పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కనిపిస్తోంది. వచ్చే 24 గంటల్లో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనుండగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.