ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. శనివారం జరిగిన జంట బాంబు పేలుళ్లలో 61మంది దుర్మరణం చెందగా, 200మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు ఆ దేశ వైద్య, ఆరోగ్యశాఖ ధ్రువీకరించింది. స్థానిక మీడియా కథనం ప్రకారం కాబూల్లోని దహ్మజంగ్ సర్కిల్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించినట్లు సమాచారం.