diwakar travels
-
దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్
-
దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, అనంతపురం : దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై కర్ణాటక లోకాయుక్తను ఆశ్రయించారు. జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్రెడ్డి ఫోర్జరీలపై లోకాయుక్తకు ఆధారాలు సమర్పించారు. జేసీకి సహకరించిన కర్ణాటక రవాణా శాఖ అధికారుల పాత్రపైనా ఫిర్యాదు చేశారు. ( డబ్బు తీసుకుంటే ఆస్పత్రి సీజ్ చేస్తా ) కర్ణాటక డీజీపీ, పలువురు మంత్రులకు వీరిపై ఫిర్యాదు చేశారు. కాగా, 2017లో బీఎస్-3 వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే దివాకర్ ట్రావెల్స్ నిషేధిత వాహనాలను నకిలీ పత్రాలతో రిజిస్టర్ చేయించింది. స్ర్కాప్ కింద కొనుగోలు చేసిన 33 బస్సులు, లారీలను కర్ణాటకలో నడుపుతోంది. -
దురుసు ప్రవర్తన, జేసీ ప్రభాకర్రెడ్డి అరెస్ట్
సాక్షి, అనంతపురం: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, లాక్డౌన్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. వైద్య పరీక్షల కోసం జేసీ ప్రభాకర్రెడ్డిని జీజీహెచ్కు తరలించారు. కాసేపట్లో గుత్తి కోర్టులో ఆయనను హాజరుపర్చనున్నారు. కాగా, వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్ రెడ్డి కండీషన్ బెయిల్పై గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, జేసీ విడుదల సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్ద ఆయన వర్గీయులు నానా హంగామా చేస్తూ కోవిడ్ నిబంధనలు కాలరాశారు. దీంతో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్, పవన్కుమార్ సహా 31 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: విడుదలైన 24 గంటల్లోపే జేసీపై మరో కేసు) మరోవైపు జేసీ, అస్మిత్లు కడప సెంట్రల్ జైలు నుంచి తాడిపత్రి వరకు అనుచరగణంతో ర్యాలీగా వచ్చారు. ఈ క్రమంలో జేసీ దళిత సీఐ దేవేంద్రను పబ్లిక్గా బెదిరించారు. దీంతో సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన జేసీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కడప నుంచి తాడిపత్రి వరకు లాక్డౌన్ నిబంధనలు జేసీ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు. జేసీ ప్రభాకర్రెడ్డిపై 506, 189, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. వీటితోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ 52 కింద కూడా జేసీపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ('పోలీసులంటే జేసీ బ్రదర్స్ కు ఎందుకంత చులకన') -
దళిత సీఐని పబ్లిక్గా బెదిరించిన జేసీ
సాక్షి, అనంతపురం: అక్రమ వాహనాల కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు గురువారం జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఇది జరిగిన 24 గంటల్లోపే వాళ్లిద్దరిపై మరో కేసు నమోదైంది. జేసీ విడుదల సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్ద ఆయన వర్గీయులు నానా హంగామా చేస్తూ కోవిడ్ నిబంధనలు కాలరాశారు. దీంతో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్, పవన్కుమార్ సహా 31 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు జేసీ, అస్మిత్లు కడప సెంట్రల్ జైలు నుంచి తాడిపత్రి వరకు అనుచరగణంతో ర్యాలీగా వచ్చారు. (వాహనాల కుంభకోణం; జేసీ కొత్త నాటకం ) ఈ క్రమంలో జేసీ దళిత సీఐ దేవేంద్రను పబ్లిక్గా బెదిరించారు. దీంతో సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన జేసీపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. కాగా కండీషన్ బెయిల్లో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్లు శుక్రవారం అనంతపురం వన్టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఐతో దురుసుగా ప్రవర్తించడంపై జేసీని పోలీసులు విచారిస్తున్నారు. ఆయనపై మరో నాలుగు కేసులు నమోదయ్యే అవకాశాలున్నందున ఎలాంటి అవాంచనీయ ఘర్షణలు చోటు చేసుకోకుండా తాడిపత్రి పరిసరాల్లో భారీగా పోలీసులు మెహరించారు. (జేసీ వర్గీయుల హంగామా.. నిలిచిన 108 అంబులెన్సు) -
దళిత సీఐని పబ్లిక్గా బెదిరించిన జేసీ
-
దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ చేస్తున్నట్లు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివరాంప్రసాద్ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 154 వాహనాలను అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. అందుకు సంబంధించిన 62 బస్సులు, లారీలను అనంతపురం జిల్లాలో ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన వాహనాలను ఎక్కడ దాచారన్న సమాచారంపై విచారణ కొనసాగిస్తున్నాం. నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్లపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. (కర్నూల్ పీఎస్లో ముగిసిన జేసీ విచారణ) కరోనా కట్టడికి చర్యలు రవాణాశాఖలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాము. అందులో భాగంగానే బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేశాము. ఎక్కువ మంది బయోమెట్రిక్ తాకటం వల్ల కరోనా సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఓటీపీ ద్వారా రవాణాశాఖ సేవలు పొందవచ్చు. అందుకోసమే ఓటీపీ విధానాన్ని అమల్లోకి తెచ్చిన ఆర్టీఏ అధికారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్లు,పర్మిట్లు జారీ వంటి 18 రకాల సేవలను ఓటీపీ ద్వారా అందించున్నట్లు శివరాంప్రసాద్ తెలిపారు. (నేరం అంగీకరించిన జేసీ ప్రభాకర్రెడ్డి!) -
నేరం అంగీకరించిన జేసీ ప్రభాకర్రెడ్డి!
సాక్షి, అనంతపురం : జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన అనుచరుడు చవ్వా గోపాల్రెడ్డి పోలీసు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. కస్టడీలో వారు వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించి నేర అంగీకారపత్రం.. ‘సాక్షి’ చేతికి చిక్కింది. అందులో ఏముదంటే.. స్క్రాప్ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ప్రభాకర్రెడ్డి చెన్నైకి చెందిన ముత్తుకుమార్ను సంప్రదించారు. నాగాలాండ్ ఆర్టీఏ బ్రోకర్ సంజయ్ ద్వారా వీరు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారు. నాగాలాండ్కు తీసుకెళ్లకుండానే అక్కడ మొత్తం 154 వాహనాల రిజిస్ట్రేషన్ చేయించారు.(మాకేం తెలీదప్పా..అంతా బ్రోకర్లే జేసినారు..) ఇలా బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా నమోదు చేయించారు. ఇందుకోసం ముత్తుకుమార్, సంజయ్లకు ప్రభాకర్రెడ్డిలకు భారీగా డబ్బులు చెల్లించారు. ఆ తర్వాత జేసీ అనుచరుడు నాగేంద్ర నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేశారు. వీటితోనే ఎన్ఓసీ తీసకున్నారు. ఈ మేరకు జేసీ ప్రభాకర్ నేరం అంగీకరించారు. ఇలా ఫోర్జరీ చేసిన పత్రాలతో తెలంగాణ, కర్ణాటకలలో 8 వోల్వో బస్సులు, లారీలు విక్రయించారు. మొత్తం అశోక్ లేలాండ్కు చెందిన 154 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి.. వాటిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు మార్చిన తీరు విస్మయం కలిగిస్తోంది.(మాజీ మంత్రి పితాని కుమారుడికి హైకోర్టు షాక్) ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డి బెయిల్ పిటిషన్లు తిరస్కరణ.. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డిలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. వారి బెయిల్ పిటిషన్లపై న్యాయమూర్తి సోమవారం వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారణ చేపట్టారు. బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన ఆయన.. వారి రిమాండ్ను ఈ నెల 27 దాకా పొడిగించారు. కాగా, ప్రస్తుతం ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డిలు కడప సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రభాకర్రెడ్డి అనుచరుడు చవ్వా గోపాల్రెడ్డి బెయిల్ పిటిషన్ను కూడా న్యాయమూర్తి తిరస్కరించారు. -
వాహనాల కుంభకోణం; జేసీ కొత్త నాటకం
‘జేసీ’....తన బస్సులాగే రూట్ మార్చాడు. తుక్కు వాహనాల కొనుగోలులో నకిలీలు జేసి జైలులో ఉన్న తండ్రీ, తనయులు జేసీ ప్రభాకర్రెడ్డి, జేసీ అస్మిత్రెడ్డిలు కేసు నుంచి తప్పించుకునేందుకు కొత్త నాటకానికి తెరలేపారు. ఈ కేసులో తమకేం తెలియదని.. బ్రోకర్ ద్వారా వాహనాలు కొనుగోలు చేశామని బుకాయిస్తున్నారు. అయితే తప్పుడు వ్యవహారంలో వారిద్దరూ తప్పించుకోలేరని..తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని అధికారులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: తుక్కు వాహనాల కొనుగోలు కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్రెడ్డిలు కేసుల నుంచి తప్పించుకునేందుకు కొత్త నాటకానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ఈ కేసుతో తమకు సంబంధం లేదని.. కేవలం బ్రోకర్ ద్వారా వాహనాలను కొనుగోలు చేశామని బుకాయిస్తున్నట్లు సమాచారం. మొత్తం 154 బీఎస్–3 వాహనాలను తప్పుడు రిజి్రస్టేషన్లతో బీఎస్–4 వాహనాలుగా రిజి్రస్టేషన్ చేయించడంతో పాటు పలువురికి విక్రయించిన కేసులో జేసీ ప్రభాకర్రెడ్డి ఆయన తనయుడు జేసీ అస్మిత్రెడ్డిలతో పాటు మరో నలుగురిపై 27 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై విచారణ సమయంలోనే జేసీ కొత్త నాటకానికి తెరతీసినట్లు తెలుస్తోంది. స్క్రాబ్ వాహనాల కుంభకోణంలో తమకేమీ తెలియదని బుకాయించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా తాము నమ్మిన బ్రోకర్లే ఈ వ్యవహారం నడిపారని కేసు నుంచి తప్పించుకునే యత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే నాగాలాండ్ కేంద్రంగా బీఎస్–3 వాహనాలను తప్పుడు సరి్టఫికెట్లతో బీఎస్–4గా మార్చడంతో పాటు ఏకంగా పోలీసు అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేశారు. అయితే, ఈ తప్పంతా తాము జేసీ ఆదేశాలతోనే చేసినట్లు ఇతర నిందితులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో జేసీ ప్రభాకర్రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్రెడ్డి తప్పించుకునే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఏ–1గా జేసీ ఉమారెడ్డి (జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి), ఏ–2గా జేసీ ప్రభాకర్రెడ్డి, ఏ–3గా నాగేంద్ర, ఏ–4గా బాబయ్య, ఏ–5గా జేసీ విజయ (జేసీ దివాకర్రెడ్డి సతీమణి), ఏ–6గా జేసీ అస్మిత్ రెడ్డి (జేసీ ప్రభాకర్రెడ్డి తనయుడు)పై అనంతపురం, తాడిపత్రి స్టేషన్లల్లో మొత్తం 27 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ వ్యవహారంలో వీరి పాత్రకు తగిన ఆధారాలతో పాటు సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయని...బుకాయింపులతో కేసు నుంచి తప్పించునే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదీ జరిగింది..! వాతావరణాన్ని కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా 2017 ఏప్రిల్ 1 నుంచి బీఎస్–3 వాహనాల రిజి్రస్టేషన్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో బీఎస్–3 వాహనాలను విక్రయించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన బీఎస్–3 వాహనాలను...నాగాలాండ్లో జేసీ ట్రావెల్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. మొత్తం 157 రవాణా వాహనాలను స్క్రాప్ కింద విక్రయించేందుకు ముందుకు రాగా... వీటిని తక్కువ ధరకు దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఈ విధంగా కొనుగోలు చేసిన వాహనాలను బీఎస్–4గా పేర్కొంటూ నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత వీటిని అనంతపురం రవాణాశాఖ కార్యాలయం ద్వారా ఎన్ఓసీ తీసుకుని దర్జాగా జిల్లాలో ఇష్టారాజ్యంగా తిప్పారు. కొద్ది మందికి కూడా కొత్త బీఎస్–4 వాహనాల కంటే కొంచెం తక్కువ ధరకు విక్రయించారు. అయితే, వీటిపై రవాణాశాఖ ఉన్నతాధికారులకు కాస్తా అనుమానాలు, ఫిర్యాదులు రావడంతో నాగాలాండ్కు వెళ్లి విచారణ ప్రారంభించారు. తీగలాగితే డొంక కదలగా... అక్రమంగా తిరుగుతున్న ఈ వాహనాలను ఎక్కడికక్కడ పట్టుకుని సీజ్ చేశారు. ఈ క్రమంలోనే జేసీ మరో ఎత్తుగడ వేశారు. విలువైన సామానులను తీసేసి.. కేవలం ఛాసీస్ మాత్రమే ఉంచి వాహనాలు అప్పగిస్తున్నారు. మరోవైపు తమను మోసం చేసి వాహనాలను విక్రయించారని పలువురు తాడిపత్రిలో ధర్నా చేయడంతో పాటు జేసీ ప్రభాకర్రెడ్డిపై కేసులు కూడా పెట్టారు. పక్కాగా ఆధారాలు ! వాస్తవానికి ఈ విధంగా బీఎస్–3 వాహనాలను...బీఎస్–4 వాహనాలుగా పేర్కొంటూ తప్పుడు రిజి్రస్టేషన్ జరిగిన వాహనాలకు ఎన్ఓసీ ఇవ్వడం సాధ్యం కాదని రవాణాశాఖ అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ వాహనాలను తాము రిజి్రస్టేషన్ చేస్తే తమకు ఇబ్బందులు తప్పవని, అందువల్ల తాము ఈ పనిచేయలేమని తేలి్చచెప్పినట్లు సమాచారం. అయితే, నాగాలాండ్లో రిజి్రస్టేషన్ చేసిన తర్వాత ఆర్సీలో బీఎస్–4 వాహనాలు అని పేర్కొన్నారని.. మీకేమీ ఇబ్బంది ఉండదంటూ వివిధ రకాలుగా రవాణాశాఖ అధికారులకు ఆశపెట్టి, బెదిరించి ఎన్ఓసీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మాత్రం ఎన్ఓసీ ఇచ్చిన రవాణాశాఖ అధికారులది తప్పంటూ జేసీ బ్రదర్స్ వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. అంతేకాకుండా తాము నేరుగా ఈ వాహనాలను కొనుగోలు చేయలేదని.. తప్పంతా బ్రోకర్లదేనని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మొత్తం వ్యవహారంలో వీరి పాత్ర స్పష్టంగా ఉండటంతో ఎన్ని నాటకాలు ఆడినా తప్పించుకునే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
జేసీ ప్రభాకర్రెడ్డికి పీటీ వారెంట్లు జారీ
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డికి రెండు కేసుల్లో జిల్లా కోర్టు శనివారం పీటీ వారెంట్లు జారీ చేసింది. తాడిపత్రి కేసుల్లో వారిద్దరికీ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. కడప సెంట్రల్ జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు.మరోవైపు నిషేధిత వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత విక్రయాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. తాడిపత్రిలో రవికుమార్ అనే ఆర్టీఏ బ్రోకర్ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల తయారీపై పోలీసులు అతన్ని ఆరా తీస్తున్నారు. నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ల చెలామణిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, జేసీ ట్రావెల్స్ ఫొర్జరీ కేసులో జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డికి అనంతపురం కోర్టు జూలై 1 దాకా రిమాండ్ పొడిగిస్తూ శుక్రవారం ఆదేశించింది. (చదవండి: జేసీ ప్రభాకర్రెడ్డికి రిమాండ్ పొడిగింపు) -
జేసీ ప్రభాకర్రెడ్డికి రిమాండ్ పొడిగింపు
సాక్షి, అనంతపురం : జేసీ ట్రావెల్స్ ఫొర్జరీ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డిలకు అనంతపురం కోర్టు జూలై 1 దాకా రిమాండ్ పొడిగించింది. ప్రస్తుతం కడప జైలులో ఉన్న ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డిలను పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు విచారణకు హాజరుపరిచారు. దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. రిమాండ్ పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.(చదవండి : జేసీ ట్రావెల్స్ కేసు.. కీలక విషయాలు) మరోవైపు ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డిలకు బెయిల్ ఇవ్వాలని అనంతపురం జిల్లా కోర్టులో వారి తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేశారు. అలాగే ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డిలను తమ కస్టడీకి అప్పగించాలని తాడిపర్తి పోలీసులు గుత్తి కోర్టులో పిటిషన్లో దాఖలు చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత విక్రయాలపై జేసీ వారి నుంచి వివరాలు సేకరించేందుకు అనుమతివ్వాలని పోలీసులు ఈ పిటిషన్లో కోరారు. -
నేడు మెజిస్ట్రేట్ ముందుకు జేసీ ప్రభాకర్రెడ్డి
సాక్షి, అనంతపురం: దివాకర్ రోడ్లైన్స్, బీఎస్ 3 వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలను వన్టౌన్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఆదివారం వన్టౌన్లో సీఐ ప్రతాప్రెడ్డి దాదాపుగా 40 వాహనాలకు సంబంధిన రిజిస్ట్రేషన్లపై లోతుగా విచారణ చేపట్టారు. వాహనాలను ఎక్కడ కొనుగోలు చేశారు? నాగాలాండ్లో ట్రక్కు వాహనాల కొనుగోలు, రిజిస్ట్రేషన్లు, తదితరాలపై తండ్రీకొడుకులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం మెజిస్ట్రేట్ ముందు మరోసారి వీరిద్దరినీ వన్టౌన్ పోలీసులు హాజరుపర్చనున్నారు. కస్టడీని పొడిగించాలని కోరనున్నట్లు సమాచారం. చదవండి: కస్టడీకి జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డి -
జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్లకు షాకిచ్చిన కోర్టు!
సాక్షి, అనంతపురం : జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ల బెయిల్ పిటిషన్ను గురువారం కోర్టు తిరస్కరించింది. ప్రభాకర్రెడ్డి, అస్మిత్లను రెండు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ ఇద్దరిపై మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. 154 బస్సులు, లారీల అక్రమ రిజిస్ట్రేషన్పై.. జేసీ దివాకర్రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్రెడ్డిని పోలీసులు విచారించారు. ( జేసీ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ ) కాగా, రెండు బస్సులకు సంబంధించి నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్తో ఎన్ఓసీ పొందిన కేసులో ఈ నెల 13న ఏ2 జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏ6 జేసీ అస్మిత్ రెడ్డిలకు మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిని వన్టౌన్ పోలీసులు వారిని కడప కారాగారానికి తరలించారు. గత సోమవారం జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిల బెయిల్కు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు దాఖలైంది. నేడు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు బెయిల్ పిటిషన్ను తిరష్కరించింది. ( మరో వివాదంలో జేసీ దివాకర్ రెడ్డి) -
జేసీ ప్రభాకర్ రెడ్డిపై పీటీ వారెంట్
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ అక్రమాల్లో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. అనంతపురం వన్టౌన్ పోలీసులు మూడు కేసులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలపై సోమవారం కోర్టులో పీటీ వారెంట్(క్రైం నెంబర్ 33) వేశారు. గతేడాది జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ తుక్కు కింద బీఎస్ 3 వాహనాలను కొనుగోలు చేశారు. తప్పుడు ఇన్వాయిస్లతో తుక్కు కింద కొనుగోలు చేసిన ఆ వాహనాలను నాగాలాండ్ రాజధాని కొహిమా.. అనంతపురం, ఇతర రాష్ట్రాల్లో బీఎస్ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతపురంలో రిజిస్ట్రేషన్ చేయించిన 80 వాహనాలపై రవాణాశాఖాధికారులు వన్టౌన్లో ఫిర్యాదు చేశారు. ఆ కేసులకు సంబంధించి వన్టౌన్ పోలీసులు కోర్టులో పీటీ వారెంట్ను వేశారు. తండ్రీ, కొడుకులు కడప కారాగారంలో ఉండగానే పోలీసులు పీటీ వారెంట్ నమోదు చేయడం చర్చనీయాంశమైంది. మెజిస్ట్రేట్ పీటీ వారెంట్పై విచారణ నేటికి(మంగళవారం) వాయిదా వేశారు. చదవండి: ‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు బెయిల్ దాఖలు.. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిల బెయిల్కు సంబంధించి సోమవారం ఆన్లైన్లో దరఖాస్తు దాఖలైంది. రెండు బస్సులకు సంబంధించి నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్తో ఎన్ఓసీ పొందిన కేసులో ఈ నెల 13న ఏ2 జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏ6 జేసీ అస్మిత్ రెడ్డిలకు మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ క్రమంలో వన్టౌన్ పోలీసులు వారిని కడప కారాగారానికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి బెయిల్ దరఖాస్తుపై విచారణను మెజిస్ట్రేట్ నేటికి వాయిదా వేశారు. చదవండి: జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పరీక్షలు -
అంతులేని అవినీతి..
-
40 ఏళ్ల నుంచి అక్రమంగా దివాకర్ ట్రావెల్స్ నిర్వహణ
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన జేసీ బ్రదర్స్ (జేసీ దివాకర్రెడ్డి– జేసీ ప్రభాకర్రెడ్డి) వ్యాపార సామ్రాజ్యమంతా అవినీతి, అక్రమమేనని తేలింది. గత తెలుగుదేశం పాలనలో మరీ చెలరేగిపోయారు. ట్రావెల్స్, ట్రాన్స్పోర్ట్, అసాంఘిక కార్యకలాపాలు, మాన్యం భూముల ఆక్రమణ తదితర వాటి ద్వారా గత ఐదేళ్లలో రూ.2900 కోట్ల మేర దోపిడీ సాగించారు. తాడిపత్రి: దివాకర్ ట్రావెల్స్ అక్రమాలు 2012లో వెలుగులోకి వచ్చాయి. అప్పటి రవాణా శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య మహబుబ్నగర్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దివాకర్ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఓ మహిళా ప్రయాణికురాలు ఇచ్చిన సమాచారం మేరకు రవాణా శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య స్వయంగా అధికారులతో కలిసి కర్నూలు – హైదరాబాద్ జాతీయ రహదారిలో తనిఖీలు నిర్వహించారు. దివాకర్ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సులో మొబైల్ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి.. ఆ బస్సును కూడా సీజ్ చేశారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్పై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించి అనుమతులు లేని బస్సులను పదుల సంఖ్యలో సీజ్ చేశారు. ఆదర్శ మున్సిపాలిటీలోనూఅంతులేని అవినీతి తాడిపత్రి మున్సిపాలిటీ పేరుకే ఆదర్శం.. కానీ ఆ ఆదర్శం మాటున అంతులేని అవినీతి చోటు చేసుకుంది. జేసీ సోదరులే కాకుండా వారి అనుచరులు సైతం తాడిపత్రి మున్సిపాలిటీని అడ్డుపెట్టుకొని రూ.200 కోట్లకు పైగా దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జేసీ ప్రభాకర్రెడ్డి బినామీగా వ్యవహరించిన ప్రధాన అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి పట్టణంలోని జేసీ నాగిరెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్లో మొదటి అంతస్తు టెండర్ దక్కించుకున్నాడు. మొదటి అంతస్తుకు సంబంధించి రూ.2.73కోట్లు బకాయిలు మున్సిపాలిటీకి చెల్లించాలి. ఈ మొత్తం కాంప్లెక్స్ను వ్యాపారులకు సబ్లీజుకు ఇచ్చేశాడు. ఒక్కో వ్యాపారి నుంచి రూ.20 వేల నుంచి రూ.30 వేలు చొప్పున అద్దె వసూలు చేశాడు. ఈ కాంప్లెక్స్లో కనీసం 50 మంది వ్యాపారులు ఉంటారు. ఈ లెక్క ప్రకారం నెలకు రూ.10 లక్షలు నుంచి రూ.15 లక్షల ఆదాయం వచ్చేది. ఇదే కాంప్లెక్స్లో 64, 68 నంబర్ షాపులు కూడా ఎస్వీ రవీంద్రారెడ్డి దక్కించుకున్నారు. వీటికి రూ.3.52 లక్షలు గుడ్విల్, రూ.3.33 లక్షలు బాడుగల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ దుకాణాల లీజును మున్సిపల్ అధికారులు రద్దు చేశారు. అయినా ఈ దుకాణాలు లీజుకు ఇచ్చి ప్రతినెలా భారీగా అద్దె వసూలు చేశాడు. గత ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగించాడు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్లో 64, 76, 68, 62 నంబర్ షాపులను కూడా ఎస్వీ రవీంద్రారెడ్డి దక్కించుకున్నాడు. వీటికి రూ.2 వేల చొప్పున మాత్రమే అద్దె చెల్లిస్తున్నారు. వ్యాపారులకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సబ్లీజుకు ఇచ్చారు. రెండు కాంప్లెక్స్లోని అద్దెలు రవీంద్రారెడ్డి వసూలు చేసినా, ఈ డబ్బులు తిరిగి జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటికి చేరినట్లు సొంత పార్టీ నేతలే చెబుతుండడం గమనార్హం. నిజాయతీ అధికారికి బదిలీనే బహుమానం మైనింగ్ విజిలెన్స్ ఏడీగా ప్రతాప్రెడ్డి 2015 ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రిలో జరుగుతున్న గ్రానైట్ మాఫియా అక్రమాలు చూసి ఆయన షాక్కు గురయ్యారు. గ్రానైట్ దందాపై ఉక్కుపాదం మోపారు. 2015కు ముందు ఏటా కోటి రూపాయలు కూడా ఫెనాల్టీ రూపంలో వచ్చేవి కావు. కానీ 2015–16లో రూ.5.40 కోట్లు, 2016–17లో రూ.5.55 కోట్లు రాబట్టారు. ఈ జరిమానాలను బట్టి అక్కడ దందా ఏ స్థాయిలో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. తమకు ప్రతిబంధకంగా మారుతున్న ప్రతాప్రెడ్డిని బదిలీ చేయించాలని చూశారు. చివరకు చంపుతామంటూ బెదిరింపులకు కూడా దిగారు. దీంతో గ్రానైట్ మాఫియాతో తనకు ముప్పు ఉందంటూ మైనింగ్ విజిలెన్స్ డైరెక్టర్కు ప్రతాప్రెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పీఏ రవీంద్రారెడ్డితో పాటు గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు, నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత ప్రతాప్రెడ్డిని ఇక్కడి నుంచి ఆ మాఫియానే బదిలీ చేయించి తమ అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగించింది. అధికారాన్నీ అడ్డుపెట్టుకుని గ్రానైట్ మాఫియా ద్వారా రూ. 200 కోట్లకు పైగా ఆర్జించారన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. మాఫియా జోక్యం లేక ముందు ఈ ప్రాంత గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు ప్రతి నెలా రూ.9.5 కోట్ల మేర విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. అంటే పరిశ్రమలు ఎంత బాగా నడిచాయో ఈ బిల్లులను చూస్తే తెలిసేది. మాఫియా జోక్యంతో పరిశ్రమలు కాస్తా చీమకుర్తి, మాటూరు, చిత్తూరు, కర్నూలు, ఒంగోలు తదితర ప్రాంతాలకు తరలిపోయాయి. దీంతో ప్రస్తుతం రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లు మాత్రమే కరెంటు బిల్లులు వస్తున్నాయి. అంటే గ్రానైట్ పరిశ్రమలు భారీగా మూతపడ్డాయి. తద్వారా రూ.2,500 కోట్లు గ్రానైట్ పరిశ్రమకు నష్టం వాటిల్లింది. ట్రాన్స్పోర్ట్ ద్వారా రూ.300 కోట్లు ఆర్జాస్ స్టీల్ప్లాంట్ కోసం హుసేన్పురం, జంబులపాడు, చల్లవారిపల్లి, వీరాపురం గ్రామాల ప్రజలు దాదాపు రెండు వేల ఎకరాల వరకు తమ భూములను స్వాధీనం చేశారు. వీరు లారీలు, ఇతర మార్గాల ద్వారా ఈ ప్లాంటుపై ఆధారపడి జీవించే వారు. అయితే దివాకర్ రోడ్లైన్స్, ట్రాన్స్ ఇండియా పేరుతో జేసీ బ్రదర్స్ సొంతంగా ట్రాన్స్పోర్టు ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జేసీ బ్రదర్స్ ట్రాన్స్పోర్ట్ను కాదనే ధైర్యం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఉండేది కాదు. దీంతో తొలి ప్రాధాన్యత జేసీ వారికే ఇస్తూ వచ్చేవారు. అయితే ఇందుకు సంబంధించిన బిల్లులను జేసీ బ్రదర్స్ ట్రాన్స్పోర్టు పేరు మీద కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్ పేరుపై చేయిస్తూ ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతున్నట్లు సమాచారం. లారీలపై జేసీపీఆర్ అని ఉంటుంది. బిల్లులు మాత్రం ఆయన పేరుతో ఉండవు. మొత్తం బినామీ లెక్కలే. ఈ లారీలు మినహా ఇతర లారీలు స్టీల్ప్లాంట్లోకి వెళ్లేందుకు వీల్లేదు. ఇలా ఐదేళ్లలో ట్రాన్స్పోర్ట్ ద్వారా రూ.300 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. డ్రై స్లాగ్ ద్వారా నెలకురూ.15కోట్ల ఆదాయం ఆర్జాస్ స్టీల్ ప్లాంట్లో డ్రై స్లాగ్ను టన్ను రూ.10తో ఇక్కడి టీడీపీ నేతలు కొనుగోలు చేసేవారు. దీనిని అల్ట్రాటెక్ సిమెంట్, సాగర్ సిమెంట్ పరిశ్రమలకు తరలించి టన్ను రూ.850 చొప్పున విక్రయిస్తారు. ట్రాన్స్పోర్టు, ఇతర ఖర్చుల కింద రూ.250 పోగా రూ.600 మేర మిగులుతుండేది. ప్రతి నెలా 25వేల టన్నులకు పైగా డ్రైస్లాగ్ను ఈ స్థాయిలో తరలించే వారు. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.750 కోట్లకు పైగా ఆదాయం గడించినట్లు తెలుస్తోంది. అన్ని రూట్లకూ ఒకటే పర్మిట్ జేసీ సోదరులు అధికార బలంతో రవాణా శాఖ అధికారులను గుప్పిట్లో పెట్టుకొని ఒక పర్మిట్ నంబర్పైనే పలు రూట్లలో అనధికారికంగా బస్సులు నడుపుతూ వచ్చారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ల నిర్వహణపై నిఘా అధికమైంది. దీనికి తోడు దివాకర్ ట్రావెల్స్కు చెందిన బస్సులు తరచూ ప్రమాదాలకు గురయ్యేవి. ఈ ట్రావెల్స్ అక్రమాలపైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన రవాణా శాఖ అధికారులు అనుమతులు లేకుండా తిరుగుతున్న బస్సులన్నింటినీ ఎక్కడికక్కడ సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. రాజకీయ అవసరాలకు మట్కా డాన్ సహకారం తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ రాజకీయ అవసరాలకు మట్కా డాన్ రషీద్ స్పాన్సర్గా వ్యవహరించేవాడు. నియోజకవర్గంలోని నేతలకు పెద్ద మొత్తంలో కానుకలను ఆయన అందజేసేవాడు. ప్రజాప్రతినిధులు కార్లు కొనుగోలు చేస్తే వాటికి నెలవారీ కంతులు కూడా రషీద్ చెల్లించేవాడని తెలిసింది. మట్కా నిర్వహణకు పోలీసుల నుంచి ఇబ్బందులు రాకుండా కప్పం రూపంలో స్థానిక నేతలకు రషీద్ నజరానాలు ఇచ్చేవాడు. 2018 డిసెంబర్ 30న వైఎస్సార్ జిల్లాకు చెందిన సీఐ హమీద్ఖాన్తో పాటు పోలీసులపై దాడి చేసి వారి వాహనాన్నే తగులబెట్టి సవాల్ విసిరే స్థాయికి ఎదిగాడంటే అతని వెనుక ఉన్న వ్యక్తి ఎవరనేది తాడిపత్రిలోని ఏఒక్కరినీ అడిగినా తెలుస్తుంది. మాన్యాన్నీ వదలని జేసీ సోదరులు పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరులో పప్పూరమ్మ ఆలయానికి దాదాపు 19 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. ఈ భూముల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఆలయంలో ధూపదీప నైవేద్యాలు, నిత్య కైంకర్యాలు చేస్తుండేవారు. అయితే తాడిపత్రి – పెద్దపప్పూరు ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ భూములను మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి కబ్జా చేసి పంట సాగు చేపట్టారు. రెండు పెద్ద ఫారంపాండ్లు ఏర్పాటు చేయించి బోరుబావుల నీటితో వాటిని నింపారు. ఈ నీటితో మాన్యం భూముల్లో కరివేపాకు, అరటి సాగు చేశారు. పంట దిగుబడుల ద్వారా రూ.లక్షలు ఆర్జిస్తున్నా ఆలయంలో పూజలకు కనీసం ఒక్క పైసా కూడా చెల్లించలేదనే ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం ఈ విషయంపై విచారణకు వచ్చిన దేవదాయ శాఖ అధికారలు ఆ భూములన్నీ జేసీ దివాకర్రెడ్డి అధీనంలో ఉన్నాయని తెలుసుకుని నోరు మెదపకుండా వెళ్లిపోయారు. మూడు నెలల క్రితం అధికారులు వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. గ్రానైట్ మాఫియా తాడిపత్రిలో 850 వరకు గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి 70 లారీలతో 20 నుంచి 30 మంది ట్రాన్స్పోర్టర్లు గ్రానైట్ రాళ్లను చిత్తూరు, మడకశిర, కర్నూలు ప్రాంతాల నుంచి తీసుకువస్తుంటారు. ఒక లోడు గ్రానైట్ను క్వారీ నుంచి తాడిపత్రికి చేరాలంటే రూ.45 వేల నుంచి రూ.50 వేలు రాయల్టీ చెల్లించాలి. అయితే రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్ చేర్చేలా క్వారీ యాజమాన్యం తాడిపత్రి పాలిష్ మిషన్ వ్యాపారుల మధ్య కుదిరిన ఒప్పందం మాఫియాను తలపించింది. లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణాన్ని తగ్గించి బిల్లులో చూపించి రవాణా చేసేవారు. ఒకే బిల్లుతో 5 – 6 లోడ్లు రవాణా చేస్తుండేవారు. ఈ డబ్బులు మొత్తం మాఫియాను నడిపే ఓ పెద్దమనిషి ఇంటికి చేరవేసేవారు. అక్కడ వాటాల పంపకం జరుగుతుండేది. -
ఎన్ఓసీల కోసం బరితెగించిన దివాకర్ ట్రావెల్స్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అక్రమాలే పెట్టుబడిగా.. అధికారమే అరాచకంగా ఇన్ని రోజులుగా వ్యవహరిస్తున్న జేసీ బ్రదర్స్ పాపాలపుట్ట ఒక్కొక్కటిగా పగిలిపోతోంది. ఇప్పటికే పర్మిట్లు లేకుండా బస్సులను ఇష్టారాజ్యంగా తిప్పిన దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం.. ఏకంగా పోలీసు సంతకాలనే ఫోర్జరీ చేసి నిరంభ్యంతర సర్టిఫికెట్(ఎన్ఓసీ) పత్రాలు సృష్టించింది. వీటితో లారీలను విక్రయించిన ఘటన బయటపడి 24 గంటలు కూడా గడవకముందే మరో ఫోర్జరీ బాగోతం వెలుగులోకి వచ్చింది. తాజాగా తాడిపత్రి ఎస్ఐ సంతాకాన్ని ఫోర్జరీ చేసి.. రవాణా శాఖకు దరఖాస్తు చేసుకుని ఎన్ఓసీ తీసుకోవడం ద్వారా తెలంగాణలో రెండు బస్సులను విక్రయించారు. ఈ వ్యవహారాన్ని గుర్తించిన రవాణాశాఖ అధికారులు సదరు యాజమాన్యంపై అనంతపురం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కథ నడిపించారిలా.. దివాకర్ ట్రావెల్స్కు చెందిన లారీలు, బస్సులకు సంబంధించిన రికార్డుల్లో అక్రమాలు భారీగా జరిగినట్టు తెలుస్తోంది. దీంతో వీటి విక్రయానికి దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం అడ్డదారులు తొక్కినట్టు అర్థమవుతోంది. ఈ ట్రావెల్స్కు చెందిన ఆరు లారీలను బెంగళూరులో విక్రయించారు. ఇందుకోసం స్థానిక పోలీసుల నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, రికార్డులన్నీ నకిలీవి కావడంతో అడ్డదారుల్లో పోలీసు సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ స్టాంపులను తయారుచేసి పోలీసుల నుంచి ఎన్ఓసీ తీసుకున్నారు. తద్వారా ఎన్ఓసీ ఉన్నట్టు చూపించి లారీలను బెంగళూరులో విక్రయించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. అయితే, లారీలతోపాటు రెండు బస్సులను(ఏపీ02టీసీ9666, టీఎస్09యుబీ7034) కూడా ఇదే విధంగా పోలీసు సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ స్టాంపులతో రవాణా శాఖకు ఎన్ఓసీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. అనంతరం వీటిని తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం విక్రయించింది. అయితే, తమకు దరఖాస్తు చేసింది ఫోర్జరీ డాక్యుమెంట్లు అని గుర్తించిన రవాణాశాఖ అధికారులు అనంతపురం 1వ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు మొత్తం దివాకర్ ట్రావెల్స్కు సంబంధించిన వాహనాల రికార్డుల్లో అక్రమాలు జరిగాయని.. వీటిపై లోతైన విచారణ జరపాలంటూ ఉన్నతాధికారులకు కొందరు ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆ మేరకు రవాణాశాఖ ఉన్నతాధికారులు అక్రమాలను వెలికితీసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరింత లోతుగా.. ఇప్పటికే పర్మిట్లు లేని వ్యవహారంతో పాటు ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీలో దివాకర్ ట్రావెల్స్ వ్యవహారం బయటపడింది. ఇక ఏకంగా అసలు రవాణాశాఖ నుంచి ఉన్న బస్సులకు కూడా పర్మిట్లు తీసుకున్న వ్యవహారంలో మొత్తం ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కూడా రవాణాశాఖ ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం ట్రావ్సెల్ బస్సులకు సమర్పించిన వివిధ డాక్యుమెంట్లన్నీ కూడా నకిలీవేనన్న ఫిర్యాదులు రవాణాశాఖ ఉన్నతాధికారులకు చేరాయి. దీంతో ప్రధాన కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులు జిల్లాకు విచ్చేసి మొత్తం అక్రమ వ్యవహారాలను లాగే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమాల మొత్తం లోగుట్టును ఒకటి రెండు రోజుల్లో రవాణాశాఖ అధికారులు బయటపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే దివాకర్ ట్రావెల్స్పై సీరియస్ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ అక్రమ వ్యవహారాల్లో వెనుక నుంచి ఇన్నాళ్లుగా కథ నడిపించిన జేసీ బ్రదర్స్ దోషులుగా చట్టం ముందు నిలవాల్సిన పరిస్థితి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం వేధిస్తోందన్న వ్యాఖ్యలను జేసీ చేస్తున్నట్టు తాజా ఘటనలతో అర్థమవుతోంది. -
జేసీపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్
సాక్షి, తాడిపత్రి : గడిచిన సార్వత్రిక ఎన్నికలలో ఘోర ఓటమిని చవిచూసిన మాజీ ఎంపీ జేసి దివాకర్రెడి మతిస్థిమితం కోల్పోయి పోలీసు వ్యవస్థ, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. గన్నెవారిపల్లెకాలనీలో ఆదివారం వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసు వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ అనంతపురం రూరల్ స్టేషన్లో కొన్ని గంటల పాటు వేచి ఉన్నందుకే పోలీసులు, ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో హత్యా రాజకీయాలు చేసి నియోజకవర్గ ప్రజలు, రైతు కుటుంబాలకు చెందిన పలువురిని అదే పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని స్టేషన్లు, జైలుకు పంపి కక్ష తీర్చుకున్న గత చరిత్రను మరచిపోయావా జేసి అని ప్రశ్నించారు. చదవండి: బీజేపీ మన పార్టీయే అంటున్న జేసీ పోలీసు వ్యవస్థను అతి నీచంగా మాట్లాడి, తప్పు చేసిన నీపై కేసు నమోదు చేయడం అందుకు సంబంధించి విధులు నిర్వర్తించటం పోలీసుల బాధ్యతని తెలియకపోవడం విచారకరమన్నారు. చట్టం అందరికీ సమానమేనని, తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందే తప్ప, అందులో ఎలాంటి కక్షపూరిత చర్యలకు తావుండదన్నారు. మీ హయాంలో పోలీసులు మీకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఇప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అలానే వ్యవహరిస్తారనుకుంటున్నారని, అలాంటి ఆటలు ఇక సాగవన్నారు. వైఎస్సార్సీపీలోకి తనను ఆహ్వానిస్తున్నారు. అని జేసీ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని, నీలాంటి నీచ రాజకీయ నాయకులకు ఎన్నటికీ తమ పార్టీలో చోటు దక్కదన్నారు. ప్రజల సంక్షేమం కోసం తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి నిత్యం పాటు పడుతున్నాడని, అందులో భాగంగానే నాయకులదరం ప్రజల కోసం పని చేస్తున్నామని తెలిపారు. కక్ష సాధింపెలా అవుతుంది? అక్రమంగా బస్సులను తిప్పుతున్న నీ ట్రావెల్స్పై ట్రాన్స్ పోర్ట్ అధికారులు చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు చర్యలు అని ఏ విధంగా చెప్పగలగుతావు. అన్ని ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉంటే అధికారులు బస్సులపై ఎందుకు చర్యలు తీసుకుంటారు. అక్రమంగా బస్సులను తిప్పుతున్నావు కనుకే బస్సులను అధికారులు సీజ్ చేస్తున్నారన్నారు. బస్సులకు ఇన్సూరెన్సు సైతం చెల్లించకుండా ఉన్నది వాస్తవం కాదా అన్నది బహిర్గతం చేయాలన్నారు. ఈ విషయమై తాను బహిరంగ చర్చకు సిద్ధమేనని ఎమ్మెల్యే మాజీ ఎంపీ జేసీకి సవాల్ విసిరారు. పోలీసులు ఆలోచించాలి ప్రబోధానంద ఆశ్రమం పైదాడి చేసేందుకు దాదాపు 500 మంది కార్యకర్తలను వెంటబెట్టుకొని వెళ్లి అల్లర్లు సృష్టించిన కేసులో ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదో పోలీసులు ఆలోచించాలన్నారు. పట్టణ పోలీస్స్టేషన్ గేటుకు తాళాలు వేసి ఓ సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీ స్థాయి అధికారిని దూషించిన ఈ విషయమై జేసీపై పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. -
మాజీ ఎంపీ జేసీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రవాణా శాఖ అధికారులు మంగళవారం జరిపిన తనిఖీల్లో ఐదు జేసీ ట్రావెల్స్ బస్సులు పట్టుబడ్డాయి. ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లు లేకపోవడంతో అధికారులు ఈ బస్సులను సీజ్ చేశారు. అనంతపురం డీటీసీ శివరాంప్రసాద్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. తాజా దాడులతో ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లలో అక్రమాలు కారణంగా మొత్తం 36 బస్సులు.. 18 కాంట్రాక్టు బస్సులను అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించిన జేసీ బ్రదర్స్ సరైన పర్మిట్లు లేకుండా బస్సులు నడపటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
దివాకర్ ట్రావెల్స్..రాంగ్రూట్లో రైట్రైట్
ఆయనో పెద్ద మనిషి. మైకు దొరికితే నీతులు చెబుతుంటారు. ముఖ్యమంత్రులు, ప్రధానులకు సైతం సలహా ఇచ్చే రీతిలో వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ ఆయన బిజనెస్ మొత్తం అడ్డదారిలో సాగుతోంది. కొన్నేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ ట్రావెల్స్ బస్సుల ద్వారా రూ. కోట్లు కొల్లగొట్టారు. అన్నాతమ్ముడు ఏకమై పాతికేళ్లుగా ప్రైవేటు ట్రావెల్స్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతూ ఎన్నో ప్రాణాలు తీశారు. మరెంతో మందిని క్షతగాత్రులుగా మిగిల్చారు. అందుకే ఆ బస్సు చూస్తే చాలు జనం మృత్యుశకటమొచ్చనంటూ పరుగులు తీస్తున్నారు. సాక్షి, అనంతపురం: మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిలకు చెందిన దివాకర్ ట్రావెల్స్...జిల్లాలోనే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసులు నడుపుతోంది. కానీ అన్నీ అడ్డదారిలోనే...పర్మిట్ ఓ రూట్లో తీసుకుని...మరో రూట్లో బస్సులు నడుపుతారు. కొన్నింటికి అసలు పర్మిటే ఉండదు. ఇలా అడ్డదారిలో అడ్డంగా తిరుగుతున్న ట్రావెల్స్పై ఇటీవల రవాణాశాఖ అధికారులు నిఘా వేశారు. ఆకస్మిక తనిఖీలు చేయగా.. ట్రావెల్స్ గుట్టు రట్టయ్యింది. ఇటీవల రోడ్డు రవాణాశాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించారు. ఈ క్రమంలో జిల్లాలోనూ ఉపరవాణా కమిషనర్ శివరామప్రసాద్ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయిన అధికారులు ఈనెల 16న వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. తొలిరోజు 8, మరుసటి రెండు బస్సులను సీజ్ చేశారు. జిల్లాలో సీజన్ చేసిన వాటిలో 8 బస్సులు దివాకర్ ట్రావెల్స్వే కావడం గమనార్హం. ఇలా అనంతపురంలో 4, గుంతకల్లులో 3, పెనుకొండలో ఒక దివాకర్ బస్సును సీజ్ చేశారు. రవాణాశాఖ నిబంధనలను తుంగలోకి తొక్కి బస్సులు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతా అడ్డదారిలోనే... ఇంటర్స్టేట్ క్యారేజ్ అనుమతులు తీసుకొని జిల్లా వ్యాప్తంగా మొత్తం 196 ప్రైవేటు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. స్టేజ్ క్యారెజ్ అనుమనుతులు తీసుకున్న ప్రైవేటు ట్రావెల్స్ రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోనే ఉండటం గమనార్హం. అనంతపురం టూ బెంగుళూరు, అనంతపురం టూ బళ్లారి, అనంతపురం టూ చెళికర, అనంతపురం టూ హైదరాబాద్ సర్వీసుల పేరుతో పలు ట్రావెల్స్కు చెందిన బస్సులు తిరుగుతున్నాయి. ఒక పర్మిట్తో రెండు, మూడు బస్సులు ఇంటర్ స్టేజ్ వ్యవహారం వెనుక భారీ అక్రమాలు జరుగుతున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ అనుమతులు తీసుకున్నది ఒక రూట్ అయితే.. మరో రూట్లో బస్సులు తిప్పితున్నారు. కొన్నింటికి గడువు మీరిపోయినా అలాగా కొనసాగిస్తున్నారు. మరికొందరు అనుమతి ఒక బస్సుపై ఉంటే.. రెండు మూడు బస్సులు అదనంగా తిప్పుతున్నారు. ఇందులో దివాకర్ ట్రావెల్స్ బస్సులు కూడా మినహాయింపేమి కాదు. ఇటీవల అధికారులు సీజ్ చేసిన 8 దివాకర్ బస్సుల్లో రెండింటికీ పూర్తిగా అనుమతి లేకపోవడం, మరికొన్నింటిలో నిబంధనలకు విరుద్ధంగా సీటింగ్ కెపాసిటీ పెంచి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మరికొన్నింటిలో డ్రైవర్లు, కండెక్టర్లకు లైసెన్స్లు లేనట్లు అధికారులు గుర్తించారు. దీంతో (ఏపీ02టీహెచ్4220, ఏపీ02టీఈ2196, ఏపీ02టీసీ3969, ఏపీ02టీఏ6373, ఏపీ02టీఈ0135, కేఏ01ఏకే3929, కేఏ34ఏ0987, కేఏ34ఏ8874) సీజ్ చేసినట్లు రవాణాశాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వానికి రూ.కోట్లలో గండి... ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అనుమతులు లేకుండా తిరుగుతుండడంతో పాటు అనుమతి లేని రహదారులపై కూడా దర్జాగా రాకపోకలు సాగిస్తున్నాయి. తాజాగా రవాణాశాఖ అధికారుల దాడులతో బట్టబయలు అయిన వ్యవహారం జిల్లాలో కొన్నేళ్ల నుంచి జరుగుతున్నా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ట్రావెల్స్ దందా కొనసాగించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పనిచేసిన రవాణాశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు. రహదారులపై అడ్డదారిలో తిరగడమే కాకుండా ఏపీఎస్ ఆర్టీసీకి నష్టం కలిగించేలా కొన్ని రూట్లలో అతివేగంతో రాకపోకలు సాగిస్తూ అనేక మంది ప్రజల ప్రాణాలను కూడా జేసీ ట్రావెల్స్ బస్సులు తీశాయి. ఇటీవల రవాణా శాఖ అధికారులు సీజ్ చేసిన దివాకర్ ట్రావెల్స్ బస్సులు 8 2017 నవంబర్ 3న ఆత్మకూరు సమీపంలోని వడ్డుపల్లి వద్ద వేగంగా వచ్చిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చిన బొలొరో వాహనాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో ‘ఆత్మ’ డీపీడీ రమణ ప్రాణాలు కోల్పోయారు. 2017 సెప్టెంబర్లో ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లెకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని కామారుపల్లివద్ద దివాకర్ బస్సు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సదరు ట్రావెల్స్ నిర్వాహకులు ఆస్పత్రి ఖర్చులు కూడా చెల్లించకపోవడంతో బాధితుడు గ్రామస్తుల సాయంతో ధర్నా చేశాడు. ఇలా గత నాలుగేళ్లలో దివాకర్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, చాలా మంది క్షతగాత్రులుగా మిగిలి జీవచ్ఛవాల్లో బతుకుతున్నారు. ప్రమాదాలకు కారణమైన బస్సులకు అనుమతి లేనట్లు గుర్తించినా.. అప్పటి రవాణాశాఖ అధికారులు చర్యలకు వెనుకంజ వేశారు. ఫిర్యాదుల మేరకే దాడులు నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాం. ఇందులో పదిబస్సులు పట్టుబడగా దివాకర్ ట్రావెల్స్కు చెందినవి 8 ఉన్నాయి. అనుమతులు లేకపోవడం, డ్రైవర్, కండెక్టర్లకు లైసెన్స్ లేకపోవడం, అక్రమంగా సీటింగ్ కెపాసిటీ పెంచి ప్రయాణికులను తరలిస్తుండడం తదితర కారణాలతో వాటిని సీజ్ చేశాం. ఈ దాడులు కొనసాగుతాయి. రోజూ 20 చొప్పున ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – శివరామప్రసాద్, ఉపరవాణా కమిషనర్ -
జేసీ దివాకర్ రెడ్డికి షాక్
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి రవాణా శాఖ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. దివాకర్ ట్రావెల్స్కు చెందిన 23 బస్సులను ఆర్టీఏ అధికారులు గురువారం సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడస్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు, జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలోని అధికారులు పలు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారంగా టికెట్ ధరలు వసూలు చేస్తున్న 23 బస్సులను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అంతేకాకుండా దివాకర్ ట్రావెల్స్కు చెందిన 23 ఇంటర్ స్టేట్ క్యారియల్ బస్సుల పర్మిట్లను కూడా రద్దు చేశారు. అదేవిధంగా నిబంధనలను అతిక్రమించినందుకు పలు కేసులు నమోదు చేశారు. అయితే దివాకర్ ట్రావెల్స్పై అనేక ఫిర్యాదులు వచ్చాయని అందులో భాగంగానే తనిఖీలు చేశామని, దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు వెల్లడించారు. -
అనంతపురం జిల్లాలో దివాకర్ ట్రావెల్స్లో చీరల తరలింపు పట్టివేత
-
దివాకర్ ట్రావెల్స్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన
సాక్షి, అమరావతి బ్యూరో : హైదరాబాద్ నుంచి విజయవాడకు టికెట్ బుక్ చేసుకున్న ఓ మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్ చేయి చేసుకున్న ఘటన మంగళవారం హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఆపై దారి పొడవునా తిడుతూ.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు గురిచేసిన వైనంపై ఆ ప్రయాణికురాలు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలు మేరకు.. విజయవాడకు చెందిన ఉప్పలపాడు లత తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె మంగళవారం విజయవాడకు వచ్చేందుకు అభీబస్ యాప్ ద్వారా దివాకర్ ట్రావెల్స్ బస్సులో టికెట్ బుక్ చేశారు. ఆ బస్సు కొండాపూర్ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే ఆ సమయానికి బస్సు అక్కడికి చేరుకోకపోవడంతో ఆమె మరో స్టేజ్ అయిన గచ్చిబౌలికి తన మిత్రుడి సాయంతో కారులో చేరుకున్నారు. అక్కడికి కూడా బస్సు సమయానికి రాకపోవడంతో అభీబస్కు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో వారు బస్సు డ్రైవర్తో మాట్లాడించే ప్రయత్నం చేయగా.. టోలిచౌక్ దాటిందని.. లక్డీకపూల్ రావాలని డ్రైవర్ సమాధానం చెప్పి ఫోన్ పెట్టేశాడు. లక్డీకపూల్కు చేరుకున్న లత అక్కడ బస్సు ఆపకపోవడంతో మెహదీపట్నం వరకు కారులో ఛేజ్ చేసి బస్సుకు అడ్డంగా నిలవగా.. బస్సు డ్రైవర్ ఆమెను పత్రికలో రాయలేని భాషలో తిట్టడం ప్రారంభించాడు. ఈ మాటలు బయట ఉన్న ఆమెకు వినిపించలేదు. బస్సు ఎక్కాక ఆమెతో పాటు అతని స్నేహితుడిని సైతం ఇదే పద్ధతిన తిడుతుండటంతో ఆమె డ్రైవర్పై చేయి చేసుకుంది. దీంతో డ్రైవర్ సైతం ఆమెపై చేయి చేసుకుని.. బూతులు తిట్టాడు. ఇదంతా బస్సులో ప్రయాణిస్తున్న కొందరు వీడియో కూడా తీశారు. ఇదే విషయంపై ఆమె 100కు ఫోన్ చేయగా వారు సూర్యరావుపేట పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఆమెతో ఫోన్ మాట్లాడి.. ఇక్కడ బస్సు ఆపితే అందరూ ఇబ్బంది పడతారని.. కాబట్టి మీరు విజయవాడకు వెళ్లాక అక్కడే కేసు నమోదు చేయాలని సూచించారు. ఆ తర్వాత ఆమె వీడియోను.. జరిగిన విషయాన్ని లత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పగా ఆమె బంధువులంతా గవర్నరుపేటలోని మమతా హోటల్ సమీపంలో బస్సు ఆగగానే డ్రైవర్, అతని సహాయకుడిపై విరుచుకుడి దేహశుద్ధి చేశారు. అనంతరం వారిద్దరితో ఆమె కాళ్లు పట్టించి క్షమాపణలు చెప్పించారు. ఇలాగే ఎవరితోనూ వ్యవహరించకూడదని డ్రైవర్కు బుద్ధి చెప్పినట్లు లత తండ్రి మీడియాకు వివరించారు. -
దివాకర్ ట్రావెల్స్ బస్సులో 45 బస్తాల చిల్లర నాణేలు
-
దూసుకెళ్లిన దివాకర్ ట్రావెల్స్..
-
దూసుకెళ్లిన దివాకర్ ట్రావెల్స్..
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపటంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి వద్ద సోమవారం జరిగింది. ప్రయాణికుల ప్రాణాలు అంటే ట్రావెల్స్ యాజమాన్యానికి లెక్కేలేదా అంటూ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి నిరసనగా ప్రయాణికులు దివాకర్ ట్రావెల్స్ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. డ్రైవర్ మద్యం సేవించి ట్రావెల్స్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యం ప్రమాదంపై ఏ విధంగానూ స్పందించలేదు. -
దివాకర్ ట్రావెల్స్ ఉల్లంఘనలకు పాల్పడింది
హైకోర్టుకు నీరబ్కుమార్ నివేదిక సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లా ముండ్ల పాడు వద్ద ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సు ఎటువంటి నిబంధలను ఉల్లంఘించలేదంటూ క్లీన్చిట్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఆగ్రహంతో దిగొచ్చిం ది. ఆ బస్సు విషయంలో దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం పలు ఉల్లంఘ నలకు పాల్పడిందని మంగళవారం హైకోర్టుకు నివేదించింది. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్కుమార్ స్వయంగా కోర్టు ముందు హాజరై ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. మోటారు ట్రాన్స్పోర్ట్ కార్మికుల చట్ట నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపారు. దివాకర్ ట్రావెల్స్ సహా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన మిగిలిన యాజమాన్యాలన్నింటికీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఉల్లంఘనలపై ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో తదుపరి విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది. -
అడ్డంగా దొరికిపోయిన ఏపీ సర్కార్
- దివాకర్ ట్రావెల్స్ ఉల్లంఘనకు పాల్పడలేదన్న ఏపీ - ఉల్లంఘనకు పాల్పడిందని నివేదిక ఇచ్చిన టీ సర్కార్ - దీంతో ఏపీ ప్రభుత్వ తీరుపై ధర్మాసనం అసంతృప్తి - దివాకర్ ట్రావెల్స్కు క్లీన్చిట్పై ఘాటు వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లా, ముండ్లపాడు వద్ద ఫిబ్రవరిలో ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సు నిబంధనలను ఉల్లంఘించ లేదంటూ క్లీన్చిట్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉమ్మడి హైకోర్టులో అడ్డంగా దొరికిపోయింది. దివాకర్ ట్రావెల్స్ కు ఏపీ ప్రభుత్వం క్లీన్చిట్ ఇస్తూ నివేదిక ఇవ్వగా, తెలంగాణ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నివేదిక ఇవ్వడంతో ఏపీ బండారం బట్టబయ లైంది. ఏపీ సర్కార్ తరఫున రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సుమితా దావ్రా దాఖలు చేసిన నివేదికలో పస లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. అలాగే కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చేందుకు నిరాకరించింది. మోటారు వాహన కార్మికుల చట్ట నిబంధనలను అమలు చేసే విషయంలో.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని ఏపీ సర్కార్ను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్టర్ చేసుకోకపోతే ఉల్లంఘన కాదా? మోటారు వాహన చట్ట నిబంధనలకు విరు ద్ధంగా ఉభయ రాష్ట్రాల్లో బస్సు ఆపరేటర్లు బస్సులు నడుపుతున్నా అధికారులు పట్టించు కోవడం లేదని, ఈ నేపథ్యంలోనే ముండ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిందంటూ న్యాయవాది కేవీ సుబ్బారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం, పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని ఉభయ రాష్ట్రాల రవాణా శాఖ, కార్మికశాఖ ఉన్నతాధికారులను ఆదేశిం చింది. ఈ ఆదేశాల మేరకు ఏపీ సర్కార్ తరఫున రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సుమి తా దావ్రా నివేదికను కోర్టు ముందుంచారు. ముండ్లపాడు వద్ద ప్రమాదం జరిగే సమయా నికి దివాకర్ ట్రావెల్స్ బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారని, ఆ బస్సు పూర్తి ఫిట్గా ఉందని, నిబంధనలను ఎక్కడా ఉల్లంఘిం చలేదని పేర్కొన్నారు. మంగళవారం ఈ వ్యాజ్యంపై మరోసారి విచారణకు వచ్చినప్పుడు పిటిషనర్ తరఫు న్యాయవాది పీఏవీ పద్మనాభం ఏపీ ప్రభుత్వం దివాకర్ ట్రావెల్స్కు క్లీన్చిట్ ఇవ్వడాన్ని ఎత్తిచూపారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు మోటారు ట్రాన్స్పోర్ట్ కార్మికుల చట్టం కింద రిజిస్ట్టర్ చేసుకోలేదని తెలంగాణ ప్రభుత్వం తన నివేదికలో స్పష్టంగా చెప్పిం దని, అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం దివాకర్ ట్రావెల్స్ ఎటువంటి చట్ట ఉల్లంఘ నలకు పాల్పడలేదని తమ విచారణలో తేలినట్లు చెబుతోందని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. పద్మనాభం వాదనలతో ధర్మాస నం ఏకీభవించింది. ప్రతీ దానిని ఖండిస్తూ పోవడమేనా.. అంటూ విస్మయం వ్యక్తం చేసింది. చట్టం కింద రిజిస్టరే చేసుకోక పోవడం చట్ట ఉల్లంఘనే అవుతుందని, మరి ఉల్లంఘించలేదని ఎలా చెబుతారని ఏపీ సర్కార్ తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ శ్రీనివాస్ను ప్రశ్నించింది. అధికారులు కోర్టు ఆదేశాల పట్ల సీరియస్గా ఉన్నట్లు కనిపిం చడం లేదని, అలా లేకుంటే ఆ విషయాన్ని తమకు చెప్పాలని, ఏం చేయాలో తమకు బాగా తెలుసునని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఏజీ ఈ మొత్తం వ్యవహారంలో చోటు చేసుకున్న వైరుధ్యాలను అంగీకరించారు. చివరగా మూడు వారాల గడువునిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
‘దివాకర్’ ప్రమాదంపై 4 వారాల్లో నివేదికివ్వండి
ఏపీ వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించిన ఎన్హెచ్ఆర్సీ అమలాపురం టౌన్: కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. బస్సు ప్రమాదం.. అందులో చోటుచేసుకున్న తప్పిదాలు, ట్రావెల్స్ యాజమాన్యాన్ని ప్రభుత్వం కాపాడుతోందంటూ పలు అభియోగాలతో తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన న్యాయవాది కుడు పూడి అశోక్ ఫిర్యాదు చేయగా ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది. మంగళవారం అశోక్ మీడియాతో మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కమిషన్ పంపిన ఉత్త ర్వుల నకళ్లను విడుదలచేశారు. కృష్ణాజిల్లా కలెక్టర్ స్పందించి దివాకర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
దివాకర్ ట్రావెల్స్పై ప్రజా పోరాటం!
‘ప్రైవేటు బస్సు మాఫియాపై పోరాట సమితి’ పేరిట వేదిక ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: కనీస ప్రమాణాలు లేకుండా, జాగ్ర త్తలు చేపట్టకుండా బస్సులను తిప్పుతున్న దివాకర్ ట్రావెల్స్ వంటి ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు, వాటికి అండగా నిలుస్తున్న ఏపీ సర్కారు తీరును ఎండగట్టేం దుకు ప్రజా పోరాటం మొదలవుతోంది. మూడున్నరేళ్ల క్రితం మహబూబ్నగర్ జిల్లా పాలెం శివారులో దివాకర్ ట్రావెల్స్కు చెందిన బస్సు దగ్ధమై 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తాజాగా అదే ట్రావెల్స్ కు చెందిన బస్సు కాలువలో పడిపోయి 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఇలాంటి ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు, వాటికి అండగా నిలుస్తున్న ప్రభుత్వాలపై పోరాటం కోసం కొందరు బాధితులు, మరికొందరు కలసి ‘ప్రైవేటు బస్సు మాఫియాపై పోరాట సమితి’ పేరిట ఓ వేదికను ఏర్పాటు చేశారు. నిర్లక్ష్యంతో అమాయకులను బలితీసుకుంటున్న ట్రావెల్స్ను మూసివేయించడమే లక్ష్యంగా నిర్ణయించినట్టు ఈ వేదిక అధ్య క్షురాలు రేఖ పేర్కొంటున్నారు. పాలెం ఘటన బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా కృషి చేసిన సుధాకర్ ఈ వేదికకు గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. -
మాట వినకుంటే వేటు..!
⇒ బిగ్బాస్ వేధింపులు తాళలేక ఉద్యోగులు బదిలీల బాట ⇒ పని ఒత్తిడి భరించలేక గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి సాక్షి, అమరావతి బ్యూరో : జిల్లాలో బిగ్బాస్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాస్థాయి అధికారులు సైతం సొంత నిర్ణయాలు తీసుకొనే పరిస్థితి లేదంటున్నారు. చిన్న పనులకూ ఆయన అనుమతి తీసుకోవాల్సిందేనట. కాదంటే టార్గెట్ చేసి ముప్పుతిప్పలు పెట్టి బదిలీపై వెళ్లేలా చేస్తున్నారు. బిగ్బాస్ వేధింపులు తాళలేక ఓ అధికారి ఈ జిల్లాను వదిలి వెళ్లిపోగా, పని ఒత్తిడి భరించలేక ఓ పంచాయతీ కార్యదర్శి గుండెపోటుతో మృతి చెందాడు. ⇒ జిల్లాలో బిగ్బాస్ మాట తీరు, వ్యవహార శైలి కింది స్థాయి అధికారులు, ఉద్యోగులకు ఇబ్బందికరంగా తయారైందంటున్నారు. ‘చినబాబు’ అండతో రెచ్చిపోతున్న బిగ్బాస్ ఆగడాలు, వేధింపులకు ఉద్యోగులు సతమతమవుతున్నారు. తనకు నచ్చని అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ అందరి ముందే యూజ్లెస్ ఫెలో, వేస్ట్ఫెలో అంటూ తన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని ఉద్యోగు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘శివుడిఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్లు..’ బిగ్బాస్ ఆదేశం లేకుండా జిల్లాలో ఏ పనీ జరగకూడదనే రీతిలో పాలన సాగుతోంది. ⇒ బిగ్బాస్ ప్రతి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంటారు. జిల్లా అధికారులు అంతా విజయవాడలో నివాసం ఉండడంతో వారిని కాన్ఫరెన్స్ పేరిట అర్ధరాత్రి వరకు మచిలీపట్నంలో ఉంచేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో మహిళా అధికారులు అర్ధరాత్రి వేళ విజయవాడ రాలేక ఇబ్బందులు పడాల్సివస్తోంది. ⇒ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులకు ఇంటి పన్ను వసూలుకు సంబంధించి టార్గెట్స్ ఇచ్చారు. జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఒక్కో కార్యదర్శి నాలుగు పంచాయతీలకు ఇన్చార్జిగా వ్యవహరించాల్సి వస్తోంది. మార్చి 31 లోపు టార్గెట్ పూర్తిచేయకుంటే వేటు తప్పదని ఒత్తిడి చేయడంతో బందరు మండలంలోని ఓ కార్యదర్శి గుండె పోటుతో మృతి చెందాడు. ⇒ ఇటీవల డీపీవో తనకు తెలియకుండా ఆ శాఖ ఉద్యోగులను బదిలీ చేశారనే కారణంతో బిగ్బాస్ ఆమెను వేధించి ప్రభుత్వానికి సరెండర్ చేశారని తెలుస్తోంది. ⇒ జెడ్పీ సీఈఓ సైతం బిగ్బాస్ వేధింపులు తట్టుకోలేక బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన కౌన్సెలింగ్ పక్రియ చేపట్టి జిల్లా ఉద్యోగులను బదిలీ చేశారు. అందుకు సీఈఓ సహకరించారనే కారణంతో ఆయనను వేధించినట్టు తెలుస్తోంది. ⇒ ఇక దివాకర్ ట్రావెల్స్ దుర్ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బిగ్బాస్ వ్యవహరించిన తీరును జిల్లాస్థాయి అధికారులు, ఉద్యోగులు తప్పుపట్టారు. అయితే బిగ్బాస్ తన కోటరీని రంగంలోకి దింపి ప్రతిపక్షనేతకు వ్యతిరేకంగా జిల్లాలో నిరసన సమావేశాలు నిర్వహించేలా ఒత్తిడి చేశారని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నిరసన సమావేశాలు నిర్వహించడం తమకు ఇష్టంలేకపోయినా బిగ్బాస్ ఆదేశాల మేరకు తప్పలేదని ఓ అధికారి వాపోయారు. ⇒ అధికార పార్టీ నేతలు కూడా బిగ్బాస్ ఆగడాలు భరించలేక పోతున్నారని, ‘చినబాబు’ అండ ఉండడంతోనే ఆయనను ఈ జిల్లా నుంచి సాగనంపలేకపోతున్నారని తెలుగుదేశం వర్గాలు వాపోతుండడం కొసమెరుపు..! -
బ్లాక్మెయిల్ పాలి‘ట్రిక్స్’కు బెదిరేవాళ్లు లేరు
– జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలతో సభ్య సమాజం తలదించుకుంటోంది – జేసీ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి – తాడిపత్రిలోని పరిశ్రమలన్నీ జేసీకి కప్పం కట్టాల్సిందే – జేసీ సోదరులపై మాజీ ఎంపీ అనంత ఫైర్ అనంతపురం : రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఆయన సతీమణి, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పట్ల తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వాడిన పదజాలం సభ్యసమాజంలో అందరూ తలదించుకునేలా ఉందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ కుటుంబం పై జేసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 20–25 ఏళ్లుగా జేసీని చూస్తున్నామనీ, అందరినీ బెదిరించి లొంగదీసుకుందామనే ధోరణిలోనే ఆయన రాజకీయ చరిత్ర ఉందన్నారు. ప్రభాకర్రెడ్డి మాటలు వింటుంటే ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అనే అనుమానాలు అందరిలో మెదలవుతున్నాయన్నారు. కేవలం ‘సాక్షి’ పత్రికనో, వైఎస్ జగన్నో కాదు వారి దురాగతాలను ఏ పత్రిక, రాజకీయ పార్టీ ప్రశ్నించినా వారిపట్ల ఇదే రకంగా వ్యవహరిస్తారని ధ్వజమెత్తారు. నాయకులను ఎస్సీ ఎస్టీ కేసులంటూ కోర్టుకు ఈడ్చి బ్లాక్మెయిల్ చేస్తారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాడిపత్రిలో ఆటవిక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారన్నారు. ప్రజల హృదయాలను గెలుచుకున్న మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణానాన్ని కూడా అపహాస్యం చేసేలా మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. చివరికి తాడిపత్రి నియోజకవర్గ ఆడబిడ్డ అనేది కూడా మరచిపోయి విజయమ్మపై కూడా విచక్షణ, జ్ఞానం లేకుండా మాట్లాడారన్నారు. ఏం మాట్లాడినా ‘రా..తేల్చుకుందాం’ అంటున్నారనీ, ఏం తేల్చుకుంటాం కుస్తీలు పట్టేందుకు ఏమైనా రౌడీలా అని ప్రశ్నించారు. మీకంత మోజు ఉంటే రాజీనామా చేయండి. ప్రజా క్షేత్రంలోకి వెళ్లి తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మీకు ఉబలాటం ఉంటే జిల్లాలో అందరూ రాజీనామా చేయండనీ, లేదంటే ట్రయల్ రన్గా మీ ఇద్దరు సోదరులు రాజీనామా చేయాలని చురకంటించారు. తమ మాట వినలేదని గతంలో ఆర్టీఏ అధికారులు, పోలీసులను అనేకమార్లు బెదించారని విమర్శించారు. అందరూ భయపడితే ఎంతవరకైనా బెదిరిస్తారని, జరక్కపోతే తోక ఎలా ముడుచుకుంటాడో కూడా తెలుసని చెప్పారు. ముఖ్యమంత్రులను, అధికారంలో ఉన్నవారిని పొగిడి ఎలా పనులు చేసుకుంటాడో ప్రజలందరికీ తెలుసన్నారు. చెన్నారెడ్డిని మొదలుకుని జనార్ధన్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, మధ్యలో టీడీపీ తప్ప తర్వాత వచ్చిన వైఎస్, ఆయన తర్వాత వచ్చిన సీఎంలు, ప్రస్తుత ముఖ్యమంత్రి చందబాబును తమ దందాను జరుపుకునేందుకు ఎలా పొగిడారో తెలుసన్నారు. జరక్కపోతే మాత్రం 1994లో జిల్లాలో రాజకీయాలనే ధారాదత్తం చేసి బెంగళూరు, హైదరాబాద్కు పారిపోయిన విషయమూ తెలుసన్నారు. అలాంటి వారా జగన్ గురించి మాట్లాడేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అవసరాలు జేసీ సోదరులకు ఉన్నాయి, వీరి అవసరాలు ముఖ్యమంత్రికి ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మాఫియాగ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని వచ్చే ఎన్నికల్లో ఈ మాఫియాతో ప్రజల ఓట్లు వేయించాలనే కుట్రకు సీఎం చంద్రబాబు పూనుకున్నారన్నారు. రాష్ట్రంలో ఇద్దరు , ముగ్గురు బస్సులను అడ్డం పెట్టుకొని మాఫియా నడుపుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ ఒత్తిడితో వారు చెప్పింది చేయకపోతే బదిలీలు చేస్తారనే భయం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఉందన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే జేసీ ప్రభాకర్రెడ్డి ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. జిల్లాలో అదృష్టమో దురదృష్టమో తెలీదుకాని తాడిపత్రిలో చాలా పరిశ్రమలు ఉన్నాయన్నారు. అందరూ వీరికి కప్పం కట్టాల్సిందేనన్నారు. ఇవన్నీ చంద్రబాబుకు తెలీదా? అని ప్రశ్నించారు. సమావేశంలో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, పార్టీ నాయకులు చవ్వా రాజశేఖర్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్బేగ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు రిలాక్స్ నాగరాజు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. -
న్యాయం చేయకపోతే ధర్నా చేస్తాం
-
‘దివాకర్’ బస్సే.. మా ఇంటి దీపాలను ఆర్పేసింది
-
‘దివాకర్’ బస్సే.. మా ఇంటి దీపాలను ఆర్పేసింది
నందిగామ ప్రమాదంలో మృతి చెందిన కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి తల్లిదండ్రుల ఆవేదన గరిడేపల్లి: ‘మాయదారి దివాకర్ బస్సే మా ఇంటి దీపాలను ఆర్పేసింది..’ అంటూ కృష్ణా జిల్లా నంది గామ వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన నలబోలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డిల తల్లిదండ్రులు శేషిరెడ్డి, కమలమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదండరాంపురంలో వారు మీడి యాతో మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే.. ‘మా పిల్లలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారని ఎంతో సంబరపడ్డాం. కానీ బస్సు ప్రమాదం మా పిల్లలిద్దర్నీ బలితీసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం మా పిల్లలను కానరాని లోకాలకు పంపింది. ప్రైవేట్ బస్సులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ప్రభు త్వాలు పట్టించుకోకపోవడం దారుణం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ఆధార్కార్డులు, బ్యాంకు అకౌంట్లు తీసుకెళ్లారు. ఎవరెంత పరిహారం చెల్లించినా మా పిల్లల ప్రాణాలు మాకు తిరిగి ఇవ్వగలరా? మా పిల్లల చావుకు కారణమైన బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిం చడం సరికాదు. మా పిల్లల ప్రాణాలను బలిగొన్న బస్సు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్పై కేసు తగదు ప్రమాదంలో మరణించిన మహ్మద్ తయ్యబ్ భార్య రషీదాబేగం హైదరాబాద్: రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసు పెట్టడం సరికాదని ఆ ప్రమాదంలో మరణించిన హైదరాబాద్కు చెందిన మహ్మద్ తయ్యబ్ భార్య రషీదా బేగం అన్నారు. ఆదివారమిక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణమైన దివా కర్ ట్రావెల్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తుంది తప్ప బాధితులను పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తే దివాకర్ ట్రావెల్స్ యజమానులైన జేసీ సోదరులపై తామే కేసు పెడతామన్నారు. -
‘దివాకర్ ట్రావెల్స్ పై కేసులు పెట్టాలి’
నల్లగొండ: టీడీపీ నాయకులు జేసీ సోదరులు పిచ్చి కుక్కల్లా మాట్లాడుతున్నారని, వారిని అడ్డం పెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తీరు మార్చుకోకుంటే జేసీ సోదరులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వుంటుందని హెచ్చరించారు. నందిగామ బస్సు ప్రమాద బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. -
పరిటాల రవి దెబ్బకు జేసీ బ్రదర్స్ పరారయ్యారు
-
జేసీ ఎమ్మెల్యేనా ? వీధి రౌడీనా ?
-
చంద్రబాబుకు దమ్ముంటే జేసీని సస్పెండ్ చేయాలి
-
ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి:బాలినేని
-
పరిటాల రవి దెబ్బకు జేసీ బ్రదర్స్ పరారయ్యారు
విశాఖపట్నం/నెల్లూరు: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలకు లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఉండేందుకు జేసీ బ్రదర్స్ గతంలో మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు పరిటాల రవి కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లాలో జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పరిటాల దెబ్బకు పరార్: జేసీ ప్రభాకర్ రెడ్డి ఊరకుక్కని, గతంలో పరిటాల రవి దెబ్బకు జేసీ బ్రదర్స్ పరారయ్యారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేసీ బ్రదర్స్ను అడ్డుపెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తున్నారని, దమ్ముంటే వైఎస్ జగన్ను నేరుగా ఎదుర్కోవాలని విమర్శించారు. జేసీ బ్రదర్స్ దిష్టిబొమ్మల దహనం: వైఎస్ జగన్పై జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడంపై వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు చాలా ప్రాంతాల్లో జేసీ బ్రదర్స్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. జేసీ ప్రభాకర్రెడ్డి రౌడీయిజం -
చంద్రబాబు అండతోనే జేసీ రెచ్చిపోతున్నాడు
-
చంద్రబాబు అండతోనే జేసీ రెచ్చిపోతున్నాడు
జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ అనంతలో వైఎస్ఆర్ సీపీ నేతల ఆందోళన అనంతపురం/విజయవాడ: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఆ పార్టీ నేతలు ఖండించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్దిచెబుతారని హెచ్చరించారు. అనంతలో ఆందోళన: జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో దివాకర్ ట్రావెల్స్ వద్ద వైఎస్ఆర్ సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ, పెద్దారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. జేసీ బ్రదర్స్ చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసునని.. వైఎస్ జగన్, విజయమ్మలను విమర్శించే అర్హత వారికి లేదని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు బుద్ధిచెబుతారని పార్టీ నేతలు శంకర్ నారాయణ, పెద్దారెడ్డి, గుర్నాధ్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యేనా.. వీధి రౌడీనా?: జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేనా లేక వీధి రౌడీనా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన భాష చూసి ఎమ్మెల్యేలందరూ తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్పత్రిలో చూపించుకోవాలి కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని హితవు పలికారు. ప్రభాకర్ రెడ్డిని సోషల్ మీడియాలో అందరూ తిడుతున్నారని, ఆయన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థిస్తారా లేక చర్యలు తీసుకుంటారో తేల్చి చెప్పాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు అండతోనే రెచ్చిపోతున్నాడు: జేసీ ప్రభాకర్ రెడ్డి భాష అత్యంత దారుణంగా ఉందని, చంద్రబాబు అండతోనే ఆయన రెచ్చిపోతున్నాడని వైఎస్ఆర్ సీపీ నేత జోగి రమేష్ అన్నారు. ఘోర బస్సు ప్రమాదం జరిగితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విమర్శించడం నేరమా అని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబు కంట్రోల్లో పెట్టుకోవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బఫూన్లా మాట్లాడితే కోరలు పీకుతాం: జేసీ ప్రభాకర్ రెడ్డి బఫూన్లా మాట్లాడితే కోరలు పీకుతామని వైఎస్ఆర్ సీపీ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఆయన మరోసారి నోరు జారితే పల్నాడు నుంచి తాడిపత్రికి వెళ్లి బుద్ది చెబుతామని అన్నారు. జేసీ ప్రభాకర్రెడ్డి రౌడీయిజం -
జేసీ ప్రభాకర్రెడ్డి రౌడీయిజం
బస్సు ప్రమాద ఘటనపై ‘సాక్షి’ కథనాలతో అసహనం ⇒ ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత దూషణలు ⇒ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ బైఠాయింపు ⇒ ‘సాక్షి’ అనంతపురం కార్యాలయం ఎదుట హల్చల్ అనంతపురం: జేసీ ప్రభాకర్రెడ్డి.. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే.. నియోజకవర్గంలోని దాదాపు 2.50 లక్షల మంది ఓటర్లకు ప్రతినిధి.. కానీ, ఇవన్నీ మరిచిపోయారు. తన సహజసిద్ధ శైలిలో రౌడీలా రెచ్చిపోయారు. ఎన్నికల కోడ్ను ధిక్కరించారు. పోలీసుల హెచ్చరికలను బేఖాతర్ చేశారు. శనివారం తాడిపత్రి నుంచి భారీసంఖ్యలో వాహనాల్లో జనాలను తీసుకొచ్చి అనంతపురం సమీపంలోని ‘సాక్షి’ ఎడిషన్ కార్యాలయం ఎదుట టెంట్ వేసి ధర్నాకు దిగారు. ధర్నాలో నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేశారు. తాను బాధ్యతగల ప్రజాప్రతినిధిని అనే విషయం మరిచిపోయారు. వినేవారే చెవులు మూసుకునేలా, రాజకీయ వ్యవస్థను దిగజార్చేలా, ప్రజాస్వామ్యం తలదించుకునేలా విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిగతంగా దూషించారు. ప్రభాకర్రెడ్డి హావభావాలు, మాటలు, తీరు ఓ వీధిరౌడీని తలపించేలా ఉన్నాయని సర్వత్రా చర్చ జరిగిందంటే ఆయన ఏ స్థాయిలో రెచ్చిపోయి ఉంటారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జగన్, ‘సాక్షి’కి వ్యతిరేకంగా నినాదాలు కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ బస్సు యజమానులైన జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి సోదరులను ఈ కేసు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విమర్శించారు. బస్సు ప్రమాదం కేసును తీరుగారుస్తున్న ప్రభుత్వ తీరుపై ‘సాక్షి’ పత్రికలో పలు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి సహనంకోల్పోయారు. శనివారం ‘సాక్షి’ అనంతపురం ఎడిషన్ కార్యాలయం ఎదుట తన అనుచరులతో కలిసి హల్చల్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను అతిక్రమించారు. ఉదయమే జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులు ‘సాక్షి’ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఎదురుగా టెంట్ వేశారు. వందలాది మంది అనుచరులతో జేసీ ప్రభాకర్రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వచ్చీరాగానే తన కుమారుడు అస్మిత్రెడ్డితో కలిసి శిబిరంలో బైఠాయించారు. ప్రతిపక్ష నేతను ఇష్టం వచ్చినట్లు దూషించారు. వ్యక్తిగతంగానూ కించపరిచేలా మాట్లాడారు. ఇదే సమయంలో జేసీ అనుచరులు ‘సాక్షి’ దినపత్రిక ప్రతులను దహనం చేశారు. వైఎస్ జగన్కు, ‘సాక్షి’కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్పీ మల్లికార్జున వర్మ వచ్చి ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పే ప్రయత్నం చేసినా జేసీ లెక్కచే యలేదు. జగన్ ఇంటి వద్దకూ వెళ్తానంటూ రెచ్చిపోయారు. కాసేపటికి పోలీసులు జేసీ ప్రభాకర్రెడ్డితోపాటు ఆయన కుమారుడిని నాలుగో పట్టణ పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. ‘సాక్షి’ కథనాలపై అభ్యంతరాలుంటే జేసీ ప్రభాకర్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఖండించవచ్చు. లేదంటే పత్రికా ప్రకటన విడుదల చేయొచ్చు. అదీ ఇష్టం లేకపోతే కోర్టును ఆశ్రయించి న్యాయపరంగా పోరాడొచ్చు. కానీ, బాధ్యతగల ఎమ్మెల్యేగా ఉండి ‘సాక్షి’ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అనంతపురం ఎడ్యుకేషన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కారుకూతలు కూస్తున్న జేసీ ప్రభాకర్రెడ్డీ.. ఖబడ్దార్! అంటూ వైఎఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు, పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు హెచ్చరించారు. శనివారం సాయంత్రం అనంతపురం టవర్క్లాక్ సర్కిల్లో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభాకర్రెడ్డి వీధిరౌడీలా వ్యవహరిస్తూ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. -
జేసీ ప్రభాకర్రెడ్డి రౌడీయిజం
-
జేసీ బ్రదర్స్ కోసం పడరాని పాట్లు
-
4 రోజులైనా బస్సు ఘటనపై విచారణ లేదు
-
బస్సు ప్రమాద బాధితులకు ఎంపీ మేకపాటి పరామర్శ
-
'ఓటుకు కోట్లు' వీడియోను చూడలేదేం?
⇒ బాబుకు ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్న ⇒ మంత్రివర్గం చూడాల్సిన వీడియోలు చాలా ఉన్నాయని ఎద్దేవా గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కేబినెట్ సమావేశంలో రోడ్డు ప్రమాద ఘటన బాధితులను విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించడానికి సంబంధించిన వీడియోలను చూశామని చెబుతున్న సీఎం చంద్రబాబు మంత్రివర్గం అసలు చూడాల్సిన వీడియాలు చాలానే ఉన్నాయని వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో ఏ సీఎం చేయని దౌర్భాగ్యమైన పని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్రెడ్డిని పంపించి రూ.5 కోట్లతో ఎమ్మెల్యేను కొంటూ పట్టుబడిన వీడియోలను చూడాలి. ‘మా వాళ్లు బ్రీఫ్డ్మీ’ అంటూ అందరి పరువు తీసిన వ్యక్తి కేబినెట్ హెడ్గా ఏవిధంగా పనికొస్తాడు? మీలాంటి వాళ్లు మాకెందుకంటూ కేబినెట్ లో తీర్మానం చేయండి. గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో తొక్కిసలాటకు కారణమై 29 మందిని చంపేశా రు. కేబినెట్ ఆ వీడియో చూడాలి..’ అని రోజా అన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె విలేకరుల తో మాట్లాడారు. ‘చింతమనేని ప్రభాకర్ ఇసుకను అడ్డ దిడ్డంగా దోచుకుంటుంటే అడ్డుకున్న తహశీల్దార్ వనజా క్షిని ఆయన ఏవిధంగా కొట్టాడో ఆ వీడియోలు చూడండి. అలాగే చింతమనేనిని అరెస్ట్ చేయాలని కేబినెట్ తీర్మానం చేస్తే ప్రజలు హర్షిస్తారు. టీడీపీకే చెందిన గుంటూరు జెడ్పీ చైర్మన్, మైనార్టీ మహిళ జానీమూన్.. మంత్రి రావెల కిషోర్బాబు వల్ల తన కుటుంబానికి ప్రాణ గండం ఉందని బోరున విలపిం చారు. అందువల్ల ఆయన్ను బర్తరఫ్ చేయాలని కేబినెట్లో తీర్మానిస్తే ప్రజలు హర్షిస్తారు..’ అని రోజా అన్నారు. నారాయణ కాలేజీలో తమ పిల్లలు చనిపో తుంటే ఆ తల్లులు కడుపుకోతతో ఏడు స్తున్న వీడియోలు కూడా చూడాలన్నారు. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు వచ్చిన జగన్ తీరును ఖండిస్తున్నామని కేబినెట్ తీర్మానం చేయడం సిగ్గుమాలిన రాజకీయాలకు నిదర్శనమని ఎద్దేవాచేశారు. ‘లోకేష్కు అండగా ఉన్నాడని కాల్మనీ సెక్స్రాకెట్ కేసులో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను కాపాడింది మీరు కా దా? ఆ రాకెట్లో 200 సీడీలు దొరికితే సీపీ గౌతంసవాంగ్ ఆ సీడీలు ఎందుకు కేబినెట్కు ఇవ్వలేదు? వాటి మీద చర్చ ఎందుకు జరగలేదు?’ అని రోజా నిలదీశారు.‘మీ మనవడిని ఎత్తుకుని ముద్దాడాడని పది మంది మృతికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ అధినేత, ఎంపీ జె.సి.దివా కర్రెడ్డిని కాపాడుతున్నారా?’ అని చంద్రబాబును రోజా ప్రశ్నించారు. తక్షణమే దివాకర్ ట్రావెల్స్ యాజ మాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, డాక్టర్పై చర్యలు తీసుకోండి.. వైఎస్ జగన్ భుజం మీద చేయి వేసి లాగిన కలెక్టర్పై, చేతిలో ఉన్న పేపర్స్ లాక్కున్న డాక్టర్పై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు తన బాధ్యత నిర్వర్తిస్తుంటే ఆ పనికి విఘాతం కలిగించిన కలెక్టర్, డాక్టర్పై విచారణ చేపట్టాలన్నారు. -
4 రోజులైనా విచారణ లేదు
⇒ 10 మంది మరణించినా దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై కదలిక లేదు ⇒ గురువారంనాటి రెండు బస్సు ప్రమాదాలపై మాత్రం విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం సాక్షి, అమరావతి: దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఇది జరిగి 4 రోజులైంది. దీనిపై ప్రభుత్వ స్పందన అంతంతమాత్రం. ఇంతవరకు న్యాయ విచారణకు ఆదేశించలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదు. కానీ, గురువారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జరిగిన రెండు బస్సు ప్రమాదాలపై మాత్రం ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. ఈ రెండు ఘటనల్లో పలువురికి గాయాలయ్యాయి. ఎవరూ మరణించలేదు. కానీ, ఈ రెండు ప్రమాదాల్లో బస్సులు చిన్న సంస్థలవి కావడం, అధికార పార్టీ నేతలకు చెందినవి కాకపోవడంతో ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. ఇదే వేగాన్ని 10 మందిని బలితీసుకున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘటనపై చూపలేదు. ఈ సంస్థ అధికార పార్టీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి కుటుంబానిది కావడంవల్లే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం తనిఖీలూ లేవు.. ఆలిండియా టూరిస్ట్ పర్మిట్లు పొందిన ప్రైవేటు బస్సులు స్టేజి క్యారియర్లుగా తిప్పుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ముండ్లపాడు ఘటనతో పొరుగునున్న తెలంగాణ ప్రభుత్వం తమ సరిహద్దుల్లో తిరుగుతున్న ఏపీ ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు చేపట్టింది. ఏపీలోని ప్రైవేటు ట్రావెల్స్పై ఉక్కుపాదం మోపింది. పలు బస్సులకు సరైన పత్రాలు లేవని కేసులు నమోదు చేసింది. కానీ, ఏపీ రవాణా శాఖ అధికారులు కనీసం తనిఖీలు చేయడంలేదు. ప్రభుత్వ పెద్దలు కొందరు అడ్డుపడుతుండటంవల్లే తామేమీ చేయలేక పోతున్నామని రవాణా శాఖ అధికారులు అంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాతో సర్కారు పెద్దలు ఎంతలా అంటకాగుతున్నారో దీనిని బట్టే అర్ధమవు తుంది. రవాణా శాఖ అధికారులు జాతీయ రహదారులపై ఉన్న టోల్ప్లాజాల్లో బస్సుల వేగ పరిమితి, బ్రీత్ ఎనలైజర్లతో పరీక్షలు చేయాలి. రోజూ టోల్గేట్లు దాటే బస్సుల వివరాలు నమోదు చేయాలి. అవేమీ జరగడంలేదు. సర్కారు నుంచి సహకారం లేదని,సిబ్బందిని నియమించడంలేదని, బ్రీత్ ఎనలైజర్లు, స్పీడ్ గన్లు వంటి పరికరాల కొనుగోలుకు నిధులు లేవని అధికారులు చెబుతున్నారు. అందువల్లే తనిఖీలు చేయలేకపోతున్నామని అంటున్నారు. -
పడరాని పాట్లు
⇒ జేసీ బ్రదర్స్ను కాపాడేందుకు యత్నం ⇒ అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకు కుయుక్తులు ⇒ ఇప్పటికే బాబు పాలనపై తీవ్ర వ్యతిరేకత ⇒ కర్నూలులో దీనావస్థలో పార్టీ ⇒ జేసీ సోదరులను కాపాడకపోతే ‘అనంత’లోనూ అదే పరిస్థితి ⇒ అందుకే కేసును తప్పుదారి పట్టించడానికి క్యాబినెట్ వేదికగా మంత్రాంగం ⇒ ప్రతిపక్ష నేతపై గోబెల్స్ ప్రచారానికి వ్యూహం సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా నందిగామ వద్ద జరిగిన దివాకర్ ట్రావెల్స్ ఘోర బస్సు ప్రమాద ఘటనలో దోషులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. టీడీపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేను ప్రమాదం నుంచి బయట పడేయడానికి శతధా ప్రయత్నిస్తోంది. బస్సు ప్రమాద ఘటనపై చంద్రబాబు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో వాటి నుంచి బయట పడటానికి పాట్లు పడుతున్నారు. ప్రమాదానికి గురైన బస్సు తన పార్టీ ఎంపీది కావడం.. ఆ బస్సుకు రెండవ డ్రైవర్ లేకపోవడం.. పోస్టుమార్టం చేయకుండానే డ్రైవర్ మృతదేహాన్ని తరలిస్తుండగా ప్రతిపక్ష నేత నిలదీయడంతో మొత్తం ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. అందులో భాగంగానే సాక్షాత్తు క్యాబినెట్నే వేదికగా చేసుకుని ప్రతిపక్ష నేతపై ఎదురు దాడికి దిగారు. మరోవైపు ఒక్క హామీ నెరవేర్చక పోవడంతో రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకం లేదు. కర్నూల్లో గంగుల కుటుంబం జగన్ వెంట నడవడంతో టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి. కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఫిరాయింపుదారులను తిరిగి ఎన్నికల్లో నిల్చోబెట్టి గెలిపించుకోలేని దయనీయ పరిస్థితి. అనంతపురంలో జేసీ బ్రదర్స్ను పార్టీలో చేర్చుకున్నప్పుడు మంత్రి పదవులు ఆశ చూపారు. తీరా మూడేళ్లయినా ఆ ఊసే లేదు. ఇప్పుడు కూడా వారిని వెనకోసుకురాకపోతే అక్కడా అదే పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి క్యాబినెట్ను వేదికగా చేసుకుని ప్రతిపక్ష నేతపై గోబెల్స్ ప్రచారానికి తెరలేపారు. క్యాబినెట్లో ఏమి జరిగి ఉండాలి.. బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించి.. పలు సందేహాలు లేవనెత్తడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా డిఫెన్స్లో పడిపోయారు. ఈ విషయాలన్నింటినీ జగన్ తప్పకుండా త్వరలో పారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తారని, గట్టిగా నిలదీసి ప్రశ్నల వర్షం కురిపిస్తే తన పరువు గంగలో కలుస్తుందని ఏకంగా పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నేత పైనే కేసు పెట్టారు. క్యాబినెట్ మీటింగ్లో ఆసాంతం ఇదే విషయమై చర్చలు జరిపారు. జగన్ ఘటనా స్థలిలో పర్యటించినప్పటి వీడియోను క్యాబెనెట్ మీటింగ్లో పలుమార్లు వీక్షించి పోస్టుమార్టం చేయకుండా మృతదేహాలను ఎలా తరలిస్తారని ప్రతిపక్ష నేత నిలదీసి అడగడమే పాపమన్నట్లు తీర్మానించేశారు. వాస్తవానికి భువనేశ్వర్ నుంచి హైదరాబాద్.. అంటే చాలా దూరం. నిజానికి ఆ బస్సులో రెండవ డ్రైవర్ లేడని తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం తర్వాత ఇతనే రెండవ డ్రైవర్ అని ఎవర్నో చూపారు. బస్సుకు స్పీడ్ గవర్నెన్స్ కూడా లేవు. జగన్ పర్యటన తర్వాత బయట పడిన ఈ విషయాలన్నింటినీ ఇసుమంతైనా పట్టించుకోలేదు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? డ్రైవర్ తప్పిదం ఏమిటి? మృతుల కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి? దోషులకు శిక్ష పడాలంటే ఏం చేయాలి? ఏ తరహా విచారణ జరిపించాలి? భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తదితర విషయాలు నిమిషం పాటు కూడా చర్చించిన పాపాన పోలేదు. అంతకు ముందే అధికారుల సంఘాన్ని ఉసి గొల్పినా అనుకున్నంత ఫలితం రాలేదని భావించి, జగన్.. కలెక్టర్ను ప్రశ్నించడమే తప్పు అన్నట్లు విస్తృత ప్రచారం చేసేలా వ్యూహం రూపొందించారు. జరిగిన విషయాన్ని వక్రీకరించి, లీకులిచ్చి.. ప్రభుత్వ అనుకూల మీడియాలో ‘ఇదేం పద్ధతి’ అంటూ చిలువలు పలువలు చేసి రాయించుకున్నారు. పరామర్శకు వెళ్తే అంత ఉలికిపాటు ఎందుకు? భయమెందుకు? ఘటన స్థతికి ప్రతిపక్షనేత జగన్ వెళ్లాడనగానే ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళనకు లోనైనట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి బస్సు ప్రమాదం చోటు చేసుకున్న రోజు ప్రమాద స్థలానికి దగ్గరలోనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కానీ, ఆ జిల్లాకు చెందిన మంత్రులు కానీ అక్కడికి వెళ్లలేదు. కేసును పక్కదారి పట్టించేలా అధికార యంత్రాంగానికి ముందుగానే ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించి ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్, వైద్యులు, ఇతర అధికారులు జగన్ వెంట హాలు లోపలకు వెళ్లారు. ఆ హాలులో అప్పటికే మీడియా ప్రతినిధులు, మృతుల బంధువులు ఉన్నారు. ఆ హాలులో బంధువులకు అప్పగించడానికి ప్యాక్ చేసి ఉంచిన మృతదేహాలు ఓ వైపు కనిపించాయి. అదో.. అది డ్రైవర్ మృతదేహం అని ఎవరో చూపించారు. పోస్టుమార్టం చేశారా అని జగన్ వైద్యులను అడిగారు. ఒకింత తడబాటుతో వైద్యుడు ‘లేద’ని సమాధానమిచ్చారు. దీంతో వైద్యుల వద్ద ఉన్న పోస్టుమార్టం మూడు కాపీల్లోంచి ఒకదానిని జగన్ అడిగి తీసుకుని మీడియా ప్రతినిధులకు అక్కడ జరుతుతున్న విషయాన్ని వివరించారు. ‘బస్సు డ్రైవర్ మద్యం సేవించాడా? లేదా? అనేది తెలియాలంటే పోస్టుమార్టం తప్పని సరి. పోస్టుమార్టం చేయకుండా మృతదేహాన్ని ఎలా అప్పగిస్తారు? కలెక్టరే దగ్గరుండి తప్పు చేయిస్తే ఎలా? చట్ట విరుద్ధంగా ఇలా చేస్తే మీతో పాటు ఇందులో ప్రమేయమున్న వాళ్లంతా జైలుకు వెళ్తారు’ అని జగన్ కలెక్టర్ను గట్టిగా నిలదీశారు. దీంతో ‘అవన్నీ ఇక్కడేం పని..పదండి’ అంటూ ‘పోస్టుమార్టం చేశామ’ని చెప్పండని కలెక్టర్ వైద్యులకు ప్రాంప్టింగ్ ఇవ్వడం వినిపించింది. కలెక్టర్ సూచనలతో వైద్యుడు.. జగన్ చేతిలో ఉన్న ఆ రిపోర్టును తిరిగి లాక్కునేందుకు యత్నించారు. ఇలా ఎందుకంటే.. సీఎం చంద్రబాబు జేసీ సోదరుల్లో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వక పోవడంతో అప్పుడప్పుడు ఎంపీ జేసీ పరోక్షంగా ఎత్తిచూపుతూనే ఉన్నారు. ఈ తరుణంలో వారిపై బస్సు ప్రమాద కేసు పెడితే అసలుకే ఎసురొచ్చి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో పక్కదారి పట్టించారని స్పష్టమవుతోంది. మరో వైపు కర్నూలు జిల్లాలో పార్టీ పరిస్థితి బాగోలేదననే ఆందోళన ఆయనలో రోజురోజుకూ తీవ్రమవుతోంది. భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వెళ్లాక గంగుల కుటుంబం వైఎస్సార్సీపీలో చేరడం, శిల్పా మోహన్రెడ్డి గుర్రుగా ఉండటం పట్ల ఏం చేయాలో తోచక చంద్రబాబు తల పట్టుకున్నారు. ఈ స్థితిలో జేసీ సోదరులతో వైరం పెంచు కోవడానికి బాబు ఏ మాత్రం ఇష్టపడలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఒక అబద్ధాన్ని పదిమార్లు పదే పదే చెప్పి.. అసలు విషయం మరుగున పడేలా చేసి, అబద్ధ మే అసలు నిజమని జనాన్ని నమ్మించాలనే వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఇందుకు క్యాబినెట్ సమావేశాన్నే వేది కగా చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అక్రమ కేసులపై జనాగ్రహం
⇒ టీడీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధిచెబుతారు ⇒ తహసీల్దారు కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నిరసనలు నెల్లూరు(సెంట్రల్) : ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై ప్రజలు ఆగ్రహించారు. ప్రజలు, బాదితుల పక్షాన నిలబడటం తప్పా.. అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రమాదానికి కారణమైన బస్సు యజమాన్యాన్ని రక్షిం చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నా లను ఎండగడుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టి భయపెట్టాలని చూడటం హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. కృష్ణాజిల్లాలోని జాతీయరహదారిపై మంగళవారం దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను పరామర్శించి పూర్తి వివరాలు కావాలని అధికారులను, డాక్టర్లను అడిగినందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం ప్రభుత్వం ప్రోద్బలంతో అక్రమంగా కేసులు బనాయించినందుకు నిరసనగా గురువారం జిల్లా వ్యాప్తంగా తహసీల్దారు కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నల్లబ్యాడ్జిలతో నిరసనలు తెలిపారు. ► సర్వేపల్లి నియోజక వర్గంలోని వెంకటాచలం మండల తహసీల్దారు కార్యాలయం ఎదుట వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి నిరనస తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ముత్తుకూరులోని తహసీల్దారు కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మెట్టా విష్టువర్ధన్రెడ్డి , టీపీ గూడూరులో ప్రధాన కార్యదర్శి చిల్లకూరు సుధీర్రెడ్డి, మనుబోలులో బీసీ విభాగం జిల్లా అ«ధ్యక్షుడు బాస్కర్గౌడ్, పొదలకూరులో ఎంపీపీ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ► వెంకటగిరిలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు జగన్మోహన్రెడ్డిపై కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. కాగా, సైదాపురం మండలంలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట మండల కన్వీనర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ► కావలి నియోజకవర్గంలోని దగదర్తిలో మండల తహసీల్దారు కార్యాలయం ఎదుట జరిగిన నిరసనలలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పాల్గొన్నారు. కేసులతో ఎవరూ భయపడరని.. టీడీపీ చేసే అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారన్నారు. కావలిలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట నగర అ«ధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి, ప్లోర్లీడర్ కనుమర్లపూడి వెంకటనారాయణ.. బోగోలులో మండల కన్వీనర్ రఘుయాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ► ఉదయగిరి తహసీల్దారు కార్యాలయం ఎదుట జరిగిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం పోరాడుతున్న జగన్మోహన్రెడ్డిపై టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టడం అన్యాయంగా ఉందన్నారు. వింజమూరులో మండల కన్వీనర్ మలిరెడ్డి విజయకుమార్రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ► గూడూరు నియోజక వర్గంలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. వాకాడులో సీజీసీ సభ్యులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ► సూళ్లూరుపేట నియోజక వర్గంలోని నాయుడుపేట తహసీల్దారు కార్యాలయం ఎదుట మండల కన్వీనర్ తంబిరెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. సుబ్రమణ్యంరెడ్డి, రఫి పాల్గొన్నారు. ► ఆత్మకూరులోని తహసీల్దారు కార్యాలయం ఎదుట జరిగిన నిరసనలో మున్సిపల్ ఫ్లోర్లీడర్ అల్లారెడ్డి ఆనందరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సంగంలో జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కంటాబత్తిన రఘునాథరెడ్డి పాల్గొన్నారు. -
ధర్మాగ్రహం!
సాక్షి, విజయవాడ : ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నా జిల్లా అంతటా నిరసన ప్రదర్శనలు కొనసాగించి సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గం ముండ్లపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి బంధువులతోపాటు గాయపడినవారిని పరామర్శించడానికి వచ్చిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించడాన్ని ఖండిస్తూ గురువారం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వైఎస్ జగన్పై అక్రమ కేసులు ఎత్తివేయాలని, దివాకర్ ట్రావెల్స్ బస్సు బాధితులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. విజయవాడలో ధర్నా చౌక్ వద్దపోలీసులు ఓవర్యాక్షన్ చేశారు. ధర్నా కోసం ఏర్పాటు చేసిన టెంట్లు తొలగించారు. ► నూజీవీడులోని సబ్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ► గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు జరిగాయి. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు పాల్గొని తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. ► నందిగామలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యాన పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలు పట్టుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. కంచకచర్ల, వీరులపాడు, చందర్లపాడు మండలాల్లోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ► మచిలీపట్నంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ► జగ్గయ్యపేటలో తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో «నిరసన ప్రదర్శన నిర్వహించారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో నాయకులు ధర్నాలు చేశారు. ► మైలవరంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ ఆధ్వర్యాన నిరసన ప్రదర్శన నిర్వహించారు. ► అవనిగడ్డలో నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ ఆధ్వర్యంలో నాయకులు నల్లబ్యా డ్జీలు ధరించి ప్ల కార్లులు పట్టుకుని తాహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. ► పెడనలో నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రామ్ప్రసాద్ ఆధ్వర్యంలో తాహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. మున్సిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, ఉప్పాల రాము పాల్గొన్నారు. ► గుడివాడలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, దుక్కిపాటి శశిభూషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోనూ స్థానిక నేతలు ధర్నాలు చేశారు. ► కైకలూరులో సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల్లో నరసనలు తెలిపారు. ► పామర్రులోని నాలుగు రోడ్ల కూడలిలో వైఎస్సార్ సీపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తోట్లవల్లూరు, పమిడిముక్కల, పెదపారుపూడి, మొవ్వ మండలాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ► పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు తహసీల్దార్ కార్యాలయాల వద్ద వైఎస్సార్ సీపీ నేతలు ధర్నాలు నిర్వహించారు. = తిరువూరు, విసన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు మండలాల్లో ధర్నాలు జరిగాయి. -
నివేదిక అంతా గందరగోళం!
రవాణా శాఖ వైఫల్యాల్ని కప్పి పుచ్చుకునేందుకేనని అనుమానాలు ⇒ ప్రైవేటు ట్రావెల్స్ తనిఖీలను పట్టించుకోని యంత్రాంగం ⇒ ముండ్లపాడు బస్సు ప్రమాద ఘటన విచారణపై నోరెత్తని సర్కారు ⇒ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రాణ నష్టం లేని బస్సు ప్రమాదాలపై విచారణకు ఆదేశం సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 10 మంది మృత్యువాత పడిన ఘటనలో రవాణా శాఖ సర్కారుకు ఇచ్చిన నివేదిక గందరగోళంగా ఉంది. రవాణా శాఖ వైఫల్యాల్ని కప్పి పుచ్చుకునే క్రమంలో బస్సు బోల్తా నివేదికను ఉద్ధేశపూర్వకంగానే గందరగోళంగా మార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు డ్రైవర్లు బస్సులోనే ఉన్నారని, మృతి చెందిన డ్రైవరు తాడిపత్రికి చెందిన ఆదినారాయణ కాగా, రెండో డ్రైవరు కోదాడకు చెందిన శేఖర్ రెడ్డి. కానీ శేఖర్ రెడ్డి బస్సు డిక్కీలోనే నిద్రిస్తున్నారని, సంఘటన జరిగిన తర్వాత స్వల్ప గాయాలతో బయటకు వచ్చారని రవాణా శాఖ సర్కారుకు నివేదిక అందించింది. సాధారణంగా బస్సు నడిపే సమయంలో ఇద్దరు డ్రైవర్లు క్యాబిన్లోనే ఉంటారు. డిక్కీలో నిద్రిస్తున్నారనే రవాణా శాఖ నివేదికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన రెండు గంటల తర్వాత శేఖర్ రెడ్డి గాయాలతో డిక్కీనుంచి బయటకు వచ్చారని రవాణా శాఖ నివేదికలో పేర్కొంది. ప్రమాదం జరిగిన ముండ్లపాడు ప్రాంతం కోదాడకు దగ్గర్లో ఉండటంతో అసలు రెండో డ్రైవరు బస్సులో ఉన్నాడా? లేడా? అన్న అనుమానాలు వ్యక్తం కావడం గమనార్హం. ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సుకు ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ ఉందని పేర్కొంటూనే కాంట్రాక్టు క్యారేజీ అనుమతి ఉందని గందరగోళంగా నివేదిక ఇచ్చారు. విచారణపై నోరు మెదపని సర్కార్... బస్సు ప్రమాదంలో 10 మంది మృతి చెందినా ఇంతవరకు న్యాయ విచారణ కానీ.. శాఖాపరమైన విచారణకు ఆదేశించిక పోవడాన్ని బట్టి చూస్తే అధికార పార్టీ ఎంపీ, అతని సోదరుడిని పూర్తిగా కాపాడేందుకేనన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. గురువారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బస్సు బోల్తా పడిన ఘటనలు జరిగాయి. ఈ రెండు ఘటనల్లో ప్రాణ నష్టం లేకపోయినా.. పలువురికి గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వం ఈ రెండు సంఘటనలపై విచారణకు ఆదేశించింది. ఈ ట్రావెల్స్తో తమ పార్టీ వారెవరికీ సంబంధాలు లేవు కాబట్టే, పైగా చిన్న ట్రావెల్స్ కావడంతో విచారణ పేరుతో హడావుడి చేసింది. కానీ 10 మంది మరణించిన ముండ్లపాడు ఘటనపై నివేదికలతో సరిపెట్టడం గమనార్హం. బస్సు ప్రమాదంపై ఇంకా లోతైన విచారణ జరగాలనుకున్నా.. రోడ్డు నిర్మాణంలోనూ సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయేమో కూడా పరిశీలన జరిపించాలి. ప్రమాదం జరిగిన ప్రాంతం జాతీయ రహదారి కావడంతో ఎన్హెచ్ఏఐను నివేదిక కోరాలి. ప్రమాదం జరిగిన ప్రదేశం హైదరాబాద్ ఎన్హెచ్ఏఐ పరిధిలో ఉంది. పైపెచ్చు రోడ్డు నిర్వహణ జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తుండటం విశేషం. బస్సుల తనిఖీల్లో రవాణా శాఖ వైఫల్యం... ఆలిండియా టూరిస్ట్ పర్మిట్లు పొందిన ప్రైవేటు బస్సులు స్టేజి క్యారియర్లుగా తిప్పుతూ ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ముండ్లపాడు ఘటనతో పొరుగునున్న తెలంగాణ ప్రభుత్వం తమ సరిహద్దుల్లో తిరుగుతున్న ఏపీ ట్రావెల్స్ తనిఖీలు చేపట్టింది. ఏపీలోని ప్రైవేటు ట్రావెల్స్పై ఉక్కుపాదం మోపింది. పలు బస్సులకు సరైన పత్రాలు లేవని కేసులు నమోదు చేసింది. కానీ ఏపీ రవాణా శాఖ అధికారులు కనీసం తనిఖీలు కూడా చేయకపోవడాన్ని బట్టి చూస్తే ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాతో సర్కారు పెద్దలు ఎంత అంటకాగుతున్నారో.. ఇట్టే అర్ధమవుతుంది. ప్రైవేటు ట్రావెల్స్ను తనిఖీ చేయడానికి రవాణా అధికారులు వెనుకాడుతున్నారంటే ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా సర్కారును ఎంతలా గుప్పిట్లో పెట్టుకున్నారో.. తెలుస్తుంది. రవాణా శాఖ అధికారులు జాతీయ రహదారులపై ఉన్న టోల్ప్లాజాల్లో బస్సుల వేగ పరిమితి, బ్రీత్ ఎనలైజర్లతో పరీక్షలు నిర్వహించాలి. విధిగా ప్రతి రోజూ టోల్గేట్లు దాటే బస్సుల వివరాలు నమోదు చేయాలి. కానీ సిబ్బంది కొరత, పరీక్షలకు సరైన పరికరాలు (బ్రీత్ ఎనలైజర్లు, స్పీడ్ గన్లు) లేకపోవడం వల్లే తనిఖీలు చేయలేకపోతున్నామని సాక్షాత్తూ రవాణా శాఖ అధికారులే వెల్లడించడం గమనార్హం. తనిఖీల్లో రవాణా శాఖ డొల్లతనం వెల్లడవుతుందనే కారణంతో బస్సు ప్రమాద దుర్ఘటనపై గందరగోళ నివేదిక అందించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వీడియోల వివాదం
-
మీరు చూడాల్సిన వీడియోలు చాలానే ఉన్నాయి: రోజా
ఏపీ కేబినెట్ సమావేశంలో నందిగామ ఘటనకు సంబంధించిన వీడియోలను చూశామని చెబుతున్న చంద్రబాబు మంత్రివర్గం.. నిజానికి చూడాల్సిన వీడియో అది కాదని, ఇంకా చాలానే ఉన్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అది కేబినెట్ సమావేశమా.. సినిమా థియటేరా అని ఎద్దేవా చేశారు. విజయవాడలో స్థానిక నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయని దౌర్భాగ్యమైన పని.. రేవంత్ రెడ్డిని పంపి ఎమ్మెల్సీ సీటు కొనుగోలుకు 5 కోట్లు ఇస్తూ పట్టుబడిన వీడియోలు చూడాలని, మావాళ్లు దే బ్రీఫ్డ్ మీ అని అడ్డమైన ఇంగ్లీష్ మాట్లాడిన వీడియో చూడాలని చెప్పారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో 29 మంది మరణిస్తే, ఆ రషెస్ ఇంతవరకు కనిపించవని, ఆ వీడియోలు ఏమయ్యాయో కేబినెట్కు తెలియదని అన్నారు. చింతమనేని ప్రభాకర్ అడ్డదిడ్డంగా దోచుకుంటుంటే అడ్డుపడినందుకు వనజాక్షి అనే అధికారిణిని ఎలా కొట్టారో ఆ వీడియో చూడాలని.. ఆమె కళ్లనీళ్లు పెట్టుకున్న వీడియో చూడాలని తెలిపారు. జానీమూన్ అనే మహిళ తన కుటుంబానికి రావెల కిశోర్ బాబు వల్ల ప్రాణభయం ఉందని భోరుమన్నారని, ఆ వీడియో చూడాలని సూచించారు. కేబినెట్ సమావేశంలో వైఎస్ జగన్ మీద తీర్మానం చేశామని చెబుతున్నారని.. కానీ బస్సు ప్రమాదంలో మరణించిన 11 మంది కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించాలని ఎందుకు తీర్మానం చేయించలేదని రోజా ప్రశ్నించారు. దివాకర్ ట్రావెల్స్ మీద చర్యల గురించి ఎందుకు చర్చించలేదని అడిగారు. ఇక ఐఏఎస్ అధికారులు ఎప్పుడూ లేనట్లుగా తీర్మానం చేసి సీఎంకు ఇచ్చామంటున్నారని, రాష్ట్రంలోనే అత్యున్నత అధికారి అయిన అజయ్ కల్లంకు జరిగిన అవమానం వారికి కనిపించలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఉండగానే మరో సీఎస్గా దినేష్ను ఎందుకు నియమించారని, ఈ విషయాన్ని అధికారులు ఎందుకు అడగలేదని అన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణ కలెక్టర్ చేతిలోంచి పేపర్లు లాక్కుని చించేసినప్పుడు ఈ సంఘం ఎందుకు స్పందించలేదు, ఆయన మీద తీర్మానం ఎందుకు చేయలేదని అడిగారు. ఉద్యోగులకు జీతం పెరిగినా, జీవితం మెరుగైనా అది వైఎస్ హయాంలోనేనని అన్నారు. లిఫ్ట్ ఆపరేటర్ రిటైర్ అవుతున్నట్లు చెబితే సన్మానించి, బట్టలు పెట్టి, ఇల్లు ఇప్పించిన నాయకుడు వైఎస్ అని గుర్తు చేశారు. జగన్ కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారని, ఏనాడూ అధికారులను పన్నెత్తి మాట కూడా అనలేదని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే, దురుసుగా ప్రవర్తిస్తే ఎవరికైనా కోపం రాదా అని అడిగారు. పక్కనే హెలికాప్టర్లలో తిరుగుతున్న సీఎం గానీ, రవాణా మంత్రి గానీ, దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్ ఎవరూ అక్కడకు ఎందుకు వెళ్లలేదని అన్నారు. ఒకవైపు డాక్టర్ పోస్టుమార్టం చేయలేదని చెబుతుంటే, మరోవైపు కలెక్టర్ మాత్రం చేశామని అన్నారని, ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని అడిగారు. రిపోర్టు కాపీలు మూడు ఉన్నందున ఒకటి ఇవ్వాలని వైఎస్ జగన్ అడుగుతుంటే ఇవ్వకపోవడం ఏంటి.. దాన్ని మార్చాలనే ఉద్దేశం ఉండటం వల్లేనా అని నిలదీశారు. నారాయణ కాలేజిలో ఎంతమంది పిల్లలు చనిపోతున్నారో.. ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారో చూడాలని, నారాయణ కాలేజి గుర్తింపు రద్దుచేసి, ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని రోజా డిమాండ్ చేశారు. దివాకర్ ట్రావెల్స్ను కాపాడితే మాత్రం ప్రజలు హర్షించబోరని అన్నారు. డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా ఎలా మృతదేహాన్ని పంపారు, రెండోడ్రైవర్ను ఎక్కడ దాచిపెట్టారని ఆమె నిలదీశారు. లోకేష్కు అండగా ఉన్నాడని కాల్మనీ సెక్స్రాకెట్లో బుద్దా వెంకన్నను ఎలా కాపాడారో అంతా చూస్తున్నారని, లోకేష్ కొడుకును ఎత్తుకుని ముద్దాడినంత మాత్రాన జేసీని కాపాడాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి నష్టం వస్తుందని తెలిసి కూడా కేశినేని, దివాకర్ ట్రావెల్స్ను కాపాడుతున్నారా? ఇది జరిగిన మర్నాడే స్కూలు పిల్లల బస్సు లోయలో పడిందంటే ప్రభుత్వం ఎలా పనిచేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయం చేస్తున్నది చంద్రబాబు, ఆయన ప్రభుత్వమన్నది అందరికీ తెలుసని, కాల్మనీ సెక్స్రాకెట్లో 200 సీడీలు దొరికితే ఆ నిందితులను ఎందుకు అరెస్టుచేయలేదో ఎవరూ అడగరని అన్నారు. దివాకర్ ట్రావెల్స్ నుంచి మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. మల్లాది విష్ణుకు చెందిన బార్లో కల్తీ మద్యం ఉందని యజమాని మీద కేసు పెట్టారు కదా.. మరిప్పుడు దివాకర్ ట్రావెల్స్ యజమాని మీద ఎందుకు కేసులు పెట్టరని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
చూడాల్సిన వీడియోలు చాలానే ఉన్నాయి
-
జేసీని రక్షించేందుకే బాబు పాట్లు
♦ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ♦ విపక్ష నేత జగన్పై కేసు పెట్టి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని రక్షించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. ఇంత భారీ ప్రమాదాన్ని, ప్రాణ నష్టాన్ని కప్పిపెట్టే కుట్ర జరిగిందని ఆరోపించారు. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసు పెట్టి అసలు విషయాన్ని ప్రభుత్వం, ప్రభుత్వానికి సంబంధించిన తాబేదార్లు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో అంబటి మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగినప్పుడు జగన్ వెళ్లి బాధితులకు మనోధైర్యం కలిగించారని, అప్పుడు అధికారులు ఎవ్వరూ వివాదం చేయడానికి ప్రయత్నించలేదని చెప్పారు. ప్రస్తుత ఘటనలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ తప్పులేదని చూపించటానికి చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా తరలించేందుకు ప్రయత్నించడంపై డాక్టర్, కలెక్టర్ను జగన్ ప్రశ్నించారని చెప్పారు. అధికారులంటే గౌరవం ఉంది జగన్ మాటలను సరిగా అర్ధం చేసుకోకుండా ఐఏఎస్ల సంఘం మాట్లాడటం సరికాదని అంబటి అన్నారు. జగన్ హెచ్చరించి, డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయించకుండా ఉండుంటే కలెక్టర్ జైలుకు వెళ్లి ఉండేవారని చెప్పారు. ఈ సంగతి కలెక్టర్, ఐఏఎస్లకు తెలియకపోవడం బాధాకరమన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంటే తమకు గౌరవం ఉందని చెప్పారు. వారిలో నీతినిజాయితీ గలవారు ఉన్నారని, పోస్టుల కోసం కక్కుర్తిపడే వాళ్లు కూడా ఉన్నారని అన్నారు.గతంలో చంద్రబాబు వాడిన భాష బాగుందా అని ప్రశ్నించారు. -
ఆ కేసులు కక్షపూరితం
బాధ్యులను వదలి.. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతపైతప్పుడు కేసులా? ఇదెక్కడి న్యాయమని వైఎస్ఆర్సీపీ ధర్మాగ్రహం సర్కారు తీరుపై నిరసనలతో విరుచుకుపడిన పార్టీశ్రేణులు ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ యాజమాన్యాన్ని, సిబ్బందిని.. పోస్టుమార్టం లేకుండానే డ్రైవర్ మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించిన అధికారులను వదిలేశారు.. ఇదేమిటని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతపై మాత్రం కక్ష సాధిస్తున్నారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. సర్కారు పాల్పడుతున్న ఈ కక్షపూరిత చర్యలపై గురువారం వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. నల్లబ్యాడ్జీలు ధరించి.. నోటికి నల్లగుడ్డలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశాయి. విశాఖ నగరం, జిల్లావ్యాప్తంగా ధర్నాలు, మానవహారాలు, మౌన ప్రదర్శనలతో సర్కారుపై ధర్మాగ్రహం వ్యక్తం చేశాయి. తమ నేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి సంఘీభావం ప్రకటించాయి. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు సర్కార్ అక్రమ కేసులు బనాయించడంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. పదకొండు మంది ప్రాణాలను బలిగొన్న దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా.. ఇదేమిటని ప్రశ్నించిన జననేతపై కక్ష పూరితంగా కేసులు నమోదు చేయడంపై మండిపడింది. ప్రతిపక్ష నాయకుడు పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు జీవీఎంసీ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో నిరసనలతో హోరెత్తి పోయింది. నియోజక వర్గ కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శనలు నిర్వహించారు. నాలుగు రోడ్ల జంక్షన్లో మానవహారాలుగా ఏర్పడి నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించారు. బనాయించిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేసి వైఎస్ జగన్మోహన్రెడ్డికి క్షమాపణలు చెప్పాలంటూ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డాబాగార్డెన్ జంక్షన్లో జరిగిన నిరసనలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తి పోశారు. అదే విధంగా నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన నిరసనల్లో కూడా పార్టీ కో ఆర్డినేటర్లు ప్రభుత్వ నిరంకుశ పాలనపై నిప్పులు చెరిగారు. విశాఖ తూర్పులో.. విశాఖ తూర్పు కో ఆర్డినేటర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆరిలోవలో నిరసన ప్రదర్శన చేశారు. నోటికి నల్లబ్యాడ్జీలు కట్టుకుని పీఐసీ పాయింట్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు ప్రదర్శనగా వెళ్లి అక్కడ మానవహారం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొన్న విశాఖ ఎయిర్పోర్టులో రన్వేపై జగన్ను అడ్డుకున్నారని..నేడు ఇదేమిటని ప్రశ్నించినందుకు జగన్పై తప్పు డు కేసులు పెట్టారని వంశీకృష్ణ ఆరోపించా రు. ఎస్సీసెల్ నగర కన్వీనర్ బోని శివరామకృష్ణ, నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్తి మం దారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి ఎ.రాజబాబు, నగర కార్యదర్శులు ఇ మ్మంది సత్యనారాయణ, పీఐ బాలరాజు, వైదా నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ పశ్చిమలో.. విశాఖ పశ్చిమ పార్టీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో మల్కాపురం ప్రకాష్ నగర్లో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేశారు. గడిచిన మూడేళ్లుగా ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పట్ల చంద్రబాబు సర్కార్ అవలంబిస్తున్న వైఖరిపై ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని..అందువలనే జగన్పై కేసులు బనాయిస్తూ చంద్రబాబు వికృతంగా ప్రవర్తిస్తున్నారని మళ్ల విజయప్రసాద్ ఆరోపించారు. ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ బద్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉత్తరంలో... విశాఖ ఉత్తర కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఆధ్వర్యంలో సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తొలుత బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. అనంతరం వైఎస్ జగన్పై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి ప్ల కార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు. తక్షణమే కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్యాదవ్, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, రాష్ట్ర కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి, సంస్కృత విభాగం నగర కన్వీనర్ రాధ, గిడ్డంకుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణా రెడ్డి, ప్రచార కమిటీ నగర అధ్యక్షుడు బర్కత్ అలి, యువజన విభాగం కార్యదర్శి రెయ్యి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణంలో.. విశాఖ దక్షిణ కో ఆర్డినేటర్ కోలా గురువులు ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్ ఎల్ఐసీ భవనం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రమాదంలో మృతి చెందిన 11మందికి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నా«థ్ మాట్లాడుతూ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి వెళ్లిన శాసనసభ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రభుత్వం అక్రమకేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, ప్రచార కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మాసిపోగు రాజు, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో... గాజువాక కో ఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో వందడుగుల రోడ్డులో మౌనప్రదర్శన చేశారు. వందడుగుల రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నాచేశారు. కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం ఇచ్చారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. ఈసందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్తో కలిసి జగన్పై అక్రమ కేసులు బనాయించిన చంద్రబాబు నేడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని మరోసారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అదే విధంగా స్టీల్ప్లాంట్లో పొట్టి శ్రీరాములు కూడలి వద్ద వైఎస్సార్ ట్రేడ్యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తానప్ప ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పార్టీ కో ఆర్డినే టర్ తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. పెందుర్తిలో.. పెందుర్తి కో ఆర్డినేటర్ అన్నంరెడ్డి అదీప్రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టా్టరు. పెందుర్తి బీఆర్టీఎస్ రహదారి నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దారు పాండురంగారెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా అదీప్రాజు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్స్ నడుపుతూ పదిమంది ప్రాణాలు తీసిన ట్రావెల్స్ యాజమాన్యాన్ని వదిలిపెట్టి బాధితులకు అండగా నిలబడిన జగన్మోహన్రెడ్డిపై కేసు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు సర్కారు దిగజారుడుతనానికి ఇది నిదర్శనమన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి గొర్లె రాము నాయుడు, మండల అధ్యక్షులు నక్కా కనకరాజు, తుంపాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భీమిలిలో.. భీమిలి, ఆనందపురం మండలాల్లో పార్టీ మండల కమిటీల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. భీమిలి పట్టణాధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఇక్కడ జిల్లా అధికార ప్రతినిధి ఎస్.కరుణాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వెల్లంపల్లి శ్రీనివాస్ సహా 20 మంది అరెస్ట్
విజయవాడ: వైఎస్ఆర్ సీపీ నేతలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద సంఘటనకు సంబంధించి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించినందుకు నిరసనగా ధర్నాకు దిగిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ సహా 20 మందిని అరెస్ట్ చేశారు. వారిని ఈ రోజు ఉదయం నుంచి ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో ఉంచారు. వెల్లంపల్లి శ్రీనివాస్పై నాన్బెయిలబుల్ కేసు పెట్టామని పోలీసులు చెప్పారు. కాగా కేసుల విషయంలో పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. పోలీసుల వైఖరికి నిరసనగా ఉంగుటూరు పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. -
వెల్లంపల్లి శ్రీనివాస్ సహా 20 మంది అరెస్ట్
-
చంద్రబాబే అధికారులతో మాట్లాడిస్తున్నారు
హైదరాబాద్: దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని రక్షించేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం విషయంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా తరలించేందుకు ప్రయత్నించారని, వైఎస్ జగన్ ఈ విషయం గురించి డాక్టర్, కలెక్టర్ను అడిగారని చెప్పారు. పోస్టుమార్టం చేయకపోవడం చట్టవిరుద్ధమని, పోస్టుమార్టం చేయకుండా మృతదేహాన్ని పంపిస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని వైఎస్ జగన్ అన్నారని, చట్టం గురించి మాట్లాడటం తప్పా అని అంబటి ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రశ్నించాకే డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో నీతినిజాయితీ ఉన్నవారు ఉన్నారని, పోస్టుల కోసం కక్కుర్తిపడేవారు ఉన్నారని అంబటి అన్నారు. ముఖ్యమంత్రులు పదవిలో ఐదేళ్లే ఉంటారని, ఐఏఎస్లు చాలాకాలం ఉంటారని చెప్పారు. వ్యవస్థలు శాశ్వతం తప్ప వ్యక్తులు కాదన్న విషయం మరిచిపోవద్దని, చంద్రబాబు చెప్పినట్టు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చేయడం సరికాదని అన్నారు. చంద్రబాబు జేబులో బొమ్మల్లా ఉండొద్దని, ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. ప్రొటోకాల్ పాటించాల్సిన బాధ్యత ఐఏఎస్, ఐపీఎస్లపై ఉందని, ప్రతిపక్ష నేతను గౌరవించాలని అన్నారు. దివాకర్ ట్రావెల్స్ నిబంధనలు పాటించకపోవడం వల్లే దుర్ఘటన జరిగిందని, అసలు నేరస్తులను వదిలి వైఎస్ జగన్ను నేరస్తునిగా చిత్రీకరించే యత్నం సరికాదనన్నారు. చంద్రబాబే అధికారులతో మాట్లాడిస్తున్నారని, వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని అంబటి పేర్కొన్నారు. చంద్రబాబుకు జైలు భయం పట్టుకుందని, ఓటుకు కోట్లు కేసులో తప్పించుకునేందుకు ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుని తిరుగుతున్నాని విమర్శించారు. -
చంద్రబాబే అధికారులతో మాట్లాడిస్తున్నారు
-
టికెట్ దొరక్క బతికి బయటపడ్డ భార్య
దివాకర్ ట్రావెల్స్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భర్త హైదరాబాద్: బస్ టికెట్ దొరక్క ఏపీలోని దివాకర్ ట్రావెల్స్ ఘోర ప్రమాదం నుంచి బతికి బయట పడ్డారు నగరానికి చెందిన లావణ్య. అయితే అదే బస్సులో ప్రయాణించిన ఆమె భర్త మధుసూదన్ రెడ్డి మృతి చెందారు. కుమారుడికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. జీడిమెట్ల పారిశ్రా మికవాడలోని ఓ పరిశ్రమలో సైట్ ఇంజనీర్గా పనిచేసే మధుసూదన్రెడ్డి 15 రోజుల క్రితం కంపెనీ పనిపై భువ నేశ్వర్ వెళ్లారు. అక్కడ అతనికి జ్వరం రావడంతో భార్య లావణ్య, కుమారుడు అభిలాష్రెడ్డి అక్కడకు వెళ్లి మధుసూదన్రెడ్డిని తీసుకుని హైదరా బాద్కు పయనమయ్యారు. అయితే రెండు టికెట్లే లభించడంతో కుమారు డితో కలసి మధుసూదన్రెడ్డి దివాకర్ ట్రావెల్స్లో, భార్య రైలులో హైదరాబాద్కు పయనమయ్యారు. ఇంతలో కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం జరగడంతో మధుసూ దన్రెడ్డి మృతి చెందగా.. అభిలాష్రెడ్డి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. -
తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ను నిషేధించాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి గరిడేపల్లి(హుజూర్నగర్): తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ను పూర్తిస్థాయిలో నిషేధించి ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన సోదరులు డాక్టర్ శేఖర్రెడ్డి, కృష్ణారెడ్డిల మృతదేహాలను సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కోదండరాం పురంలో బుధవారం ఆయన సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మృతుల తల్లిదండ్రులు శేషిరెడ్డి, కమలమ్మలను పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేవలం యజమాని నిర్లక్ష్యం, డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగి 11 ప్రాణాలు పోయాయన్నారు. దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం.. మృతులకు ఒక్కొ క్కరికి రూ. 25 లక్షల నష్ట పరిహారం అందించాలని, ఘటనకు దివాకర్ ట్రావెల్స్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రమాదస్థలానికి చేరుకొని మృత దేహాలను పరామర్శించేందుకు వెళ్లిన తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీడీపీ ప్రభుత్వం అడ్డుకోవటం సిగ్గుచేట న్నారు. జగన్ పట్ల అధికారులు వ్యవహరిం చిన తీరు బాధాకరమన్నారు. చంద్రన్న బీమా పథకం ఉంటే ఎక్స్గ్రేషియా ఇస్తామ నడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి మృతుల కుటుం బాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల చొప్పున నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్రెడ్డి, దొంతిరెడ్డి సైదిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త రామకృష్ణారెడ్డి, చిత్తలూరి సోమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విషాద వాటికలో దోషుల సేవ
- బస్సు ప్రమాదం ఘటనలో ప్రభుత్వ బాధ్యతను మరచిన అధికారులు - ప్రశ్నించిన ప్రతిపక్ష నేతపై కేసులతో ఎదురుదాడి - దివాకర్ ట్రావెల్స్ని కాపాడేందుకు ఆపసోపాలు - కలెక్టర్ నుంచి రవాణా, పోలీసులు, వైద్యుల వరకూ ఇదే తీరు - ప్రాథమిక అంశాలను గాలికొదిలి తూతూమంత్రంగా విచారణ సాక్షి, అమరావతి బ్యూరో: ఓ పెద్ద విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదం.. పది కుటుంబాలలో అంతులేని వ్యథను మిగిల్చింది.. ఆ కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ఆ ఘటనకు కారణమేమిటో కనుక్కోవద్దా..? బాధ్యతెవరిదో తేల్చవద్దా..? బాధ్యులెవరో కనిపెట్టి తగిన చర్యలు తీసుకుంటే కదా అలాంటి మరో ముప్పు నుంచి మనమందరం తప్పించుకోగలుగుతాం..! అది ప్రభుత్వ కనీస బాధ్యత. అది అధికారయంత్రాంగం కనీస విద్యుక్తధర్మం. కానీ అందరూ కలసికట్టుగా దానిని అటకెక్కించారు. కూడబలుక్కుని దోషులను రక్షించేందుకు కంకణం కట్టుకున్నారు. సాక్ష్యాలు పట్టించుకోరు.. మృతదేహాలకు పోస్టుమార్టం చేయించరు. రెండో డ్రైవర్ లేకపోయినా ఉన్నట్లు కనికట్టు చేస్తారు. అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీకి చెందిన ట్రావెల్స్ ఇబ్బందుల్లో పడిపోతుందని ఇంతమంది ఇన్ని రకాలుగా రక్షించే ప్రయత్నించడం బహుశా ఇంకెక్కడా మనం చూసి ఉండం. డాక్టర్లు, పోలీసులు, రవాణాశాఖ అధికారులు.. చివరకు జిల్లా కలెక్టర్ ఇలా అందరూ ఒక్కతాటిపై ఒక్కమాటపై నిలబడి దోషుల సేవలో తరించడం చూసి జనం నివ్వెరపోతున్నారు.. ‘‘ఇదేం న్యాయం? బాధితులకు ఇంత అన్యాయం చేస్తారా? ఇది మీకు తగదు’’ అని అన్న పాపానికి ప్రతిపక్షనేతపై కేసులు మోపే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రంలో అరాచకపాలన ఏ స్థాయికి చేరుకుందో తెలుసుకునేందుకు కృష్ణాజిల్లా ముండ్లపాడు వద్ద జరిగిన బస్సుప్రమాదం తాజా ఉదాహరణ.. వైద్యులకిది తగునా...:? మెడికో లీగల్ కేసుల్లో పోస్టుమార్టం అన్నది అత్యంత కీలకమైన అంశమని వైద్యులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నందిగామ ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు ఆ అంశానికి ప్రాధాన్యమివ్వకపోవడం విస్మయపరుస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగినపుడు డ్రైవర్ తాగి ఉన్నారా లేదా అన్నది తెలుసుకోవడం అతి ముఖ్యమైన అంశం. డ్రైవర్ బతికి ఉంటే బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించాలి. డ్రైవర్ మృతిచెందితే ఆయన శరీరభాగాలను పరిశీలించాలి. పోస్టుమార్టం చేయాలి. తుది నివేదిక కోసం నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాలి. కానీ దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో వైద్యులు ఈ ప్రాథమిక అంశాలన్నీ విస్మరించారు. (చదవండి: డెత్ ట్రావెల్స్!) పోలీసుల తీరూ అంతే... సంచలనం సృష్టించిన ఇలాంటి కేసుల విచారణ సందర్భంలో పోలీసులు ఎంతో జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. రెండో డ్రైవర్ ఉన్నాడా? ఉంటే ఎవరు? అన్న విషయాన్ని పోలీసులు నిర్ధారించాలి. కానీ మంగళవారం మధ్యాహ్నం తరువాత తానే రెండో డ్రైవర్ని అంటూ ఒకరు వస్తే ఎలాంటి ఆధారాలూ సరిపోల్చుకోకుండా పోలీసులు సరేనన్నారు. కానీ ఆయన నిజంగా రెండో డ్రైవరా కాదా అనేది నిగ్గుతేల్చాలని భావించనే లేదు. అంతవరకు కనిపించని ఆ డ్రైవర్ హఠాత్తుగా ఎక్కడినుంచి వచ్చాడనే దిశగా విచారించనే లేదు. ప్రమాదం సంభవించి 24గంటల తరువాత కూడా రెండో డ్రైవర్ ఎవరన్నది పోలీసులు వెల్లడించలేదు. ‘ట్రావెల్స్’ని కాపాడేందుకు రవాణా శాఖ తాపత్రయం బస్సు ప్రమాదం కేసులో దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కాపాడేందుకు రవాణా శాఖ అధికారులు శతవిధాలుగా ప్రయత్నించడం అనుమానాలకు తావిస్తోంది. డ్రైవర్ తాగి బస్సు నడపడం వల్ల ప్రాణనష్టం సంభవిస్తే ట్రావెల్స్ యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. డ్రైవర్ తాగి బస్సు నడిపాడా? లేక మరో కారణం వల్ల ప్రమాదం జరిగిందా అనేది పోస్టుమార్టం సవ్యంగా జరిగితే తేలే అవకాశం ఉండేది. మంగళవారం మధ్యాహ్నం 3గంటలవరకు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోయినా అధికారులు పట్టించుకోనే లేదు. పైగా ఫోరెన్సిక్ నివేదిక వచ్చే వరకూ కూడా ఆగకుండానే బుధవారం నాడు హడావిడిగా ఓ ప్రకటన విడుదల చేసేశారు. డ్రైవర్ తాగి లేడని వారంతట వారు తేల్చేశారు. ప్రమాదానికి ముందు డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది? మరో కీలకమైన అంశం. బీపీ, గుండెపోటు, కంటిచూపు ఇతరత్రా సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారికే విధులు అప్పగించాలి. అందుకోసం ట్రావెల్స్ యాజమాన్యం తమ డ్రైవర్లకు క్రమంతప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మరి దివాకర్ ట్రావెల్స్ ఆ నిబంధనలను పాటిస్తోందా లేదా అన్నది రవాణా శాఖ అధికారులు పట్టించుకోనే లేదు. ప్రమాదానికి గురైన బస్సుకు రెండో డ్రైవర్ ఉన్నారా?.. ఉంటే ఎవరు? కీలకమైన ఈ అంశాన్ని రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడమే లేదు. ప్రమాదం సంభవించిన చాలాసేపటి వరకు రెండో డ్రైవర్ ఎవరన్నది ఎవరూ చెప్ప లేదు. మంగళవారం మధ్యాహ్నం 3గంటల తరువాత ఒకర్ని తీసుకువచ్చి ఆయనే రెండో డ్రైవర్ అని చూపించారు. ప్రమాదం సంభవించినప్పుడు రెండో డ్రైవర్ బస్సు కింది భాగంలో ఉన్న డిక్కీలో నిద్రపోతున్నారని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బస్సు రన్నింగ్లో ఉన్నప్పుడు డిక్కీలో రెండో డ్రైవర్ నిద్రపోవడం అసాధ్యమని సీనియర్ ఆర్టీవో ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. తన 15ఏళ్ల అనుభవంలో ఇలాంటి విషయాన్ని చూడలేదని ఆయన చెప్పారు. గమ్యస్థానంలో బస్సును నిలిపి ఉన్నప్పుడు డీక్కీ తెరచి అందులో నిద్రించవచ్చన్నారు. అంతేగానీ బస్సు ప్రయాణిస్తున్నప్పుడు డిక్కీలో నిద్రపోవడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఏమాత్రం గాలి కూడా అందని డిక్కీలో ఉండలేరన్నారు. డ్రైవర్ సీటు వెనుకభాగంలోనే రెండో డ్రైవర్ విశ్రాంతి తీసుకునేందుకు బెర్త్ ఉంటుందన్నారు. దీంతో ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సుకు రెండో డ్రైవర్ ఉన్నారా అన్నది సందేహాస్పదంగా మారింది. రెండో డ్రైవర్ లేరన్న విషయాన్ని నిర్ధారిస్తే ట్రావెల్స్ యాజమాన్యం ప్రమాదానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం రెండో డ్రైవర్ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తడంతో అధికారులు గతుక్కుమన్నారు. రెండో డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నారని బుధవారం ఉదయం ప్రకటించారు. కలెక్టర్ అలా ఎందుకు వ్యవహరించారు? ఏదైనా ప్రమాదంగానీ విపత్తుగానీ సంభవిస్తే సంబంధిత అన్ని విభాగాలను సమన్వయపరుస్తూ తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్దే. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు శాస్త్రీయంగా చర్యలు చేపట్టారా లేదా అన్నది కలెక్టర్ పరిశీలించాలి. ప్రమాద కారణాలను తెలుసుకోవడానికి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించాల్సిన బాధ్యత పోలీసు అధికారులది. పోస్టుమార్టం చేయాల్సింది వైద్యులు. పోలీసులు, వైద్యులు ఆ విధంగా వ్యవహరించకపోతే కలెక్టర్ స్పందించాలి. పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించాలి. జిల్లా మేజిస్ట్రేట్గా ఆయనకు విచక్షణాధికారాలు ఉన్నాయి. కానీ దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద అనంతరం కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ.బాబు. ఆ అంశానికే ప్రాధాన్యమివ్వలేదు. ఉదయం 5.45గంటలకు ప్రమాదం సంభవించింది. దాదాపు 10గంటల సమయంలో డ్రైవర్ మృతదేహం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. కలెక్టర్ బాబు దాదాపు మధ్యాహ్నం 1గంట సమయంలో ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ సాయంత్రం 3 గంటలకు ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వచ్చేవరకు కూడా డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయనే లేదు. జగన్మోహన్రెడ్డి అడిగినపుడు ఆ విషయాన్ని వైద్యులే చెప్పారు. డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని కలెక్టర్ ఆదేశించకపోవడం, పైగా జగన్ అడిగితే అన్ని మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని చెప్పడం ప్రశ్నార్థకంగా మారాయి. పోస్టుమార్టం చేయకుండానే డ్రైవర్ మృతదేహాన్ని ఆయన స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రి తరలించేందుకు అధికారులు ఎందుకు ఏర్పాట్లు చేసినట్లు? -
రాంగ్ రూట్
-
ట్రావెల్స్పై కాకుండా జగన్పై కేసులా?
-
ట్రావెల్స్పై కాకుండా జగన్పై కేసులా?
విజయవాడ: దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కాపాడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అందుకే శవరాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దివాకర్ రెడ్డి ట్రావెల్స్ కాబట్టే డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయలేదన్నారు. వాస్తవాలు వెల్లడవుతాయన్న భయంతోనే పోస్టుమార్టం చేయలేదని తెలిపారు. దివాకర్ ట్రావెల్స్పై కాకుండా వైఎస్ఆర్సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు పెట్టడం విడ్డురంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం చంద్రబాబుకు అలవాటైందని పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని అంబటి స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా నందిగామ మండలం ముండ్లపాడు వద్ద మంగళవారం దివాకర్ ట్రావెల్స్కు చెందిన బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను వాకబు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే మూటకట్టేయడం, రహస్యంగా తరలించే ప్రయత్నం చేయడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, నందిగామ ప్రభుత్వాస్పత్రిలో వైఎస్ఆర్సీపీ నేతలు కలెక్టర్తో దురుసుగా ప్రవర్తించారని టీడీపీ నేత వాసిరెడ్డి సత్యనారాయణ ప్రసాద్ బుధవారం నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హుటాహుటీన కేసు నమోదు చేయడం గమనార్హం. వైఎస్ జగన్ సహా పార్టీ నేతలు పార్థసారధి, ఉదయభాను, జోగి రమేష్, అరుణ్ కుమార్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది విధులుకు ఆటంకం కలిగించారంటూ వైఎస్ జగన్ సహా పార్టీ నేతలపై సెక్షన్ 353, 503,34 కింద కేసులు నమోదు అయ్యాయి. -
ప్రశ్నిస్తే ఉలిక్కిపాటు ఎందుకు?: ఎమ్మెల్యే రోజా
-
వైఎస్ జగన్పై కేసు నమోదు
విజయవాడ : ప్రతిపక్ష పార్టీపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఎదురుదాడికి దిగింది. ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు నమోదు అయింది. వైఎస్ జగన్ సహా పార్టీ నేతలు పార్థసారధి, ఉదయభాను, జోగి రమేష్, అరుణ్ కుమార్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది విధులుకు ఆటంకం కలిగించారంటూ వైఎస్ జగన్ సహా పార్టీ నేతలపై సెక్షన్ 353, 503,34 కింద కేసులు నమోదు అయ్యాయి. నందిగామ ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్పై దురుసుగా ప్రవర్తించారని టీడీపీ నేత వాసిరెడ్డి సత్యనారాయణ ప్రసాద్ బుధవారం నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హుటాహుటీన కేసు నమోదు చేయడం గమనార్హం. కాగా రాజకీయ కక్షతోనే టీడీపీ నేతలతో ఫిర్యాదు చేయించి ప్రతిపక్షంపై కేసులు నమోదు చేయిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు వ్యాఖ్యానించారు. కాగా కృష్ణాజిల్లా నందిగామ మండలం ముండ్లపాడు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్న ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను వాకబు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే మూటకట్టేయడం , రహస్యంగా తరలించే ప్రయత్నం చేయడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సంబంధిత వార్తలు.... ఇలాగైతే జైలుకెళ్తారు -
వైఎస్ జగన్పై కేసు నమోదు
-
పోస్ట్ మార్టం చేయకుండా ప్యాకింగా ?
-
కృష్ణా జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
-
ట్రావెల్స్ యాజమాన్యాలకు చంద్రబాబు అండ
-
అన్నదమ్ముల మృతితో జిల్లాలో విషాదం
-
అతి వేగమే బస్సు ప్రమాదానికి కారణం
-
ఇలాగైతే జైలుకెళ్తారు
⇒ డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోయినా చేసినట్లు కలెక్టర్ చెప్పడంపై జగన్మోహన్రెడ్డి ఆగ్రహం ⇒ డ్రైవర్ తాగి ఉన్నాడో లేదో తెలిసేదెలా? ⇒ టీడీపీ ఎంపీ ట్రావెల్స్ కాబట్టి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ⇒ రిపోర్ట్ కాపీ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి? సాక్షి, అమరావతిబ్యూరో: రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే మూటకట్టేయడం , రహస్యంగా తరలించే ప్రయత్నం చేయడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్న జగన్మోహన్రెడ్డి ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను వాకబు చేశారు. అనంతరం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ప్రమాద కారణాలను గుర్తించడానికి తీసుకున్న చర్యలపై అధికారులు సూటిగా సమాధానం చెప్పలేదు. అక్కడే మూటగట్టి ఉన్న డ్రైవర్ ఆదినారాయణ మృతదేహాన్ని చూస్తూ వైద్యులను జగన్ ప్రశ్నించారు. ‘‘డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేశారా?’’ అని అడగ్గా డాక్టర్ స్పందిస్తూ... ‘‘ఆ!... ఇంకా చేయలేదు. చేస్తాం’’ అంటూ ముక్తసరిగా సమాధానం చెబుతూ కొన్ని నివేదికల ప్రతులు చూపించారు. ఆ నివేదికలను చూసి వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోతే ప్రమాదానికి గల కారణాలు ఎలా తెలుస్తాయి? తాగి ఉన్నారో లేదో తెలుసుకోవద్దా? పోస్టుమార్టం చేయకుండానే మృతదేహాన్ని ఎందుకు మూటగట్టేశారు? గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని నిలదీశారు. అదే విషయాన్ని అక్కడే ఉన్న కలెక్టర్ బాబు.ఎను కూడా అడిగారు. పోస్టుమార్టం చేయలేదని డాక్టర్ ఓ వైపు చెబుతుండగా కలెక్టర్ మాత్రం మాట దాటవేసేందుకు యత్నించడం గమనార్హం. ‘‘బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా అడుగుతుంటే సరైన సమాచారం ఇవ్వరా? ట్రావెల్స్ యాజమాన్యం టీడీపీ ఎంపీకి చెందినది కాబట్టి తప్పును కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారా?’’ అని ప్రశ్నించారు. వైద్యులు రూపొందించిన రిపోర్టు కాపీలను తాను తీసుకుంటానని చెప్పారు. అప్పటికే కలెక్టర్ ఆగ్రహంతో చూస్తుండటంతో ఆ డాక్టర్ తడబడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతి నుంచి పత్రాలను తీసుకునేందుకు యత్నించారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. ‘‘ఆ పత్రాలు నేను ఉంచుకుంటాను. మూడు కాపీలు తయారు చేస్తారు కదా? మిగిలిన కాపీలు మీ వద్ద ఉంటాయి కదా’’ అని అన్నారు. తన వద్ద ఇక కాపీలు లేవని చెబుతూ డాక్టర్ వాటిని తీసుకునేందుకు మరోసారి యత్నించారు. దాంతో వైఎస్ జగన్ స్పందిస్తూ... ‘‘మీరు జిరాక్స్లు తీసుకోండి. నా వద్ద ఈ కాపీలు ఉండనివ్వండి’’ అని చెప్పారు. కానీ, కలెక్టర్ మాత్రం ఆ పత్రాలు ఇచ్చేయాలని జగన్తో చెప్పడం గమనార్హం. దీనిపై జగన్ తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతకు సమాచారం ఇవ్వరా? పత్రాలు ఇవ్వరా? నాకు అధికారులు అంటే పూర్తి గౌరవం ఉంది. పోస్టుమార్టం జరగకపోయినా జరిగినట్లు చెప్పడం, ఇలా ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం సరికాదు. బాధితులకు న్యాయం జరిగేలా వ్యవహరించకపోతే అందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుంది’’ అని స్పష్టం చేశారు. నిబంధనలకు నీళ్లొదిలేశారు బస్సు ప్రమాదానికి గల కారణాలను విచారించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ ఆదినారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. నిబంధనల ప్రకారం... ఆ డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేశాడా లేదా అన్నది నిర్ధారించాలి. అందుకు మృతదేహానికి పోస్టుమార్టం చేయడం ఒక్కటే మార్గం. ఆ విషయాన్ని అధికారులు ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. డ్రైవర్ మృతదేహాన్ని ప్యాక్ చేసి, ఆయన స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక బస్సులో ఉండాల్సిన రెండో డ్రైవర్ ఏమయ్యాడో పోలీసులు, అధికారులు పట్టించుకోలేదు. రెండో డ్రైవర్కు లైసెన్స్ ఉందా? అతడు కూడా తాగి ఉన్నాడా? అనే విషయాలను తెలుసునేందుకు అధికారులు ప్రయత్నించిన పాపానపోలేదు. మధ్యాహ్నం 1.45 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ కూడా అలాగే వ్యవహరించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నారా లేదా అన్నది పరిశీలించలేదు. పోస్టుమార్టం తప్పనిసరి స్పష్టం చేస్తున్న న్యాయ, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్, మరికొందరు మృతుల దేహాలకు పోస్టుమార్టం చేయకుండానే వారి దేహాలను తరలించే ప్రయత్నం జరిగింది. అసలు ఈ విధంగా పోస్టుమార్టం చేయకుం డా మృతదేహాలను తరలించవచ్చా అంటే అలా కుదరదని, అది చట్ట రీత్యా నేరమని న్యాయ, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రమాదాల్లో మృతుల దేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం మన దేశంలోనే కాదు.. అనేక దేశాల్లో చట్ట ప్రకారం తప్పనిసరి అని వారు చెబుతున్నారు. ముఖ్యంగా మంగళవారం జరిగిన ప్రమాదం వంటి ఘటనల్లో పోస్టుమార్టం నివేదిక అత్యంత కీలక సాక్ష్యమని, ఇది లేకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు, ఇతర ప్రయోజనాలు కోరడం సాధ్య పడదని వారు చెబుతున్నారు. అందువల్ల పోస్టుమార్టం చేయకపోవడం మృతుల కుటుంబాలకు అన్యాయం చేయడమేనని తెలిపారు. ప్రమాదానికి గురైన వాహన డ్రైవర్ చనిపోతే అతని మృతదేహానికి తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలని స్పష్టంగా చెప్పారు. ఏ కారణం చేత ప్రమాదం జరిగిందో అతని పోస్టుమార్టం నివేదిక ద్వారా ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పోస్టుమార్టం బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని, ఈ నివేదికలు లేకుండా చట్ట ప్రకారం ముందుకెళ్లడం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. -
ట్రావెల్స్ యాజమాన్యాలకు చంద్రబాబు అండ
నిబంధనలు ఉల్లంఘించినా పట్టదా?: వైఎస్ జగన్ ⇒ డ్రైవర్ తాగాడో లేదో తెలియదంటున్నారు ⇒ మృతదేహానికి పోస్టుమార్టం కూడా చేయలేదు ⇒ రెండో డ్రైవర్ను తప్పించి.. కొత్త డ్రైవర్ను తెస్తున్నారు ⇒ మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు ఇవ్వాలి ⇒ ఘటనా స్థలాన్ని సందర్శించిన ప్రతిపక్ష నేత ⇒ నందిగామ ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘నిర్లక్ష్యంగా బస్సులు నడిపి ప్రయాణికుల మృతికి కారణమైన ట్రావెల్స్ యాజమాన్యాలను కాపాడేందుకు ప్రభు త్వం ప్రయత్నిస్తోంది. బస్సు నడిపిన డ్రైవర్ తాగి ఉన్నాడో లేదో పరీక్షలు చేయలేదు. రెండో డ్రైవర్ను తప్పించారు. ట్రావెల్స్ యజమానులైన టీడీపీ ఎంపీలకు ముఖ్య మంత్రి చంద్రబాబు అండగా నిలుస్తున్నారు. నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘి స్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు సమీపంలోని ముండ్లపాడు గ్రామానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను ఓదార్చారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ, పోలీసులు, వైద్యులతో మాట్లాడి సహాయక, వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లా డారు. మృతుల కుటుంబాలకు బస్సు యాజమాన్యం నుంచి రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ‘‘ప్రమాదంలో చనిపోయినవారి మృత దేహాలకు పోస్టుమార్టం చేయకపోయినా చేసినట్లుగా చూపిస్తున్నారు. డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడిపాడా లేదా అనేదానిపై పోస్టుమార్టం చేశారా? అని అడిగితే.. చేయలేదని డాక్టర్లు చెబుతున్నారు. డ్రైవర్ మద్యం తాగి బస్సు నడిపాడో లేదో తెలియ దని అంటున్నారు. పోస్టుమార్టం చేస్తే డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడో లేదో తెలుస్తుంది కాబట్టి ఏకంగా మృతదేహాన్ని మూట గట్టేశారు. ఫోరెన్సిక్ పరీక్షలూ చేయలేదు. రెండో డ్రైవర్ ఏమయ్యాడు? బస్సు భువనేశ్వర్ నుంచి బయల్దేరి హైదరాబాద్కు వస్తోంది. బస్సు కాంట్రాక్ట్ క్యారియరా? స్టేజ్ క్యారియరా? అని అడిగితే కలెక్టర్ సమాధానం చెప్పడం లేదు. రెండో డ్రైవర్ ను తీసుకొచ్చామని కలెక్టర్ అంటున్నారు. ఆయన ఎక్కడున్నాడని అడిగితే.. వెళ్లిపోయాడని చెబుతున్నారు. అతడిని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? ఎందుకు పంపించేశారు? రెండో డ్రైవర్ తాగకపోయి ఉంటే, అతడి వద్ద లైసెన్స్ ఉంటే ఆయనను ఇక్కడే ఉంచే వారు. రెండో డ్రైవర్ తాగి అయినా ఉండాలి లేదా అతడికి లైసెన్స్ లేకపోయి అయినా ఉండాలి. ఈ రెండు కారణాల్లో ఏదో ఒకటి ఉంది కాబట్టే అతడిని తప్పించారు. ఇప్పుడు కొత్త డ్రైవర్ను తీసుకొస్తారు. అతడే రెండో డ్రైవరంటూ ఒక పద్ధతి ప్రకారం బస్సు యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతోంది. ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? తప్పు చేసిన వారిని ప్రశ్నించాలి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని అంటున్నారు. ఇది సరైంది కాదు. బస్సు యాజమాన్యం నుంచి రూ.20 లక్షలకు తక్కువ కాకుండా పరిహారం ఇప్పిస్తేనే ఇలాంటి ప్రమాదాలు ఆగుతాయి. లేకపోతే భవిష్యత్తులోనూ పునరావృతం అవుతూనే ఉంటాయి. ట్రావెల్స్ యాజమాన్యాలను ప్రభు త్వం ఇలాగే రక్షిస్తూ పోతే రేపు ఇంకెంతో మంది బలయ్యే ప్రమాదం ఉంది. ప్రజల ప్రాణాలను మింగేస్తున్న బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు మౌనంగా ఉండిపోవద్దు. పోలీసులు లోతుగా విచారణ చేపట్టాలి. తప్పు చేసిన వారిని ప్రశ్నిం చాలి. మృతుల కుటుంబాలకు యాజమాన్యాల నుంచి కనీసం రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాలి. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో ఆలోచించాలి. మృతుల కుటుంబాలకు అందరూ తోడుగా నిలవాలి’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. లైసెన్స్ ఉందో లేదో కూడా చూడరు గతంలో కూడా కేశినేని ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాల కు కారణమయ్యాయి. ఈ ట్రావెల్స్ యజమానులు అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీలే. వీరికి సీఎం చంద్రబాబు దగ్గరుండి మరీ అండగా నిలుసు ్తన్నారు. అందుకే నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ఒకే బస్సు పర్మిట్తో మూడు నాలుగు బస్సులు తిప్పుతున్నారు. కాంట్రాక్టు క్యారియర్కు అనుమతి తీసుకొని, నిబం ధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారియర్ కింద బస్సులు నడిపిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ నిలిపేస్తూ ప్రయాణికు లను ఎక్కించుకుంటున్నారు. డ్రైవర్లు మద్యం సేవించి నిర్లక్ష్యంగా బస్సు నడిపినా పట్టించుకునేవారే ఉండరు. వారికి కనీసం లైసెన్స్ ఉందో లేదో కూడా చూడరు. -
ఉత్తమ వైద్య సేవలందించండి
సీఎం చంద్రబాబు ఆదేశం సాక్షి, అమరావతి: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై మంగళవారం వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలందించాలని అధికారులను ఆదేశించారు. చికిత్స, సహాయ ఏర్పాట్లను పర్యవేక్షించాలని జిల్లా మంత్రులకు సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు చెప్పాలని హోంమంత్రి, జిల్లా మంత్రులకు సూచించారు. మంగళవారం డీజీపీ సాంబశివరావు సచివాలయంలో సీఎంను కలసి ప్రమాదం, అందుకు కారణాలు, తర్వాత పరిణామాలను వివరించారు. కాగా, సచివాలయంలో సీఎం చంద్రబాబు గ్రేట్ లేక్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, చాన్సలర్ డాక్టర్ వి.బాలచంద్రన్ బృందంతో సమావేశమయ్యారు. మరోవైపు అమరావతిలో ఎయిమ్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల్ని పదిరోజుల్లోగా ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం పేరును మారుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఇకనుంచి ఎస్సీ, ఎస్టీ సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి నిధిగా వ్యవహరించాలని నిర్ణయించారు. -
బస్సు ప్రమాదం దురదృష్టకరం
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి అనంతపురం అర్బన్: బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని, ఇందుకు తాము చాలా బాధపడుతున్నామని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి అన్నారు. బస్సుకు ఏమైనా తమకు చింత లేదని, ప్రమాదంలో పలువురు మరణించడం, గాయపడడం బాధపెట్టిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా దీపక్రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన దివాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. బస్సుకు జీపీఎస్ ఉందని, ప్రమాద సమయంలో 70 నుంచి 72 కిలోమీటర్ల వేగంతోనే వెళుతోందని చెప్పారు. ఏదైనా అడ్డొచ్చి ఉంటే తప్పించే ప్రయత్నంలో గానీ, లేదా డ్రైవర్ నిద్రమత్తులో ఉండి గానీ ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుకుంటున్నామన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇస్తామన్నారు. మృతిచెందిన డ్రైవర్, క్లీనర్ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. సంబంధిత వార్తలు చదవండి కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం నిబంధనలు గాలికి.. ప్రాణాలు గాల్లోకి!