డ్రైవర్ నిద్రించడం వల్లే ప్రమాదం: డీఎస్పీ | driver-is-sleeping-at-that-time-says-dsp-ambika-prasad | Sakshi
Sakshi News home page

Jun 13 2015 9:22 AM | Updated on Mar 22 2024 10:55 AM

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జరిగిన ఘనకు డ్రైవర్ తప్పిదమే కారణమని రాజమండ్రి డీఎస్పీ అంబికాప్రసాద్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో క్రూజర్ డ్రైవర్ నిద్రపోయినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. మృతుల బంధువులకు సమాచారం అందిచినట్లు ఆయన తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ అంబికాప్రసాద్ వివరించారు. క్రూజర్ వాహనం ధవళేశ్వరం బ్యారేజీ పైనుంచి గోదావరిలో పడి 22 మంది చెందిన విషయం తెలిసిందే.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement