రోజురోజుకు చిన్నమ్మ బలం తగ్గిపోతోంది. శశికళ వర్గంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మెల్లమెల్లగా జారుకుంటున్నారు. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం గూటికి చేరుతున్నారు. తాజాగా మరో ఐదుగురు అన్నాడీఎంకే మంత్రులు శశికళ శిబిరం నుంచి జంప్ అయినట్టు సమాచారం. ఇప్పటికే ఇద్దరు మంత్రులు (విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్, మత్య్సశాఖ మంత్రి జయకుమార్) ఓపీఎస్కు జై కొట్టగా.. మరో ఐదుగురు కూడా సెల్వం వైపు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.