అతి వేగమే బస్సు ప్రమాదానికి కారణం | fatal accident in Krishna district, 10 killed, 32 injured | Sakshi
Sakshi News home page

Mar 1 2017 6:29 AM | Updated on Mar 22 2024 11:05 AM

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు గ్రామం వద్ద విజయవాడ– హైదరాబాద్‌ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున హృదయాలను ద్రవింపజేసిన దృశ్యం. దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు(ఏపీ02 టీసీ 7146) మంగళవారం ఉదయం 5.45 గంటల ప్రాంతంలో ముండ్లపాడు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా, మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రి, ఆంధ్రా ఆసుపత్రి, హెల్ప్‌ ఆసుపత్రిలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement