నీకు క్యారెక్టర్ రాయను అని చెప్పాను. ఆమె వెంటనే రాయాలి, రాయకపోతే చంపేస్తా! నీ తర్వాతి 10 సినిమాలు నేనే చేస్తా.. ఇప్పుడు నీకేం కావాలో సరిగా చెప్పి చావు అంది. అంతే, ఆమె రెస్పాన్స్కు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ మాటలకు నాకూ నవ్వాగలేదు. ఎందుకంటే ఊహించని పాజిటివ్ రెస్పాన్స్ అది. దెబ్బతో ఆమె మీద కోపం పోయింది. అలా కాకుండా నేనన్న మాటలకు ఇన్సల్ట్గా ఫీలై ఏడుస్తూ సెట్లో నుంచి వెళ్లిపోవచ్చు. అలిగి రెండో రోజు షూటింగ్కు రావడం మానేయొచ్చు.. కానీ తనలా చేయలేదు. అందుకే మన రియాక్షన్స్తో జీవితంలో చాలా నాన్సెన్స్ను కట్ చేయొచ్చు. అలాగే సోషల్ మీడియాలో ఎవరో ఏదో పోస్ట్ పెడితే ప్రత్యేకంగా రియాక్ట్ కానవసరం లేదు. ఎక్కడో ఏదో జరిగితే మనం వైల్డ్గా రియాక్ట్ అయి పదిమందితో వాదించి గొడవపెట్టుకోవడం అవసరమా? కాబట్టి మనకు పనికొచ్చేవాటికే మనం రియాక్ట్ కావాలి. నవ్వుతూ సమాధానం చెప్పండి. లేదంటే ఎలాంటి బదులివ్వకుండా చిన్న చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించవచ్చు' అని చెప్పుకొచ్చాడు పూరీ జగన్నాథ్. చదవండి: మిడ్ వీక్ ఎలిమినేషన్కు శ్రీసత్య బలి పవన్ కల్యాణ్ సినిమా నుంచి తప్పుకున్న పూజా హెగ్డే -
జీవితంలో సగం గొడవలు దానివల్లే వస్తాయి: పూరీ జగన్నాథ్
భారీ అంచనాలు పెట్టుకున్న లైగర్ డిజాస్టర్ కావడంతో సోషల్ మీడియాకు కొంత దూరంగా ఉంటున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. తాజాగా అతడు ఓ కొత్త పాడ్క్యాస్ట్తో అభిమానులకు తన స్వరం వినిపించాడు. ఈసారి ఆయన తడ్కా గురించి మాట్లాడాడు. తడ్కా అంటే తాలింపు, పోపు. ఏంటి? పూరీ వంట మాస్టారు ఎప్పుడయ్యారనుకునేరు.. అయినదానికీ కానిదానికీ అనవసరమైన మాటలు జోడించి మంటపెట్టే వ్యవహారం గురించి మాట్లాడారాయన. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే.. 'మనం ఓ మనిషిని ఇంకో మనిషి దగ్గరకు ఏదో పని మీద పంపిస్తాం. అతడు తిరిగొచ్చి ఏం జరిగిందో చెప్పడు. అవతలివాడు ఏమన్నాడో తప్ప మిగతాదంతా చెప్తాడు. అసలేమైంద్రా అంటే.. మంచిరోజులు కావన్నా.. నువ్వెంత చేశావు వాడికి.. వాడలా మాట్లాడటం నచ్చలేదు. నాలుగు డబ్బులు వచ్చేసరికి ఒళ్లు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. నేను కాబట్టి ఊరుకున్నాను కానీ, నువ్వైతే లాగి పెట్టి కొట్టేవాడివి అని చెప్పుకుంటూ పోతాడు. ఇంతకీ వాడు ఏమన్నాడ్రో చెప్రా అని అడిగితే ఇంకెప్పుడూ వాడి దగ్గరకు పంపించొద్దు, ప్లీజ్ అన్నా, వరస్ట్ ఫెలో వాడు.. ఇలా అడిగిన దానికి సమాధానం మాత్రం ఇవ్వడు. అది కాదురా, ముందు వాడేమన్నాడో మ్యాటర్ చెప్పు అని అడిగితే డబ్బులిచ్చి పట్టుకెళ్లమన్నాడు అని బదులిస్తాడు అంటే అక్కడ పెనంలో ఉన్నదాన్ని ఇక్కడికి తెచ్చేలోపు మనుషులు తాళింపు వేసి తీసుకొస్తారు. తాళింపు అంటే తడ్కా. జీవితంలో సగం గొడవలు తడ్కా వల్లే వస్తాయి. మధ్యవర్తులు జరిగింది చెప్తున్నారా? లేదంటే వాళ్ల అభిప్రాయం చెప్తున్నారా? అనేది గ్రహించాలి. డౌటొస్తే అడిగేయండి. మనందరం పుట్టుకతోనే వండటం నేర్చుకున్నాం. అలవోకగా తడ్కా పెట్టేస్తాం. ఇప్పటికైనా జరిగిందే చెప్పండి. నీ అభిప్రాయం అడిగినప్పుడే నీ మనసులో ఉన్నది కక్కేయండి, లేదంటే చావండి. అంతేకానీ మీరేమనుకుంటున్నారో ముందే చెప్పేయడం కుదరదు. తడ్కా వేసేది మనమే.. తడ్కా లేకుండా మనదగ్గరకి ఏ విషయం రాదు. దయచేసి తట్కాలు తగ్గిద్దాం.. అని సలహా ఇచ్చాడు పూరీ. చదవండి: శ్రీహాన్ నా వెనకాల మాట్లాడతాడు: రేవంత్ -
పూరికి చిరు గ్రీన్ సిగ్నల్..!
-
పూరీ జగన్నాథ్ ని ఆదుకోనున్న రవితేజ
-
విజయ్కి ‘లైగర్’ సెగ!
సాక్షి, హైదరాబాద్: ‘లైగర్’చిత్రంలో పెట్టుబడులకు సంబంధించిన సెగ ఆ చిత్రంలో నటించిన హీరో విజయ్ దేవరకొండకు తగిలింది. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట ఆయన బుధవారం హాజరయ్యారు. ప్రధానంగా భారీ బడ్జెట్తో కూడిన ఆ సినిమా నిర్మాణానికి పెట్టుబడులు పెట్టిన వారి విషయం పైనే ఈడీ దృష్టి పెట్టింది. కొందరు రాజకీయ నేతలు మనీలాండరింగ్ ద్వారా లైగర్లో పెట్టుబడులు పెట్టారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈడీ గత నెల 17న ఈ సినిమా దర్శకనిర్మాతలు పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్లను 10 గంటలపాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వారి విచారణలో వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలను క్రాస్ చెక్ చేసుకోవడానికి విజయ్ దేవరకొండకు నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం అధికారులు ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. రెమ్యునరేషన్ ఎలా తీసుకున్నారు? విజయ్ తన మేనేజర్తో కలిసి బుధవారం ఉదయం 8.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈడీ అధికారులకు ఇవ్వడానికి తన వెంట కొన్ని పత్రాలను తెచ్చారు. ఉదయం 10.30 గంటలకు విజయ్ను ప్రశ్నించడం ప్రారంభించిన అధికారులు గంట భోజన విరామం ఇచ్చారు. ఆ తర్వాత ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకు సాగింది. ఈ చిత్ర నిర్మాణంతోపాటు విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్కు సంబంధించి అధికారులు ప్రశ్నల్ని సంధించారు. పారితోషికాన్ని చెక్కుల ద్వారానా, ఆన్లైన్లోనా లేదా నగదు రూపంలో తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతలతో చేసుకున్న ఒప్పంద పత్రాలను విజయ్ నుంచి తీసుకున్నారు. ఈ చిత్రానికి పెట్టుబడులు పెట్టిన వారిలో హైదరాబాద్కు చెందిన కొందరు రాజకీయ నేతలు ఉన్నారన్నది ఈడీ అనుమానం. ఈ విషయంపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన.. నటించడం మాత్రమే తన బాధ్యతని, ఆర్థిక లావాదేవీల్లో కలగజేసుకోలేదని చెప్పారని సమాచారం. తాను ఎక్కువగా దర్శకుడితోనే సంప్రదింపులు జరిపానని, తమ మధ్య పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడు, వివిధ ఫంక్షన్ల సమయంలోనూ రాకపోకలు సాగించిన, హాజరైన వారి జాబితాలను అధికారులు సేకరిస్తున్నారు. వీరికి నిర్మాతలతో ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు. అధికారులు త్వరలో మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. లైగర్ నిర్మాతల్లో పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్తోపాటు బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్, అపూర్వ మెహతా సైతం ఉన్నారు. వీరికీ నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించిన మైక్ టైసన్ రెమ్యునరేషన్ అంశాన్నీ ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారని సమాచారం. ఈ కేసుకు సంబంధించి మరికొందరి విచారణ పూర్తయిన తర్వాత అవసరమైతే విజయ్ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. వారికి కావాల్సిన జవాబులిచ్చా.. ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. విచారణ నేపథ్యంలో అధికారులు తన రెమ్యునరేషన్ వివరాలు అడిగారని, తాను చెప్పానని పేర్కొన్నారు. ‘మీరందరూ ఎలా ఉన్నారు. (మీడియా వాళ్లను ఉద్దేశించి) చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు... దాదాపు రోజంతా కదా!! నేను లోపల (ఈడీ కార్యాలయంలో) 12 గంటలు ఉన్నా. ఈడీ వాళ్లు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు. వారికి కావాల్సిన జవాబులు ఇచ్చాను. మీరు ఎంతగానో ప్రేమిస్తారు... ఆ పాపులారిటీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందులో ఇదీ ఒకటి. నన్ను ఈడీ వాళ్లు పిలిచినప్పుడు వచ్చి నా డ్యూటీ నేను చేశాను. గురువారం రమ్మని పిలవలేదు’అని విజయ్ అన్నారు. ఏ కేసుపై మిమ్మల్ని విచారించారు అన్న మీడియా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా గుడ్నైట్ అంటూ వెళ్లిపోయారు. -
ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ డైరెక్షన్ చేయడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు. ఛార్మి కౌర్ సహ నిర్మాతగా వ్యవహరించింది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడింది. అయితే ఈ సినిమా లావాదేవీల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గుర్తించింది. ఈ సినిమాలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారన్న విషయంపై ఇప్పటికే లైగర్ నిర్మాతలు పూరీ జగన్నాథ్, చార్మీలను ఈడీ అధికారులు విచారించారు. తాజాగా లైగర్ హీరో విజయ్ దేవరకొండను కూడా విచారణకు పిలిచారు ఈడీ అధికారులు. మంగళవారం ఉదయం హీరో విజయదేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యాడు. లైగర్ సినిమా లావాదేవిలపై విజయ్ను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. -
డైరెక్టర్ పూరీ, ఛార్మీ లను విచారిస్తున్న ఈడీ అధికారులు
-
ఈడీ ఆఫీసులో పూరీ, చార్మీ..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫోకస్ చేసింది. ఈ సినిమాలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారన్న విషయంపై లైగర్ నిర్మాతలు పూరీ జగన్నాథ్, చార్మీలను విచారిస్తోంది. గురువారం పూరీ, చార్మీ ఈడీ ఆఫీస్కు రాగా.. సినిమాకు సంబంధించిన నగదు లావాదేవీలపై ఈడీ వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కాగా వీరు ఫెమా(విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం) నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు అధికారులు ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు. ఇకపోతే లైగర్ సినిమాలో రాజకీయ నేతలు బ్లాక్మనీని పెట్టుబడులుగా పెట్టారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఈడీకి ఫిర్యాదు కూడా అందింది. దీనికి తోడు లైగర్ నిర్మాతలు ఫెమా నిబంధనలను బ్రేక్ చేసినట్లు ఆధారాలు దొరకడంతో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పూరీ, చార్మీలకు పదిహేను రోజుల క్రితమే నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డ పూరీ, చార్మీతో కలిసి నేడు ఈడీ ఆఫీస్కు వెళ్లగా.. విదేశీ పెట్టుబడుల గురించి ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: అమెజాన్ ప్రైమ్లోకి కాంతార, కాకపోతే ఓ ట్విస్ట్ -
Vijay Devarakonda: నేను ఎక్కడికి వెళ్లలేదు.. మళ్లీ తిరిగి వస్తా
లైగర్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో బోల్తా కొట్టింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ మూవీలో విజయ్కి జోడీగా అనన్య పాండే నటించింది. ఆదివారం ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్.. లైగర్ ఫ్లాప్పై స్పందించారు. లైగర్ సినిమా విడుదల తర్వాత నేను ఎక్కడికెళ్లినా అభిమానులు మంచి కమ్ బ్యాక్తో రావాలని అడుగుతున్నారని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ పెద్దఎత్తున సందడి చేశారు. ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ద్వారా విజయ్ బాలీవుడ్లోనూ అరంగేట్రం చేశారు. (చదవండి: ఆర్మీ క్యాంపులో విజయ్ దేవరకొండ.. ఆ ప్రాజెక్ట్ కోసమేనా?) ఈ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ.. 'నేను ఎక్కడికి వెళ్లినా అభిమానులు అన్నా.. నువ్వు మళ్లీ కమ్బ్యాక్ ఇవ్వాలని అడుగుతున్నారు. నేను మీకు ఒకటే చెప్పాలనుకున్నా. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. మళ్లీ తిరిగి వస్తా' అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరలవుతోంది. దీంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్కు ఉన్న కాన్ఫిడెన్స్ తమకు ఉండాలని కోరుకుంటున్నట్లు ఓ అభిమాని కామెంట్ చేశాడు. రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్ కూడా ఈ చిత్రంలో నటించారు. లైగర్ విడుదలకు ముందే విజయ్, పూరి కలిసి జనగణమన అనే మరో ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగిపోయినట్లు తెలుస్తోంది. విజయ్ ప్రస్తుతం సమంతా రూత్ ప్రభుతో కలిసి తెలుగు రొమాంటిక్ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. -
'లైగర్' మూవీని ముందు ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో అటు పూరి జగన్నాథ్కు, ఇటు విజయ్కు కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా కథను పూరి ముందుగా కన్నడ స్టార్ హీరో యష్కు వినిపించాడట. అయితే ఆయన నో చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ విజయ్ దగ్గరికి వెళ్లిందట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ సినిమాను రిజెక్ట్ చేసి యశ్ మంచి పనే చేశాడంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
వాళ్లని తప్పా నేను ఎవరిని మోసం చేయలేదు : పూరి జగన్నాథ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. లైగర్ ఫ్లాప్ కావడంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు డబ్బు వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేయడమే కాకుండా, పూరిని బెదిరిస్తూ ధర్నాకు దిగేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో పూరి తమ ఫ్యామిలీకి ముప్పు ఉందని రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరిణామాలపై పూరి జగన్నాథ్ మీడియాకు లేఖను విడుదల చేశారు. 'నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే.. అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియన్స్ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా.వాళ్ళని ఎంటర్ టైన్ చేస్తా' అంటూ సుధీర్ఘ నోట్లో రాసుకొచ్చారు. పూరి లేఖ పూర్తి సారాంశం.. ”సక్సెస్.. ఫెయిల్యూర్.. ఈ రెండూ అపోజిట్ అనుకుంటాం. కానీ కాదు. ఈ రెండూ ఫ్లోలో ఉంటాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయి. గుండెల నిండా ఊపిరి పిలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చెయ్యాల్సిన పని ఏంటి ? ఊపిరి వొదిలెయ్యటమే. పడతాం, లేస్తాం. ఏడుస్తాం, నవ్వుతాం. ఎన్నో రోజులు ఏడ్చినాక తర్వాత జరిగేది ఏంటి ? పగలబడి నవ్వటమే.. ఇక్కడ ఏదీ పర్మినెంట్ కాదు .. లైఫ్ లో మనకి జరిగే ప్రతి సంఘటనని మనం ఒక ఎక్స్పీరియన్స్ లా చూడాలి తప్ప, ఫెయిల్యూర్ సక్సెస్ లా చూడకూడదు. నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలుజారింది, నదిలో పడ్డా, కొట్టుకుపోయా, వడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, వూరి వేలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవడో కాపాడాడు, వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేసాడు, ఇలా ఎన్నెన్నో లైఫ్ లో జరుగుతుంటాయి. అవన్నీ సీన్లే. అందుకే లైఫ్ ని సినిమా లా చూస్తే, షో అయిపోగానే మర్చిపోవచ్చు. మైండ్ కి తీసుకుంటే మెంటల్ వస్తాది. సక్సెస్ ఐతే డబ్బులొస్తాయి. ఫెయిల్ ఐతే బోలెడు జ్ఞానం వస్తాది. సో ఎప్పుడూ మనం మెంటల్లీ, ఫైనాన్షియల్లీ పెరుగుతూనే ఉంటాం తప్ప, ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏదిలేదు. అందుకే దేన్నీ ఫెయిల్యూర్ గా చూడొద్దు. ఇక బ్యాడ్ జరిగితే మన చుట్టూ ఉన్న బ్యాడ్ పీపుల్ మాయమైపోతారు .. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుంది. మంచిదే కదా ? కానీ ఖాళీగా ఉండకూడదు. ఏదోకటి చెయ్యాలి .. అది రిస్క్ అవ్వాలి. జీవితంలో రిస్క్ చెయ్యకపోతే అది లైఫే కాదు. ఏ రిస్క్ చెయ్యకపోతే అది ఇంకా రిస్క్. జీవితంలో నువ్వు హీరో ఐతే, సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. పొగుడుతారు, నిందిస్తారు, బొక్కలో వేస్తారు, మళ్ళీ విడుదల చేస్తారు, అందరూ చప్పట్లు కొడతారు, అక్షింతలు వేస్తారు. సో ఇవన్నీ మీ జీవితంలో జరగకపోతే, జరిగేలా చూడండి. లేకపోతె మీరు హీరో కాదేమో అనుకొనే ప్రమాదం ఉంది. అందుకే మనం హీరోలా బతకాలి. బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి. నేను నిజాయతి పరుడుని అని చెప్పుకొనవసరంలేదు. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది. నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకులని ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు. నిజానికి నేను ప్రేక్షకుల పట్ల బాధ్యత వహిస్తాను. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా . వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా. డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడనుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన, ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేనూ దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే .. మధ్యలో జరిగేది అంతా డ్రామా”.. – మీ పూరి జగన్నాధ్ -
పూరీ జగన్నాథ్ ఇంటికి పోలీసుల భద్రత.. కోర్టుకు వెళ్లనున్న డిస్ట్రిబ్యూటర్లు!
లైగర్ మూవీ ఫ్లాప్తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చిక్కుల్లో పడ్డారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందింది. దీంతో ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన పూరీ ఆర్థికంగా భారీగా నష్టపోయారు. మరోవైపు లైగర్ వల్ల తాము ఆర్థికంగా నష్టపోయామని, పెట్టన డబ్బులో కోంతభాగం వెనక్కి ఇవ్వాలంటూ పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పూరీని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పూరీ సమయంలో కోరడంతో వారు బెదిరింపులకు పాల్పడుతున్నారు. చదవండి: నిజమే పూరీ పెద్ద మోసగాడు.. పరువు తీసేద్దాం పదండి!: లేఖ వైరల్ దీంతో బుధవారం పూరీ పోలీసులను ఆశ్రయించారు. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్ల ద్వారా తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు వారినుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డిస్ట్రిబ్యూటర్లు తన ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందని, ముందస్తు భద్రత కల్పించాలని ఆయన ఫిర్యాదు కోరారు. ఈ మేరకు పోలీసులు పూరీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. గురువారం ఆయన ఇంటి వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. చదవండి: పెద్దింటి కోడలు కాబోతున్న యంగ్ హీరోయిన్ వర్ష! కాగా గత ఆగస్ట్ 25న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ మూవీ ఘోర పరాజయం పొందింది. నైజాం డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ వరంగల్ శీను, శోభన్ బాబులు నష్టపోయిన డబ్బులు తిరిగి చెల్లించాలని పూరీపై ఒత్తిడి పెంచారు. సుమారు రూ.8 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, వాటిని తిరిగి ఇప్పించాలంటూ పూరీకి లేఖలు రాశారు. ఈ విషయమై పూరీ మాట్లాడిన ఓ ఆడియో ఫైల్ రెండు రోజుల క్రితం వైరల్ అయింది. ఈ నెల 27న వారంతా తన ఇంటి ముందు ధర్నా చేయబోతున్నారని, తన పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారంటూ పూరీ వాపోయారు. అయితే ఈ విషయమైన డిస్ట్రిబ్యూటర్లు కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
నిజమే పూరీ పెద్ద మోసగాడు.. పరువు తీసేద్దాం పదండి!: అతడి లేఖ వైరల్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొద్ది రోజులుగా వారల్లో నిలుస్తున్నాడు. ఇటీవల లైగర్ మూవీ డిస్ట్రిబ్యూటర్తో ఆయన మాట్లాడిన ఆడియో కాల్ చర్చనీయాంశమైంది. ఇటీవల ఆయన భారీ బడ్జెట్తో తెరకెక్కించిన లైగర్ మూవీ బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. లైగర్ ఫ్లాప్తో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. అయితే ఈ సినిమాకు పూరీ కూడా ఓ నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. లైగర్ ఫ్లాప్తో తమకు కొంత డబ్బు వెనక్కి ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్ పూరీని డిమాండ్ చేశారు. అయితే దీనికి అయినా కొంత గడువు అడిగినప్పటికీ కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ఆయన ఆఫీసు ముందు ధర్నా చేసేందుకు సిద్ధపడ్డారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న జెర్సీ నటుడు, చెన్నైలో నేడు గ్రాండ్ వెడ్డింగ్ దీంతో తన పరువు తీసే ప్రయత్నాలు చేస్తే అసలు డబ్బు ఇవ్వనంటూ పూరీ వారిని వారించిన ఆడియో ఈమధ్య బయటకు వచ్చింది. దీంతో పూరీ పరువు తీసేందుకు కావాలనే ఈ ఆడియోను లీక్ చేశారని, కొంతమంది పని గట్టుకునిన ఆయనను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాంటి వారిని ఉద్దేశిస్తూ పూరీ ఫ్యాన్ ఒకరు బహిరంగ లేఖ రాశారు. అవును డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నిజంగా ఓ మోసగాడు. పరువు తీసేద్దాం పదండి! అంటూ అతడు ఫేస్బుక్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇందులో అతడు డైరెక్టర్ పూరీ గురించి ఈ లొల్లి ఏందో నాకేం అర్థం కావట్లా..! పూరీ ఫ్యాన్గా కాదు. సాదాసీదా ఆడియన్గా సూటిగా అడుగుతున్నా సమాధానం చెప్పండి! ‘‘అవును డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. నిజంగా ఓ మోసగాడు. పరువు తీసేద్దాం పదండి! ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్.. మైల్ స్టోన్స్ లాంటి సినిమాలను ఇచ్చి.. ఇప్పుడు ఇలాంటి కుట్రల మధ్య నలిగిపోతున్నందుకు ఖచ్చితంగా పరువు తీసేయాలి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ, ఒక్కో మార్క్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కదా.. మోసగాడు అనే ముద్ర తప్పకుండా వేయాల్సిందే. దర్శకుడిగా, నిర్మాతగా తాను వందల కోట్లు నష్టపోయినా.. ఎప్పుడూ ఎవరి పేర్లు బయట పెట్టనందుకు, ఎవరినీ బాధ్యులను చేయకుండా పల్లెత్తు మాట కూడా అనకుండా ఉన్నందుకు పక్కాగా కుటుంబంతో సహా రోడ్డుకు లాగాలి. చదవండి: ఫ్యాన్స్తో తమన్నా మాస్ డాన్స్, వీడియో వైరల్ అవును.. తాను సమాజంలో పరువుగా బ్రతకాలని అనుకుని.. ఇన్నాళ్లు ఎవరి పరువు తీయకుండా ఉన్నందుకు బుద్దొచ్చేలా పరువు తీయాలి. తనను ఎంతోమంది మోసగించినా.. ఎన్ని ప్లాప్స్ వచ్చినా.. బ్లాక్ బస్టర్స్ తో బౌన్స్ బ్యాక్ అయ్యే డాషింగ్ డైరెక్టర్ ని ఇలాగే పరువు తీసి సత్కరించాలి’’ అంటూ తన లేఖలో రాసుకొచ్చాడు. పూరీకి మద్దతు తెలుపుతూ ఆయన పురువు తీయాలని చూసేవారిపై అసహనం వెల్లగక్కుతు ఈ సందర్భంగా అతడు ఒపెన్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే తనకు, తన కుటుంబానికి డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్ల ద్వారా ప్రాణహాని ఉందంటూ ఇటీవల ఆయన జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
'నా కుటుంబం ఆపదలో ఉంది'.. జూబ్లీహిల్స్ పీఎస్లో పూరి ఫిర్యాదు
జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ పోలీసులను ఆశ్రయించారు. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై, తన కుటుంబంపై హింసకు పాల్పడేలా వీరు ఇతరులను ప్రేరేపిస్తున్నట్లు కంప్లైంట్లో పేర్కొన్నారు. వారి నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పూరి జగన్నాధ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ పూరి జగన్నాథ్కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. భారీ స్థాయిలో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ తమకు కొంత డబ్బు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీని కోసం పూరి ఒక నెల రోజులు గడువు కోరినప్పటికీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం దర్శకుడి ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన పూరి జగన్నాథ్ తన పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చాడు. ఈమేరకు ఓ ఆడియోకాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా పూరి జగన్నాధ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదురుతోంది. #Liger : Producer-Director #PuriJagannath Complains to Poloce Authorities that his Distributors are trying to instigate violence! pic.twitter.com/POxsnGsbdk — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 26, 2022 -
లైగర్ వివాదం.. పూరీ డబ్బులివ్వాల్సిన పని లేదు: తమ్మారెడ్డి
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ పూరీ జగన్నాథ్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే! భారీ స్థాయిలో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ తమకు కొంత డబ్బు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు పూరీ ఒక నెల రోజులు గడువు కోరినప్పటికీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం పూరీ ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ విషయం తెలిసిన పూరీ జగన్నాథ్ తన పరువు తీయాలని ప్రయత్నిస్తే ఒక్క పైసా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చాడు. ఈమేరకు ఓ ఆడియోకాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించాడు. 'పూరీ జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. లైగర్ హక్కులు కొనమని వాళ్ల ఇంటికి వెళ్లి అడిగాడా? లేదు కదా! కొనుక్కునేవాడిదే తప్పు. అంతకుముందు విజయ్ దేవరకొండ నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు అంత పెద్ద మొత్తానికి కొనడం ఎందుకు? నష్టాలు వచ్చాయని డబ్బులు డిమాండ్ చేయడం ఎందుకు? లాభాలొస్తాయని పెద్ద సినిమాలు కొన్నప్పుడు నష్టం వచ్చినా భరించాలి' అని చెప్పుకొచ్చాడు. చదవండి: సినిమా చూడమని ఇంటింటికీ వెళ్లి అడుక్కోవాలా? అమ్మ ఆరోగ్యానికి రిస్క్ అని తెలిసినా నాన్న లెక్కచేయలేదు: శ్రీదేవి కూతురు -
పూరీ జగన్నాథ్కు బ్లాక్మెయిల్.. సంచలనంగా ఆడియో లీక్
-
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పూరి జగన్నాథ్ ఆడియో
-
పూరీ జగన్నాథ్కు బ్లాక్మెయిల్.. సంచలనంగా ఆడియో లీక్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా పూరీ జగన్నాథ్కు, బయ్యర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే ఎంతో కొంత నష్టాన్ని పూడ్చేందుకు తాను ప్రయత్నిస్తానన్నాడు పూరీ. కానీ ఇంతవరకు ఆ డబ్బు అందకపోవడంతో బయ్యర్లు ధర్నాకు దిగుతామని బ్లాక్మెయిల్ చేస్తున్నారట. ఈ విషయంపై పూరీ మాట్లాడిన ఆడియో కాల్ లీకైంది. 'ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ తిరిగి డబ్బివ్వాల్సిన అవసరం లేదు. అయినా ఎందుకిస్తున్నాను? పాపం, వాళ్లు కూడా నష్టపోయారులే అని! ఇదివరకే బయ్యర్లతో మాట్లాడాను. ఒక అమౌంట్ ఇస్తానన్నాను, వాళ్లూ ఒప్పుకున్నారు. కాకపోతే ఒక నెల రోజులు గడువు అడిగాను. ఇస్తానని చెప్పాక కూడా ఇలా ఓవరాక్షన్ చేస్తే అసలివ్వబుద్ధి కాదు. పరువు కోసం డబ్బులిస్తున్నాం, నా పరువు తీయాలని చూస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. కొన్ని ఆడతాయి, కొన్ని పోతాయి. ఒకవేళ సినిమా హిట్ అయితే బయ్యర్స్ దగ్గర వసూలు చేయడానికి నానాపాట్లు పడాలి. పోకిరి దగ్గర నుంచి ఇస్మార్ట్ శంకర్ దాకా బయ్యర్స్ నుంచి నాకు రావాల్సిన డబ్బు ఎంతో ఉంది. బయ్యర్స్ అసోసియేషన్ అది నాకు వసూలు చేసి పెడుతుందా? లేదు కదా! ధర్నా చేస్తారా? చేయండి. ధర్నా చేసినవారికి తప్ప మిగతావాళ్లందరికీ డబ్బులిస్తాను' అని పూరీ కోపంతో శివాలెత్తిపోయాడు. ప్రస్తుతం ఈ ఆడియో లీక్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. చదవండి: హ్యాపీగా టాయ్లెట్స్ కడిగేవాడిని: నటుడు నేనెలా ఉన్నా అందగత్తెనే -
ఫ్రస్టేషన్ సాంగ్ని విడుదల చేసిన అనిల్ రావిపూడి
సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తున్న చిత్రం 'స్లమ్డాగ్ హజ్బెండ్'. దర్శకుడు పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్గా పరిచయం అవుతున్నారు. మైక్ మూవీస్పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఇట్ ఈజ్ ప్రస్టేషన్ సాంగ్.. అనే పాటని దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యాన్ని అందించగా, రాహుల్ సిప్లిగంజ్తో కలిసి భీమ్స్ సిసిరోలియో పాడారు. ఈ సాంగ్లో నటుడు సునీల్ తళుక్కున మెరిశారు. -
‘జ్యోతిలక్ష్మి’ టైంలో పూరీకి ఆ విషయం తెలియకుండా మేనేజ్ చేశా: సత్యదేవ్
విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సత్యదేవ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సత్యదేవ్ తనదైన నటన స్కిల్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగిన సత్యదేవ్ ఇటీవల గాడ్ఫాదర్ మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో ఆయన చేసిన జయదేవ్ పాత్రకి మంచి స్పందన వచ్చింది. గాడ్ఫాదర్ బ్లాక్బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో ఆయన రీసెంట్గా ఓ యూట్యూబ్చానల్తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: విడాకులు రద్దు? కొత్త ఇంటికి మారనున్న ధనుశ్-ఐశ్వర్యలు! ఇదిలా ఉంటే సత్యదేవ్ సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని మరి ఇండస్ట్రీకి వచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో ఆయన జాబ్ చేస్తూ మరోవైపు సినిమాల్లో నటించాడు. ఇక సాఫ్ట్వేర్ జాబ్ను పూర్తిగా వదిలేసి సినిమాల వైపే మొగ్గు చూపాడు. తాజాగా ఈ విషయంపై ఆయన స్పందించాడు. ‘అందరు నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి వచ్చానంటున్నారు. అది నిజం కాదు. సినిమాల్లోకి రావడం కోసమే నేను ఉద్యోగం చేశాను. ఎందుకంటే అవకాశాలు వచ్చి నిలదొక్కునేంత వరకు డబ్బులు కావాలి కదా. డబ్బు కోసమే నేను జాబ్ చేశా. బ్లఫ్ మాస్టర్ సినిమా వరకూ జాబ్ చేస్తూనే షూటింగ్లో పాల్గోన్నాను’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: మోహన్ లాల్కు షాక్, అక్కడ ‘మాన్స్టర్’పై నిషేధం అనంతరం ‘షూటింగ్ కోసం నైట్ షిఫ్ట్లు చేశాను. ఉదయం షూటింగ్, నైట్ ఉద్యోగం చేస్తూ వచ్చాను. జ్యోతిలక్ష్మి సినిమాకి గ్యాప్ లేకుండా 39 రోజులు పని చేశాను. ఈ మూవీ చేసేటప్పుడు నేను సినిమాల్లో చేస్తున్నట్టు ఆఫీసులో తెలియదు. జాబ్ చేస్తున్నాననే విషయం డైరెక్టర్ పూరీ గారికి తెలియదు. జాబ్ టెన్షన్ షూటింగ్లో, సినిమా టెన్షన్ ఆఫీసుల కనిపించకుండ మేనేజ్ చేశా. ‘ఘాజీ’, ‘మనవూరి రామాయణం’, ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రాలు అలాగే పూర్తి చేశాను’ అని చెప్పాడు. ఈ సందర్భంగా చిరంజీవిగారితో చేయాలనేది తన కల అని, ఆయనతో కలిసి నటించాలనే తన డ్రీమ్ను చాలా ఏళ్లుగా భద్రపరుచుకుంటూ వచ్చానన్నాడు సత్యదేవ్. -
ఆర్మీ క్యాంపులో విజయ్ దేవరకొండ.. ఆ ప్రాజెక్ట్ కోసమేనా?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మళ్లీ షూటింగ్లో బిజీ అయిపోయాడా? లైగర్ ఫ్లాప్ తర్వాత కాస్త విరామం తీసుకున్న యంగ్ హీరో మరో ప్రాజెక్ట్ కోసం సిద్ధమయ్యాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తన తదుపరి సినిమా జనగణమన షూటింగ్ కోసం సైనికులతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గన్ పట్టుకుని ఉన్న ఓ ఫోటోను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. బాక్సాఫీస్ వద్ద లైగర్ అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆపేసినట్లు చాలా రూమర్స్ వచ్చాయి. తాజాగా విజయ్ ఆర్మీ క్యాంపులో కనిపించడంతో ఈ చిత్రానికి సంబంధించిన పనులు జరగుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఫోటో-షేరింగ్ యాప్లో చిత్రాన్ని షేర్ చేసిన విజయ్ దేవరకొండ.. 'దేశంలో అత్యంత పెద్ద దుర్ఘటన యూరీ' అని రాశాడు. ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా ప్రకటన కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ ఛాపర్ నుండి బయటకు రావడం కనిపించింది. గతంలో ఈ చిత్రం ఆగిపోయిందన్న రూమర్లను నిర్మాత ఛార్మీ కౌర్ అవన్నీ ఫేక్ అంటూ ట్వీట్ చేసింది. వంశీ పైడిపల్లి, పూరి జగన్నాధ్ల సహకారంతో ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. ఈ పాన్-ఇండియా చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో 3 ఆగస్టు 2023న విడుదల కానుంది. -
లైగర్ ఫ్లాప్పై తొలిసారి స్పందించిన పూరీ
-
లైగర్ ఫ్లాప్పై తొలిసారి స్పందించిన పూరీ, ఏమన్నాడంటే
విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్చించిన చిత్రం లైగర్. పాన్ ఇండియా మూవీగా రూపొందిన లైగర్ భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తా పడింది. దీంతో ఈ మూవీ నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లైగర్ నష్టాలను మిగిల్చింది. ఇదిలా ఉంటే విడుదలకు ముందు బ్లాక్బస్టర్ హిట్ ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన పూరీ విడుదల అనంతరం సినిమా గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. చదవండి: ‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి మూవీ పరాజయంపై ఇంతవరకు ఆయన నేరుగా స్పందించింది లేదు. ఈ నేపథ్యంలో చిరుతో ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్లో పాల్గొన్న పూరీ ఈ సందర్భంగా లైగర్ ఫ్లాప్పై స్పందించాడు. కాగా గాడ్ ఫాదర్ బ్లాక్బస్టర్ హిట్ నేపథ్యంలో పూరీ జగన్నాథ్-చిరంజీవి ఇన్స్ట్రాగ్రామ్ లైవ్ ద్వారా ముచ్చటించారు. ఈ నేపథ్యంలో చిరు, పూరీని ఇలా ప్రశ్నించాడు. పూరీ మీరు అనుకున్న రిజల్ట్ రాకపోతో ఎలా తీసుకుంటారు? అని అడగ్గా.. ‘దెబ్బ తగినప్పుడు హీలింగ్ టైమ్ ఉంటుంది చూశారా.. అది తక్కువగా పెట్టుకోవాలి. ఆస్తులు పోవచ్చు లేదా యుద్ధాలు జరగోచ్చు ఏం జరిగినా హీలింగ్ టైమ్ నెలకు మించి ఉండకూడదు. ఒక నెలలో వేరే పనిలో పడిపోవాలి అంతే. కొన్నిసార్లు నమ్మిన వాళ్లు కూడా ఫ్లిప్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు’ అన్నాడు. చదవండి: వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్లుక్ రిలీజ్ అనంతరం ‘నేను లైగర్ సినిమా తీశాను. మూడేళ్లు సినిమాకి పనిచేస్తూ ఎంతో ఎంజాయ్ చేశాను. మంచి సెట్స్ వేశాం. కాస్ట్ అండ్ క్రూ, మైక్ టైసన్ ఇలా అంతా ఎంతో ఆనందంగా చేశాం. కానీ, సినిమా ఫ్లాప్ అయ్యింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా రిజల్ట్ కోసం ఆదివారం వరకు వేచి చూశా. ఆ తర్వాత మూవీ ప్లాప్ అని అర్థమైంది. ఆ మరుసటి రోజు సోమవారం జిమ్కు వెళ్లి 100 స్క్వాడ్స్ చేశా. ఒత్తిడి మొత్తం పోయింది. నా జీవితం నేను బాధగా ఉన్న రోజుల కంటే నవ్వుతూ ఉన్న రోజులే ఎక్కువ’ అంటూ పూరీ సమాధానం ఇచ్చాడు. ఇక ప్రస్తుతం తాను ముంబైలో కొత్త కథలు రాసే పనిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. కాగా గాడ్ ఫాదర్లో పూరీ జర్నలిస్ట్గా కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. -
డైరెక్టర్ పూరీకి ఏమైంది? చిరు పిలిచినా ఎందుకు రాలేదు?
ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మోహన్ రాజాగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలై.. సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. వంద కోట్ల క్లబ్ని కూడా దాటేసింది. సినిమా విడుదలైన మూడు రోజులకే సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ వేడుకకి సినిమా కోసం పని చేసిన టెక్నిషియన్స్తో పాటు నటీనటులందరూ వచ్చారు. కానీ కీలక పాత్ర పోషించిన పూరీ జగన్నాథ్ మాత్రం కనిపించలేదు. దీంతో పూరీకి ఏమైంది? చిరు సినిమా సక్సెస్ మీట్కి ఎందుకు రాలేదు? అసలు సక్సెస్ మీట్కి చిరంజీవి ఆహ్వానించారా? లేదా? అనేది టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అసలు విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించినప్పటికీ.. సక్సెస్ మీట్కి పూరీ రాలేనని చెప్పారట. (చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా..?) పూరీ ప్రస్తుతం గోవాలో తన తర్వాతి సినిమా స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్నాడు. భారీ అంచనాలు పెట్టుకున్న ‘లైగర్’ డిజాస్టర్ కావడంతో.. విజయ్ దేవరకొండ ప్లాన్ చేసిన ‘జనగనమణ’ మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికిప్పుడు పూరీతో సినిమా చేయడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదు. హీరోలు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట. ఇలాంటి సమయంలో బయటకు రావడానికి పూరీ ఇష్టపడడం లేదట. అందుకే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి సక్సెస్ మీట్కి ఆహ్వానించినా.. సున్నితంగా తిరస్కరించారట. గాడ్ ఫాదర్లో పూరీ జగన్నాథ్ పోషించిన జర్నలిస్ట్ పాత్ర అదిరిపోయింది. సక్సెస్ మీట్లో కూడా చిరంజీవి పూరీని పొగిడేశాడు. కానీ పూరీ, చిరు ఒకే స్టేజ్ మీద కనిపించి ఉంటే బాగుండేది అంటున్నారు ఆయన అభిమానులు. -
GOD FATHER Pre Release: అభిమానులే నాకు గాడ్ఫాదర్స్
‘‘మీరు(అభిమానులు) నన్ను ‘గాడ్ఫాదర్’ అని అంటున్నారు. కానీ, ఏ గాడ్ఫాదర్ లేకుండా వచ్చిన నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించి, ఈ స్థాయి ఇచ్చిన ప్రతి అభిమాని నాకు ‘గాడ్ఫాదర్’. చిరంజీవి వెనకాల ఏ గాడ్ఫాదర్ లేరని అంటుంటారు.. కానీ నేను ఇప్పుడు అంటున్నాను.. నా వెనకాల లక్షలమంది గాడ్ఫాదర్స్ ఉన్నారు.. నా అభిమానులే నా ‘గాడ్ఫాదర్స్’’ అని చిరంజీవి అన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. నయనతార, సల్మాన్ఖాన్, సత్యదేవ్, పూరి జగన్నాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం అనంతపురంలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ‘గాడ్ఫాదర్’ ట్రైలర్ను రిలీజ్ చేశారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ– ‘‘నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఈ నేల తడుస్తుంది. ఈ రోజు కూడా ఇలా వర్షం కురవడం శుభ పరిణామంగా అనిపిస్తోంది. ఇక ‘గాడ్ఫాదర్’ విషయానికొస్తే.. మలయాళ హిట్ మూవీ ‘లూసిఫర్’ చిత్రాన్ని నేను తెలుగులో ‘గాడ్ఫాదర్’గా చేయడానికి ప్రధాన కారణం రామ్చరణ్. దర్శకుడు మోహన్ రాజా పేరును కూడా చరణే సూచించాడు. మాపై నమ్మకం, ప్రేమ, గౌరవంతో ‘గాడ్ఫాదర్’ కథ వినకుండా నటించిన సల్మాన్ఖాన్గారికి థ్యాంక్స్. నయనతార ఈ సినిమా ఒప్పుకోవడం మా విజయానికి తొలిమెట్టు. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాలో భాగస్వాములవడంసంతోషం. తెలుగువారికి జాతీయ అవార్డులు రావడం అరుదు. అలాంటిది చిన్న వయసులోనే జాతీయ అవార్డు సాధించిన తమన్కు అభినందనలు. మా సినిమాకి రీ రికార్డింగ్ అద్భుతంగా ఇచ్చాడు. పొలిటికల్ అండ్ ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది.. ప్రేక్షకులను అలరిస్తుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను. నేను సినిమా చూశాను కాబట్టే ఇంత ఆత్మ విశ్వాసంతో మాట్లాడుతున్నాను. కానీ, ప్రేక్షకుల తీర్పును ఎప్పుడూ గౌరవిస్తాం. మా సినిమాతో పాటు విడుదలవుతున్న నా మిత్రుడు నాగార్జున ‘ది ఘోస్ట్’, గణేష్ ‘స్వాతిముత్యం’ సినిమాలు కూడా విజయం సాధించాలి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు.. రెండూ ప్రేక్షకులచేత ఆదరించబడినప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో తమన్, ఫైట్మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో కాస్త స్తబ్ధత ఏర్పడింది. జయాపజయాలు మన చేతుల్లో ఉండవని తెలుసు. కానీ ప్రేక్షకులను అలరించలేకపోయామే, వారిని అసంతృప్తికి గురిచేశామే అనే బాధ ఉంది. దానికి సమాధానం, నాకు ఊరట ఈ ‘గాడ్ఫాదర్’. ఈ సినిమా కచ్చితంగా నిశ్శబ్ధ విస్ఫోటనం అవుతుంది.. ఇందుకు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలి. బుధవారం ఉదయం ఓ విషాదం చోటు చేసుకుంది. సూపర్స్టార్ కృష్ణ గారి సతీమణి, సోదరుడు మహేశ్బాబుగారి మాతృమూర్తి ఇందిరాదేవిగారు మృతిచెందారు. ఆ కుటుంబం విషాదంలో ఉంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. -
లైగర్ తర్వాత ఛార్మి ట్వీట్.. పూరికి స్పెషల్ విషెస్ చెబుతూ..!
దర్శకుడు పూరి జగన్నాధ్ బర్త్డే సందర్భంగా సినీనటి ఛార్మి ప్రత్యేకంగా విష్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పూరి ఫోటోను షేర్ చేస్తూ 'ఎటర్నల్' అంటూ ఎమోజీని జత చేశారు. ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'లైగర్' బాక్సాఫీస్ ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాకు కొద్ది రోజులు స్పల్ప విరామం ప్రకటించారు. తాజాగా పూరి బర్త్డే సందర్భంగా ఛార్మి ట్వీట్ చేయడంతో వైరలవుతోంది. లైగర్ తర్వాత వెంటనే జనగణమన ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ సినిమాపై ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ చిత్రం షూటింగ్ ఆపేసినట్లు సోషల్ మీడియాలో చాలా రూమర్లు వచ్చాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైంది. తాజాగా సైమా వేడుకలకు హాజరైన విజయ్ని అక్కడి మీడియా ‘జనగణమన’పై ప్రశ్నించగా.. ‘అవన్ని ఇప్పుడెందుకు? ఇక్కడికి అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి జగణమన గురించి మర్చిపోండి. సైమా వేడుకను ఎంజాయ్ చేయండి’అని రౌడీ హీరో సమాధానం ఇచ్చాడు. దీంతో నిజంగానే జగగణమన ఆగిపోయిందని, అందుకే ఆ చిత్రంపై స్పందించడానికి విజయ్ ఇష్టపడడంలేదని నెటిజన్స్ కామెంట్ చేశారు. 𝐄𝐓𝐄𝐑𝐍𝐀𝐋 ☺️#HBDPuriJagannadh @PuriConnects pic.twitter.com/lh7UyGn2tv — Charmme Kaur (@Charmmeofficial) September 28, 2022 -
‘గాడ్ ఫాదర్’లో పూరి రోల్ ఇదే.. అసలు విషయం బయటపెట్టిన చిరు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం గాడ్ఫాదర్. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇందులో చిరు పొలిటికల్ లీడర్గా కనిపించనున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ ఫిలిం లూసిఫర్కు రీమేక్గా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ కీ రోల్ పోషిస్తుండగా నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చదవండి: జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ‘ఆది’ రీరిలీజ్! ఎప్పుడంటే.. ఇంకా విడుదలకు కొద్ది రోజులే ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన చిరు ఈ మూవీ నుంచి మరో ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా గాడ్ ఫాదర్లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నటిస్తున్నారన్న వార్తలపై స్పందించారు. ఇందులో పూరీ జర్నలిస్ట్గా కనిపిస్తాడని అన్నారు. ‘‘మా సినిమాలో ఒక యూట్యూబర్ పాత్ర ఉంది. సంఘటనలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. స్టోరీ నరేటర్గా చేయాలి. ఈ రోల్ కోసం ఎవరా? అని డైరెక్టర్ ఆలోచిస్తున్న క్రమంలో పూరిని తీసుకుంటే ఎలా ఉంటుందని మోహన్ రాజాకు చెప్పాను. చదవండి: క్రేజీ అప్డేట్.. ఆ రోజు నుంచే ‘పుష్ప-2’ రెగ్యులర్ షూటింగ్! దీంతో వెంటనే ఆశ్చర్యంగా చూస్తూ.. ‘ఆయన నటిస్తారా? అయితే మీరే ఆయనను అడగండి’ అన్నాడు. వెంటనే నేను ఫోన్ తీసుకుని పూరికి ఇలా అని చెప్పగానే.. ‘చస్తే చేయను’ అన్నాడు. ‘మీ ముందు నేను నటించడమేంటి సార్.. నావల్ల కాదు’ అన్నాడు. కానీ నేనే పట్టుబట్టి ఒప్పించాను. షూటింగ్ లోకేషన్స్ వస్తు కూడా చాలా వణికిపోయాడు. కానీ తన పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు. తెర ఆయనను చూసి ఓ డైరెక్టర్లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా! అని మీరంత ఆశ్చర్యపోతారు’ అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. -
ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాకు అతనే గాడ్ఫాదర్: చిరంజీవి
మోహన్రాజా దర్శకత్వంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం 'గాడ్ఫాదర్'. ఈ చిత్రంలో మెగాస్టార్కు జోడిగా నయనతార నటిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్కి తెలుగు రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. ప్రమోషన్స్లో భాగంగా గాడ్ ఫాదర్ మూవీ చిత్రబృందం సరికొత్తగా ప్లాన్ చేసింది. ఏకంగా ఆకాశంలో ఇంటర్వ్యూ నిర్వహించింది. (చదవండి: God Father: గాడ్ఫాదర్ సెన్సార్ పూర్తి.. డైరెక్టర్ ట్వీట్ వైరల్) ప్రత్యేక విమానంలో తిరుగుతూ చిరంజీవిని యాంకర్ శ్రీముఖి ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూకి సంబంధించి తాజాగా ప్రోమోలను రిలీజ్ చేయగా నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన తార్ మార్ టక్కర్ మార్ సాంగ్ అభిమానులను ఓ రేంజ్లో ఊర్రూతలూగిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 5 రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ’ సర్టిఫికేట్ ఇచ్చింది. త్వరలోనే అనంతపురంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ ప్రోమోలో 'రాజకీయాలకు దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు' అన్న డైలాగ్ ప్రేక్షకుల్లో మరింత హైప్ క్రియేట్ చేసింది. ప్రోమోలో చిరంజీవి లుక్ అదిరిపోయిందంటూ శ్రీముఖి అనడంతో నవ్వుతూ సమాధానాలిచ్చాడు మెగాస్టార్. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కేవలం ప్రేమతో చేశాడు. హ్యాట్సాఫ్ టు సల్మాన్ భాయ్ అంటూ చిరు ప్రశంసించారు. పూరీ జగన్నాథ్లో కమాండింగ్ ఉన్న నటుడు ఉన్నాడని చూసిన తరువాత మీరే ఆశ్చర్యపోతారు అన్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ ఆరో ప్రాణం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనే గాడ్ ఫాదర్. నిశ్శబ్ద విస్పోటనం అంటూ మెగాస్టార్ ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగింది. అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువే ఈ సినిమాలో చూస్తారని మెగాస్టార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూ సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 25న ప్రసారం కానుంది. ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. -
ఓటీటీలోకి వచ్చేసిన లైగర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్న్యూస్.. ఇప్పుడు లైగర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్స్టార్లో ఈరోజు(సెప్టెంబర్22)నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. కథేంటంటే..తల్లి కల కోసం కరీంనగర్ నుంచి ముంబై చేరిన ఒక సాదా సీదా కుర్రాడు ఇంటర్నేషనల్ ఎంఎంఏ ఫైటర్ అయిన ఒక ఇన్స్పిరేషన్ ఈ చిత్రం. పు పాన్ ఇండియా సినిమాగా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ చిత్రం ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ కథ, సంభాషణలు, ప్రతి పాత్ర తీర్చిదిద్దిన పధ్ధతి, సంగీతం, విజయ్ దేవరకొండ నటన.. అన్నిటినీ ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు.సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్, లవ్ అన్నీ సమపాళ్లలో కలిసిన ఈ సినిమా చూడడం కుటుంబం మొత్తానికి ఒక పెద్ద రిలీఫ్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా "లైగర్". డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రమే. "లైగర్" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/3dywSjk -
‘జనగణమన’ పై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జాగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం లైగర్. ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. అయితే ఈ చిత్రం విడుదల కంటే ముందే విజయ్, పూరీ కాంబినేషన్లో రెండో చిత్రం ప్రకటించారు. పూరి జగన్నాథ్ తన కలల ప్రాజెక్ట్ ‘జనగణమన’ ను విజయ్తో తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అంతేకాదు చిన్న షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే లైగర్ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో.. ‘జనగణమన’ని నిర్మాతలు దూరం పెట్టినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. లైగర్ తర్వాత పూరీ, చార్మీలు సైతం ఈ చిత్రంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అంతేకాదు ‘జనగణమన’ ఆగిపోయిందంటూ వచ్చిన వార్తలను కూడా ఖండించలేదు. ఇలాంటి సమయంలో ఈ చిత్రంపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (చదవండి: బ్లాక్ బస్టర్ అందించిన ఈ దర్శకులు..ఇలా సైలెంట్ అయ్యారేంటి?) తాజాగా సైమా వేడుకలకు హాజరైన విజయ్ని అక్కడి మీడియా ‘జనగణమన’పై ప్రశ్నించగా.. ‘అవన్ని ఇప్పుడెందుకు? ఇక్కడికి అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి జగణమన గురించి మర్చిపోండి. సైమా వేడుకను ఎంజాయ్ చేయండి’అని రౌడీ హీరో సమాధానం ఇచ్చాడు. దీంతో నిజంగానే జగగణమన ఆగిపోయిందని, అందుకే ఆ చిత్రంపై స్పందించడానికి విజయ్ ఇష్టపడడంలేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. -
పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల ప్రకారం.. దుర్గంచెరువులో దూకి ఇటీవల సాయికుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకున్న సాయికుమార్ గతంలో పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినట్లు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక దుర్గంచెరువులో దూకి సాయికుమార్ సూసైడ్ చేసుకున్నట్లు మాదాపూర్ పోలీసులు వెల్లడించారు.కాగా ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందులేకపోయింది. చదవండి: (రాజ్ కుటుంబాన్ని వెంటాడుతున్న గుండె జబ్బులు) -
‘లైగర్’ ఎఫెక్ట్.. రెంట్ కట్టలేక ఆ ఫ్లాట్ ఖాళీ చేసిన పూరి జగన్నాథ్
లైగర్ ఫ్లాప్తో మరోసారి పూరి జగన్నాథ్ కష్టాల్లో పడ్డాడని తెలుస్తోంది. మాస్, డాషింగ్ డైరెక్టర్ చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న పూరి ఆ మధ్యలో వరుస ఫ్లాపులతో అప్పుల పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తిరిగి తన కెరీర్ను గాడిన పెట్టుకున్నాడు. అదే జోష్తో లైగర్ చిత్రాన్ని అంత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తెరకెక్కించాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ అవుతుందని ఆశపడ్డ మూవీ టీం అంచనాలన్ని తలకిందులయ్యాయి. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లైగర్ భారీ నష్టాలను మిగిల్చింది. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్? వరుడు ఎవరంటే.. దీంతో బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని ఈ చిత్ర నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారట. ఇక మూవీని కరణ్ జోహార్తో కలిసి పూరీ, చార్మీలు నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు లైగర్ చిత్రీకరణ అంతా ముంబైలోనే జరిగింది. ఈ నేపథ్యంలో ముంబైలో ఓ విలసవంతమైన ప్లాట్ను తీసుకున్న పూరి ఇప్పుడు రెంట్ కట్టలేక దాన్ని ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. మూవీ షూటింగ్, ప్రమోషన్స్లో భాగంగా గతేడాది పూరీ ముంబైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ముంబైలో ఓ విలాసవంతమైన సీ ఫేసింగ్ 4 బిహెచ్కే ఫ్లాట్ను రూ. 10 లక్షలకు అద్దెకు తీసుకున్నాడట. మెయింటనెన్స్ ఖర్చులు కలుపుకుని దాదాపు రూ. 15 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. చదవండి: రణ్బిర్-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత ఇక లైగర్ డిజాస్టర్తో ఇప్పుడు ఆ రెంట్ కట్టేలేని పరిస్థితులో పూరి ఉన్నాడని, అందువల్లే ఈ ఫ్లాట్ను ఖాళీ చేశాడని తెలుస్తోంది. అదే లైగర్ హిట్ అయ్యి ఉంటే పూరి రేంజ్ ఒక్కసారిగా మారిపోయేది. ఆశించినట్లు ఈ మూవీ విజయం సాధించి ఉంటే ఆయన కోసం బాలీవుడ్ అగ్ర హీరోలు, నిర్మాతలు క్యూ కట్టి ఉండేవారు. పూరి కూడా ఈ ఉద్దేశంతోనే ముంబైకి మకాం మార్చాడని సన్నిహితుల నుంచి సమాచారం. లైగర్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని, అదే జరిగితే ఇక తాను ముంబైలోనే సెటిల్ అవ్యొచ్చనే ఉద్దేశంతో వెతికి మరి పూరి ఆ విలాసవంతమైన ఫ్లాట్ను ఎంతో ఇష్టంగా తీసుకున్నాడట. దాదాపు రూ. 120 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన లైగర్ చిత్రం తొలి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో మొత్తం ఇప్పటి వరకు లైగర్ రూ. 58 నుంచి 60 కోట్లు మాత్రమే వసూలు చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. Rumours Suggest Director #PuriJagannadh Has Been Forced To Vacate His Posh Mumbai Sea-Facing Flat After #Liger Failed At The #BoxOffice@purijaganhttps://t.co/zqPfGmWWTb — Box Office Worldwide (@BOWorldwide) September 8, 2022 -
‘లైగర్’ ఫ్లాప్.. చార్మీ షాకింగ్ నిర్ణయం
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్లో ఒకటిగా లైగర్ నిలుస్తుందని అంతా భావించినా అందుకు భిన్నంగా డిజాస్టర్ టాక్ని మూటగట్టుకుంది. మైక్ టైసన్ వంటి ప్రపంచ చాంపియన్ ఉన్నా కంటెంట్ లేకుంటే థియేరట్లకు జనాలు రారని లైగర్ మరోసారి నిరూపించింది. ఫలితంగా భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చిందంటున్నారు సినీ విశ్లేషకులు. చదవండి: నిర్మాతతో టీవీ నటి రెండో పెళ్లి, కొత్త జంటపై దారుణమైన ట్రోల్స్ ఇక లైగర్ ఫలితం అనంతరం చార్మీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఆమె ట్వీట్ చేస్తూ ట్రోలర్స్కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. తాను సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘చిల్ గాయ్స్. కాస్తా బ్రేక్ తీసుకుంటున్నా(సోషల్ మీడియాకు). పూరీ కనెక్ట్స్ త్వరలోనే మరింత దృఢంగా, మునుపటికి కంటే ఉత్తమంగా తిరిగి వస్తుంది. అప్పటి వరకు కాస్తా శాంతించండి అబ్బాయిలు’ అంటూ చార్మీ రాసుకొచ్చింది. ఇక చార్మీపై కొందరు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా లైగర్ ఫ్లాప్తో విజయ్తో పాటు పూరీ కనెక్ట్స్ నిర్మాతలైన చార్మీ, పూరీ జగన్నాథ్ను ఉద్దేశించి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: వైరల్గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు! ప్రమోషన్స్లో విజయ్ ఓవరాక్షన్, నోటి దురుసు వల్లే ఈసినిమా ఫ్లాప్ అయ్యిందని, అతడిని నమ్ముకున్నందుకు పూరీ కనెక్ట్స్ పని అయిపోయిందంటూ సోషల్ మీడియా విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు చార్మీ, పూరీ కనెక్ట్స్ను ట్యాగ్ చేస్తూ సినిమా అసలు బాగోలేదని, విడుదలకు ముందు క్రియేట్ చేసిన హైప్ కథలోనే లేదని.. కథ, కథనం చాలా బలహీనంగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటి కారణంగానే ఆమె సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Chill guys! Just taking a break ( from social media )@PuriConnects will bounce back 😊 Bigger and Better... until then, Live and let Live ❤️ — Charmme Kaur (@Charmmeofficial) September 4, 2022 -
‘లైగర్’ ఫ్లాప్తో పారితోషికంలో భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్! ఎంతంటే..
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన లైగర్ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అనుకున్నంత స్థాయిలో అందుకోలేకపోయింది. లైగర్ రిలీజ్కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగినప్పటికీ విడుదల తర్వాత సీన్ మారిపోయింది. తొలి షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో లైగర్ బాక్సాఫీస్ లెక్కలన్ని తలకిందులయ్యాయి. విడుదలకు ముందు ఈ మూవీ రూ. 200 కోట్లకుపైగా వసూలు చేస్తుందని ఆశపడ్డ విజయ్కి బాక్సాఫీసు ఫలితాలు షాకిచ్చాయి. చదవండి: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్బాస్ బ్యూటీ! దీంతో రౌడీ హీరో ఆశలన్ని అడియాసలయ్యాయి. అన్ని భాషల్లోనూ ఈ మూవీ భారీ డిజాస్టర్గా నిలిచింది. దీంతో లైగర్ మూవీ నిర్మాతలకు పెద్ద ఎత్తున్న నష్టాలను మిగిల్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ సినిమాకు బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్, నటి చార్మీ కౌర్లు నిర్మాతలు కాగా.. పూరీ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించాడు. దీంతో లైగర్ పరాజయంతో పూరీ తన పారితోషికంతో పాటు లాభాల్లో వచ్చిన తన వాటాలో 70 శాతం వెనక్కి ఇచ్చాడని సమాచారం. ఇక హీరోగా చేసిన విజయ్ కూడా తన పారితోషికంలో కొంతభాగాన్ని వదులుకున్నాడని తెలుస్తోంది. చదవండి: శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాకి విజయ్ రూ. 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడని ఇప్పటికే వార్తలు వినిపించాయి. దీనితో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్లో విజయ్కి కూడా వాటా ఉందట. ఇప్పుడు ఆ వాటాను వద్దని పూరీ, చార్మీలకు చెప్పడమే కాకుండా.. తన పారితోషికంలో రూ. 6 కోట్లను విజయ్ వెనక్కి ఇచ్చేసినట్లు ఫిలిం దూనియాలో టాక్ వినిపిస్తోంది. ఇది తెలిసి విజయ్ నిర్ణయంపై అతడి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. నష్టాల్లో కూరుకుపోయిన నిర్మాతలను ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడంటూ విజయ్ అభిమానులు కాలర్ ఎగిరేస్తున్నారు. కాగా విజయ్ తన తదుపరి చిత్రం జన గణ మన కోసం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టాడు. ఈ మూవీకి కూడా పూరీ దర్శకత్వం వహిస్తుండగా.. చార్మీతో కలిసి నిర్మించనున్నాడు. -
'ఇండియాను షేక్ చేస్తా అన్నాడు.. ఫ్లాప్ చేశాడు'.. తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'లైగర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకోని రీతిలో డిజాస్టర్గా మిగిలిపోయింది. రిలీజ్ అయిన తొలిరోజు నుంచి నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడిందీ సినిమా. దీంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండపై కొందరు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లైగర్ రిజల్ట్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. 'మన యాక్షన్ని బట్టే ప్రేక్షకుల రియాక్షన్ఉంటుంది. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయి. సినిమాను చూడండి అని ప్రమోట్ చేసుకోవాలి. నువ్వు చిటికెలు వేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. హీరోలు ఊరికే ఎగిరెగిరి పడటం మంచిది కాదు. అలాగే ఇష్టం వచ్చినట్లు ''ఊపేస్తాం.. తగలెడతాం.. అని స్టేట్మెంట్లు ఇస్తే ఇలాగే ప్రేక్షకులు మనల్ని తగలెడతారు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ సినిమా డిజాస్టర్కు కారణాలు ఏమై ఉంటాయి అని ప్రశ్నించగా.. ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. నేను పూరి జగన్నాథ్ అభిమానినే. కానీ లైగర్ ట్రైలర్ చూసినప్పుడే మూవీ చూడలనిపించలేదు. భవిష్యత్తులో కుదిరితే చూస్తా అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. -
'లైగర్' డిజాస్టర్పై స్పందించిన ఛార్మి
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్లో ఒకటిగా లైగర్ నిలుస్తుందని అంతా భావించినా అందుకు భిన్నంగా డిజాస్టర్ టాక్ని మూటగట్టుకుంది. మైక్ టైసన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఉన్నా కంటెంట్ లేకుంటే థియేరట్లకు జనాలు రారని లైగర్ మరోసారి ప్రూవ్ చేసినట్లయ్యింది. ఫలితంగా భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్పై నిర్మాత ఛార్మి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'జనాలు ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూసే యాక్సిస్ ఉంది. కుటుంబం మొత్తం ఇంట్లోనే భారీ బడ్జెట్ సినిమాలు చూడగలరు. కాబట్టి సినిమాలు వారిని ఎగ్జైట్ చేయనంత వరకు థియేటర్లకు రావడానికి వాళ్లు ఇష్టపడటం లేదు. తెలుగులో ఇటీవల బింబిసార, సీతారామం, కార్తికేయ 2 వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. సుమారు రూ 150 కోట్ల నుంచి రూ. 170కోట్ల వరకు వసూలు చేశాయి. కానీ బాలీవుడ్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 2019నుంచి లైగర్ కోసం కష్టపడ్డాం. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత లైగర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. ఎన్నో అడ్డంకులను దాటి థియేటర్లో విడుదల చేశాం. కానీ సినిమా ఫెయిల్యూర్ అవడం బాధగా అనిపిస్తుంది' అంటూ ఛార్మి ఆవేదన వ్యక్తం చేసింది. -
మైక్ టైసన్ నన్ను బూతులు తిట్టాడు, బయటికి చెప్పలేను: విజయ్
విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'లైగర్'. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. రిలీజ్ అయిన మొదటిరోజు నుంచే నెగిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. కథలో లోపాలున్నా విజయ్ నటనకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అతని రెండేళ్ల కష్టం ప్రతి ఫ్రేములో కనిపిస్తుందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో గెస్ట్ రోల్లో నటించిన మైక్ టైసన్ గురించి విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో మైక్ టైసన్ తనను చాలా సందర్భాల్లో తిట్టాడని, ఆ బూతుల్ని తాను చెప్పాలనుకోవట్లేదని తెలిపాడు. అయితే అవన్నీ టైసన్ కేవలం ప్రేమతోనే అన్నాడని చెప్పుకొచ్చాడు. 'ఇండియా అంటే ఆయనకు ఎంతో గౌరవం. ఇక్కడి ఆహారం, మ్యూజిక్ను ఎంజాయ్ చేస్తాడు. కానీ పెద్ద సంఖ్యలో జనాల్ని చూస్తే మాత్రం భయపడతాడు. ఓసారి ఆయన ఇండియాకు వచ్చిన క్రమంలో ఆయన్ని చూడటానికి గుంపులుగా వచ్చిన జనాల్ని చూసి హోటల్ నుంచి బయటికి కూడా రాలేదు' అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. -
షాకింగ్.. 'లైగర్' చెత్త రికార్డ్.. రేటింగ్లో మరీ ఇంత తక్కువా?
విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ఇండియా చిత్రం 'లైగర్'. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైందనే చెప్పొచ్చు. విడుదలైన రోజు నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న లైగర్ చిత్రానికి ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ సంస్థ(ఐఎండీబీ)అత్యల్ప రేటింగ్ను ఇచ్చింది.10కి కేవలం 1.7 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. ఇక ఈ రేటింగ్ ఇటీవల లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ చిత్రాల కంటే తక్కువ అని తెలుస్తోంది.చదవండి: లైగర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!.. ఎప్పుడంటే అమీర్ ఖాన్ కెరీర్లోనే అతిపెద్ద ఫ్లాప్గా నిలిచిన లాల్ సింగ్ చడ్డాకు ఐఎండీబీ రేటింగ్ 5 ఇవ్వగా.. లైగర్కు మాత్రం 1.7 ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అక్షయ్ కుమార్ రక్షా బంధన్ చిత్రానికి 4.6, దొబారా 2.9. రణ్బీర్ కపూర్ 4.9తో పోలిస్తే లైగర్కు మాత్రం అత్యంత దారుణంగా 1.7రేటింగ్ ఇచ్చారు. ఇక ఈ వీకెండ్ రోజుల్లో కలెక్షన్స్ అనుకున్నట్టుగా రాబట్టకపోతే మూవీ డిజాస్టర్ టాక్ను మూటగట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. చదవండి: 'తలకిందులైంది.. లైగర్ రిజల్ట్ చూసి విజయ్ ఏం చేశాడో తెలుసా? -
లైగర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!.. ఎప్పుడంటే
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్పై ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ+ హాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఓటీటీ రైట్స్ను దాదాపు 85 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది.సినిమా రిలీజ్కు ముందే ఈ డీల్ కుదుర్చుకుంది.సాధారణంగా కొత్త సినిమాలు 50రోజుల తర్వాతే ఓటీటీలోకి రానున్నాయి. దీన్ని బట్టి అక్టోబర్ తొలివారంలో లైగర్ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: లైగర్ రిజల్ట్ తర్వాత విజయ్ ఏం చేశాడో తెలుసా? -
'తలకిందులైంది.. లైగర్ రిజల్ట్ చూసి విజయ్ ఏం చేశాడో తెలుసా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లైగర్. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన లైగర్ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అనుకున్నంత స్థాయిలో అందుకోలేకపోయింది. లైగర్ రిలీజ్కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగినప్పటికీ విడుదల తర్వాత సీన్ మారిపోయింది. నెగిటివ్ టాక్తో బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. దీంతో రౌడీ హీరో ఆశలు అడియాసలయ్యాయి. అయితే సినిమా ఫలితం పక్కనపెడితే విజయ్ దేవరకొండ యాక్టింగ్కి మాత్రం ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్తో అతడి కష్టమంతా సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా లైగర్ రిలీజ్ అయిన ఒకరోజు తర్వాత విజయ్ దేవరకొండ మళ్లీ యాక్షన్లోకి దిగాడు. సినిమా రిజల్ట్ని పట్టించుకోకుండా తన పనుల్లో నిమగ్నమయ్యాడు. జిమ్లో ఉత్సాహంగా కసరత్తులు చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. వందశాతం మనం ప్రయత్నం చేసినా ఫలితం మన చేతుల్లో ఉండదని విజయ్కి సపోర్ట్ చేస్తూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Just a day after #Liger’s release, #VijayDeverakonda is back in action again. @TheDeverakonda sweating it out with his fitness regime. This man never stops.🔥 pic.twitter.com/qeh902naNb — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 26, 2022 -
Liger Movie: థియేటర్ వద్ద రచ్చ చేసిన పూరీ ఫ్యామిలీ
నర్సీపట్నం: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా రిలీజ్ కావడంతో నర్సీపట్నంలో అభిమానుల సందడి నెలకొంది. రాజు థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటింది. పూరీ జగన్నాథ్ సోదరుడు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పూరీ సతీమణి లావణ్య, కుమార్తె పవిత్ర, మిగతా కుటుంబ సభ్యులతో రాజు థియేటర్లో సినిమాను తిలకించారు. అభిమానులు భారీ ఎత్తున బాణసంచా పేల్చారు. సినిమా తిలకించిన అనంతరం థియేటర్ ఆవరణలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఎమ్మెల్యే గణేష్, పూరీ సతీమణి లావణ్య, కుమార్తె పవిత్ర, ఎమ్మెల్యే సతీమణి కళావతి కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా లావణ్య మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందనడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: (గణేష్ మండపం పెడుతున్నారా? ఈ అనుమతులు తప్పనిసరి) -
'లైగర్' ఫస్ట్డే కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ రావాలంటే అన్ని కోట్లు రావాల్సిందే!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల నడుమ నిన్న(గురువారం) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం అనుకున్నంతగా ఆడియెన్స్ను మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగానూ నిరాశపరిచింది. పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా తొలిరోజు రూ. 12కోట్ల షేర్ను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ నెగిటివ్ టాక్ కారణంగా ఆ టెర్గెట్ను లైగర్ అందుకోలేకపోయింది. తొలిరోజు తెలంగాణ, ఏపీలో కలిపి రూ. 9. 57కోట్ల షేర్ని మాత్రమే రాబట్టింది. తెలుగురాష్ట్రాల్లో కలెక్షన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి... నైజాంలో రూ. 4.2కోట్లు సీడెడ్లో రూ. 1.32కోట్లు వైజాగ్లో రూ. 1.30కోట్లు ఈస్ట్లో రూ.. 64లక్షలు వెస్ట్లో రూ. 39లక్షలు కృష్ణలో రూ. 48 లక్షలు గుంటూరులో రూ. 83లక్షలు నెల్లూరులో రూ. 40 లక్షల వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ అంచనాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ. 12 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా 15.40 కోట్ల గ్రాస్, రూ. 9.57కోట్ల షేర్ను రాబట్టింది. ఓవర్ సీస్ సహా వరల్డ్ వైడ్ గా లైగర్ సినిమా తొలి రోజు 33.12 కోట్ల గ్రాస్ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ రూ. 90కోట్లు ఉండగా, ఇంకా రూ.76.55 కోట్ల వసూళ్లు రావాల్సి ఉంది. -
లైగర్లో విజయ్కి నత్తి పెట్టడానికి కారణం బన్నీనే: పూరీ
ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ సినిమాల గురించి చర్చించుకుంటే ఎలా ఉంటుంది.. ఇక వారి ఫ్యాన్స్కి ఇదోక క్రేజీ న్యూసే కదా. అలా అభిమానులకు ఓ మంచి అనుభూతి అందించారు మన తెలుగు క్రేజీ డైరెక్టర్స్. నేడు(ఆగస్ట్ 25) లైగర్ మూవీ రిలీజ్ నేపథ్యంలో బుధవారం డాషింగ్ డైరెక్టర్ పూరీని ఇంటర్య్వూ చేశారు మన లెక్కల మాస్టర్ సుకుమార్. ఈ సందర్భంగా పూరీ దగ్గర తాను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశానని చెప్పారు సుక్కు. చదవండి: సౌందర్యతో ఎఫైర్.. రూమర్స్పై క్లారిటీ ఇచ్చిన జగపతి బాబు ఈ నేపథ్యంలో పూరీ కథలు రాయడం, ఆయన అద్భుతమైన డైరెక్షన్ వెనక ఉన్న కృషి గురించి అడిగా సుకుమార్. కథ రాసేటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందో పూరీ వివరించారు. ఈ సందర్భంగా లైగర్లో విజయ్ దేవరకొండకు లోపం పెట్టడం వెనక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడంటూ ఆసక్తికర విషయం చెప్పారు పూరీ. ‘‘ఒకసారి బన్నీ నాతో మాట్లాడుతూ ‘హీరోకి ఏదైనా ఒక లోపం పెట్టి, అతని పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేయవచ్చును గదా’ అన్నారు. హీరోకి నత్తి ఉన్నట్టుగా చూపిస్తే ఎలా ఉంటుందని అడిగితే సూపర్గా ఉంటుందని చెప్పారు. చదవండి: Surekha Vani: అలాంటి బాయ్ఫ్రెండ్ కావాలంటున్న నటి సురేఖ వాణి ఇక మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని అనుకున్న నేను ఈ బాక్సింగ్ కథ వైపు వెళ్లాను. విజయ్ దేవరకొండ పాత్రకి నత్తి పెట్టాను. అలా ఈ పాత్రను డిజైన్ చేయడం వెనుక బన్నీ ఉన్నాడు. విజయ్ దేవరకొండ ఈ పాత్రను గొప్పగా చేశాడు’’ అంటూ పూరీ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఈ మూవీ కోసం మైక్ టైసన్ను ఒప్పించడానికి ఏడాది పట్టిందని పూరీ వెల్లడించారు. ఈ సందర్భంగా తన సినిమాల్లోని హీరో క్యారెక్టరైషన్స్ గురించిన మరిన్ని విశేషాలను పూరీ పంచుకున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే ఇక్కడో లుక్కేయండి. -
Liger Review: లైగర్ మూవీ రివ్యూ
టైటిల్ : లైగర్ నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, మైక్టైసన్, విషురెడ్డి, అలీ తదితరులు నిర్మాణ సంస్థలు: ధర్మా ప్రొడెక్షన్స్,పూరీ కనెక్ట్స్ నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా దర్శకత్వం:పూరి జగన్నాథ్ సంగీతం :సునీల్ కశ్యప్, విక్రమ్ మాంట్రోస్, తనీష్ భాగ్చి సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ ఎడిటర్:జనైద్ సిద్దిఖీ విడుదల తేది: ఆగస్ట్ 25, 2022 యావత్ సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ‘లైగర్’. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం.. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తొలిసారిగా బాక్సర్ గా వెండితెరపై కనిపించబోతుండడంతో ‘లైగర్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్ బజ్ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా నిర్వహించడంతో ‘లైగర్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య గురువారం(ఆగస్ట్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లైగర్’ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘లైగర్’ కథేంటంటే.. కరీంనగర్కు చెందిన బాలమణి(రమ్యకృష్ణ) తన కొడుకు లైగర్(విజయ్ దేవరకొండ)ని మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(ఎమ్.ఎమ్.ఏ)లో నేషనల్ ఛాంపియన్గా చూడాలనుకుంటుంది. కొడుకుకి ట్రైనింగ్ ఇప్పించడం కోసం కరీంనగర్ నుంచి ముంబై వస్తుంది. అక్కడ ఓ టీస్టాల్ నడుపుతూ లైగర్కి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇప్పిస్తుంది. జీవితంలో ఏ అమ్మాయి జోలికి వెళ్లొదని, ప్రేమలో పడితే మన లక్ష్యాన్ని మర్చిపోతామని చెబుతుంటుంది. కానీ లైగర్ మాత్రం ముంబైకి చెందిన తాన్య(అనన్యపాండే)తో ప్రేమలో పడిపోతాడు. ఆమె కూడా లైగర్ని ప్రేమిస్తుంది కానీ అతనికి నత్తి ఉందని తెలిసి దూరమవుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయిన లైగర్ చివరకు తన గోల్ని రీచ్ అయ్యాడా? లేదా? ఇంటర్నేషనల్ చాపియన్షిప్లో పాల్గొనడానికి లైగర్కు సహాయం చేసిందెవరు? తన గురువులా భావించే మైక్ టైసన్తో లైగర్ ఎందుకు తలపడాల్సి వచ్చింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఈ మధ్య కాలంలో ‘లైగర్’చిత్రానికి వచ్చినంత హైప్ ఏ చిత్రానికి రాలేదు. ఈ సారి పూరీ బలమైన కథలో వస్తున్నాడని అంతా భావించారు. తీరా సినిమా చూశాక.. పూరీ మళ్లీ పాత పాటే పాడరనిపిస్తుంది. ఓ సాధారణ ప్రేమ కథకి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యాన్ని జోడించి ‘లైగర్’ని తెరకెక్కించాడు. ఇది ప్రేమ కథ అని ప్రచారం చేయడం కంటే.. ఎమ్ఎమ్ఏ నేపథ్యంలో వస్తున్న చిత్రమనే ఎక్కువగా ప్రచారం చేశారు. హీరోని కూడా అదే స్థాయిలో చూపించారు. కానీ కథలో మాత్రం ఆ సిరియస్నెస్ ఎక్కడా కనిపించలేదు. ఎమ్.ఎమ్.ఏ సంబంధించిన సీన్స్ సాధారణంగా సాగుతాయే తప్ప ఉత్కంఠను రేకెత్తించవు. పోనీ ప్రేమ కథను అయినా ఆకట్టుకునేలా ఉందా అంటే అదీ అనిపించదు.తాన్య, లైగర్ ప్రేమలో పడిన తీరు కూడా ఆకట్టుకునేలా ఉండదు. యూత్ని అట్రాక్ చేయడం కోసం బోల్డ్నెస్ని అతికించడం కొంతమేర ఇబ్బందిగా అనిపిస్తుంది. హీరోహీరోయిన్ ప్రేమలో పడిన సన్నివేశాలతో పాటు.. వాళ్లు విడిపోవడం, సెకండాఫ్లో బ్రేకప్కి చెప్పిన రీజన్ అన్ని సిల్లీగా అనిపిస్తాయి. అయితే తెరపై విజయ్ని చూపించిన తీరు మాత్రం అందరిని మెప్పిస్తుంది. ఇక సెకండాఫ్ ఎక్కువగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాపింయన్ చుట్టే తిరుగుతుంది. ఇంటర్నేషనల్ ఛాపింయన్షిప్ కోసం అమెరికా వెళ్లాల్సిన లైగర్కు ప్రభుత్వం సహాయం చేయకపోవడం.. స్పాన్సర్షిప్ వ్యవహారం అంతా సాదాసీదాగా సాగుతుంది. అలాగే కొడుకు అమెరికాలో ఫైట్ చేస్తుంటే.. తల్లి ముంబైలోని ఇంట్లో కూర్చొని ప్రోత్సహించడం లాంటి సీన్తో పాటు మరికొన్ని సనివేశాలు వాస్తవికతకు దూరంగా ఉంటాయి. మైక్టైసన్, విజయ్ల మధ్య వచ్చే ఫైటింగ్ సీన్ అయితే మైక్టైసన్ అభిమానులు జీర్ణించుకోవడం కష్టమే. సినిమాలోని మెయిన్ పాయింట్కి ఆధారంగా ముగింపు ఉంటే బాగుండేది. హీరో నత్తితో పలికే డైలాగ్స్ కొన్ని చోట్ల నవ్విస్తాయి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. పూరీ రాసుకున్న స్టోరీ లైన్, లైగర్ అనే క్యారెక్టర్ బాగున్నప్పటికీ.. ఆ క్యారెక్టర్కి తగ్గట్లుగా కథనాన్ని మాత్రం నడిపించలేకపోయాడు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్ దేవరకొండ యాక్టింగ్. ప్రాణం పెట్టి నటించాడు. లైగర్ పాత్ర కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. నత్తితో ఆయన పలికిన డైలాగ్స్ సహజంగా అనిపిస్తాయి. గత సినిమాలలో కంటే ఇందులో విజయ్ నటన కొత్తగా ఉంటుంది. ఎనర్జిటిక్ ఫెర్ఫార్మెన్స్తో విజయ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక లైగర్ తల్లి బాలామణిగా రమ్యకృష్ణ తనదైన నటనతో ఆకట్టుకుంది. తాన్యగా అనన్య పాండే మెప్పించింది. తెరపై అందంగా కనిపించింది. అయితే ఆ పాత్ర సినిమాపై అంతగా ప్రభావం చూపదు. పాటల్లో విజయ్, అనన్య రొమాన్స్ ఆకట్టుకుంటుంది. లైగర్ కోచ్గా రోనిత్ రాయ్ మెప్పించాడు. విషురెడ్డి, అలీ, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికిస్తే.. సంగీతం పర్వాలేదు. పాటలు టాలీవుడ్ కంటే బాలీవుడ్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన అనన్య పాండే
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం 'లైగర్'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పూరి కనెక్ట్స్ ,ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత విజయ్ నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో లైగర్పై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో భారీ అంచనాల మధ్య నేడు(గురువారం)లైగర్ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆడియెన్స్ రెస్పాన్స్ చూసేందుకు విజయ్, అనన్య హైదరాబాద్లోని ఓ థియేటర్కు వెళ్లారు. వీళ్లు ఎంట్రీ కాగానే ఆడియెన్స్ థియేటర్లో రచ్చరచ్చ చేశారు. విజిల్స్ వేస్తూ పేపర్లు చింపుతూ హంగామా సృష్టించారు. దీంతో విజయ్ క్రేజ్ చూసిన అనన్య పాండే కాస్త భయపడినట్లుంది. కాస్త కంగారుగానే థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
‘లైగర్’ ట్విటర్ రివ్యూ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన అనన్య పాండే నటించింది. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు భారీ స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ‘లైగర్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 25) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘లైగర్’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. సినిమా బాగుందని , కమర్షియల్గా ఆడుతుందని కొందరు కామెంట్ చేస్తుంటే.. స్టోరీ యావరేజ్గా ఉందని, విజయ్ మాత్రం తనదైన నటనతో ఆకట్టుకున్నారని మరికొందరు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ బాగుందని, నటుడిగా తన బెస్ట్ ఇచ్చాడని, సినిమాలో అతను నత్తితో ఇబ్బంది పడటం అందరిని బాధిస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మొదటి భాగం కాస్త ఫర్వాలేదనిపించినా, సెకండాఫ్ మాత్రం చాలా దారుణంగా ఉందంటున్నారు. Just now finished watching the #Liger..the movie is so high standards with very quality output. @TheDeverakonda lived in his character..Production values are so high @PuriConnects . Boss #purijagan delivered another block buster. Please go and book the tickets to watch #Liger https://t.co/JGX5jkI38J — Ramu Akula (@Akula4Ramu) August 25, 2022 ‘ఇప్పుడే లైగర్ సినిమా చూశా. సినిమా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ తన పాత్రలో జీవించేశాడు. ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ బాగున్నాయి. పూరీ జగన్నాథ్ మరో బ్లాక్ బస్టర్ అందించాడు’అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. One word review:- Excellent One of the best movies related to journey of a wrestler and fight scenes were so classic. #VijayDevarakonda as usual nailed his role in movie.#MikeTyson played an excellent role.#AnanyaPanday was so hot and pretty.#Liger #LigerReview pic.twitter.com/fNzJaH728X — 𝙰𝚑𝚊𝚍 (@catzproud) August 25, 2022 బాక్సర్ నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో లైగర్ ఒక బెస్ట్ చిత్రమని, విజయ్ దేవరకొండ ఎప్పటి మాదిరే తన పాత్రలో ఒదిగిపోయాడు. మైక్టైసన్ ఓ అద్భుతమైన పాత్రని పోషించాడు. అనన్య పాండే తెరపై అందంగా కనిపించింది. మొత్తంగా లైగర్ ఓ అద్భుతమైన చిత్రమని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Liger #LigerHuntBegins A below average first half followed by a hideous second half. HIDEOUS. Abysmal writing and horrible screenplay. A climax Endira 😭😭😭 There's no story no screenplay just random montages. VD couldn't do much either. Stammer, ruining characterization😭 — Sai_Reviews (@saisaysmovies) August 24, 2022 ఫస్టాఫ్ యావరేజ్గా ఉందని, సెకండాఫ్ కూడా అంతగా ఆకట్టుకోలేదని చెబుతున్నారు. పూరి జగన్నాథ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అస్సలు బాగోలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. #LigerReview ⭐️/ 5 Firstly #Liger is not a Telugu Film, Whole film/songs shot in Hindi & then dubbed into Telugu. Such a disrespect to our Audience Positives: - Vijay looks Negatives: - Songs 🤮 - #AnanyaPanday 🙏 Poker-faced actress i've seen in recent times 🤦 1/3 — ᐯ K (@vamsixplores) August 25, 2022 If #Liger makes money it’s only because of @TheDeverakonda acting but if it fails it’s because of bad screenplay, misplaced songs & bollywoodizing south content. @ananyapandayy and @karanjohar association leaves bad side effects to this movie !! Good luck ! — Nidhi Singh (@NidhiSi85385249) August 25, 2022 #LigerReview : Puri missed a great chance with the movie #Liger STORY👎 SCREENPLAY👎 SECOND HALF 👎 CLIMAX👎 Heroine Track👎 HERO acting 👎#VijayDeverakonda action is poor the stuttering character didn't suit Vijay Devarakonda. Rating:1.5/5 — Harish (@Harish1432D) August 25, 2022 #LigerReview our rating 2/5 Plus points; 👉Vijaya Deverakonda Minus points 👉Story 👉Screen Play 👉Heroine Track 👉Climax 👉Songs Puri Missed a great chance with the movie #Liger@TheDeverakonda @sarigamacinemas @purijagan#Waatlagadenge pic.twitter.com/08VlBakVVQ — Movies Box Office (@MovieBoxoffice5) August 25, 2022 #Liger Review: OK Action Entertainer 👍#VijayDeverakonda Shines👏#RamyaKrishnan & #MikeTyson r effective👌#AnanyaPanday 🥲🙏 Songs👎, but BGM👍 Story & Screenplay🙏 Action scenes r good✌️ Rating: ⭐⭐⭐/5#LigerReview #LigerHuntBegins #WaatLagaDenge pic.twitter.com/vY9DjGmnDM — Kumar Swayam (@KumarSwayam3) August 24, 2022 -
అలా బతకలేకపోతే ఎంత సంపాదించినా లాభం లేదు: విజయ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోలో విజయ్కు జోడీగా అనన్య పాండే నటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆగస్ట్ 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్న లైగర్ టీం ఇటీవలె సాక్షి టీవీతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. సినిమా బ్యాగ్రౌండ్ ఏమాత్రం లేకపోయినా, ఎంత స్టార్డమ్ సంపాదించుకున్నారు. అసలు విజయ్ దేవరకొండ ఎవరు అని అడిగితే.. 'నాకు పూర్తిగా నేను ఎవరో తెలియదు. కానీ నాకు ఒకటి తెలుసు.. నాకు అనిపించింది నేను చేస్తా. నచ్చినట్లు ఉంటా. అన్నింటికంటే నాకు ఇదే ముఖ్యం. నచ్చినట్లు బతకలేకపోతే సూపర్ స్టార్ అయినా, ఎంత సంపాదించినా లాభం లేదు' అంటూ చెప్పుకొచ్చాడు. పూరి జగన్నాథ్ తనను చాలా బాగా అర్థం చేసుకుంటారని, తన గురించి తనకే చెప్తారంటూ పేర్కొన్నాడు. ఇక విజయ్ అందరికీ ఇంతలా కనెక్ట్ అవ్వడానికి కారణం అతని నిజాయితీ అని హీరోయిన్ అనన్య పాండే తెలిపింది. ప్రతిరోజూ విజయ్ తనకు కొత్తగానే కనిపిస్తాడని, పని విషయంలో చాలా కష్టపడతాడని చెప్పుకొచ్చింది. -
60 ఏళ్లు వచ్చినా.. ఆ 20 రోజులు మరిచిపోలేను : విజయ్ దేవరకొండ
‘‘నా కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమా ‘లైగర్’. గుంటూరులోనే కాదు.. ఇండియాలో ఎక్కడికి వెళ్లినా నాపై మీరు చూపిస్తున్న ప్రేమను మరచిపోలేను’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గుంటూరులో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నాకు అరవై ఏళ్లు వచ్చి, సినిమాలు మానేసి ఇంట్లో కూర్చొని ఉన్నా కూడా ‘లైగర్’ ప్రమోషన్స్లో పాల్గొన్న 20రోజులు, మీ (అభిమానులు) ప్రేమని మరచిపోలేను.. ఆలోచిస్తుంటాను. అంత స్ట్రాంగ్ మెమొరీ నాకు ఇచ్చారు. అంతే మెమొరీ మీకు తిరిగి ఇవ్వడం నా బాధ్యత. మీకు గుర్తుండిపోయే సినిమా ‘లైగర్’. ఈ సినిమాకి మూడేళ్లు పట్టింది. ఈ చిత్ర కుమ్మేస్తుంది. ఆగస్టు 25న గుంటూరుని మీరు (అభిమానులు) షేక్ చేయాలి’’ అన్నారు. (చదవండి: ట్రెండింగ్లోకి ‘బాయ్కాట్ లైగర్’.. ‘రౌడీ’ ఫ్యాన్స్ గట్టి కౌంటర్) పూరి జగన్నాథ్ మాట్లాడుతూ–‘‘మిమ్మల్ని చూస్తుంటే ‘లైగర్’ ప్రీ రిలీజ్కి వచ్చామా? సక్సెస్ మీట్కి వచ్చామా? అన్నది అర్థం కావడం లేదు. మీరందరూ ఒక్కొక్క టిక్కెట్ కొంటే చాలు మా సినిమా బ్లాక్బస్టర్. ఈ సినిమాలో విజయ్ ఇరగదీశాడు.. అనన్య చింపేసింది. రమ్యకృష్ణ ఉతికి ఆరేసింది. ఈ సినిమాలో హైలైట్ మైక్ టైసన్. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.. ఎంత వసూలు చేస్తుందో తెలియదు. ఇవన్నీ పక్కనపెట్టి ఇంతకంటే డబుల్ బడ్జెట్తో విజయ్తో ‘జనగణమణ’ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాం.. అది మా నమ్మకం’’ అన్నారు. -
బాయ్కాట్ చేస్తారా ..ఏదొచ్చినా కొట్లాడుడే: విజయ్ దేవరకొండ
‘లైగర్ కోసం మూడేళ్లు కష్టపడ్డాం. ప్రాణం పెట్టి నటించాను. తల్లి సెంటిమెంట్తో భారతీయ జెండాను ఎగురవేస్తే బాయ్ కాట్ చేస్తారా? మనం ధర్మంతో ఉన్నాం. ఏదొచ్చిన కొట్లాడుడే’అని విజయ్ దేవరకొండ అన్నాడు. లైగర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా చిత్ర యూనిట్ శనివారం విజయవాడలో ఈవెంట్ నిర్వహించింది. ఇందులో హీరో విజయదేవర కొండ, హీరోయిన్ అనన్య పాండే, డైరెక్టర్ పూరి జగన్నాధ్, ప్రొడ్యూసర్ చార్మి పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా విజయ్ మీడియాతో ముచ్చటిస్తూ బాయ్కాట్ వివాదంపై స్పందించారు. మనం కరెక్ట్గా ఉన్నప్పుడు, మన ధర్మం మనం చేసినప్పుడు ఎవడి మాట వినేదే లేదు. ఏదొచ్చినా కొట్లాడుడే. తల్లి సెంటిమెంట్తో మంచి సినిమా చేస్తే బాయ్కాట్ చేస్తారా? చూద్దాం.. అల్రెడీ బుకింగ్స్ ఓపెనయ్యాయి’ అన్నారు. ఇక లైగర్ సినిమా గురించి పూరి కధ చెప్పగానే మెంటలొచ్చిందని వెంటనే ఓకే చెప్పేశానన్నారు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్నిఇండియా కు పరిచయం చేశారని చెప్పాడు. ఇక పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. లైగర్ ఓ యాక్షన్ డ్రామా చిత్రమని, చిన్నా, పెద్ద అంతా కలిసి చూడొచ్చని చెప్పారు. అమ్మా నాన్నా తమిళ అమ్మాయి చిత్రానికి లైగర్తో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇలాంటి చిత్రాన్ని థియేటర్స్లోనే చూడాలని, ఓటీటీ చూడాల్సిన మూవీ కాదన్నారు. Manam Correct unnapudu Mana Dharmam manam chesinapudu Evvadi maata vinedhe ledu. Kotladudham 🔥#Liger — Vijay Deverakonda (@TheDeverakonda) August 20, 2022 -
కొంపముంచిన విజయ్ కామెంట్స్.. ట్రెండింగ్లో బాయ్కాట్ 'లైగర్'
#బాయ్కాట్ బాలీవుడ్.. ఇండియలో ట్రెండింగ్లో ఉన్న హ్యాష్ట్యాగ్ ఇది. బీటౌన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ బాయ్కాట్ ట్రెండ్ ఇప్పడు 'లైగర్' సినిమాను కూడా తాకింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న ఈ సమయంలో లైగర్కు బాయ్కాట్ సెగ తగిలింది. దీనికి కరణ్జోహార్ ఒక కారణమైతే, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ మరో కారణంగా తెలుస్తుంది. పూరి కనెక్ట్స్తో కలిసి కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో లైగర్ బాయ్కట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఇక మరోవైపు ఓ ఇంటర్వ్యూలో లాల్సింగ్ చడ్డా బాయ్కాట్ చేయడంపై విజయ్ స్పందిస్తూ.. ఇలా చేయడం వల్ల చాలామంది కార్మికులు నష్టపోతారని కామెంట్స్ చేసి అమీర్ఖాన్కు మద్దతు తెలపడంతో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. దీనికి తోడు ఓ ప్రెస్మీట్లో విజయ్ దేవరకొండ టేబుల్ మీద కాళ్లు పెట్టి మీడియాకు ఆన్సర్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ కారణాలతో లైగర్ సినిమాను బాయ్కాట్ చేయాలంటూ #BoycottLigerఅనే హ్యాష్ట్యాగ్ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. We Telugu youth also support for this #BoycottLiger because it is not Telugu movie it is Hindi movie which is dubbing in telugu produced by Karan Johar #BoycottLigerMovie — suman kumar (@khsumankumar45) August 20, 2022 It's enough for boycott #BoycottLigerMovie pic.twitter.com/Tkt5PVhuOJ — Chris Virat🇮🇳 (@Chrisvirat100) August 20, 2022 -
‘లైగర్’లో ముందుగా ఆమెను హీరోయిన్గా అనుకున్నా: పూరీ
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-అనన్య పాండే జంటగా నటించిన తాజా చిత్రం లైగర్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో లైగర్ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న పూరి జగన్నాథ్ చిత్ర విశేషాలను పంచుకున్నాడు. అయితే లైగర్లో ముందుగా తాను వేరు హీరోయిన్ను అనుకున్నట్లు చెప్పాడు. చదవండి: ప్రపోజల్స్పై ‘జీ సరిగమప’ విన్నర్ శ్రుతిక ఆసక్తిర వ్యాఖ్యలు ఈ మేరకు పూరీ మాట్లాడుతూ.. ‘విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాక నిర్మాణంలో భాగంగా నిర్మాత కరణ్ జోహార్ని కలిసి కథ చెప్పాను. ఆయన వెంటనే ఒకే అన్నారు. ఆ తర్వాత హీరోయిన్ కోసం జాన్వీ కపూర్ను కలిశా. ఎందుకంటే కథ అనుకున్నప్పుడే విజయ్కి జోడిగా జాన్వీని అనుకున్నాను. నేను శ్రీదేవి విరాభిమాని కావడంతో నా చిత్రం ద్వారానే జాన్వీని తెలుగులో లాంచ్ చేయాలనుకున్నా. అందుకే జాన్వీని కలిసి కథ వినిపించా. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ను వదులుకుంది. చదవండి: నా పాత్రను అందరు ప్రశంసిస్తున్నారు: ‘సీతారామం’ నటుడు ఇదే విషయాన్ని కరణ్కు చెప్పడంతో ఆయన అనన్య పేరును సూచించారు. దీంతో అనన్యను హీరోయిన్గా ఫైనల్ చేశాం. ఇక షూటింగ్ స్టార్ట్ అయ్యాక తెలిసింది ఆమె ఎంత మంచి నటి అనేది. ప్రతి సీన్లోనూ హావభావాలు చాలా బాగా ఇచ్చేది. ఈ సినిమా తర్వాత ఆమెకు యూత్లో ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది’ అని పూరీ చెప్పుకొచ్చాడు. కాగా పూరీ కనెక్ట్స్-ధర్మ ప్రొడక్షన్స్లో కరణ్ జోహార్-చార్మీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కాగా రీసెంట్గా సెన్సార్ కార్యక్రమాన్ని జరపుకున్న ఈ మూవీకి బోర్డు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 7 అసభ్యకర సన్నివేశాలని ఉన్నాయని, వాటి తొలగించి చిత్రం విడుదల చేయాలని పేర్కొంటూ సెన్సార్ బోర్డు లైగర్కు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. -
వీల్చైర్లో మైక్ టైసన్.. బాక్సింగ్ దిగ్గజానికి ఏమైంది..?
దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ గురించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ 'లైగర్'లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం వరకు సినిమా ప్రమోషన్స్లో బిజిబిజీగా గడిపిన మైక్ టైసన్.. తాజాగా వీల్చైర్లో కూర్చొని కదలలేని పరిస్థితిలో కనిపించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు లెజెండరీ బాక్సర్కు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. లైగర్ షూటింగ్లో హుషారుగా కనిపించిన యోధుడు కర్ర పట్టుకు కూర్చొని, ఇతరుల సాయంతో ముందుకు కదులుతున్న దృశ్యాలను చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. Former heavyweight boxing champion Mike Tyson’s health failing him and says his ‘expiration date may come really soon’ Mike Tyson is pictured in a wheelchair at Miami Airport, raising new fears for his health amid problems with sciatica. pic.twitter.com/ITHHAwfJQK — Zedbugs (@Zedbugs1) August 17, 2022 ఈ దృశ్యాలు టైసన్ మియామి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసినవిగా చెబుతున్నారు. టైసన్ ఈ పరిస్థితిలో ఉన్నప్పటికీ కొందరు సెల్ఫీల కోసం ఎగబడిన వైనం విస్మయానికి గురి చేస్తుంది. టైసన్ ఈ స్థితిపై ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. టైసన్ గతకొంతకాలంగా వెన్నునొప్పి, సయాటికాతో బాధపడుతున్నట్లు తెలిసింది. డాక్టర్లు టైసన్ను వీల్ చైర్ వాడాలని సూచించారట. విషయం తెలుసుకున్న అభిమానులు.. ప్రపంచాన్ని ఏలిన దిగ్గజ బాక్సర్కు ఈగతి పట్టిందేనని వాపోతున్నారు. 56 ఏళ్ల టైసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎక్స్పైరీ డేట్కు దగ్గర పడుతున్నానని చెప్పిన మాటల గురించి ప్రస్తుతం జనం చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం లైగర్ ఈనెల (ఆగస్టు) 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్కు జోడీగా బాలీవుడ్ క్యూటీ అనన్య పాండే నటించగా.. టైసన్ కీ రోల్ పోషించాడు. ఇక మైక్ టైసన్ ప్రొఫెషనల్ కెరీర్ విషయానికొస్తే.. టైసన్ ఇరవై ఏళ్ల వయసుకే తన దూకుడుతో ప్రపంచ ఛాంపియన్గా ఎదిగాడు. జూన్ 30, 1966లో జన్మించిన టైసన్.. చిన్నవయసులోనే అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్గా ఎదిగాడు. బాల్యంలో ఎన్నో కష్టాలు, వేధింపులు ఎదుర్కొన్న టైసన్.. స్ట్రీట్ఫైట్లలో పాల్గొని జైలు పాలయ్యాడు. లైంగిక వేధింపులు, ఇతరత్రా వివిదాల కారణంగా అతను 38సార్లు జైలుకెళ్లాడు. టైసన్ జైల్లో ఉండగానే బాక్సింగ్ దిగ్గజం ముహమ్మద్ అలీని కలిశాడు. 1997లో ప్రత్యర్థి ఇవాండర్ హోలిఫీల్డ్ చెవి కొరికి 3 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాడు. టైసన్ కెరీర్ రికార్డు 50 విజయాలు-20 ఓటములుగా ఉంది. చదవండి: విజయ్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న మైక్ టైసన్.. ఎంతంటే -
ఛార్మితో రిలేషన్ బయటపెట్టిన పూరి జగన్నాథ్
పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి కౌర్ తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతుంది. పూరి జగన్నాథ్తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో పూరి-ఛార్మిల మధ్య ఏదో ఉందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఛార్మి ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని వార్తలు వస్తున్నాయి. చదవండి: చేతిలో రూపాయి లేకపోయినా ఆఫర్ను రిజెక్ట్ చేశా : ఛార్మి తాజాగా ఛార్మితో తనకున్న రిలేషన్ షిప్ను బయటపెట్టారు పూరి జగన్నాథ్. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 'ఛార్మీ 13 ఏళ్ల వయసప్పటి నుండి తనకు తెలుసని, దశాబ్దాలుగా ఆమెతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. ఛార్మీకి నాకు ఏదో అఫైర్ ఉందని ఏదేదో మాట్లాడుకుంటారు. ఆమె ఇంకా యంగ్గా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అదే అదే ఛార్మికి 50ఏళ్లు ఉంటే ఇలా మాట్లాడేవారు కాదు. ఆమెకు వేరేవాళ్లతో పెళ్లి జరిగినా పట్టించుకునేవారు కాదు. చదవండి: రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష? ఎంజీఆర్, జయలలిత దారిలో.. కానీ తామిద్దరం ఒకే ఇండస్ట్రీలో ఉండటం, ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్ అవుతుండటంతో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఒకేవళ అఫైర్ ఉన్నా అది ఎక్కువరోజులు నిలబడదు. ఆకర్షణ అనేది కొన్నిరోజుల్లోనే చచ్చిపోతుంది. స్నేహమే శాశ్వతం. తామిద్దరం మంచి ఫ్రెండ్స్' అంటూ పుకార్లకు పూరి ఫుల్ స్టాప్ పెట్టారు. -
చేతిలో రూపాయి లేకపోయినా ఆఫర్ను రిజెక్ట్ చేశా : ఛార్మి
ప్రస్తుతం ఎక్కడ చూసిన 'లైగర్' మూవీ జోరు కనిపిస్తోంది.రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోలో విజయ్కు జోడీగా అనన్య పాండే నటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా విజయ్, పూరి జగన్నాథ్లను ఛార్మి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను పూరి జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. చదవండి: ఛార్మితో రిలేషన్ బయటపెట్టిన పూరి జగన్నాథ్ ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఛార్మి అడిగారు. ఇక లాక్డౌన్ టైంలో ఓ ఓటీటీ సంస్థ నుంచి భారీగా ఆఫర్ వచ్చినా వదులుకున్నాననని, చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా సరే ఆఫర్ను రిజెక్ట్ చేసినట్లు చెబుతూ ఛార్మీ ఎమోషనల్ అయ్యింది. -
రూ. 2 కోట్లు ఇస్తే రిటర్న్ పంపించాడు: విజయ్పై పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం ఎక్కడ చూసిన లైగర్ మూవీ జోరు కనిపిస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. దీంతో చిత్ర బృందం ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల వరంగల్లో నిర్వహించిన లైగర్ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో దర్శకుడు పూరీజగన్నాథ్ మాట్లాడుతూ.. విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. తన భార్య లావణ్య చెప్పడం వల్లే అర్జున్ రెడ్డి సినిమా చూశానన్నాడు. చదవండి: గుడ్న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్, బేబీ బంప్తో సర్ప్రైజ్ ‘‘అర్జున్ రెడ్డి చూసిన నా భార్య కొత్త దర్శకులు వస్తున్నారు. మంచి సినిమాలు చేస్తున్నారు. నువ్వు వెనుకబడిపోతున్నావ్. ఎవరో సందీప్ రెడ్డి వంగా అట. కొత్తగా వచ్చాడు. విజయ్ అనే యువ నటుడితో అర్జున్ రెడ్డి తీశాడు. చాలా బావుంది’ అని లావణ్య చెప్పడంతో ఆ సినిమా చూశా. 5 నిమిషాలయ్యే సరికి ఆ తర్వాత సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనిపించలేదు. కేవలం విజయ్ యాక్టింగ్పైనే నా ఫోకస్ నిలిచిపోయింది. అతడి నటనలో నిజాయితీ కనిపించింది. అతడితో ఎలాగైనా సినిమా చేయాలనుకున్నాను. అది లైగర్ ద్వారా తీరింది’’ అంటూ పూరీ చెప్పుకొచ్చాడు. అప్పుడే విజయ్తో తప్పుకుండ ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని అన్నాడు. చదవండి: బాలీవుడ్కు బాయ్కాట్ సెగ, మరో స్టార్ హీరోపై విరుచుకుపాటు అలాగే మూవీ షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర విషయాన్ని ఈ సందర్భంగా పూరీ పంచుకున్నాడు. లైగర్ మూవీ షూటింగ్ సమయంలో విజయ్కి రెండుసార్లు డబ్బులు పింపిస్తే అవి తిరిగి పంపించాడంటూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. ‘మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ నిర్మాతగా విజయ్కి ఓసారి కోటి రూపాయలను పంపించా. దానికి ఇప్పుడు వద్దని, ముందు సినిమా కోసం ఖర్చు చేయమని డబ్బు వెనక్కి పంపించాడు. మళ్లీ కొద్ది రోజులకు రూ.2 కోట్లు పంపిస్తే నాకు అప్పులు ఉన్నాయని తెలిసి అవి కట్టమని చెప్పాడు’ అని పూరీ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇలాంటి నటుడిని ఇంతవరకు తాను చూడలేదని, విజయ్లో ఎక్కడా పొగరు కనిపించదంటూ పూరీ ప్రశంసలు కురిపించాడు. -
విజయ్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న మైక్ టైసన్.. ఎంతంటే
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. చదవండి: హీరో కాకముందు విజయ్ దేవరకొండ ఏం చేశాడో తెలుసా? ప్రస్తుతం వరుస ప్రమోషన్స్తో మూవీ టీం ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. లైగర్ కోసం విజయ్ దేవరకొండ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం విజయ్ దాదాపుగా రూ. 35కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అనన్య పాండేకు మాత్రం కేవలం రూ. 3కోట్ల రూపాయాలే అప్పజెప్పారట. మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఈ సినిమాలో నటించిన మైక్ టైసన్కు విజయ్ కంటే ఎక్కువగా సుమారు రూ. 40కోట్ల వరకు రెమ్యునరేషన్ అందించినట్లు సమాచారం. -
'లైగర్'.. ఫుల్లీ లోడెడ్ మసాలా మూవీ : పూరి జగన్నాథ్
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ఆగస్టుల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరంగల్లోని హన్మకొండలో లైగర్ టీం ఫ్యాన్డమ్ టూర్ని నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ..హాయ్ వరంగల్., వర్షం పడుతున్నా తడిచిమరీ ఈ వేడుకకి విచ్చేసిన ప్రేక్షకులు, అభిమానులందరికీ లవ్ యూ. ఆగస్ట్ 25 విడుదలౌతుంది. కరణ్ జోహార్ గారికి స్పెషల్ థాంక్స్. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. అపూర్వ మెహతా మిగతా టీం అందరికీ థాంక్స్. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారికి కృతజ్ఞతలు. ఒక రోజు మా ఆవిడ తిట్టింది. ఎందుకంటే.. కొత్త కొత్త దర్శకులు వస్తున్నారు మంచి మంచి సినిమాలు తీసుతున్నారు.. నువ్వు వెనకపడిపోతున్నావ్.. సందీప్ రెడ్డి వంగా అనే డైరెక్టర్ వచ్చాడు. అర్జున్ రెడ్డి అనే సినిమా తీశాడు. నేను నా కూతురు మూడు సార్లు చూశాం., నువ్వూ చూడు'' అని చెప్పింది. అర్జున్ రెడ్డి చూశా. డైరెక్షన్ బావుంది.. సినిమా కూడా బాగానే వెళ్తుంది. కానీ 45 నిమిషాలు సినిమా చూసి ఆపేశా. కారణం.. సినిమాలో కుర్రాడిపై నా ద్రుష్టి ఆగిపోయింది. ఇంత నిజాయితీగా ఒక కుర్రాడు నటిస్తున్నాడని విజయ్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయా. అప్పుడే విజయ్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. విజయ్ లో నాకు నచ్చేది నిజాయితీ. లైగర్ లో ఎంత ఎలివేషన్ పెట్టినా కొంచెం పొగరు కూడా కనిపించదు. చాలా నిజాయితీగా చేశాడు. ఒక నిర్మాతగా విజయ్ కి కోటి రూపాయిలు ఇస్తే వద్దు ముందు సినిమా కోసం ఖర్చుపెట్టండని అంటాడు. తర్వాత రెండుకోట్లు పంపిస్తే.,,. మాకు అప్పులున్నాయని తెలిసి.. ముందు అప్పులు తీర్చమని తిరిగిపంపించేస్తాడు. ఈ రోజుల్లో ఇలా ఎవరంటారు ? హ్యాట్సప్ టు విజయ్. విజయ్ నాన్నగారు మా అబ్బాయిని ఒక కొడుకులా చూసుకొని మంచి సినిమా తీయ్ అన్నారు. కానీ విజయ్ నన్ను ఒక తండ్రిలా చూసుకొని నా కష్టాల్లో నాతో పాటు నిల్చున్నాడు. విజయ్ లాంటి హీరోని నేను చూడలేదు. మైక్ టైసన్ ని పట్టుకోవడానికి ఏడాది పట్టింది. ఆయన్ని ఈ సినిమాలోకి తీసుకొచ్చిన క్రెడిట్ ఛార్మికి దక్కుతుంది. మైక్ టైసన్ లాంటి లెజెండ్ తో కలసి పని చేసే అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఆయనతో సినిమా చేస్తామంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. అనన్య ఫైర్ బ్రాండ్. అద్భుతంగా నటిస్తుంది. రమ్యకృష్ణ గారు రెబల్ తల్లిగా కనిపిస్తారు. అమెది చాలా స్ఫూర్తిని ఇచ్చే పాత్ర. ఛార్మీ సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఏ కష్టాన్ని నా వరకూ తీసుకురానివ్వదు. సెట్ లో ఆమె ఏడ్చిన సందర్భాలు కూడా వున్నాయి. కానీ బయటికి చెప్పదు. ఛార్మీకి బిగ్ థాంక్స్. అలీతో చేసిన సినిమాలన్నీ హిట్టే. కష్టాల్లో సుఖాల్లో తోడుంటాడు. నాపై ప్రేమతో స్టేజ్ పై డ్యాన్స్ వేశాడు. రోనిత్ రాయ్, మకరంద్ దేశ్ పాండే, చంకీ పాండే, గెటప్ శ్రీను, వంశీ అందరూ ప్రేమతో చేసిన సినిమా ఇది. అజీమ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. భాస్కర భట్ల మంచి లిరిక్స్ రాశారు. సాగర్ సౌత్ మ్యూజిక్ చూసుకున్నారు. విష్ నటుడిగా తెలుసు. అతను రియల్ ఫైటర్. ఈ సినిమాలో బ్యాడ్ గాయ్ రోల్ ప్లేయ్ చేశాడు. మా కంపనీ సీఈవో కూడా. విష్ మా బలం. డివోపీ విష్ణు శర్మ, ఎడిటర్ జునైద్, ఆర్ట్ డైరెక్టర్ జానీ, అనిల్.. మా పీఆర్వో వంశీ- శేఖర్, లీగర్, మార్కెటింగ్ టీమ్స్ ,శ్రేయాస్ మీడియా శ్రీనివాస్.. అందరికీ కృతజ్ఞతలు. లైగర్ ఆగస్ట్ 25 న వస్తోంది. ఇది ఫుల్లీ లోడెడ్ మసాలా మూవీ. సినిమాని మీరంతా థియేటర్ లో చూడాలి' అని కోరారు. ఛార్మీ కౌర్ మాట్లాడుతూ.. ఐ లవ్ యూ వరంగల్. ఈవెంట్ చేయాలంటే నా ఫస్ట్ ఛాయిస్ వరంగల్. ఇక్కడ ఈవెంట్ జరిగితే సినిమా సూపర్ హిట్. చివరి క్షణంలో వేదిక మారింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు ఎంతో సహకారం అందించారు. లైగర్ గురించి చాలా మాట్లాడాలని వుంది. కానీ లైగర్ సక్సెస్ కొట్టి బిగ్ బాక్సాఫీసు నంబర్స్ క్రియేటి చేసిన తర్వాత అప్పుడు సక్సెస్ మీట్ లో మాట్లాడతాను. ఆగస్ట్ 25 వాట్ లాగా దేంగే'' అన్నారు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వరంగల్ లో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమం (ఫోటోలు)
-
డేటింగ్లో ఉన్నా.. కానీ ఆమెకు ఇష్టం ఉండదు: విజయ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సాన పనిలేదు. విడుదలకు ముందే ఆయన నటించిన లైగర్ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది. ఈనెల25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్లో పాల్గొంటున్న విజయ్ తాజాగా తన రిలేషన్షిప్ స్టేటస్పై ఓపెన్ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. 'నా పర్సనల్ లైఫ్ గురించి బయటపెట్టడం ఇష్టం ఉండదు. నటుడిగా పబ్లిక్ లైఫ్లో ఉండటం నాకు ఇష్టమే. కానీ పబ్లిక్లో ఫోకస్ కావడం ఆమెకు నచ్చకపోవచ్చు. అందుకే ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకోవడం లేదు ' అంటూ చెప్పుకొచ్చాడు దీంతో విజయ్ డేటింగ్లో ఉన్న అమ్మాయి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని తేలిపోయిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా విజయ్ స్టేట్మెంట్తో రష్మికతో డేటింగ్ రూమర్స్కి కూడా చెక్ పెట్టినట్లయ్యింది. -
Vijay Deverakonda: ఆయన కొట్టిన దెబ్బకు రోజంతా బాధపడ్డా
నటుడు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించింది. బాక్సింగ్ దిగ్గజం మైక్టైసన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా చిత్రం తమిళనాడు విడుదల హక్కులను స్టూడియో–9 సంస్థ అధినేత, నటుడు, నిర్మాత ఆర్.కె.సురేష్ పొందారు. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చెన్నైలోని ఓ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. నటుడు విజయ్ దేవరకొండ, నటి అనన్య పాండే, ఆర్కే సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్కే సురేష్ మాట్లాడుతూ.. అర్జున్రెడ్డి చిత్రం చూసిన తరువాత తాను విజయ్ దేవరకొండకు ఫ్యాన్ అయ్యానన్నారు. ఆయన అమేజింగ్ యాక్టర్ అని అన్నారు. అందుకే ఈ చిత్రాన్ని కొనుగోలు చేశానని తెలిపారు. ఇది మాస్ ఎంటర్టైనర్ అని, ప్రేమ సన్నివేశాలు ఉంటాయని నటి అనన్యపాండే పేర్కొంది. ఎంతో ప్రేమిస్తూ చిత్రం చేసినట్లు చెప్పారు. చదవండి: ('ఆర్ఆర్ఆర్' అని గూగుల్లో సెర్చ్ చేశారా? మీకో సర్ప్రైజ్ !) విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. లైగర్ చిత్రంలో తన పాత్రకు నత్తి ఉంటుందని తెలిపారు. అలా నటించడానికి చాలా కష్టపడ్డానని చెప్పారు. అయితే పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అన్నారు. తమిళంలో నోటా చిత్రం చేశానని.. తమిళ ప్రేక్షకులు మంచి చిత్రాలను ఆదరిస్తారని తెలిపారు. తమిళంలో వరుసగా నటించాలన్న ఆశ ఉందన్నారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్, వెట్రిమారన్, పా.రంజిత్ అంటే చాలా ఇష్టమని అన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి వారితో ఫోన్లో టచ్లో ఉన్నానని, త్వరలోనే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటించే అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నానన్నారు. మైక్టైసన్తో నటించే ముందు కాస్త టెన్షన్ పడ్డానన్నారు. అయితే నటించడం గొప్ప అనుభూతి ఇచ్చిందని తెలిపారు. ఆయన గ్రేట్ పర్సన్ అన్నారు. షూటింగ్లో ఆయన చెంపపై కొట్టిన దెబ్బకు నొప్పితో ఆ రోజంతా బాధపడ్డానని చెప్పారు. నటి రమ్యకృష్ణ సూపర్బ్ యాక్టర్ అని కొనిడాడారు. చిత్రంలో స్ట్రాంగ్ మదర్గా నటించారని చెప్పారు.