కేంద్రమంత్రి జైరాం రమేష్కు సమైక్య సెగ | cabinet minister jairam ramesh faces samaikya fury in renigunta | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 26 2014 4:17 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

కేంద్రమంత్రి జైరాం రమేష్కు సమైక్య సెగ తగిలింది. తిరుపతి వచ్చిన ఆయనను బుధవారం రేణిగుంట చెక్పోస్ట్ సర్కిల్ వద్ద సమైక్యవాదులు అడ్డుకున్నారు. విభజన ద్రోహి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. దాంతో జైరాం రమేష్ తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. తెలంగాణపై కేంద్రం నియమించిన జీవోఎం సభ్యుడుగా ఉన్న జైరాం రమేష్ రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement