శశికళ కుటుంబానికి సేవలు చేయాలా? | are we here to serve sasikala family, asks madhusudanan | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 10 2017 12:47 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

అన్నాడీఎంకే వ్యవస్థాపక సభ్యులలో ఆయనొకరు. పార్టీలో జయలలిత తర్వాత దాదాపు అంతటిస్థానంలో ఉన్న వ్యక్తి. అలాంటి పెద్దమనిషి తొలుత శశికళ ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. కానీ తర్వాత బయటకు వచ్చేసి పన్నీర్ సెల్వానికి బహిరంగంగా మద్దతు పలికారు. ఆయనే ఇ. మధుసూదనన్. పార్టీ ప్రిసీడియం చైర్మన్. శశికళ కుటుంబ సభ్యుల పెత్తనం భరించలేకే తాను అక్కడి నుంచి వచ్చేశానని, పన్నీర్ సెల్వానికి జరిగిన అవమానం రేపు తనకూ జరగొచ్చన్న అంచనాయే తనను బయటకు రప్పించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జయలలిత మరణం తర్వాత శశికళ స్వతంత్రంగా, గౌరవప్రదంగా పార్టీని నడిపిస్తారని తాను భావించాను గానీ.. క్రమంగా ఆమె కుటుంబ సభ్యులంతా పెత్తనం చేయడం మొదలుపెట్టారని ఆయన అన్నారు. దాన్ని తాను భరించలేకపోయానని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement