ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నెల 18న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు ఆఫీసు ముట్టడించిన అంగన్వాడీ వర్కర్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు మెమో జారీ చేసింది. ఈ నెల 21న ఐసీడీఎస్ స్పెషల్ కమిషనర్ చక్రవర్తి మెమో జారీ చేశారు.