sasikala
-
చిన్నమ్మ రీఎంట్రీ.. ఆమె వెనుక ఎవరున్నారు?
శశికళ మరోసారి శపథం చేశారు. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. అన్నాడీఎంకేలో చేరి మళ్లీ అమ్మ పాలన తెస్తానంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో తమిళనాట కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేచింది. అసలు.. శశికళ ఎంట్రీ వెనుక కారణమేంటి..? ఇది ఆమె సొంత నిర్ణయమా.? లేక ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా..? తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ యాక్టివ్ అయ్యారు. రాజకీయాల్లో రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన మద్దతుదారులతో సమావేశమైన శశికళ కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే పార్టీలోకి తన రీఎంట్రీకి సమయం ఆసన్నమైందంటూ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోకి తన పున:ప్రవేశం మొదలైందని చెప్పారు. ఇటీవలే వెలువడిన లోక్సభ ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఏఐఏడీఎంకే పతనమవుతుందని భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆమె.. తిరిగి అమ్మ పాలనకు నాంది పలుకుతామని వెల్లడించారు. ఇదే క్రమంలో అన్నాడీఎంకే నేత పళనిస్వామిపై విమర్శలు గుప్పించారు శశికళ. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నేతగా తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ తేల్చిచెప్పారు. ఇక.. తమిళనాడు ప్రజలు తమవైపే ఉన్నారని తెలిపారు శశికళ. అన్నాడీఎంకే కథ ముగిసిపోలేదని.. తన రీ ఎంట్రీతో ఇప్పుడే ప్రారంభమయ్యిందంటూ తన మద్దతుదారుల్లో ఆమె ఉత్సాహం నింపారు. ఎంజీఆర్, జయలలిత హయాంలో అన్నాడీఎంకే చెక్కుచెదరలేదని స్పష్టం చేశారు. కానీ.. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. పార్టీలో కుల రాజకీయాలను కార్యకర్తలు సహించరంటూ ఇండైరెక్ట్గా పళనిస్వామిని టార్గెట్ చేశారు శశికళ. జయలలిత కుల ప్రాతిపదికన రాజకీయాలు చేసి ఉంటే 2017లో పళనిస్వామి సీఎం అయి ఉండేవారు కాదని విమర్శించారు. అయినా.. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు శశికళ. దీని కోసం ప్రయత్నాలను మొదలు పెట్టానని వివరించారు.ఇప్పుడు.. శశికళ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉంది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లడంపై వ్యూహాలు రచిస్తున్నాయి. డీఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. నిజానికి.. లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒక్క సీటూ గెలవలేదు. చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి డీఎంకేకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇదే ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో శశికళ ఎంట్రీ హాట్ టాపిక్గా మారింది. అన్నాడీఎంకే విజయంతో మళ్లీ అమ్మ పాలన తీసుకొస్తానంటూ ప్రకటించడం సంచలనంగా మారింది.శశికళ ఎంట్రీని పళనిస్వామి ఒప్పుకుంటారా..? అంటే కష్టమే అని చెప్పాలి. గతంలోనూ అన్నాడీఎంకేలో ఎంట్రీకోసం ప్రయత్నాలు చేసి ఆమె విఫలమయ్యారు. అప్పుడు పన్నీరు సెల్వం.. పళనిస్వామి ఒక్కటిగా ఉండి శశికళకు ఎంట్రీ లేకుండా చేశారు. ఆ తర్వాత పార్టీపై పట్టుపెంచుకున్న పళనిస్వామి.. పన్నీరు సెల్వంను సైతం బయటకునెట్టారు. కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నా.. ఇప్పటికిప్పుడు పళనిస్వామిని కాదని.. శశికళకు పార్టీ నేతలు పగ్గాలు అప్పగించే పరిస్థితి కూడా లేదు. మరికొందరు పన్నీరుసెల్వంను తిరిగి పార్టీలో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో శశికళ ఎంట్రీతో సీన్ ఎలా మారుతుందనేది ఆసక్తిగా మారింది.మరోవైపు.. అన్నాడీఎంకేతో పాటు తమిళనాడులో బీజేపీ పరిస్థితి కూడా అంతంతమాత్రమే. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి బొక్కాబోర్లా పడింది బీజేపీ. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గెలుస్తారంటూ విపరీతంగా పబ్లిసిటీ చేసినా.. చివరికి ఆ సీటును కూడా గెలుచుకోలేకపోయింది కమలం పార్టీ. అటు.. పార్టీలోని కీలక నేతల మధ్య కూడా సమన్వయ లోపం ఉంది. బీజేపీ కీలక నేత తమిళి సై, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై మధ్య విభేదాలు ఉన్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ మధ్యే అమిత్ షా బహిరంగంగా తమిళి సైని వారించింది కూడా ఇదే విషయంపై అని ప్రచారం జరిగింది. అది నిజమో కాదో తెలియదు కానీ.. అమిత్ షా మాట్లాడిన తర్వాత.. అన్నామలై, తమిళి సై భేటీ అయ్యారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలోనే శశికళ ఎంట్రీ ఇవ్వడం యాథృచ్చికం కాదంటున్నారు విశ్లేషకులు. శశికళ ఎంట్రీ వెనుక బీజేపీ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో టీటీవీ దినకరన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీతో కూటమిగా ఏర్పడి దినకరన్ పార్టీ పోటీ చేసింది. దీంతో దినకరన్ ద్వారానే ఇప్పుడు శశికళను బీజేపీ రంగంలోకి దింపిందని అంతా భావిస్తున్నారు. పన్నీరుసెల్వం, దినకరన్, శశికళ చేరిన అన్నాడీఎంకే తో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటే.. డీఎంకేను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్నది బీజేపీ భావనగా తెలుస్తోంది. మరి నిజంగానే శశికళ అన్నాడీఎంకేలోకి ఎంట్రీ ఇస్తుందా..? ఇచ్చినా ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా.? ఈలోపు తమిళ రాజకీయాల్లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. -
టైం వచ్చింది.. నా రీఎంట్రీ మొదలైంది: శశికళ
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే రాజకీయాలలో తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ వ్యాఖ్యానించారు. చైన్నెలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే కార్యకర్తల పార్టీ అని అన్నారు. ఈ పార్టీని దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత చెక్కు చెదరకుండా పరిరక్షించారని వివరించారు. అయితే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన, మనో వేదనకు గురి చేస్తున్నాయన్నారు. కుల మతాలకు అతీతంగా అన్నాడీఎంకేలో అందర్నీ దివంగత నేత జయలలిత చూసే వారు అని గుర్తుచేశారు. కుల, మతం చూసి ఉంటే తనను దగ్గర చేర్చి ఉంటారా? అని ప్రశ్నించారు. ఆమెకు అందరూ సమానం అని, అందుకే ఆమెను ప్రజలు అమ్మగా కొలుస్తూ వస్తున్నారన్నారు. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకేలోకి కులం ప్రవేశించిందని, ఓ సామాజిక వర్గంకు చెందిన వారు వ్యక్తిగత స్వలాభం, ఆధిపత్యం దిశగా చేస్తున్న ప్రయత్నాలు పార్టీని పాతాళంలోకి నెడుతున్నదని ఆరోపించారు. అన్నాడీఎంకే అంటే ఒకే కుటుంబం అని, ఇది కార్యకర్తల పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అంటే ఒకే కుటుంబం అని ఆ కుటుంబానికి చెందిన వారికే అందులో పదవులు ఉంటాయని విమర్శించారు. డీఎంకే విధానాన్ని అన్నాడీఎంకేలోకి అనుమతించే ప్రసక్తేలేదన్నారు. తన లక్ష్యం ఒక్కటే అని అందర్నీ ఏకం చేయడం అన్నాడీఎంకేను బలోపేతం చేసి రానున్న ఎన్నికలలో విజయంతో అధికారం చేజిక్కించుకోవడమేనని అన్నారు. ఇందుకోసం తన ప్రయత్నం మొదలెట్టానని, తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని, ఇక, మరింత వేగంగా ముందుకెళ్లబోతున్నట్టు శశికళ తెలిపారు. -
జయలలితపై అన్నామలై వ్యాఖ్యలు... ఖండించిన శశికళ
చెన్నై: దివంగత అన్నాడీఎంకే అధినేత జయలలిత గొప్ప హిందుత్వ నాయకురాలని బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై జయలలితను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.అయోధ్యలో రామజన్మభూమిని నిర్మించాలని కోరుకున్న తొలి బీజేపీయేతర నేత జయలలిత అని అన్నామలై చెప్పారు. 2014కు ముందు తమిళనాడులో హిందూ ఓటర్లంతా జయలలితవైపే మొగ్గు చూపేవారని గుర్తు చేశారు. అయితే జయలలితపై అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలను ఆమె నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ కీలక నేత శశికళ ఖండించారు. జయలలితను ఏ ఒక్కవర్గానికో పరిమితం చేయడం సరికాదన్నారు.ఎంజీఆర్, అన్నాదురై బాటలో అన్ని వర్గాల కోసం జయలలిత కృషి చేశారని కొనియాడారు. అన్నామలై వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని శశికళ కొట్టిపారేశారు. -
స్టే ఉండగా.. పీటీ వారెంట్ ఎలా జారీ చేస్తారు?
సాక్షి, చైన్నె: పరప్పన అగ్రహార జైలులో లగ్జరీ జీవితం గడపిన వ్యవహారంలో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ, ఈమె వదినమ్మ ఇలవరసిపై పీటీ వారెంట్ జారీ అయ్యింది. బెంగళూరు లోకాయుక్త మంగళవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో స్టే ఉండగా ఎలా..? వారెంట్జారీ చేస్తారని చిన్నమ్మ తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. వివరాలు.. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళ, ఆమె వదినమ్మ ఇలవరసి బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో జైలు శిక్షను అనుభవించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో వీరు ఆ జైల్లో లగ్జరీ జీవితాన్ని గడిపినట్టు వెలుగులోకి వచ్చింది. జైలు నుంచి తరచూ బయటకు షాపింగ్కు వెళ్లడం వంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చాయి. జైళ్ల శాఖలో పనిచేస్తున్న అధికారులు అవినీతికి మరిగి, లంచం పుచ్చుకుని చిన్నమ్మ, వదినమ్మకు లగ్జరీ జీవితం గడిపే అవకాశం కల్పించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై నియమించిన కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు బెంగళూరు ఏసీబీ అధికారులు శశికళ, ఇలవరసిని కూడా టార్గెట్ చేశారు. విచారణకు హాజరుకాకపోవడంతో.. ఈకేసులో తొలి నిందితుడిగా అక్కడి జైళ్ల శాఖ పర్యవేక్షణాధికారి కృష్ణకుమార్, పరప్పన అగ్రహార జైలు అధికారులు అనిత, సురేష్ నాగరాజ్కు సంబంధించిన కేసు లోకాయుక్త కోర్టులో విచారణకు వచ్చింది. కేసు తొలి నిందితులిగా జైలు పర్యవేక్షణాధికారి కృష్ణకుమార్, పరస్పన అగ్రహార అధికారులు అనిత, సురేష్ నాగరాజ్ను రెండు, మూడు, నాలుగో నిందితులుగా పేర్కొన్నారు. అలాగే, ఐదు, ఆరో నిందితులుగా శశికళ, ఇలవరసి ఉన్నారు. ఈ కేసు బెంగళూరు లోకాయుక్తలో విచారణలో ఉంది. ఈ విచారణకు నేరుగా హాజరు కావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గతంలో కోర్టును ఆశ్రయించారు. మినహాయింపు పొందారు. అయితే, అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలని కోర్టు ఇది వరకు సూంచింది. ఆ మేరకు పలుమార్లు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. అయితే, విచారణకు ఈ ఇద్దరు వెళ్లలేదు. దీంతో లోకాయక్త కోర్టు కన్నెర్ర చేసింది. ఈ ఇద్దరికీ పిటీ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబరు 6వ తేదీకి వాయిదా పడింది. కాగా చిన్నమ్మను అరెస్టు చేస్తారేమో అన్న బెంగ ఆమె మద్దతు దారులలో నెలకొంది. అయితే కోర్టు విచారణకు హాజరు కావడంలో కోర్టు మినహాయింపు ఉన్నా.. ఎలా వారెంట్ జారీ చేస్తారని, దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని చిన్నమ్మ న్యాయవాదులు వెల్లడించారు. -
పన్నీరు, టీటీవీ, శశికళ మద్దతుదారులే టార్గెట్
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే నుంచి ఉద్వాసనకు గురైన పన్నీరు సెల్వం, టీటీవీ దినకరన్ మద్దతు దారులను పార్టీలోకి ఆహ్వానించడమే లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ముగ్గురు మినహా తక్కిన నాయకులు అందరూ పార్టీలోకి రావాలని పిలుపు నివ్వడమే కాకుండా, ఆయా జిల్లాలోని పార్టీ నేతల ద్వారా మంతనాలు జరిపి పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టినానంతరం మదురై వేదికగా మహానాడును పళణి స్వామి విజయవంతం చేసుకుని మంచి జోష్ మీదున్నారు. మాజీ సీఎం పన్నీరుసెల్వం, అమ్మ మక్కల్మున్నేట్ర కళగం నేత దినకరన్, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న దక్షిణ తమిళనాడులో తన బలాన్ని నిరూపించుకునే విధంగా పళణి స్వామి సఫలీకృతులయ్యారు. మహానాడుకు 15 లక్షల మంది వచ్చినట్టుగా స్వయంగా పళణిస్వామి ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో దక్షిణ తమిళనాడులో తన బలాన్ని మరింత పెంచుకునేందుకు సిద్ధమయ్యా రు. పార్టీ కిందిస్థాయి కేడర్ అంతా తన వెన్నంటి ఉండడంతో, ద్వితీయ శ్రేణి, జిల్లాస్థాయిలో కీలకంగా ఉన్న పన్నీరు, టీటీవీ, శశికళ మద్దతు నాయకులను తన వైపునకు తిప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ముగ్గురు నాయకులు మినహా తక్కిన వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తూ ప్రకటన చేశారు. తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న మదురై కోటలో పళణి స్వామి తన బలాన్ని నిరూపించుకు వెళ్లడంతో ఆయన వెన్నంటి నడిచేందుకు పన్నీరు, టీటీవీ, శశకళ మద్దతుదారులు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. వీరందరినీ పార్టీలోకి మళ్లీ తీసుకొచ్చే బాధ్యతలను ఆయా జిల్లాలోని నేతలకు పళణి స్వామి అప్పగించారు. -
చిన్నమ్మ షాక్
సాక్షి, చైన్నె: ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో నెలకొన్న వర్గ విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యాయ పోరాటం ద్వారా, మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల మద్దతుతో అన్నాడీఎంకేను మాజీ సీఎం పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. ఇక పళణి స్వామి తనను దూరం పెట్టడంతో వేరు కుంపటి పెట్టిన మరో మాజీ సీఎం పన్నీరు సెల్వం ఆ పార్టీని ఎలాగైనా కై వసం చేసుకోవడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. ఇందులో భాగంగా గతంలో అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో రాజకీయ పయనం సాగిస్తున్న టీటీవీ దినకరన్ను చేతులు కలిపారు. ఒకప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరు ప్రస్తుతం మంచి మిత్రులయ్యారు. అలాగే టీటీవీ దినకరన్ ద్వారా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళను ప్రసన్నం చేసుకుని అన్నాడీఎంకే కై వశం లక్ష్యంగా మరింతగా వ్యూహాలకు పదును పెట్టాలనే ఆశతో ఉన్న పన్నీరుకు ప్రస్తుతం షాక్ తప్పలేదు. పెద్ద దిక్కుగా ఉండాలని.. అన్నాడీఎంకేలో తాజా పరిణామాల వ్యవహారంలో ఎవరో ఒకరి వైపుగా నిలబడకుండా తటస్థంగా వ్యవహరించి పార్టీకి పెద్ద దిక్కుగా నిలబడాలనే వ్యూహంతో చిన్నమ్మ ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అందుకే ఆమె పన్నీరు, టీటీవీ దినకరన్ హాజరైన ఈ వివాహ వేడుకకు దూరంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వివాహ వేడుకకు చిన్నమ్మ వస్తారనే ఎదురు చూపుల్లో దక్షిణ తమిళనాడులోని కీలక సామాజిక వర్గం వేచి ఉన్నా, చివరకు ప్రయోజనం లేకుండా పోయింది. అదే సమయంలో చిన్నమ్మ శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో భేటీకి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ తమిళనాడులోని బలమైన సామాజికవర్గం తన వెంట, పన్నీరు, దినకరన్ వెనుక ఉన్నా, ప్రస్తుతం పార్టీతో పాటుగా ముఖ్య నేతల బలం, మద్దతు పళణిస్వామి చేతిలో ఉండడాన్ని చిన్నమ్మ పరిగణనలోకి తీసుకుని ఉన్నారు. అందుకే పళణిస్వామితో సంప్రదింపులతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే ఐక్యతను చాటే విధంగా కొత్త ప్రయత్నాలకు చిన్నమ్మ సిద్ధమై తాజాగా తటస్థంగా వ్యవహరించే పనిలో పడ్డట్టు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. అలాగే, పళణికి రాయబారానికి దక్షిణ తమిళనాడుకు చెందిన మాజీ మంత్రులు నలుగుర్ని చిన్నమ్మ రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. ఈ నలుగురు ప్రస్తుతం పళణి స్వామి వెన్నంటే ఉన్నా, లోక్సభ ఎన్నికల నాటికి అందరూ ఐక్యతతో అన్నాడీఎంకేకు తిరుగులేని విజయం అందించాలన్న కాంక్షతో ఈ రాయబార ప్రయత్నాలకు సిద్ధమైనట్టు చర్చ జరుగుతోంది. -
చిన్నమ్మ.. ఎవరా జ్యోతిష్కుడు?
సాక్షి, చైన్నె: కొడనాడు హత్య, దోపిడీ కేసులో శశికళను విచారణ వలయంలోకి తెచ్చేందుకు సీబీసీఐడీ నిర్ణయించింది. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టి, ఎడపాడిలో ఉన్న ఓ జ్యోతిష్కుడిని కూడా విచారించేందుకు కసరత్తులు మొదలయ్యాయి. దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్లో 2017లో నవంబర్లో జరిగిన వాచ్మన్ హత్య, దోపిడీ ఘటన గురించి తెలిసిందే. అన్నాడీఎంకే హయాంలో ఈ కేసును మమా అంటూ ముగించారు. అయితే, ఈ ఘటన వెనుక ఉన్న మిస్టరీని వెలుగులోకి తెచ్చేందుకు తాజాగా డీఎంకే ప్రభుత్వం కంకణం కట్టుకుంది. తొలుత ఐజీ సుధాకర్, డీఐజీ ముత్తుస్వామి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏడాది కాలంగా విచారించింది. ఆ తర్వాత సీబీసీఐడీకి కేసును అప్పగించారు. ప్రధానంగా మాజీ సీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి, ఆయన సన్నిహిత మిత్రుడు ఇలంగోవన్ను టార్గెట్ చేసి ఈకేసులో సీబీసీఐడీ దూకుడుగా ముందుకెళుతోంది. గతవారం పళనిస్వామికి భద్రతాధికారిగా పనిచేసిన కనకరాజ్ను సీబీసీఐడీ విచారించింది. ఈపరిస్థితులలో ఈకేసులో శశికళ, మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టిని స్వయంగా విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే, పళనిస్వామి డ్రైవర్గా పనిచేసి అనుమానాస్పదంగా గతంలో మరణించిన కనకరాజ్కు ఎడపాడిలోని ఓ జ్యోతిష్కుడికి మధ్య సంబంధాలు ఉన్న సమాచారం సీబీసీఐడీ దృష్టికి చేరింది. దీంతో శశికళ, మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టితోపాటు ఆ జ్యోతిష్కుడిని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మే మొదటి వారంలో వీరిని విచారించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా సమన్ల జారీకి ఏర్పాట్లు జరుగుతుండడం గమనార్హం. అదే సమమయంలో పళనిస్వామి నియోజకవర్గం ఎడపాడికి చెందిన జ్యోతిష్కుడి గురించిన సమాచారం తెరపైకి రావడంతో విచారణలో ఎలాంటి ఆసక్తికర అంశాలు బయటకు రానున్నాయో అన్న ఉత్కంఠ మొదలైంది. అలాగే, గతంలో చిన్నమ్మ వద్ద విచారణ బృందం వాంగ్మూలం సేకరించిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యక్ష విచారణకు సిద్ధం కావడం గమనార్హం. -
శశికళ, దినకరన్కు ఆహ్వానం
సాక్షి, చైన్నె: తిరుచ్చి వేదికగా జరగనున్న మహానాడుకు శశికళ, దినకరన్ను ఆహ్వానించనున్నట్లు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం తెలిపారు. అన్నాడీఎంకేలో విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పార్టీని పూర్తిగా ప్రధాన కార్యదర్శి హోదాలో పళనిస్వామి తన గుప్పెట్లో తెచ్చుకున్నారు. అయితే న్యాయ పోరాటం ద్వారా పార్టీ మళ్లీ సత్తా చాటాలని సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం ప్రయత్నిస్తున్నారు. తన బలాన్ని చాటుకునే విధంగా ఈనెల 24వ తేదీన తిరుచ్చి వేదికగా భారీ మహానాడుకు సిద్ధమయ్యారకు. ముప్పెరుం విళాగా ఈ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహానాడు విజయవంతం కోసం తన శిబిరం తరపున జిల్లాల కార్యదర్శులుగా ఉన్న నేతలతో సమావేశాల్లో పన్నీరు నిమగ్న మయ్యారు. మంగళవారం జరిగిన సమావేశానంతరం మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, ముప్పెంరు విళా అన్నది అన్నాడీఎంకే కార్యకర్తలకు దివంగత నేత ఎంజీఆర్ ఇచ్చిన హక్కులను కాపాడే విధంగా ఉంటుందని వివరించారు. పదవీ వ్యామోహంతో నిబంధనలు ఉల్లంఘించి సర్వాధికారంతో విర్ర వీగుతున్న ముఠాకు గుణపాఠం చెప్పే వేదిక అవుతుందన్నారు. ఈ మహానాడుకు చిన్నమ్మ శశికళ, అమ్మ మక్కల్ మున్నేట్రకళగం నేత టీటీవీ దినకరన్ను ఆహ్వానించనున్నట్లు ప్రకటించారు. వారు తప్పకుండా ఈ మహానాడుకు వస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. కాగా, పన్నీరు వ్యాఖ్యలపై పళని శిబిరం సీనియర్నేత జయకుమార్ స్పందిస్తూ, ఆ మహానాడును తాము లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. అలాంటప్పుడు ఆయన ఎవరిని ఆహ్వానిస్తే తమకేంటిని ప్రశ్నించారు. -
కలిసికట్టుగా లోక్సభ ఎన్నికల్లోకి..
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలోని అందరూ కలిసికట్టుగా లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమయం ఆసన్నం అవుతోందని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె నాగపట్నం, తిరువారూర్లలో పర్యటించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా అన్నాడీఎంకే విభేదాల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన వేదికపై వివాదాలు శోచనీయమన్నారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులు ఎవరైనా ప్రశ్నించవచ్చునని, అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చునని, వ్యాఖ్యలు, ప్రసంగాలు చేయడానికి వీలుందన్నారు. అయితే, పన్నీరుసెల్వంను అడ్డుకోవడం శోచనీయమన్నారు. తాను ఖండించినంత మాత్రాన పన్నీరుకు మద్దతు ఇచ్చినట్టు కాదన్నారు. అన్నాడీఎంకే ఎవరి చేతిలో ఉంటే భవిష్యత్తు ఉంటుందో అన్నది కేడర్ ఆలోచించాలని, సమాధానం కేడర్ చెప్పాలని కోరారు. త్వరలో తనను పన్నీరుసెల్వం కలిసే అవకాశాలు ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేకు ఈసారి గెలుపు కష్టమేనని, ఆ మేరకు తాము వ్యూహాలకు పదును పెడతామన్నారు. -
నా వాంగ్మూలాన్ని సీబీఐ వక్రీకరించింది: పులివెందుల మాజీ ఎంపీటీసీ శశికళ
పులివెందుల(వైఎస్సార్ జిల్లా): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్లు ఎంపీ అవినాష్రెడ్డిగానీ మరెవరూ గానీ తనతో చెప్పలేదని పులివెందుల మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శశికళ స్పష్టం చేశారు. తాను చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడాన్ని ఆమె ఖండించారు. కనీసం తనతో సంప్రదించకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తన పేరును ఉటంకిస్తూ అవాస్తవాలను ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండించారు. పులివెందులలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. వివేకానందరెడ్డి చనిపోయిన రోజు ఉదయం తమ స్థలాలకు సంబంధించిన విషయంపై కలిసేందుకు వెళ్లిన మాట వాస్తవమన్నారు. అక్కడ కొంతమంది పనివాళ్లు ఉన్నారని, వివేకానందరెడ్డిని కలవాలని సమాచారం ఇవ్వగా సమాధానం చెప్పలేదన్నారు. దాంతో కాసేపు వేచి చూశానన్నారు. కొద్దిసేపటికి కొన్ని కార్లు వచ్చాయని తెలిపారు. ‘అందులో నుంచి వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీకి చెందిన మరికొంతమంది అనుచరులు ఇంటి లోపలికి వెళ్లారు. ఐదు నిమిషాల్లోనే అవినాష్రెడ్డి బయటకు వచ్చి ఆందోళనగా వివేకా ఇంటి లాన్లో ఫోన్లో మాట్లాడారు. అక్కడ గుమికూడిన వారు వివేకా సార్ చనిపోయారని మాట్లాడుకోవడం విన్నా. వెంటనే లోపలికి వెళ్లి చూడగా వివేకానందరెడ్డి చనిపోయి కనిపించారు. అక్కడ అంతా రకరకాలుగా మాట్లాడుకోవడం కనిపించింది. కొందరు గుండె నొప్పి అని, మరికొందరు రక్తపు వాంతులతో చనిపోయారని చర్చించుకున్నారు. అనంతరం బాధ తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోయా. అంతేకానీ వివేకా ఇంటి వద్ద అవినాష్రెడ్డి నాతో మాట్లాడలేదు. నేను కూడా ఆయనతో ఏమీ మాట్లాడలేదు. సిట్, సీబీఐ అధికారులు విచారణకు పిలిచినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పా’ అని శశికళ పేర్కొన్నారు. గత ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్రెడ్డేనని తనతో సహా జిల్లాలో అందరికి తెలుసన్నారు. వైఎస్ వివేకాను పని విషయమై కలవడానికి వెళ్లినప్పుడు కూడా ఎంపీగా వైఎస్ అవినాష్రెడ్డి అఖండ మెజార్టీతో గెలిచేలా మీరంతా కృషి చేయాలని తమతో చెప్పేవారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. వైఎస్ వివేకా ఉంటే అవినాష్రెడ్డికి ప్రయోజనమే కానీ ఎలాంటి నష్టం లేదన్నారు. బాలకృష్ణ ఇంట్లో బెల్లంకొండ సురేష్పై కాల్పులు ఎందుకు జరిగాయి? దాని వెనుక రహస్యాల గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు మాట్లాడితే బాగుంటుందన్నారు. -
చిన్నమ్మతో బుజ్జమ్మ ఢీ!.. దత్తపుత్రుడి వల్లే గొడవలచ్చాయని..
దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ – మేన కోడలు దీప జయకుమార్ మధ్య వివాదం ముదిరింది. చిన్నమ్మ శశికళను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలతో జయలలిత మేన కోడలు దీప శనివారం ఓ ఆడియోను విడుదల చేశారు. దత్త పుత్రుడు సుధాకరన్ వివాహం విషయంలోనే.. తన మేనత్త జయలలిత కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయని ధ్వజమెత్తారు. శశికళ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణించిన తరువాత ఆస్తికి వారసులుగా ఆమె అన్న కుమార్తె దీప, కొడుకు దీపక్ తెరపైకి వచ్చారు. కోర్టు సైతం వీరినే జయ వారసులుగా ధ్రువీకరించింది. అదే సమయంలో దీప ఓ రాజకీయ పార్టీ స్థాపించి ముందుకు సాగినా, చివరికి వెనక్కి తగ్గింది. అదే సమయంలో జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా దీప తరచూ వ్యాఖ్యల చేసేవారు. తాజాగా శశికళను ఢీకొట్టే విధంగా పలు ఆరోప ణాలు గుప్పిస్తూ.. ఓ ఆడియోను బుజ్జమ్మ దీప విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా వివాదానికి నేపథ్యం ఇదేనా..? జయలలిత మృతి నేపథ్యంలో నెలకొన్న వివాదాన్ని విచారించిన ఆర్ముగ స్వామి కమిషన్కు శశికళ లిఖిత పూర్వకంగా సమర్పించిన వాంగ్మూలంలోని కొన్ని అంశాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఇందులో దీప కుటుంబం, ఆమె తల్లి విజయలక్ష్మి గురించి శశికళ తీవ్ర వ్యాఖ్యలు చేసిందనే వార్తలొచ్చాయి. దీనిపై దీప తీవ్రంగా మండిపడుతూ ఆడియోను విడుదల చేయడం విశేషం. అనుమానాలెన్నో.. ఇప్పుడున్న మర్యాదను చెడ గొట్టుకోవద్దని, ఏ తప్పు చేయనప్పుడు, నిరూపించుకునేందుకు సిద్ధమా..? అని శశికళకు దీప సవాల్ విసిరారు. సుధాకరన్ పెళ్లి తర్వాత తన తండ్రి జయకుమార్ మరణించారని, ఏ కారణంతో ఈ మరణం సంభవించిందో.. నేటికీ వెల్లడి కాలేదన్నారు. తమపై కక్ష సాధింపులో భాగంగానే లేనిపోని చాడీలను మేనత్త వద్ద శశికళ నూరి పోసిందని మండిపడ్డారు. అందుకే శశికళపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని తాను డిమాండ్ చేస్తూ వస్తున్నట్లు స్పష్టం చేశారు. తొలుత తన సోదరుడు దీపక్ను బలవంతంగా తన గుప్పెట్లోకి శశికళ లాక్కుందని ఆరోపించారు. శశికళకు వ్యతిరేకంగా తమకు అనుకూలంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. మేనత్త జయలలిత మరణం సందర్భంగా శశికళ వ్యవహరించిన తీరు, తమ అనుమానాలకు మరింత బలాన్ని కలిగించాయని వెల్లడించారు. ఏ తప్పు చేయలేదని చెబుతున్న శశికళ, మేనత్తను చూసేందుకు తమకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని, సీసీ కెమెరాలన్నీ ఎందుకు ఆపేయించారని ప్రశ్నించారు. వారి స్వలాభం, ఆదాయం కోసం తన మేనత్త జయలలితను తప్పుదారి పట్టించి వాడుకున్నారని ఆరోపించారు. నిజాలు, రహస్యాలను మరెన్నో రోజులు దాచి పెట్ట లేరని, త్వరలో అన్ని బయటకు వచ్చి తీరుతాయని స్పష్టం చేశారు. ఆడియో రూపంలో.. వాస్తవాలను స్పష్టంగా తెలియజేస్తే.. తన మేనత్త జయలలిత మృతిపై అనుమానం అనే ప్రశ్నే వచ్చి ఉండేది కాదని ఆడియోలో దీప పేర్కొన్నారు. తన తల్లి విజయలక్ష్మి గురించి మాట్లాడేందుకు మూడో వ్యక్తిగా ఉన్న శశికళకు ఏం అర్హత ఉందని ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహరావును కలిసి అప్పట్లో తన తల్లి విజయలక్ష్మి మేనత్త జయలలితకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లు శశికళ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాస్తవానికి తన మేనత్తకు శశికళ రూపంలోనే ప్రమాదం పొంచి ఉండేదని, ఆమెను రక్షించేందుకే తన తల్లి ప్రధానిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. దత్త పుత్రుడు సుధాకరన్ వివాహం కారణంగానే మేనత్తతో తన కుటుంబానికి మనస్పార్థలు వచ్చినట్లు వివరించారు. తాను చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు నిందలను తమ మీద వేయడం శశికళకు కొత్తేమీ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి విజయలక్ష్మి గతంలో కలైంజ్ఞర్ కరుణానిధి, వాలప్పాడి రామమూర్తి వంటి నేతలను కలిసిన సందర్భాలు లేవు అని, ధైర్యం ఉంటే తనతో చర్చకు శశికళ సిద్ధం కావాలని సవాల్ విసిరారు. మౌనంగా ఉండకుంటే గుట్టు విప్పుతాం.. తన కుటుంబం, తన తల్లి గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోనని శశికళను దీప హెచ్చరించారు. శశికళ నోరు మూసుకుని మౌనం పాటిస్తే ఆమెకే మంచిదని.. లేనిపక్షంలో గుట్టు విప్పాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. తన జీవితాన్ని సర్వనాశనం చేశారని, తన కడుపులో ఉన్న బిడ్డను చిదిమేశారని, తన తల్లి భౌతిక కాయాన్ని కూడా చూడనివ్వకుండా జయలలితను అడ్డుకున్నది శశికళే కదా.. అని ఆరోపించారు. మధ్య తరవాతి స్థాయికి కూడా నోచుకోని శశికళకు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయనే విషయంపై.. ధైర్యం ఉంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇకనైనా ఈ విషయంపై శశికళను అన్నాడీఎంకే కేడర్ ప్రశ్నించాలని, రాష్ట్ర ప్రజలు సైతం నిలదీయాలని కోరారు. తనకు శశికళ రూపంలో ప్రాణహాని ఉందని ఆరోపించారు. కాగా ఈ దీప వ్యాఖ్యలపై చిన్నమ్మ శశికళ ఎలా స్పందిస్తారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
ఇలవరసి కుమారుడు వివేక్ సతీమణి కీర్తన ఆత్మహత్యాయత్నం
సాక్షి, చెన్నై: శశికళ వదిన ఇలవరసి కుమారుడు వివేక్. ఇతడి భార్య కీర్తన గురు వారం ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలు.. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ గురించి తెలిసిందే. శశికళతో పాటు జైలు జీవితాన్ని ఆమె వదినమ్మ ఇలవరసి కూడా అనుభవించారు. శశికళ అన్న జయరామన్ సతీమణే ఈ ఇలవరసి. ఆమె కుమారుడు వివేక్. శశికళకు సంబంధించిన ఆస్తుల వ్యవహారాలన్నీ ఇతడి కనుసన్నుల్లోనే సాగుతాయనే ప్రచారం ఉంది. దీంతో వివేక్ను ఈడీ, ఐటీ వర్గాలు టార్గెట్ చేశాయి. ఈ నేపథ్యంలో వివేక్ తన సతీమణి కీర్తనతో గత కొంత కాలంగా తరచూ గొడవ పడుతున్నట్లు సమాచారం. వివేక్ వేధింపుల గురించి పలుమార్లు శశికళ, ఇలవరసి దృష్టికి కీర్తన తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే వివేక్ను ఎవ్వరూ ప్రశ్నించక పోవడంతో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం రాత్రి ఇంట్లో ఉన్న పలు రకాల మాత్రలను మింగేశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను అర్ధరాత్రి వేళ అడయార్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వివేక్, కీర్తన మధ్య బుధవారం రాత్రి కూడా గొడవ జరిగినట్లు విచారణలో వెలుగు చూసింది. దీంతో తీవ్ర వేదనకు గురైన కీర్తన ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలిసింది. -
అన్నీ రహస్యాలే.. జయ లలిత కేసులో అసలేం జరిగింది?
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం సహజ మరణం కాదని.. ఆమె మరణం వెనుక కచ్చితంగా కుట్ర ఉందని జయ అభిమానులు ఆరేళ్లుగా అనుమానిస్తూనే ఉన్నారు. వివిధ కోణాల్లో ఈ డెత్ మిస్టరీ కేసును పరిశోధించిన జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో వ్యవహారం మొత్తం కొత్త మలుపు తిరిగింది. శశికళ పాత్రపై దర్యాప్తు జరపాల్సిందేనన్న కమిటీ సిఫారసు కొత్త మంటలు రాజేసింది. చదవండి: తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదు: చిన్నమ్మ 2016 సెప్టెంబరు 22న నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపస్మారక స్థితిలో చెన్నయ్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, డీ హైడ్రేషన్ లతో ఆసుపత్రిలో చేరారన్నారు కానీ ఎవరూ ఏం చెప్పలేదు. అన్నీ రహస్యంగానే జరిగిపోయాయి. అప్పుడప్పుడు ఒకటో, రెండో విషయాలు తెలిసినా.. అంతా నిగూఢమే. సాధారణ డైట్ తీసుకుంటున్నారని, జయలలిత పరిస్థితి బానే ఉందని రెండు మూడు రోజుల పాటు చెప్పుకొచ్చినా.. తర్వాత విదేశాలకు చికిత్స కోసం తీసుకెళ్తారంటూ ప్రచారం జరిగింది. సెప్టెంబరు 29న ఈ పుకార్లను ఖండించిన అపోలో వైద్యులు జయలలిత కోలుకుంటున్నారని.. వైద్యానికి బాగా స్పందిస్తున్నారని చెప్పారు. రోజుకో మలుపు నవంబరు 13న అంటే ఆసుపత్రిలో చేరిన 50 రోజుల తర్వాత జయలలిత సంతకంతో ఉన్న ఒక లేఖను విడుదల చేశారు. అందులో ఆమె తాను పునర్జన్మ పొందినట్లు పేర్కొనడమే కాదు త్వరలోనే ముఖ్యమంత్రి విధుల్లో నిమగ్నమవుతానని వెల్లడించినట్టు పేర్కొన్నారు. రెండున్నర నెలల పాటు ఆసుపత్రి వర్గాలతో పాటు అన్నాడిఎంకే నేతలు జయలలిత ఆరోగ్యం బానే ఉందని చెబుతూ వచ్చారు. పక్కా స్క్రిప్టింగ్ ప్రజలను ఊరడించడానికన్నట్లు రోజుకో సమాచారాన్ని కొద్దికొద్దిగా విడుదల చేశారు. అమ్మ కోలుకుందని.. అమ్మ పేపర్ చదివిందని.. అమ్మ టిఫిన్ తిందని.. అమ్మ టీవీ చూసిందని.. వెల్లడించారు. నవంబరు 19న జయలలిత వెంటిలేటర్ అవసరం లేకుండానే వైద్యానికి చక్కగా స్పందిస్తున్నారని ప్రకటించారు. 2016 డిసెంబరు 4న ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని త్వరలోనే ఆసుపత్రి నుండి ఇంటికి డిశ్చార్జ్ అవుతారని అన్నాడిఎంకే పార్టీ ప్రకటించింది. చిత్రంగా డిసెంబరు 5న రాత్రి 11గంటల 30 నిముషాలకు ఆమె గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు. పుకార్లు షికార్లు ఇన్ని మలుపులు తిరగడంతో తమిళనాట రక రకాల పుకార్లు షికార్లు చేశాయి. జయలలితపై విష ప్రయోగం చేసిందని కొందరు ప్రచారం చేశారు. రోజుల తరబడి స్లో పాయిజన్ ఇచ్చి జయలలితను మట్టుబెట్టారని దీని వెనుక పెద్ద కుట్ర జరిగిందని పార్టీలో జయ విధేయులు ఆరోపణలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. అపోలో వర్గాలు.. ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేసినప్పటికీ ప్రజల్లో మాత్రం అనుమానాలు అలానే ఉండిపోయాయి. ఇంట్లో గొడవ జరిగిందా? జయలలిత ను ఆసుపత్రిలో చేర్చేసరికే ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇంట్లో ఉండగానే జయలలితను అనారోగ్యం పాలు చేసేలా కుట్రలు జరిగాయని పుకార్లు పుట్టాయి. జయలలితకు స్లో పాయిజన్ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. ఇందులో ఎక్కువ భాగం శశికళపైనే ఎక్కుపెట్టారు. చెలి నెచ్చెలి జయలలితకు శశికళ తో 30 ఏళ్ల అనుబంధం ఉంది. అయితే జయలలితను అడ్డు పెట్టుకుని శశికళ కుటుంబం ప్రభుత్వంలో చొచ్చుకుపోయిందని ఆరోపణలు వచ్చాయి. ఓ దశలో జయలలితను ముఖ్యమంత్రి పీఠం నుండి తప్పించడానికి కుట్ర పన్నినట్లు నిఘా బృందాలు ఉప్పందించాయి. ఈ పరిస్థితుల్లో శశికళ కుటుంబాన్ని ఇంటి నుండి సాగనంపారు జయలలిత. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ మన్నార్ గుడి మాఫియాకు అడ్డుకట్ట వేశారు. అయితే ఏం జరిగిందో కానీ కొంతకాలం తర్వాత శశికళకు మళ్లీ ఇంట్లో చోటిచ్చారు జయ. అదే జయలలిత కెరీర్ లో అతి పెద్ద తప్పిదమని శశికళను వ్యతిరేకించే వర్గాలు అంటాయి. నివేదికలో ఉన్నవేంటీ? ♦జయలలిత డిసెంబరు 4న మరణిస్తే డిసెంబరు 5న మరణించినట్లు ప్రకటించారని నివేదికలో పేర్కొన్నారు. ♦జయలలితకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటనేదానిపై క్లారిటీ లేదని నివేదికలో పేర్కొన్నారు. ♦వైద్యులు సిఫార్సు చేసిన కొన్ని సర్జరీలు ఎందుకు చేయలేదో అర్ధం కాలేదని వ్యాఖ్యానించారు. ♦ఆమెకు సరైన వైద్యం అందలేదని కూడా అన్నారు. ♦జయలలిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది లగాయితు ఆమె మరణించే వరకు ఏం జరిగిందో అంతా మిస్టరీగానే ఉంది జయలలిత ఆసుపత్రిలో చేరడానికి ముందు పోయస్ గార్డెన్లో ఓ వ్యక్తితో వాగ్వివాదం జరిగిందని.. ఆ సమయంలో అవతలి వ్యక్తి తోసేయడంతో జయలలిత కిందపడిపోయారని మాజీ స్పీకర్ పాండ్యన్ ఆరోపించారు. శరీరంపై గాట్లేంటీ? జయలలితను ఆసుపత్రిలో చేర్చినపుడు ఆమె బుగ్గపై నాలుగు గాట్లు కనిపించాయి. ఆ గాట్లు ఏంటి? ఏమైనా గాయాలా? గాయాలైతే ఎవరు చేశారు? అన్న అనుమానాలు చక్కర్లు తిరిగాయి. అయితే వైద్యులు మాత్రం తీవ్ర అస్వస్థతకు లోనైనపుడు కొన్ని సందర్భాల్లో బుగ్గలపై అటువంటి గాట్లు ఉంటాయని అన్నారు. అంతలోనే రాజకీయమా? జయలలిత చికిత్స పొందుతున్న సమయంలోనే పార్టీ ఎమ్మెల్యేలతో శశికళ వరుస భేటీలు నిర్వహించడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇపుడు తాజాగా జయమరణం కేసుపై నివేదిక బహిర్గతం కావడంతో శశికళ భవిష్యత్తు ఏ విధంగా మలుపులు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తమిళ నాట అంతా దీనిపైనే చర్చించుకుంటున్నారు. ప్రజలకైతే నిజాలు కావాలి. జయలలితను జీవితాంతం ఆదరించిన అభిమానులకు ఏం జరిగిందో తెలియాలి. తమ అభిమాన నాయకురాలి మరణ వార్త వెనుక కుట్ర ఉందంటేనే వారు కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పటికైనా నిజాలు బయటకు వస్తేనే వారికి కొంతైనా తృప్తి ఉంటుంది. -
జయలలిత మరణం...శశికళను విచారణకు ఆదేశించాలన్న కమిషన్
చెన్నై: తమిళనాడు దివగంత మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5, 2016న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆర్మగస్వామి కమిషన్ని ఏర్పాటు చేయడం, ఐదేళ్ల తదనంతరం కమిషన్ 600 పేజీల నివేదికను స్టాలిన్కి సమర్పిచడం జరిగింది. ఐతే ఆ నివేదిక తోపాటు అదనంగా సమర్పించిన 200 పేజీల్లో కొన్ని కీలక విషయాలను వెల్లడించిన సంగతి కూడా తెలిసిందే. ఐతే ప్రస్తుతం ఆ కమిషన్ తన ముగింపు వ్యాఖ్యలలో జయలలిత నెచ్చలి, స్నేహితురాలు శశికళను దోషిగా పేర్కొంటూ విచారణకు ఆదేశించాలని పేర్కొంది. ఇందులో డాక్టర్ శివకుమార్(జయలలిత వ్యక్తిగత వైద్యుడు, శశికళ బంధువు), మాజీ ఆరోగ్య కార్యదర్శి రాధకృష్ణన్ , మాజీ ఆరోగ్య మంత్రి సి విజయ భాస్కర్లను కూడా దోషులుగా చేరుస్తూ దర్యాప్తుకు అభ్యర్థించింది. అంతేగాదు కమిషన్ వివిధ కోణాలను పరిగణలోనికి తీసుకుంటే వారందర్నీ దోషులుగా గుర్తించి దర్యాప్తు చేస్తేగాని ఒక నిర్ధారణకు రావడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పైగా జయలలిత మరణాన్ని అధికారికంగా ప్రకటించడాన్ని కూడా తప్పుపట్టింది కమిషన్. అలాగే జయలలిత డిసెంబర్ 4, 2016న మధ్యాహ్నాం 3.50 నిమిషాలకు గుండెపోటుకు గురైన తర్వాత సీపీఆర్, స్టెర్నోటమీ వంటి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే నిందితులు దీన్నీ సాకుగా చూపిస్తూ అధికారికంగా ప్రకటించడానికి జాప్యం చేసినట్లు చెబుతున్నారని కమిషన్ ఆరోపిస్తోంది. ఆమె చనిపోయింది డిసెంబర్ 4, 2016 అయితే ఆస్పత్రి వర్గాలు డిసెంబర్ 5, 2016గా ప్రకటించడాన్ని తప్పుపట్టింది. అలాగే జస్టిస్ అరుణ జగదీశన్ కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ 2018లో రాష్రంలోని తూత్తుకూడిలో జరిగిన పోలీస్ కాల్పుల ఘటనలో పోలీసుల తీరుని తప్పుపట్టింది. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం, 2018 తూత్తుకుడి ఘటన సంబంధించిన విచారణ నివేదికలను మంగళవారం అసెంబ్లీకి సమర్పించింది. (చదవండి: : ఐదేళ్లకు.. ‘అమ్మ’ మరణంపై కమిషన్ విచారణ పూర్తి -
తమిళనాట శశికళకు మరో ఊహించని షాక్!
సాక్షి, చెన్నై: తమిళనాడు పాలిటిక్స్లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళకు ఎంజీఆర్ బంధువులు షాక్ ఇచ్చారు. ఈనెల 17వ తేదీన అన్నాడీఎంకే 50వ వసంతంలోకి అడుగు పెట్టనుంది. దీంతో, గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను రామాపురం తోటలోని పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎంజీఆర్ నివాసం ఆవరణలో నిర్వహించాలని శశికళ శిబిరం నిర్ణయించింది. ఇందుకు తగ్గ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. అయితే, హఠాత్తుగా ఎంజీఆర్ బంధువులు చిన్నమ్మకు షాక్ ఇచ్చారు. రామాపురం తోటలో ఎలాంటి వేడుకలు నిర్వహించ వద్దని, తాము అనుమతి ఇవ్వబోమ ని మంగళవారం తేల్చి చెప్పారు. దీంతో మరో వేదికను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి చిన్నమ్మ మద్దతు దారులకు ఏర్పడింది. -
తమిళనాట శశికళ ప్లాన్ ఫలిస్తుందా.. పన్నీరు సెల్వానికి చెక్..?
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధానకార్యదర్శి పళణి స్వామి సొంత జిల్లాలో చిన్నమ్మ శశికళ సోమవారం పర్యటించనున్నారు. ఈ పర్యటన విజయవంతానికి ఆమె మద్దతుదారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో జిల్లాలో తన పట్టు చేజారకుండా పళణి స్వామి ముందు జాగ్రత్తల్లో పడ్డారు. అన్నాడీఎంకేలో సాగుతున్న గ్రూపు రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో అన్నాడీఎంకేను ఎప్పటికైనా తన గుప్పెట్లోకి తీసుకుంటానని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ఇప్పటికే ప్రకటించారు. తన బలాన్ని చాటే విధంగా మద్దతు దారులతో భేటీలు, సంప్రదింపుల్లో ఆమె బిజీగా ఉన్నారు. దశల వారీగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈక్రమంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎంపికైన పళణి స్వామి సొంత జిల్లాపై చిన్నమ్మ దృష్టి పెట్టారు. బలం చాటే ప్రయత్నం.. పళణి స్వామి సొంత జిల్లా సేలంలో తనకు సైతం బలం ఉందని చాటాలని చిన్నమ్మ భావిస్తోంది. ఇందులో భాగంగా తన మద్దతు దారుల ద్వారా బల నిరూపణకు సిద్ధమయ్యారు. పళణిస్వామి సొంత జిల్లాలో ఉన్న అసంతృప్తి సెగను తనకు అనుకూలంగా మలచుకునే విధంగా చిన్నమ్మ పర్యటనకు ఏర్పాట్లు జరిగాయి. సోమవారం ఆ జిల్లా పరిధిలోని ఆత్తూరు, వాలప్పాడి, సేలం టౌన్ జంక్షన్ , దాదుగా పట్టి, శీలనాయకం పట్టి, సూరమంగళంలలో సభలకు నిర్ణయించారు. పెద్దసంఖ్యలో జనాన్ని సమీకరించడమే కాకుండా, పళణిపై గుర్రుగా ఉన్న నేతలను ఆహ్వానించేందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. దీంతో అందరి దృష్టి సేలంపై పడింది. సోమవారం సేలంలో, ఆ మరుసటి రోజు పక్కనే ఉన్న ఈరోడ్ జిల్లాలో చిన్నమ్మ పర్యటన జరగనుంది. సేలంలో తిష్టవేసిన పళణి తన సొంత జిల్లాలో చిన్నమ్మ పర్యటన నేపథ్యంలో పట్టు జారకుండా ముందు జాగ్రత్తల్లో పళణి నిమగ్నమయ్యారు. చిన్నమ్మ పర్యటన వైపు ఏఒక్క నేత వెళ్లకుండా కట్టడికి సిద్ధమయ్యారు. తిరుపతి పర్యటన ముగించుకున్న ఆయన నేరుగా సేలంకు వెళ్లడం గమనార్హం. రెండు రోజులు సేలంలోనే ఆయన ఉండనున్నారు. చిన్నమ్మ పర్యటన జరిగే సమయంలో తన మద్దతుదారులతో ప్రత్యేక సమావేశాలకు పళణి ఏర్పాట్లు చేసుకున్నారు. ఫలితంగా సేలం వేదికగా అన్నాడీఎంకే రాజకీయం రసవత్తరంగా మారింది. -
Jayalalithaa Death: విచారణ పరిధిలోకి శశికళ?
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మృతి కేసుకు సంబంధించి చిన్నమ్మ శశికళ, మాజీ మంత్రి విజయ భాస్కర్, మాజీ సీఎస్ రామ్మోహన్రావును విచారణ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. వీరిని ప్రశ్నించేందుకు ప్రత్యేక సిట్ మరికొద్ది రోజుల్లో రంగంలోకి దిగనుంది. ఇందుకు తగ్గ చట్టపరమైన అంశాలపై న్యాయ నిపుణులతో అధికార వర్గాలు చర్చిస్తున్నట్లు సమాచారం. నేపథ్యం ఇదీ.. అమ్మ జయలలిత 2016 డిసెంబర్ 5న అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు, ఆరోపణలు రావడంతో గత ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ను రంగంలోకి దిగింది. ఈ కమిషన్ రెండు రోజుల క్రితం సీఎం స్టాలిన్కు తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికను ప్రభుత్వ వర్గాలు సమగ్రంగా పరిశీలించాయి. ఇందులో ఆర్ముగ స్వామి సూచించిన అంశాలు, కొన్ని సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారు. మంత్రి వర్గ సూచనలో.. ఆర్ముగ స్వామి తన నివేదికలోని కీలక విషయాల గురించి సోమవారం సాయంత్రం పొద్దు పోయే వరకు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జగినట్లు తెలుస్తోంది. 2016 సెప్టెంబర్ 22న జయలలిత ఆస్పత్రిలో చేరిన రోజు నుంచి మరణించే వరకు జరిగిన పరిణామాలు, వైద్య సేవలు అంశాలను నివేదికలో ఆర్ముగ స్వామి పొందుపరిచారు. ఈ మేరకు జయలలిత నెచ్చెలి శశికళ, డాక్టర్ శివకుమార్, అప్పటి ఆరోగ్య మంత్రి విజయభాస్కర్, అప్పటి సీఎస్ రామమోహ్మన్ రావును విచారించాలని సలహా ఇవ్వడం మంత్రి వర్గం దృష్టికి వచ్చింది. దీంతో ప్రత్యేక సిట్ ద్వారా విచారణ జరిపేందుకు మంత్రి వర్గం నిర్ణయించినట్లు తెలిసింది. చదవండి: (సీఎం స్టాలిన్ గొప్ప మనసు.. అంతు చిక్కని వ్యాధి సోకిన డానియాకు..) ఈ మేరకు మరికొద్ది రోజుల్లో ప్రత్యేక పోలీసు అధికారి పర్యవేక్షణలో ఈ సిట్ రంగంలోకి దిగనుంది. న్యాయ నిపుణులతో ఇందుకు తగ్గ చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయి. ఈ విచారణతో పాటూ ఆర్ముగ స్వామి కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిట్ విచారణ సంకేతాల నేపథ్యంలో అమ్మ మరణం మిస్టరీ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. తూత్తుకుడి వ్యవహారం మంత్రి వర్గంలో గత ప్రభుత్వ హయాంలో తూత్తుకుడిలో జరిగిన కాల్పుల వ్యవహారంపై కూడా సుదీర్ఘ చర్చ జరగడమే కాకుండా, ఆ నివేదిక ఆధారంగా శాఖ పరమైన చర్యలకు డీఎంకే పాలకులు సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎస్, రెవెన్యూ అధికారులు 21 మంది చర్యలకు అరుణా జగదీశన్ కమిషన్ తన నివేదికలో సిఫార్సు చేయడం గమనార్హం. స్టెరిలైట్కు వ్యతిరేకంగా బయలుదేరిన ఉద్యమం, ర్యాలీ, కాల్పులు ఆ తదుపరి పరిణామాల గురించి అరుణా జగదీశన్ తన నివేదికలో వివరించారు. ఐపీఎస్ అధికారులతో పాటూ 17 మంది పోలీసుల అధికారులు, కలెక్టర్, నలుగురు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు సూచించడం గమనార్హం. ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. -
పన్నీరు ఆకర్షణ మంత్రం!.. చిన్నమ్మతో కలిసి వ్యూహం అమలు?
సాక్షి, చెన్నై: పళనిస్వామి వెన్నంటి ఉన్న వారిని తన వైపునకు తిప్పుకునేందుకు పన్నీరు సెల్వం ఆకర్షణ మంత్రాన్ని ప్రయోగించే పనిలో పడ్డారు. చిన్నమ్మ శశికళతో కలిసి ఈ వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు ఫలితంగా పళని శిబిరం నుంచి ఓ ఎమ్మెల్యే , మరికొందరు నేతలు జంప్ అయ్యారు. వీరంతా ఆదివారం పన్నీరుకు జై కొట్టారు. అడీఎంకేలో పళని స్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోర్టు రూపంలో పార్టీ సమన్వయ కమిటీ తన గుప్పెట్లోకి రావడంతో పన్నీరు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పళనిస్వామికి వ్యతిరేకంగా ఉన్న వారు, అసంతృప్తి వాదులకు గాలం వేసే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఏకంగా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళతో కలిసి పన్నీరు కొత్తఎత్తులు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు క్యూలో.. చిన్నమ్మ శశికళతో కలిసి రచిస్తున్న వ్యూహానికి ఫలితం ఆదివారం లభించడం గమనార్హం. మదురై జిల్లా ఉసిలం పట్టి ఎమ్మెల్యే అయ్యప్పన్తోపాటుగా ఆ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు పన్నీరుకు ఆదివారం జై కొట్టారు. పళని శిబిరంలో ఉంటూ పన్నీరుపై విరుచుకు పడ్డ ఈ అయ్యప్పన్ ప్రస్తుతం శిబిరం మార్చేశారు. కోర్టు ఆదేశాలు, అందులోని అంశాలకు కట్టుబడి తాను పన్నీరు సెల్వం శిబిరంలోకి వచ్చానని అయ్యప్పన్ ప్రకటించారు. చెన్నై గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు నివాసంలో జరిగిన భేటీ అనంతరం అయ్యప్పన్ మీడియాతో మాట్లాడారు. తానే కాకుండా తనతో పాటుగా మరి కొందరు ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారని, అందరూ పన్నీరు సెల్వం వైపుగా వచ్చేడం ఖాయమని ప్రకటించారు. చదవండి: ‘మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది’ అదే సమయంలో పన్నీరు సెల్వం పేర్కొంటూ, మరి కొద్ది రోజుల్లో చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి టీటీవీ దినకరన్ను కలవనున్నానని, వారిని పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో పళని శిబిరానికి చెందిన నేతలు జయకుమార్, ఆర్బీ ఉదయకుమార్ స్పందిస్తూ, నోట్లను ఎరగా వేసి నాయకులు, స్వర సభ్య సమావేశం సభ్యులను తన వైపుగా తిప్పుకునే ప్రయత్నంలో పన్నీరు సెల్వం ఉన్నారని ఆరోపించారు. ఒక్క ఎమ్మెల్యే వెళ్లినంత మాత్రాన తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. -
టోల్గేట్ సిబ్బందిపై 'చిన్నమ్మ' ఫైర్
చెన్నై : చిన్నమ్మ శశికళకు కోపం వచ్చింది. టోల్ గేట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థరాత్రి వేళ రోడ్డుపై నిరసనకు దిగారు. వివరాలు.. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ పురట్చి పయనానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. విస్తృతంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ, మద్దతుదారుల్ని ఏకం చేస్తూ, తన బలాన్ని చాటుకునే పనిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం రాత్రి విల్లుపురం పర్యటన ముగించుకుని తిరుచ్చి వైపుగా బయలు దేరి వెళ్లారు. అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఎనిమిది వాహనాలతో కూడిన ఆమె ప్రైవేట్ కాన్వాయ్ తిరుచ్చి తువ్వాకుడి టోల్ గేట్కు చేరుకుంది. ముందుగా వెళ్లున్న వాహనం టోల్ ‘గేట్’ను దాటింది. అయితే, చిన్నమ్మ వాహనానికి అడ్డుగా గేట్ పడటంతో వివాదం రేగింది. ఆమె ఉన్న వాహనం అద్దాలను తాకుతూ గేట్ వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇదే టోల్ గేట్లో తనకు రెండుసార్లు అవమానం జరిగిందని, మరో మారు అదే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మద్దతుదారులు సైతం తగ్గేది లేదంటూ వాహనాలను రోడ్డు మధ్యలో ఆపేశారు. నిరసన.. బుజ్జగింపులు చిన్నమ్మ మద్దతుదారులు ఒక్క సారిగా టోల్గేట్ వైపు దూసుకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సిబ్బంది ప్రాణభయంతో పారిపోయారు. దీంతో టోల్లోని అన్ని గేట్లు మూత పడ్డాయి. వాహనాలు బారులు తీరడమే కాకుండా, కారులో నుంచి చిన్నమ్మ శశికళ నిరసనకు దిగారు. ఆమె మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు రంగంలోకి దిగి చిన్నమ్మను, ఆమె మద్దతు దారులను బుజ్జగించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. టోల్ గేట్ మేనేజర్ అమర్నాథ్ చిన్నమ్మకు క్షమాపణలు చెప్పినా చిన్నమ్మలో ఆగ్రహం తగ్గలేదు. తనపై కక్ష సాధింపు ధోరణి అనుసరిస్తున్నట్టుందని మండిపడ్డారు. ఫిర్యాదు ఇస్తే విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొనడంతో చిన్నమ్మ శాంతించారు. గంట తర్వాత ఆమె కాన్వాయ్ అక్కడి నుంచి కదిలింది. ఇదీ చదవండి: అన్నాడీఎంకేలో వర్గపోరు.. నేనే అధినేత్రిని, మీడియాతో శశికళ వ్యాఖ్యలు -
అన్నాడీఎంకేలో వర్గపోరు.. నేనే అధినేత్రిని, మీడియాతో శశికళ వ్యాఖ్యలు
సాక్షి , చెన్నై : ‘‘ప్రధాన కార్యదర్శి పదవి ఇంకా నా చేతుల్లోనే ఉండగా, ఆ పీఠం కోసం మీలో మీకు ఘర్షణలేల’’.. అని అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీపై ఆధిపత్యం కోసం ఎడపాడి పళనిస్వామి, పన్నీర్సెల్వం మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుండగా, మధ్యలో శశికళ నేనున్నాంటూ వచ్చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణులను కలుసుకుంటున్న చిన్నమ్మ విళుపురంలో మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకే ఏ ఒక్కరి సొత్తు, ప్రయివేటు సంస్థ కాదని ఆమె అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ఎంజీ రామచంద్రన్ ఆ పార్టీని స్థాపించారని ఆమె గుర్తు చేశారు. జయలలిత రాజకీయ జీవితంలో వెన్నంటి నిలిచిన కాలంలో ఆమె ఆనేక విషయాలు తనతో పంచుకున్నారని చిన్నమ్మ వెల్లడించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిని తానేనని, ప్రజలు చూపిన మార్గంలో తాను పయనిస్తున్నానని చెప్పారు. కొత్తగా ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడం వ్యక్తిగత హోదాలో కుదరదు, పార్టీ కార్యకర్తలే తీర్మానించాలని స్పష్టం చేశారు. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు, ద్రోహులను ప్రజలు క్షమించరని ఆమె హెచ్చరించారు. అదును చూసి సరైన బదులిస్తానని వ్యాఖ్యానించారు. చదవండి: భారీ వర్షాలు.. నదిలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది మృతి ఆ పదవుల కాలం చెల్లిపోలేదు : కోర్టు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, కో కన్వీనర్లుగా పన్నీర్సెల్వం, ఎడపాడి పళనిస్వామిల పదవీకాలం ముగిసిపోలేదని మద్రాసు హైకోర్టు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఆయా పదవుల్లో వారిద్దరూ కొనసాగుతున్నట్లేనని తెలిపింది. ఈనెల 11వ తేదీన తాము తలపెట్టినది సర్వసభ్య ప్రత్యేక సమావేశమని, పార్టీలో కన్వీనర్, కో కన్వీనర్ పదవులు ప్రస్తుతం లేవని ఎడపాడి వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయానికి అదనపు బందోబస్తు.. అన్నాడీఎంకేలో వర్గపోరు రోజురోజుకూ వేడెక్కుతున్న దశలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ బందోబస్తును పెట్టింది. యధావిధిగా బందోబస్తులో ఉండే పోలీసులు కాకుండా ఎస్ఐ నేతృత్వంలో 10 మందితో కూడిన సాయుధ పోలీసులు బుధవారం రాత్రి నుంచి బందోబస్తుగా నలిచి ఉన్నారు. సర్వసభ్య సమావేశంలో గొడవలు లేవనెత్తేలా అసాంఘిక శక్తులు జొరబడకుండా ఎడపాడి పళనిస్వామి జాగ్రత్త పడుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆహ్వాన పత్రాలను పంపుతున్నారు. ఆ పత్రికను స్కాన్ చేస్తేనే ప్రవేశం కల్పించేలా తీసుకున్న ఈ చర్యలు ఎడపాడి వర్గీలను సంతోష పెడుతుండగా, పన్నీర్ మద్దతుదారులు డీలాపడిపోయారు. పిల్పై రూ.25 వేల జరిమానా రెండాకుల గుర్తుపై నిషేధం విధించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసిన వ్యక్తిపై మద్రాసు హైకోర్టు రూ.25 వేల జరిమానా విధించింది. అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంపై నిషేధం విధించాలని ఆ పార్టీ మాజీ నేత పీఏ జోసెఫ్ మద్రాసు హైకోర్టులో ఇటీవల ఓ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి కోసం మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఒక వారపత్రికలో వార్త వచ్చింది. ఈనెల 11వ తేదీన జరగనున్న సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కోసం ఆయన మరో రూ.1000 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఆ పత్రికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎస్, ఓపీఎస్ల మధ్య సాగుతున్న రాజకీయపోరు కులపరమైన పోటీగా మారింది. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ కారణంగా అన్నాడీఎంకే రెండాకుల గుర్తుపై నిషేధం విధించి పార్టీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలి’.. అని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనా«థ్ భండారీ, న్యాయమూర్తి ఆర్ మాలా బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. మీరసలు పార్టీ సభ్యులా అంటూ తొలుత ప్రశ్నించారు. ప్రచారం కోసం పిల్ వేసిన జోసెఫ్పై రూ.25 వేలు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వ్యాజ్యాన్ని తోసిపుచ్చారు. -
అన్నాడీఎంకే: రెండాకుల్లో.. మూడుముక్కలాట!
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే ప్రబలశక్తి. రెండాకుల గుర్తుపై గణనీయమైన ఓటు బ్యాంకు ఈ పార్టీకి సొంతం. ఎంజీఆర్, జయలలిత కాలం నాటి క్రమశిక్షణ కనుమరుగైపోగా, రెండాకుల పార్టీ కోసం ఈపీఎస్, ఓపీఎస్, వీకేఎస్ మధ్య మూడుముక్కలాట తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. వ్యవస్థాపక అధ్యక్షునిగా ఎంజీ రామచంద్రన్, ఆ తరువాత పగ్గాలు చేపట్టిన జయలలిత ప్రధాన కార్యదర్శిగా పార్టీని పరుగులు పెట్టించారు. జయ మరణం తరువాత పార్టీపై పెత్తనం కోసం వీకే శశికళ (వీకేఎస్), ఓ పన్నీర్సెల్వం (ఓపీఎస్), ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్) పోటీపడ్డారు. ఆస్తుల కేసులో శశికళ జైలుపాలు కావడంతో ఓపీఎస్,ఈపీఎస్ల జంట నాయకత్వం అనివార్యమైంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో శశికళ జైలు నుంచి విడుదల కావడం, పార్టీ ఓటమి తరువాత అంతః కలహాలు మొదలయ్యాయి. ఏక నాయకత్వం నినాదంతో గద్దెనెక్కాలని ఎడపాడి చేస్తున్న ముమ్మురమైన ప్రయత్నాలపై ఓపీఎస్ న్యాయపోరాటానికి దిగారు. పోటీగా ఈపీఎస్ సైతం కోర్టు మెట్లెక్కారు. ముచ్చటగా మూడో నేత.. ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరించడం ద్వారా పార్టీని కైవసం చేసుకుకోవాలని ఎడపాడి పళనిస్వామి భావిస్తుండగా ఆ ప్రయత్నాలకు పన్నీర్సెల్వం గండికొడుతున్నారు. ఈపీఎస్, ఓపీఎస్ కుమ్ములాటతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండాకుల గుర్తుపై ఈసీ (ఎన్నికల కమిషన్) నిషేధం విధించింది. ఇక అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ కలవరాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేలా శశికళ రాష్ట్రవ్యాప్త పర్యటన మొదలుపెట్టారు. ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తులనే నిజమైన నేతలుగా పరిగణించాలి, కార్యకర్తలను కలుపుకుపోగల ఏక నాయకత్వమే పార్టీకి శ్రేయస్కరమని ఈనెల 4వ తేదీన పూందమల్లి జరిపిన పర్యటనలో శశికళ అన్నారు. క్యాడర్ను ఏకతాటిపై నడిపించేందుకు పార్టీ శ్రేణులు తన నాయకత్వాన్ని కోరుతున్నారని ఆమె చెప్పారు. చదవండి: Viral: బ్యాండ్ వాయించి సీఎం ఏక్నాథ్కు వెల్కమ్ చెప్పిన భార్య స్టే కోసం ఓపీఎస్ పిటిషన్ ఎడపాడి పళనిస్వామి మద్దతుదారులు ఈనెల 11వ తేదీన తలపెట్టిన సర్వసభ్య సమావేశం నిర్వహణపై స్టే విధించాలని కోరుతూ పన్నీర్సెల్వం మంగళవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను అత్యవసర కేసుగా పరిగణించి విచారణ చేపట్టాలని ఓపీఎస్ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. ఈమేరకు స్టే కోరుతూ దాఖలైన ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్టే కోసం ఒకవైపు ఓపీఎస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా, మరోవైపు ఈపీఎస్ సర్వసభ్య సమావేశానికి సన్నాహాలు చేస్తున్నారు. 11వ తేదీన సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా తనను కార్యకర్తలే ఎన్నుకునేలా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని వ్యూహం పన్నుతున్నారు. ఈ సమావేశానికి పోలీసు బందోబస్తు కల్పించాలని మాజీ మంత్రి జయకుమార్ డీజీపీకి మంగళవారం దరఖాస్తు చేశారు. అసాంఘిక శక్తుల వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. జనరల్బాడీ సమావేశానికి హాజరయ్యే సభ్యులకు బార్కోడ్తో కూడిన గుర్తింపుకార్డు విధానాన్ని ప్రవేశపెట్టాలని పార్టీ భావిస్తోంది. అంతేగాక, పన్నీర్సెల్వం వర్గాన్ని తమవైపునకు తిప్పుకునేలా ఎడపాడి నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. పనిలో పనిగా పన్నీర్సెల్వంకు సైతం ఎడపాడి ఆహ్వానం పంపడం విశేషం. -
సాక్షి కార్టూన్: 09-06-2022
జయలలిత అని పెట్టేసుకోండి మేడమ్! -
‘త్వరలో వస్తున్నా.. ఇక్కడే కదా ఉంటారు, వెయిట్ చేయండి’
సాక్షి, చెన్నై: రాష్ట్రవ్యాప్త పర్యటనను త్వరలో ప్రారంభించి చురుకైన రాజకీయాల్లో దిగుతున్నట్లు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి శశికళ ప్రకటించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి విడుదలైన శశికళను ఇంకా పలు కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి కేసు, విదేశీ మారకద్రవ్యం, కొడనాడు ఎస్టేట్, బెంగళూరు పరప్పన అగ్రహార జైలు అధికారులకు రూ.2 కోట్ల లంచం కేసుల విచారణలో ఆమె తలమునకలై ఉన్నారు. ఈ కేసుల నుంచి విముక్తి, అన్నాడీఎంకేను కైవసం చేసుకోవడం కోసం ఆమె గత కొంతకాలంగా ఆధ్యాత్మిక పర్యటనలు సాగిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా చెన్నై నుంచి తిరుచ్చిరాపల్లికి ప్రయాణం అవుతూ విమానాశ్రయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనల్లో ఉన్నానని వెల్లడించారు. ఈ పర్యటన ముగిసిన వెంటనే క్రీయాశీలక రాజకీయాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి పదవులపై త్వరలో అప్పీలు చేస్తానని స్పష్టం చేశారు. కొడనాడు హత్య, దోపిడీ నేర ఘటనలపై ఎవైనా అనుమానాలు ఉన్నాయా ని మీడియా ప్రశ్నించగా బదులివ్వకుండానే వెళ్లిపోయారు. అనంతరం తిరుచ్చి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ రణక్షేత్రంలో ఒంటరిగా దిగుతారా..? పార్టీలతో పొత్తపెట్టుకుంటారా అని ప్రశ్నించగా మీరంతా ఇక్కడే కదా ఉంటారు, వేచి చూడండి అంటూ బదులిచ్చారు. మీకు స్వాగతం చెప్పేవారిని టీటీవీ దినకరన్ బహిష్కరిస్తారని ప్రచారం జరుగుతున్నదని ప్రశ్నించగా, ప్రస్తుతం ఆలయానికి వెళుతున్నా, తరువాత బదులిస్తానంటూ వెళ్లిపోయారు. -
చిన్నమ్మకు చుక్కెదురు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చిన్నమ్మ శశికళకు చెన్నై సిటీ సివిల్ కోర్టులో చుక్కెదురైంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆమెను తొలగించడం సబబే అంటూ న్యాయస్థానం సోమవారం తీర్పు చెప్పింది. నేపథ్యం ఇదీ.. సుదీర్ఘకాలం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయలలిత 2016 డిసెంబర్లో కన్నుమూశారు. తరువాత ఆ బాధ్యతల్లో శశికళ, ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ ఎంపికైనట్లు ఆపార్టీ 2016 డిసెంబర్ 19న ప్రకటించింది. ఇక ఆ తరువాత సీఎం సీటుపై కన్నేసిన జయలలిత శాసనసభాపక్ష నేతగా కూడా ఎన్నిక్కయ్యారు. అయితే అదే సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్ష పడగా బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకెళ్లారు. దీంతో ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను, ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి టీటీవీ దినకరన్ను తొలగిస్తున్నట్లు పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ ఓ పన్నీర్సెల్వం, ఉప కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి 2017 సెప్టెంబర్లో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. ఆ తీర్మానాలు చెల్లవంటూ.. ఇదిలా ఉండగా, ప్రధాన కార్యదర్శి సమక్షంలో జరగని (సర్వసభ్య సమావేశంలో) తీర్మానాలు చెల్లవని ప్రకటించాల్సిందిగా కోరుతూ శశికళ, దినకరన్ చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. తనను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటూ 2016లో చేసిన తీర్మానానికి పార్టీ సభ్యుల హోదాలో పన్నీర్సెల్వం, ఎడపాడి పళనిస్వామి బద్దులై ఉండాలని, కన్వీనర్, కో– కన్వీనర్ పదవులను ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ప్రకటించాలని శశికళ తన పిటిషన్లో పేర్కొన్నారు. శశికళ వేసిన పిటిషన్ను నిరాకరించాల్సిందిగా పన్నీర్సెల్వం, ఎడపాడి కూడా పిటిషన్ వేశారు. ఈ వ్యవహారం కోర్టులో విచారణకు వచ్చినప్పుడు పార్టీ తరపు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ, శశికళ, దినకరన్ను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, ఎన్నికల కమిషన్ సమర్ధించిందని చెప్పారు. తాను పార్టీ ప్రధాన కార్యదర్శినని.. న్యాయస్థానంలో శశికల అబద్ధమాడారని వివరించారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అనే పేరుతో సొంతగా పార్టీ స్థాపించినందున తాను వేసిన పిటిషన్ను వెనక్కితీసుకుంటున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్ మరో పిటిషన్ ద్వారా కోర్టుకు విన్నవించారు. దీంతో ప్రధాన కార్యదర్శిగా ప్రకటించాలని కోరుతూ శశికళ దాఖలు చేసిన పిటిషన్పై మాత్రమే సోమవారం విచారణ సాగింది. శశికళ వేసిన పిటిషన్ను కొట్టివేయాలని కోరుతూ పన్నీర్సెల్వం, ఎడపాడి పళనిస్వామి దాఖలు చేసిన పిటిషన్లను స్వీకరిస్తున్నట్లు, ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగిస్తూ చేసిన తీర్మానం చెల్లుతుంది కాబట్టి ఆమె వేసిన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు చెన్నై సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి జె. శ్రీదేవి సోమవారం తీర్పు చెప్పారు. సివిల్ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తాం.. సేలం: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తనను తొలగించడం సబబే అంటూ చెన్నై సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేస్తామని చిన్నమ్మ సోమవారం స్పష్టం చేశారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోడులోని ఆర్ధనారీశ్వర స్వామి ఆలయానికి శశికళ సోమవారం వచ్చి స్వామిని దర్శించుకున్నారు. స్వామి, అమ్మవారు, నవగ్రహాల సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలే తనకు ఆధారమన్నారు. ఎంజీఆర్ రూపొందించిన విధి విధానాల ఆధారంగా కార్యకర్తలే ప్రధాన కార్యదర్శిని నిర్ణయించగలరని స్పష్టం చేశారు. దేశంలోని మరే పార్టీలోనూ ఈ షరతు లేదని, అన్నాడీఎంకే విధి విధానాల్లో మాత్రమే ఉందని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే తాను పోరాడుతున్నట్లు చెప్పారు. -
చిన్నమ్మకు ‘పన్నీరు’ క్లీన్ చిట్
సాక్షి, చెన్నై: దివంగత సీఎం, అమ్మ జయలలిత మరణం కేసులో చిన్నమ్మ శశికళకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం వ్యక్తిగతంగా క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆయన ఆర్ముగస్వామి కమిషన్ ఎదుట మంగళవారం తన వాదన చెప్పారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో చోటు చేసుకు న్న పరిణామాల గురించి తెలిసిందే. తొలుత చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది పన్నీరు సెల్వమే. అమ్మ మరణంలో మిస్టరీ ఉందని నినాదించారు. నిగ్గుతేల్చాలని పట్టుబట్టారు. చివరకు చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో సీఎంగా గద్దెనెక్కిన ఆమె ప్రతినిధి పళనిస్వామికి దగ్గరయ్యారు. అధికారాన్ని పంచుకు న్న ఈ ఇద్దరు అన్నాడీఎంకే నుంచి చిన్నమ్మను బహిష్కరించారు. అలాగే, అమ్మ మరణం మిస్టరీ నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ను రంగంలోకి దించారు. ఈ కమిషన్ గతంలో 8 సార్లు సమన్లు జారీ చేసినా పట్టించుకోని పన్నీరు, తాజాగా పరుగులు తీయక తప్పలేదు. గంటలపాటూ విచారణ సోమవారం 3 గంటల పాటుగా ఆర్ముగ స్వామి కమిషన్ పన్నీరును విచారించింది. 78 ప్రశ్నలు సంధించగా, కొన్నింటికి సమాధానాలు ఇచ్చి, మిగిలిన వాటికి దాట వేశారు. ప్రధానంగా అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్, కార్యదర్శి రాధాకృష్ణన్, సీఎస్ రామ్మోహన్రావు కనుసన్నల్లోనే చికిత్స వ్యవహారాలు సాగినట్లుగా వ్యాఖ్యల తూటాల్ని పేల్చడం చర్చకు దారి తీశాయి. మంగళవారం 6 గంటలు పా టు విచారణ జరిగింది. 120 ప్రశ్నల్ని పన్నీరు ముందు కమిషన్ వర్గాలు ఉంచగా, మరో 34 ప్రశ్నల్ని క్రాస్ ఎగ్జామిన్లో శశికళ తరపున న్యాయవాది రాజ చెందూ ర్ పాండియన్ సంధించారు. అలాగే, అపోలో ఆస్పత్రి తరపున 11 ప్రశ్నలు పన్నీరు ముందుంచారు. చిన్నమ్మకు అనుకూలంగా.. గతంలో చిన్నమ్మకు వ్యతిరేకంగా స్వరాన్ని వినిపించిన పన్నీరు తాజాగా ఆమెను ఇరకాటంలో పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. జయలలిత మరణం విషయంలో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి అనుమానం లేదు అని పేర్కొనడం గమనార్హం. అయితే, ప్రజలు, కేడర్ అనుమానాలు వ్యక్తం చేశాయని, వారి ప్రతినిధిగా తాను కమిషన్ ఏర్పాటుకు పట్టుబట్టినట్టు పేర్కొనడం ఆలోచించాల్సిందే. ఇక, జయలలితకు వ్యతిరేకంగా శశికళ, ఆమె కుటుంబీకులు ఎలాంటి కుట్రలు చేయలేదని స్పష్టం చేశారు. అలాగే, చిన్నమ్మ అంటే వ్యక్తిగతంగా తనకు మర్యాద, అభిమానం ఉందని క్రాస్ ఎగ్జామిన్ సమయంలో పన్నీరు ఇచ్చిన సమాధానాలు అన్నాడీఎంకేలో హాట్ టాపిక్ అయ్యాయి. కాగా జయలలితకు అందించిన వైద్య చికిత్సలు, సీసీ కెమెరాల తొలగింపు తదితర అంశాల గురించి తనకు తెలియదని పన్నీరు పేర్కొన్న దృష్ట్యా, ఆమెకు చికిత్స అందించిన లండన్ వైద్యుడు రిచర్డ్, అపోలో యాజమాన్యాన్ని మరో మారు విచారించేందుకు కమిషన్ సిద్ధమైంది. సంతృప్తికరంగా విచారణ విచారణ అనంతరం మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, విచారణ సంతృప్తికరంగా జరిగిందన్నారు. ‘వాస్తవాలు’ తెలియజేశానన్నారు. చిన్నమ్మ న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ మాట్లాడుతూ, కుట్రలు జరగలేదని, అనుమానం లేదన్న సమాధానాలను పన్నీరు వెల్లడించినట్లు చెప్పారు. -
జీవితాన్ని ప్రజలు, కేడర్కు అంకితం చేస్తా: చిన్నమ్మ శశికళ
సాక్షి, చెన్నై: దక్షిణ తమిళనాడు పర్యటనతో మనసు పులకించిందని, ప్రతి కార్యకర్త, ప్రజల ఆకాంక్ష నెర వేరే రోజులు సమీపించాయని చిన్నమ్మ శశికళ ధీమా వ్యక్తం చేశారు. మదురై నుంచి ఆమె రోడ్డు మార్గంలో సోమవారం చెన్నైకు చేరుకున్నారు. రెండు రోజుల క్రితం తూత్తుకుడిలో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ పర్యటించారు. ఆ తదుపరి తిరునల్వేలి, తెన్కాశి, విరుదునగర్, మదురైలలో చిన్నమ్మ పర్యటన రోడ్డు మార్గంలో సాగింది. ఈ పర్యటల్ని ముగించుకుని చెన్నైకు చేరుకున్న శశికళ కేడర్ను ఉద్దేశించి ప్రకటన చేశారు. తాను ఆధ్యాత్మిక పర్యటన నిమిత్తం వెళ్లినా, చివరకు ప్రజలతో, అభిమానులతో మమేకమయ్యారు. రోడ్డు మార్గంలో చెన్నైకు రాక అందరినీ కలవాలనే ఆకాంక్షతోనే విమాన ప్రయానాన్ని సైతం రద్దు చేసుకుని రోడ్డు మార్గంలో చెన్నైకు వచ్చినట్టు గుర్తు చేశారు. ఎంజీఆర్, జయలలిత ఆశయ సాధన ప్రతి కార్యకర్త కళ్లల్లో తనకు ఈ పర్యటన ద్వారా కనిపించిందన్నారు. అందరి ఆకాంక్ష, కోరిక నెరవేరే రోజులు సమీపించాయని వ్యాఖ్యానించారు. అందరం ఐక్యమత్యంగా ముందుకెళ్దామని, దివంగత నేతల ఆశయ సాధనలో భాగస్వామ్యం అవుదామని, పార్టీని పరిరక్షించి, ప్రజా పాలనను తిరిగి సాధించుకుంద్దామని చిన్నమ్మ ధీమా వ్యక్తం చేశారు. తన పూర్తి జీవితాన్ని ప్రజలు, కేడర్కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. -
అన్నాడీఎంకేలో చిన్నమ్మ చిచ్చు?
-
హిజబ్ వివాదం.. టీచర్ శశికళ రాజీనామా
బనశంకరి (బెంగళూరు): హిజబ్ వివాదంలో చిక్కుకున్న బెంగళూరు చంద్రా లేఔట్ విద్యాసాగర్ ప్రైవేటు స్కూల్ టీచర్ శశికళ ఉద్యోగానికి రాజీనామా చేశారు. పాఠశాలలో పని చేయలేను, అనారోగ్యం వల్ల రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. హిజబ్ ధరించిన విద్యార్థినులను స్కూల్లోకి అనుమతించలేదని ఇటీవల తల్లిదండ్రులు గొడవ చేశారు. హిజబ్కు వ్యతిరేకంగా శశికళ బోర్డుపై రాశారని ఆరోపణలు వచ్చాయి. ఆమెను సస్పెండ్ చేసినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈ తరుణంలో రాజీనామా చేశారు. చదవండి: (ఆంగ్సాన్ సూకీపై విచారణ ఆరంభం) -
మదురైలో మంతనాలు .. వేడెక్కిన అన్నాడీఎంకే రాజకీయం
సాక్షి, చెన్నై(తమిళనాడు): చిన్నమ్మ శశికళ రాజకీయ దూకుడు పెరగడంతో.. అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. చిన్నమ్మ ప్రతినిధిగా ముద్ర పడ్డ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్తో పన్నీరుసెల్వం సోదరుడు రాజ భేటీ కావడం చర్చకు దారితీసింది. ఈ వ్యవహారాలతో సేలంలో ఉన్న పళనిస్వామి హుటాహుటిన గురువారం రాత్రి చెన్నైకు చేరుకున్నారు. ఇక చిన్నమ్మ శశికళను పార్టీలోకి మళ్లీ ఆహ్వానించే విషయంపై అన్నాడీఎంకే సమన్వ య కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం చేసిన వ్యాఖ్యలకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ, మాజీ మంత్రి సెల్లూరు రాజుతో సహా పలువురు అన్నాడీఎంకే నేత లు గురువారం ప్రకటనలు చేశారు. దీంతో చిన్నమ్మ వ్యవహారం అన్నాడీఎంకేలో హట్టాఫిక్గా మారింది. ఈ వ్యవహారాలు ఓ వైపు ఉంటే, మరోవైపు చిన్నమ్మ రాజకీయ మంతనాలు ఊపందుకున్నాయి. బుధవారం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు తంజావూరులో ఉన్న ఆమెను పలువురు నేతలు కలిసి మాట్లాడినట్టు తెలిసింది. దినకరన్ ఇంటి శుభ కార్యక్రమానికి చిన్నమ్మ హాజరు కావడం, అక్కడికి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో పాటుగా దక్షిణ తమిళనాడులో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు, సన్నిహితులు రావడం చర్చనీయాంశమైంది. భేటీపై ఆసక్తి తంజావూరు పర్యటన ముగించుకుని మదురైకు గురువారం మధ్యాహ్నం చిన్నమ్మ వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ముఖ్య నేతలతో శశికళ భేటీ అయ్యారు. దక్షిణ తమిళనాడులోని దేవర్ సామాజిక వర్గాన్ని ఏకం చేసే రీతిలో, తనకు సన్నిహితంగా, మద్దతుగా ఉన్న అన్నాడీఎంకే మాజీలతో ఈ సంప్రదింపులు జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ముందుగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా చిన్నమ్మ శశికళ వ్యూహాలకు పదును పెట్టారని చెప్పవచ్చు. తాను పయనిస్తున్న మార్గంలో రైతులతో ముచ్చటిస్తూ, పంట పొలాల్లోకి వెళ్లి పలకరిస్తూ ముందుకు సాగారు. చెన్నైకు పళని స్వామి.. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో కన్వీనర్ పళనిస్వామి సేలం నుంచి గురువారం రాత్రి చెన్నైకు చేరుకున్నారు. చిన్నమ్మ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సైతం వ్యూహ రచనల్ని వేగవంతం చేశారు. ఇక, చిన్నమ్మకు మద్దతు గళం పెరుగుతున్న నేపథ్యంలో దినకరన్తో పన్నీరు సోదరుడు రాజ భేటీ కావడాన్ని తీవ్రంగానే పరిగణించారు. అదే సమయంలో మనస్సు నొప్పించే విధంగా ఇతరులపై వ్యాఖ్య లు చేయవద్దు అని తన మద్దతు దారులకు పళని స్వామి హితవు పలికినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, పళనిస్వామి కేవలం వైద్య చికిత్స కోసం చెన్నైకు వచ్చారేగానీ, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టేందుకు కాదంటూ ఆయన వర్గీయులు పేర్కొనడం గమనార్హం. చదవండి: మంత్రి వర్గంలో సంస్కార హీనులు -
అన్నాడీఎంకేలో మళ్లీ కోల్డ్ వార్.. ‘పళని’ ఎత్తు.. ‘పన్నీరు’ పైఎత్తు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో– కన్వీనర్ పళని స్వామి మధ్య మళ్లీ అంతర్గత పోరు తెర మీదకు వచ్చింది. అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిన్నమ్మ శశికళ దూకుడు, పార్టీని కాపాడుకునేందుకు పన్నీరు, పళని సారథ్యంలోని సమన్వయ కమిటీ సాగిస్తున్న కుస్తీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, హఠాత్తుగా సోమవారం సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం చిన్నమ్మ శశికళ నామస్మరణను అందుకోవడం చర్చకు దారి తీసింది. చిన్నమ్మను ఆది నుంచి పళని స్వామితో పాటుగా సీనియర్లు వ్యతిరేకిస్తున్న తరుణంలో, అందరితో చర్చించి చిన్నమ్మ విషయంలో నిర్ణయం తీసుకుంటామని పన్నీరు సెల్వం వ్యాఖ్యానించడంలో ఆంతర్యాన్ని పసిగట్టే పనిలో రాజకీయ విశేష్లకులు నిమగ్నమయ్యారు. ( చదవండి: అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ పయనం.. దినకరన్ మద్దతు ) టార్గెట్.. ప్రధాన కార్యదర్శి పదవి తానే ప్రధాన కార్యదర్శి అని శశికళ స్పష్టం చేస్తూ వస్తున్న తరుణంలో ఆ పదవి విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు పళని రచించిన వ్యూహం మంగళవారం రాజకీయ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్లో అన్నాడీఎంకే కార్యవర్గం, సర్వసభ్య సమావేశం నిర్వహించి, రద్దు చేసిన ఆ పదవిని మళ్లీ పునరుద్ధరించి, చేజిక్కించుకునేందుకు పళని వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. జంట నాయకత్వాన్ని పక్కన పెట్టి, ఏకాధిప్యతం లక్ష్యంగా సీనియర్లతో పళని రహస్య మంతనాలు చేస్తున్న విషయం పన్నీరు దృష్టికి రావడంతోనే హఠాత్తుగా చిన్నమ్మను జపాన్ని ఆయన తెర మీదకు తెచ్చినట్టు సమాచారం. ప్రధాన కార్యదర్శి పదవి తన గుప్పెట్లోకి వచ్చిన తరువాత.. చిన్నమ్మ దూకుడుకు కళ్లెం వేయవచ్చన్న ధీమాతో పళని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఎత్తుకు పైఎత్తు అన్నట్టుగా చిన్నమ్మ నినాదాన్ని పన్నీరు అందుకున్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. చిన్నమ్మ పర్యటన ఓవైపు అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాట మళ్లీ తెర రాగా, మరోవైపు కేడర్లోకి చొచ్చుకు వెళ్లేందుకు చిన్నమ్మ దృష్టి పెట్టారు. మంగళవారం చెన్నై నుంచి ఆమె తంజావూరుకు బయలుదేరి వెళ్లారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలే కాకుండా, మద్దతుదారులు ఆమెకు బ్రహ్మరథం పట్టడం గమనార్హం. మూడు రోజుల పాటుగా ఆమె తంజావూరు, మదురై, రామనాథపురంలో పర్యటించనున్నారు. చదవండి: Vijayakanth: నా ఆరోగ్యం క్షీణించిన విషయం నిజమే.. అంత మాత్రాన.. -
జయలలితకు నెచ్చెలి నివాళి
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద ఆమె నెచ్చెలి శశికళ శశివారం నివాళులర్పించారు. ఇది సర్వసాధారణ విషయమైనా.. పార్టీని కైవసం చేసుకోబోతున్నట్లు శశికళ నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో తమిళనాడులో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష అనుభవించి ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లు ప్రకటించి ఇంటికే పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి చెందడంతో రాజకీయాలపై మరలా దృష్టి సారించడం ప్రారంభించారు. ఈనెల 17న అన్నాడీఎంకే శ్రేణులంతా స్వర్ణోత్సవాలకు సిద్ధమైన తరుణంలో శనివారం ఉదయం 10.30 గంటలకు అమ్మ సమాధి వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. పదినిమిషాలు మౌనం పాటించి కన్నీళ్లు పెట్టుకున్నారు. కొన్నేళ్లుగా మోస్తున్న గుండెలోని భారాన్ని ఈరోజు దించుకున్నానని మీడియా వద్ద వ్యాఖ్యానించి ఇంటికి వెళ్లిపోయారు. అన్నాడీఎంకే కార్యాలయం వద్ద హై టెన్షన్ అమ్మ సమాధి వద్ద శశికళ నివాళులర్పించిన తరువాత నేరుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వస్తారనే సమాచారంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ఉదయం 10 గంటలకే పార్టీ నేతలు ప్రధాన గేటు వద్ద అడ్డుగా కూర్చున్నారు. అమ్మ సమాధి నుంచి శశికళ ఇంటికి చేరుకున్నారని నిర్ధారించుకున్న తరువాతే వారంతా వెళ్లిపోయారు. తమిళనాడు వ్యాప్తంగా అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నారు. జైలు నుంచి జయలలిత దత్తపుత్రుడు విడుదల బనశంకరి: జయలలిత దత్తపుత్రుడు వీఎన్ సుధాకరన్ శనివారం బెంగళూరులోని పరప్పన జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమాస్తుల కేసులో శశికళ కంటే ముందుగానే విడుదల కావలసిన సుధాకరన్ రూ.10 కోట్లు జరిమానా చెల్లించకపోవడంతో ఏడాది అదనంగా జైల్లో ఉన్నారు. ఆయన సుమారు 4 ఏళ్ల 9 నెలలు జైలులో ఉన్నారు. గత ఏడాది శశికళ, ఆమె బంధువు ఇళవరసి అదనపు జరిమానాను చెల్లించి విడుదలయ్యారు. శశికళ విడుదలై ఇంటికి వెళ్లాక ఒక్కసారి కూడా సుధాకరన్ను కలవకపోగా కనీసం ఫోన్ కూడా చేయలేదని సమాచారం. -
మోదీతో ఓపీఎస్, ఈపీఎస్ భేటీ: చిన్నమ్మ గురించే చర్చ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అధికారం కోల్పొయి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. జయ మరణం తరువాత పార్టీకి ‘పెద్ద’దిక్కుగా మారిన ప్రధాని నరేంద్రమోదీతో ఆ పార్టీ రథసారధులు అనేక సమస్యలపై మొరపెట్టుకున్నారు. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు, మాజీ మంత్రుల ఇళ్లపై ఏసీబీ దాడులు, ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీకి సవాలుగా మారాయి. ఈ సవాళ్లను ఎదుర్కొవడంపై సీనియర్ నేతల మధ్య సయోధ్య కరువైంది. ఇలాంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్సెల్వం, ఉప సమన్వయకర్త ఎడపాడి పళనిస్వామి ఆదివారం ఉదయం, రాత్రి వేర్వేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకే వారిద్దరూ ఢిల్లీకి వెళ్లినట్లు పార్టీ వర్గాల సమాచారం. పన్నీర్సెల్వం కుమారుడు, తేనీ లోక్సభ సభ్యుడు రవీంద్రనాథ్కు కేంద్రం కేటాయించిన వసతి గృహంలో సోమవారం ఉదయం జరిగిన గృహప్రవేశ కార్యక్రమానికి ఓపీఎస్, ఈపీఎస్ సహా పలువురు మాజీ మంత్రులు హాజరయ్యారు. అక్కడి నుంచి ఒకే కారులో ఓపీఎస్, ఈపీఎస్ ప్రధాని ఇంటికి చేరుకున్నారు. తమిళనాడులో మారిన రాజకీయ పరిణామాలు, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ పనితీరు, కేంద్ర క్యాబినెట్లో అన్నాడీఎంకేకు చోటు, స్థానిక సంస్థల ఎన్నికలు, అన్నాడీఎంకే మాజీ మంత్రుల ఇళ్లలో ఎసీబీ తనిఖీలు, అన్నాడీఎంకే–బీజేపీ కూటమి వ్యవహారం తదితర అంశాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. తమిళనాడులో మూడు రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీకానున్నాయి. తమిళనాడు నుంచి కేంద్రమంత్రిగా మారిన ఎల్ మురుగన్ ఆరునెలల్లోగా ఎంపీగా ఎన్నికకావడం అవశ్యంగా మారింది. ఇందుకు సంబంధించి సైతం ప్రధాని, ఓపీఎస్, ఈపీఎస్ మధ్య చర్చకు వచ్చిందని చెబుతున్నారు. చిన్నమ్మ గురించే చర్చ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 66 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. రాజకీయాలకు స్వస్థి పలికినట్లు ఎన్నికల ముందు ప్రకటించిన శశికళ మళ్లీ అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకునేందుకు పావులు కదపుతున్నారు. ప్రధానిని కలిసిన సమయంలో అన్నిటి కంటే శశికళ సాగిస్తున్న తెరవెనుక రాజకీయాలపైనే ప్రధానంగా చర్చకు వచ్చిందని తెలుస్తోంది. శశికళ సహకారం లేకుండానే 66 స్థానాల్లో గెలుపొందిన అన్నాడీఎంకేను తన చెప్పుచేతుల్లోకి తీసుకునేందుకు శశికళ చేస్తున్న ప్రయత్నాలను ఎడపాడి పళనిస్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ శశికళ పార్టీలోకి మళ్లీరాకుండా చేయాలని సీనియర్ నేతలతో ఎడపాడి చెబుతూ వస్తున్నారు. అయితే ఈ విషయంలో పన్నీర్సెల్వం వైఖరి భిన్నంగా ఉంది. శశికళను అన్నాడీఎంకేలోకి ఆహ్వానిస్తే ఆమెకున్న 5శాతం ఓటు బ్యాంకుతో పార్టీని బలోపేతం చేయవచ్చని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని ఓపీఎస్ వాదిస్తున్నారు. శశికళ గురించి ఏకాభిప్రాయం కుదరకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, ఓపీఎస్, ఈపీఎస్ ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించారు. కావేరీ నదీజలాలకు అడ్డుగా మేఘదాతు వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మించనున్న ఆనకట్ట, నీట్ ప్రవేశ పరీక్ష రద్దు, కేంద్రం నుంచి వ్యాక్సిన్ సరఫరాలో నెలకొన్న ఇబ్బందులు, మధురైలో ఎయిమ్స్ స్థాపనపై ఏర్పడిన జాప్యం తదితర అంశాలను వినతిపత్రంలో పేర్కొన్నారు. ఓపీఎస్, ఈపీఎస్లు సోమవారం ఉదయం 11 గంటల నుంచి సుమారు గంటపాటు మోదీతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం కేంద్రహోంమంత్రి అమిత్షాను కూడా కలిశారు. -
అమ్మపార్టీలో.. చిన్నమ్మ భయం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రభుత్వం చేజారిపోయింది. ఇప్పుడు పార్టీ కూడా పరాధీనమైతే.. ఇక రాజకీయ భవిష్యత్తు అంధకారమే అని అన్నాడీఎంకే అగ్రనాయకత్వం ఆందోళన చెందుతోంది. సంస్థాగత ఎన్నికల నిర్వహణకు మరో ఆరునెలలు గడువు కోరుతూ అన్నాడీఎంకే అధిష్టానం ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి ఉత్తరం రాసినట్లు తెలుస్తోంది. పార్టీ చిన్నమ్మ చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునేందుకే.. ఆరునెలల గడువు కోరడం వెనుక అంతరార్థంగా చెబుతున్నారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళ మరలా తెరపైకి వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించలేక పోవడాన్ని అవకాశంగా తీసుకుంటున్న అన్నాడీఎంకేపై వల విసరడం ప్రారంభించారు. పారీ్టలోని తన అనుచరులతో సెల్ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ ప్రగతి కోసం తాను ఎంతో శ్రమించాను, ఈరోజు పార్టీ పతనం దిశగా పయనిస్తుంటూ చూస్తూ ఊరుకోనని ఇటీవల స్పష్టం చేశారు. సీఈసీ వద్ద గుర్తింపు పొందిన పారీ్టలన్నీ ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలనే నియమావళి ఉంది. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కొత్త సభ్యత్వాల నమోదు, పునరుద్ధరణ, జిల్లాస్థాయి నుంచి పార్టీ ప్రధాన కార్యాలయ ఆఫీస్ బేరర్స్ ఎంపికను 2014 ఆగస్టు నుంచి 2015 ఏప్రిల్ వరకు నిర్వహించారు. 2014 ఆగష్టు 29వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి జయలలిత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏడోసారి ఎన్నికైనారు. మిగతా కార్యవర్గం కూడా సంప్రదాయం ప్రకారం ఎన్నుకున్నారు. అయితే ఆ తరువాత అనేక కారణాల వల్ల సంస్థాగత ఎన్నికలు జరగలేదు. 2017 సెపె్టంబరులో జనరల్బాడీ సమావేశాన్ని మాత్రమే నిర్వహించి ప్రధాన కార్యదర్శికి బదులుగా సమన్వయకర్త (పన్నీర్సెల్వం) ఉప సమన్వయకర్త (ఎడపాడి పళనిస్వామి)ను ఎన్నుకున్నారు. అందుకు అనుగుణంగా పార్టీ వ్యవహారాల్లో సవరణలు తీసుకురాగా జనరల్బాడీ సమావేశం ఆమోదించింది. త్వరలో రాష్ట్ర, జిల్లా, గ్రామస్థాయి పార్టీ నిర్వాహకుల ఎన్నికలు నిర్వహిస్తామని అధిష్టానం ఇటీవల ప్రకటించింది. ఆ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లోగా సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉండగా అనేక కారణాల వల్ల అది జరగలేదు. జూలై రెండోవారంలో ఎన్నికలు జరపాల్సిందిగా ఈసీ సూచించగా మరో ఆరునెలలు గడువు ఇవ్వాలని అన్నాడీఎంకే అధిష్టానం కోరినట్లు సమాచారం. ఈ మేరకు పదిరోజుల క్రితం ఈసీకి ఉత్తరం పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అన్నాడీఎంకే జనరల్ బాడీ సమావేశాన్ని ఈ ఏడాది జనవరి 9వ తేదీన నిర్వహించారు. ఇక ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ పరాజయం, కరోనా సెకెండ్ వేవ్ వల్ల సంస్థాగత ఎన్నికలు జరపలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారాన్ని కోల్పోవడంతో పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో జయలలిత నెచ్చెలి శశికళ పార్టీని తన చెప్పుచేతుల్లోకి తెచ్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శశికళతో నష్టం లేదు: ఎడపాడి అన్నాడీఎంకేలోని 10 మందితోనే కాదు వెయ్యిమంది నేతలతో మాట్లాడినా తమకు ఎలాంటి ఆందో ళన, నష్టం లేదని ఆ పార్టీ ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి వ్యాఖ్యానించారు. సేలం జిల్లా ఓమలూరులో పార్టీ నిర్వాహకులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, శశికళ పా రీ్టలో లేరు, కనీసం ప్రాథమిక సభ్యత్వం కూడా లేనందున ఆమెకు అన్నాడీఎంకేతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. -
మళ్లీ వస్తాను.. అన్ని చక్కదిద్దుతాను: శశికళ
సాక్షి, చెన్నై: తనతో మాట్లాడిన వాళ్లను అన్నాడీఎంకే నుంచి తొలగిస్తూ సమన్వయ కమిటీ చేసిన ప్రకటనపై చిన్నమ్మ శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని, అన్నింటినీ చక్కదిద్దుతానని మంగళవారం ఆమె స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులు సద్దుమనిగినానంతరం దూకుడు పెంచబోతున్నారు. ఇందులో భాగంగా అన్నాడీఎంకేలో దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలిత హయాంలో పార్టీ కోసం శ్రమించిన సీనియర్ నేతలతో ఫోన్లో సంప్రదించారు. కార్యకర్తలతోనూ మాట్లాడుతూ భరోసా ఇస్తున్నారు. తాను రావడం ఖాయమని, అన్నాడీఎంకేను కైవసం చేసుకుందామని ధైర్యం చెబుతున్నారు. శశికళ వ్యూహాలకు చెక్పెట్టేందుకు ఆమెతో ఫోన్లో మాట్లాడిన నేతలను అన్నాడీఎంకే సమన్వయ కమిటీ పార్టీ నుంచి తొలగించింది. గ్రామ పర్యటన మంగళవారం మదురై, తేని జిల్లాల్లోనే అన్నాడీఎంకే నేతలు, పార్టీ అనుబంధ ఎంజీఆర్ యూత్ విభాగం నేతలు పలువురితో చిన్నమ్మ ఫోన్లో మాట్లాడారు. పార్టీని రక్షించుకోవాల్సిన అవశ్యం ఏర్పడిందన్నారు. తనను అడ్డుకోవడం ఎవరి తరం కాదని పేర్కొన్నారు. జయలలిత ఆశయాల దిశగా తన ప్రయాణం ఉంటుందన్నారు. కార్యకర్తలు తన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల అభీష్టం మేరకు గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలిపారు. కాగా అన్నాడీఎంకే నుంచి ఉద్వాసనకు గురైన అధికార ప్రతినిధి పుహలేంది మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభావం చూపించలేని బీజేపీ, పీఎంకే వంటి చిన్న పార్టీలకు అన్నాడీఎంకేను తాకట్టు పెట్టారని విమర్శించారు. త్వరలో పళనిస్వామి జైలుకు వెళ్లబోతున్నారని, ఈ మేరకు తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టబోతున్నట్టు పేర్కొనడం చర్చకు దారి తీసింది. చదవండి: Tamilnadu: శశికళ ఫోన్కాల్ ఆడియో కలకలం -
‘ఆమెతో మాట్లాడితే పార్టీ నుంచి బహిష్కరిస్తాం’
చెన్నై: అసెంబ్లీ డిప్యూటీ లీడర్, అసెంబ్లీ విప్ను ఎన్నుకునే సమావేశంలో ఓ కొత్త తీర్మానాన్ని అన్నాడీఎంకే పార్టీ ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం ప్రకారం.. ఇకపై శశికళతో మాట్లాడే వారిపై కఠిన చర్యలు తప్పవని తమ నేతలను హెచ్చరించింది. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇటీవల శశికళ మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ బయట పడింది. ఆ వీడియోలో.. తాను తొందరలోనే క్రీయాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు, తర్వాత అన్నాడీఎంకేపై పార్టీపై పట్టుసాధిస్తానని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలతో మాట్లాడుతుంది. ఈ ఆడియో విన్న తర్వాత పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శశికళతో మాట్లాడిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని అన్నాడీఎంకే నేతలు తమ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపైన కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. కాగా శశికళతో మాట్లాడిన 16 మంది పార్టీ కార్యకర్తలను అన్నాడీఎంకే బహిష్కరించింది. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన పార్టీ ప్రతినిధి వీ పుగజేండిని కూడా బహిష్కరించింది. చదవండి: Tamilnadu: ‘అన్నాడీఎంకే’ నా ఊపిరి: శశికళ -
Tamilnadu: శశికళ ఫోన్కాల్ ఆడియో కలకలం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తన ఊపిరి అని, దానిని వేరు చేయడం ఎవరితరం కాదు అంటూ.. దివంగత సీఎం అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ అంశానికి సంబంధించిన ఫోన్కాల్ ఆడియో గురువారం వైరల్గా మారింది. అస్త్రసన్యాసం ప్రకటనను వెనక్కి తీసుకుని మళ్లీ రాజకీయ ప్రవేశానికి చిన్నమ్మ శశికళ సన్నద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన మద్దతు దారులతో ఆమె ఫోన్ ద్వారా మాటలు కలిపే పనిలో పడ్డారు. బుధవారం అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆనందన్తో ఫోన్లో మాట్లాడిన శశికళ, గురువారం శివగంగై జిల్లా కారైక్కుకుడి అన్నాడీఎంకే నేత ప్రభాకరన్తో ఐదు నిమిషాలకు పైగా మాటలు కలిపారు. ఈసందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో చర్చకు దారి తీశాయి. ఇప్పటి వరకు ఆమె 22 మంది నేతలతో మాట్లాడి ఉన్నట్టు సమాచారం ఉంది. ఈ సమయాల్లో ఎక్కడా ఆమె అన్నాడీఎంకే పేరును ఉచ్చరించలేదు. పార్టీని రక్షించుకోవాలని, నేను వస్తున్నాను.. అని మాత్రమే స్పందించారు. అయితే, తాజాగా, అన్నాడీఎంకే తన ఊపిరని, దానిని ఎవరూ వేరు చే యలేరని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఎంతో కష్ట పడ్డాను.. దివంగత నేత ఎంజీఆర్ తదుపరి అన్నాడీఎంకే బలోపేతం కోసం అమ్మ జయలలితో కలిసి తాను ఎంతో కష్టపడ్డానని, ఇది ఎవరికీ తెలియని విషయంగా చిన్నమ్మ ఆ ఫోన్కాల్లో పేర్కొన్నారు. అమ్మకు వచ్చే లేఖల్ని చదివి వినిపించడం, వాటికి సమాధానాలు పంపించడం తానే చేయడం జరిగేదని పేర్కొంటూ, ఇప్పుడు కార్యకర్తల నుంచి తనకు వస్తున్న లేఖలు చదివి, చూస్తూ కూర్చునే పరిస్థితి లేదన్నారు. ఆరోజు కూవత్తూరులోనూ తాను చెప్పిన విషయాలు అందరికీ గుర్తుంటాయని, అందరం ఏకం అవుదామంటూ చిన్నమ్మ ముగించారు. 14వ తేదీ భేటీలో ఎమ్మెల్యేలకే అనుమతి.. చిన్నమ్మ ఫోన్ కాల్ వ్యవహారాలు ఓ వైపు ఉన్నా, మరోవైపు పార్టీ తమ గుప్పెట్లో నుంచి జారకుండా అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కుస్తీలు పట్టే పనిలోపడింది. ఈనెల 14న పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి అనుమతి దక్కడంతో గురువారం పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి సంయుక్త ప్రకటన చేశారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే అనుమతి ఉందని, ఇతరులు ఎవ్వరూ రాకూడదని, కరోనా నిబంధనల్ని తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష ఉపనేత, విప్ను ఎంపిక చేయనున్నారు. చదవండి: దేశంలో, పార్టీలో మోదీనే టాప్: సంజయ్ రౌత్ యూపీ కేబినెట్ ప్రక్షాళన! -
గెలుపుపై అనుమానం.. చిన్నమ్మకు ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయంగా అస్త్రసన్యాసం చేసిన చిన్నమ్మ శశికళను అన్నాడీఎంకేలోకి రావమ్మా అని పార్టీ సమన్వయకర్త, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం ఆహ్వానించడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. మాటమాత్రమైనా తనతో చెప్పకుండా పన్నీర్ చేసిన ప్రకటనపై సహ సమన్వయ కర్త, సీఎం ఎడపాడి పళనిస్వామి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష ముగించుకుని జైలు నుంచి విడుదలైన శశికళ తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తారని అందరూ అనుకున్నారు. బెంగళూరు నుంచి చెన్నైలోని ఇంటికి చేరుకున్న తరువాత కొన్నాళ్లు అదే తరహాలో వ్యవహరించినా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించారు. అంతేగాక ప్రస్తుతం ఆలయాల చుట్టూ తిరుగుతూ ఆధ్యాత్మిక పర్యటనలతో గడుపుతున్నారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేలో చేర్చుకునేందుకు సిద్దమని ఆ పార్టీ సమన్వయకర్త, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం ఇటీవల సంచలన ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అధ్యక్ష విధానం ఎంజీఆర్తో, ప్రధాన కార్యదర్శి హోదా జయలలితతో ముగిసింది. సమన్వయకర్త, సహ సమన్వయకర్త హోదాల్లో పన్నీర్, ఎడపాడి పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. ఇదే తరహా కొనసాగేందుకు శశికళ సమ్మతిస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని ఒకసారి, పరిశీలిస్తామని మరోసారి పన్నీర్ అన్నారు. శశికళతో తనకు విబేధాలు, మనస్తాపాలు లేవు, అమ్మ మరణించినపుడు కొన్ని సందేహాలు ఉండేవని పన్నీర్ చెప్పారు. పన్నీర్ చేసిన ప్రకటన అన్నాడీఎంకేలో తీవ్ర చర్చనీయాంశమైంది. పన్నీర్ చేసిన వ్యాఖ్యలకు ఓటర్లు ఏ విధంగా ప్రభావితం అవుతారోనని ఎడపాడికి బెంగపట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎడపాడికి గెలుపు కోసం ఈనెల 24వ తేదీ నుంచి పన్నీర్సెల్వం ప్రచారం చేస్తున్నారు. అంతకు ముందు వీరిద్దరూ శశికళ అంశంపై రహస్యంగా మంతనాలు చేసినట్లు సమాచారం. అన్నాడీఎంకే గెలుపు అవకాశాలు, టీటీవీ దినకరన్ పార్టీ అభ్యర్థుల వల్ల ఓట్ల చీలిక, ఉత్తర, దక్షిణ తమిళనాడులో అన్నాడీఎంకే పరపతి, కొంగుమండలంలోని అన్నా డీఎంకే ఓట్ బ్యాంకు అంశాలపై కూడా ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. శశికళను అన్నాడీఎంకేలో ఆహ్వానించడంపై ఎడపాడి, పన్నీర్ మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయనే ప్రచారం కూడా జరిగింది. అదేమీ లేదని ప్రజలకు, పార్టీ నేతలకు సంకేతాలు ఇవ్వడమే ఎడపాడి, పన్నీర్ ఏకాంత చర్చల వెనుక అసలు ఉద్దేశమని వాదిస్తున్నారు. చదవండి: తమిళనాడులో హీట్ పెంచిన ట్వీట్ -
ఆ ఇద్దరి సూచన మేరకే తప్పుకున్న చిన్నమ్మ
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల నుంచి శశికళ అకస్మాత్తుగా తప్పుకోవడంలో ఇద్దరు వ్యక్తులు ప్రధాన పాత్ర పోషించిన విషయం శుక్రవారం వెలుగుచూసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి రావాలని శశికళ భావించారు. కుదిరితే అన్నాడీఎంకేను చెప్పుచేతుల్లోకి తెచ్చుకోవడం లేదా టీటీవీ దినకరన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’(ఏఎంఎంకే) ద్వారా ప్రజల్లోకి దూసుకెళ్లాలని ఆశించారు. ఇదే విషయాన్ని గత నెల 24న జయలలిత జయంతి రోజున బహిరంగంగా ప్రకటించారు. అయితే అన్నాడీఎంకే స్వాధీనంలోకి వచ్చే పరిస్థితులు కనపడలేదు. దినకరన్ వైఖరి వల్ల అతడిని దూరం పెట్టారు. ఏం చేయాలి చెప్మా అని ఆమె ఆలోచనలోపడ్డారు. ఇదే సమయంలో తమ కూటమి గెలుపు అవకాశాలను దెబ్బతీయాలని పట్టుదలతో ఉన్న శశికళను బుజ్జగించేందుకు బీజేపీకి చెందిన ఒక దూత ఆమెను స్వయంగా కలుసుకున్నారు. మనం మనం కీచులాడుకుంటే ఓట్లు చీలిపోయి అధికార పీఠాన్ని డీఎంకే తన్నుకు పోగలదు, రాజకీయాల నుంచి తాత్కాలికంగా తప్పుకోవాలని సూచించారు. ఇదే సమయంలో సమీప బంధువొకరు శశికళను కలిసి మరో కోణంలో మాట కలిపారు. ఒంటరిగా బరిలోకి దిగితే అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు అవుతుంది, ఆన్నాడీఎంకే ఓటమి పాలైతే ఆ చెడ్డపేరు నీకు చుట్టుకుంటుందని హితవు పలికారు. వీరిద్దరి సలహాతోనే రాజకీయాల నుంచి శశికళ తప్పుకున్నారనే సమాచారం శుక్రవారం బహిర్గతమైంది. శశికళ వెనుక వెన్నుపోటుదారులు.. టీటీవీ దినకరన్, మరికొందరు వెన్నుపోటుదారుల వల్లనే రాజకీయాల నుంచి శశికళ తప్పుకోవాల్సి వచ్చిందని స్వయానా ఆమె తమ్ముడు,‘అన్నా ద్రావిడర్ కళగం’ప్రధాన కార్యదర్శి దివాకరన్ వ్యాఖ్యానించారు. తనకు తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించుకోవడం, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను కూటమిగా మలుస్తూ అన్నాడీఎంకేను ఆహ్వానించడం వంటి పిల్లచేష్టలకు పాల్పడిన దినకరన్తో ఆమె విరక్తి చెందారని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: శశికళ నిష్క్రమణ వెనుక.. రాజకీయాలకు చిన్నమ్మ గుడ్బై.. కారణాలు ఇవే -
శశికళతో ఎవరికి చేటు?
రాజకీయ పార్టీ స్థాపిస్తానన్న సూపర్ స్టార్ రజనీకాంత్ వెనకడుగేయటంతో రెట్టింపు ఉత్సాహంతో వున్న డీఎంకేకు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత సహచరురాలు శశికళ ఆగమనం ఇబ్బంది కలిగించివుండాలి. తమిళనాడు అసెంబ్లీకి మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయిదు దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల సీజన్లోనూ జనాకర్షణ వున్న నేతలనూ, వారి సమ్మోహన ప్రసంగాలనూ వింటూ, మంత్రించినట్టు వారిని అనుసరిస్తూ వెళ్లటమే అలవాటైన తమిళనాడు... తొలిసారి ఆ స్థాయి నాయకులెవరూ లేని ఎన్నికల రణరంగాన్ని చూడబోతోంది. ఉన్నంతలో డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్కే ఈసారి అవకాశం వుండొచ్చని రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ నాలుగేళ్ల జైలు జీవితం తర్వాత రాష్ట్రంలో అడుగుపెట్టిన శశికళకు వచ్చిన స్పందన చూశాక అలా చెప్పినవారిలో పునరాలోచన కలిగే అవకాశం వుంది. తమిళనాట ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రభుత్వమే కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పళని స్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం అందరి అంచనాలకూ భిన్నంగా సమష్టిగా పనిచేస్తున్నారు. బీజేపీ అధినేతల ఆశీస్సులతోనే ఇదంతా సాగుతున్నదన్న విమర్శలొస్తున్న మాట వాస్తవమే అయినా పాలనాపరంగా ఆ ప్రభుత్వంపై పెద్దగా ఫిర్యాదులేమీ లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షం డీఎంకే కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్, ఎంఎంకే వంటి పక్షాలతో కలిసి కూటమి కట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకేతో వున్న పీఎంకే, ఎంజేకేలు కూడా త్వరలో డీఎంకే కూటమివైపు రావొచ్చునన్న అభిప్రాయం వుంది. అసలు ఇన్ని పార్టీలను కూటమిలో చేర్చుకుని, సీట్ల పంపకాల్లో అందరినీ సంతృప్తిపరచటం డీఎంకేకు సాధ్యమేనా అన్న సంగతలావుంచితే... ఆ పరిస్థితి నిజంగా ఎదురైతే కేవలం భారతీయ జనతాపార్టీ తోడుతో అన్నాడీఎంకే ఆ కూటమిని ఎంతవరకూ ఎదుర్కొన గలదన్న ప్రశ్న కూడా వుంది. ఇలాంటì సమయంలో శశికళ రంగప్రవేశం చేసి ఈ సంక్లిష్టతను మరింత పెంచారు. శశికళకు ఘన స్వాగతం లభించిందనడంలో సందేహం లేదు. అయితే ఆ వచ్చినవారంతా ఆమె మద్దతుదార్లేనని చెప్పటం తొందరపాటే అవుతుంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆమెలో మునుపటి ఆత్మవిశ్వాసం వుందా లేదా అని స్వయంగా చూడటం కోసం కూడా వారిలో చాలామంది వచ్చివుండొచ్చు. జయలలిత మరణానంతరం శశికళ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఆమె జీవించివుండగా తాత్కాలికంగా సీఎం బాధ్యతలు చూడటానికి నియమించిన పన్నీరుసెల్వం శశికళకు ఎదురుతిరిగారు. ఆమెను జయలలిత వారసురాలిగా ప్రకటించి, సీఎంగా రావాలంటూ తీర్మానించిన అన్నాడీఎంకే లెజిస్లేచర్ పార్టీతో గొంతు కలిపిన కొన్ని గంటలకే ఆయన ధోరణి మారింది. ఆ తర్వాతైనా సీఎం కావాలనుకున్న శశికళకు అవాంతారాలు ఎదురై చివరకు పళని స్వామికి ఆ పదవి కట్టబెట్టక తప్పలేదు. తీరా ఆమె జైలుకెళ్లాక పళనిస్వామి కూడా ఎదురుతిరిగి ఆమెను పార్టీ సెక్రటరీ జనరల్ పదవినుంచి తొలగించటంతోపాటు... పార్టీనుంచే బహిష్కరించారు. ఇదంతా చాలదన్నట్టు ఆయన పన్నీరు సెల్వంతో చేతులు కలిపారు. తనను పదవినుంచి తొల గించటం, పార్టీ నుంచి బహిష్కరించటం చెల్లదని శశికళ ఇప్పటికే కోర్టుకెక్కారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు శశికళ వంటి నేత లేకపోతే డీఎంకేకు దీటైన పోటీ ఇవ్వటం సాధ్యం కాదని ఆమె సమీప బంధువు టీటీవీ దినకరన్ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. మరోపక్క ఆరెస్సెస్ సిద్ధాంతకర్తగా పేరున్న గురుమూర్తి ఆమెతో అన్నా డీఎంకే రాజీపడి, సముచిత స్థానం కల్పిస్తే మరోసారి ఆ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ఇటీవల చెప్పటం గమనించదగ్గది. అవినీతి కేసులో శిక్ష పడిన శశికళకు వుండే ఆదరణ విషయంలో ఇన్నాళ్లూ అన్నాడీఎంకే శ్రేణుల్లో సంశయం వుండేది. మొన్న ఆమెకు లభించిన స్వాగతం చూశాక అలాంటివారిలో పునరాలోచనైతే ఏర్పడు తుంది. అలాగని పళనిస్వామి, పన్నీరుసెల్వంలకు శశికళను ఆహ్వానించటం ప్రాణాంతకం. ఆమె రావడమంటూ జరిగితే పార్టీలో వారికి చోటుండే అవకాశం వుండదు. ఆమె చేరాక పార్టీ నెగ్గినా వారిద్దరినీ కాదని దినకరన్నో, మరొకరినో ఆమె తెరపైకి తీసుకొస్తారు. తమిళనాడును పాలించిన వారిపై అవినీతి ఆరోపణలు రావటం కొత్తగాదు. గతంలో కరుణా నిధి ప్రభుత్వాన్ని ఆ కారణం చూపే కేంద్రంలో అధికారంలో వున్న అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. ఆ తర్వాత జయలలితపైనా అటువంటి ఆరోపణలే వచ్చాయి. కింది కోర్టుల్లో శిక్షపడిన సందర్భాలు రెండుసార్లున్నా ఉన్నత న్యాయస్థానాలు ఆమెను నిర్దోషిగా తేల్చాయి. అటు తర్వాత ఆమె భారీ మెజారిటీతో అధికారంలోకొచ్చారు. తమిళనాడు రాజకీయాలు విలక్షణ మైనవి. అక్కడ ద్రవిడ పార్టీలకు మాత్రమే జనం పెద్ద పీట వేస్తారు. ద్రవిడ పార్టీలైనా కూటములుగా వస్తేనే వారి ఆదరణ లభిస్తుంది. జాతీయ పార్టీలకు కొద్దో గొప్పో అక్కడ చోటు దొరకాలంటే ద్రవిడ పార్టీలతో చెలిమి చేయాల్సిందే. డీఎంకే లెక్కలు ఫలించి అత్యధిక ద్రవిడ పార్టీలు దాని ఆధ్వర్యం లోని కూటమి వెనక చేరితే అన్నాడీఎంకే దాన్ని ఎదుర్కొనగలదా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఏతావాతా ఇంతవరకూ ప్రధాన పక్షాలుగా వుంటున్న డీఎంకే, అన్నాడీఎంకేల భవితవ్యాన్ని రాబోయే ఎన్నికలు తేల్చేయబోతున్నాయి. ఆ పార్టీల్లో ఎవరు మిగులుతారో, ఎవరు కనుమరుగవు తారో నిర్ణయించబోతున్నాయి. -
జెండా వివాదం: చిన్నమ్మకు చెక్
సాక్షి, చెన్నై: తమ జెండా ఉపయోగించకుండా చిన్నమ్మ శశికళకు చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకే నిర్ణయించింది. దీనిని అడ్డుకోవాలని కోరుతూ డీజీపీ త్రిపాఠికి అన్నాడీఎంకే నేతలు, మంత్రులు గురువారం ఫిర్యాదు చేశారు. ఇక చిన్నమ్మను ఆహ్వానించేందుకు భారీ ఏర్పాట్లపై అమ్మ మక్కల్ మున్నేట్ర కళం నిమ్నగమైంది. వేలూరులో అయితే, హెలికాప్టర్ ద్వారా పువ్వుల వర్షం కురిపించేందుకు ఏకంగా కలెక్టర్ అనుమతి కోరడం గమనార్హం. అక్రమాస్తుల కేసు నుంచి విడుదలైన శశికళ ఈనెల 8న చెన్నైకి రానున్నారు. ఆమెకు ఆహ్వానం పలికేందుకు అమముక వర్గాలు భారీగానే ఏర్పాట్లపై దృష్టిపెట్టాయి. వేలూరులో అయితే, జిల్లా సరిహద్దు మాదనూరు నుంచి హెలికాప్టర్ ద్వారా పువ్వులవర్షం కురిపించేందుకు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ కళగం జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి జయంతి పద్మనాభన్ కలెక్టర్ షణ్ముగసుందరానికి గురువారం విన్నవించుకున్నారు. (చదవండి: రాళ్లు వేయించాడు.. కాళ్లు పట్టుకుంటున్నాడు..) జెండాకు చెక్.. ఆహ్వాన ఏర్పాట్లు ఓ వైపు సాగుతుంటే, ఎక్కడ అన్నాడీఎంకే జెండాలతో చిన్నమ్మ దూసుకొస్తుందో అన్న బెంగ ఆ పార్టీ వర్గాల్లో నెలకొన్నట్టుంది. జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో అన్నాడీఎంకే జెండా ఉన్న కారులో చిన్నమ్మ పయనించడం వివాదానికి దారి తీసింది. దీనిపై ఫిర్యాదులు కూడా హోరెత్తాయి. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ తమ పార్టీ జెండా ఊపయోగించకుండా చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకే నిర్ణయించింది. ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, సంయుక్త కన్వీనర్లు కేపీ మునుస్వామి, వైద్యలింగం, మంత్రులు సీవీ షణ్ముగం, జయకుమార్, తంగమణి, వేలుమణి గురువారం సాయంత్రం డీజీపీ త్రిపాఠిని కలిసి ఫిర్యాదు చేశారు.(చదవండి: షాకిచ్చిన ఎమ్మెల్యేలు.. యడ్డీ కుర్చీకి ఎసరు!) తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి పార్టీ జెండాను ఉపయోగిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు. కేపీ మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ అ న్నాడీఎంకే జెండాను ఉపయోగించే అర్హత పార్టీ కార్యకర్తలు, నాయకులకు మాత్రమే ఉందన్నారు. అయితే, తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి జెండాను ఉపయోగించే అర్హత లేదని, అందుకే డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మంత్రి సీవీ షణ్ముగం మాట్లాడుతూ అన్నాడిఎంకే పార్టీ పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలోని సమన్వయ కమిటీకే చెందుతుందని, ఇప్పటికే ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిందని, కోర్టులు సైతం స్పందించాయని గుర్తు చేశారు. ఇప్పటికే జయలలిత సమాధి వద్దకు చిన్నమ్మ వెళ్లకుండా పనుల పేరిట అడ్డుకట్ట వేసిన పాలకులు, తాజాగా జెండా వాడకానికి చెక్ పెట్టే పనిలో పడడం గమనార్హం. నేడు వదినమ్మ విడుదల.. శశికళతో పాటు ఆమె వదినమ్మ ఇలవరసి, అక్కకుమారుడు సుధాకరన్ జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగియడంతో వదినమ్మ శుక్రవారం ఉదయం జైలు నుంచి బయటకు రానున్నారు. నేరుగా ఆమె చిన్నమ్మ బస చేసి ఉన్న ఫామ్ హౌస్కు వెళ్లనున్నారు. ఈ ఇద్దరు విడుదలైనా, సుధాకరన్ విడుదలలో జాప్యం తప్పడం లేదు. ఇందుకు కారణం, ఆయన చెల్లించాల్సిన జరిమానా ఇంకా కోర్టుకు చేరలేదు. -
వచ్చేది ‘చిన్నమ్మ’ ప్రభుత్వమే!
చెన్నై: ప్రజాస్వామ్య పద్ధతిలో అన్నాడీఎంకే పార్టీని చేజిక్కించుకుని తిరిగి అమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని శశికళ మేనల్లుడు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ నాయకుడు దినకరన్ ప్రకటించారు. బెంగళూరులో క్వారంటైన్ పూర్తి చేసుకుని ఈనెల 7వ తేదీన తమిళనాడుకు వస్తారని తెలిపారు. ఎన్నికల తర్వాత తిరిగి 'అమ్మ' ప్రభుత్వం ఏర్పాటు విషయంలో శశికళ కీలక భూమిక పోషిస్తారని చెప్పారు. తమిళనాడులోని మధురైలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జయలిలత నిజమైన మద్దతుదారులంతా శశికళ రాక కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. శశికళ రాక సందర్భంగా కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లోని హోసూరు నుంచి చెన్నై వరకూ భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని ఇటీవల శశికళ విడుదలయ్యారు. అయితే కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జయిన విషయం తెలిసిందే. ఆమె రాక సందర్భంగా దినకరన్ స్పందించారు. శశికళ విడుదలైన రోజు నుంచి రాజకీయాలు మారుతాయని పేర్కొన్నారు. జయలలిత స్మారక నిర్మాణాన్ని శశికళ సందర్శించాలని ఉన్నా కూడా అయితే ఉద్దేశపూర్వకంగా అది మూసి ఉంచారని ఆరోపించారు. పార్టీ నిబంధనల ప్రకారం జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికీ ఉండదని, జనరల్ సెక్రటరీ మాత్రమే సర్వసభ్య సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గుర్తుచేశారు. జనరల్ సెక్రటరీ పదవిని రద్దు చేయడంపై శశికళ కోర్టులో సవాలు చేశారని తెలిపారు. తన పదవిని పునరుద్ధరించే విషయంలో ఆమె పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత 'అమ్మ' ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వంలో శశికళ కీలక పాత్ర పోషిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దినకరన్ ప్రస్తుతం ఆర్కే నగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
శశికళ కొత్త ఎత్తుగడ.. ఫలించేనా?!
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు నుంచి విడుదలైన ఎంకే శశికళ ఎన్నికల్లో పోటీకి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించే పనిలోపడ్డారు. సిక్కిం రాజకీయాలను ఉదాహరణగా చూపుతూ ఆరేళ్ల నిషేధం తొలగింపుపై చట్టపరంగా పోరాడనున్నారు. శశికళ అనుచరులు న్యాయకోవిదులతో చర్చలు ప్రారంభించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న శశికళ గత నెల 27వ తేదీన జైలు నుంచి విడుదలైనా తమిళనాడు అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేదు. ఆర్థికనేరంపై జైలు శిక్ష అనుభవించిన శశికళ 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఆరేళ్లపాటూ అంటే 2027 జనవరి వరకు ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేని పరిస్థితి నెలకొంది. పార్టీ సారధ్య బాధ్యతలకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకి లేదు. అయితే ఈ ఆరేళ్ల కాలం నిషేధంపై న్యాయస్థానంలో సవాలు చేయాలని ఆమె అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంలో సిక్కిం రాష్ట్ర రాజకీయాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. సిక్కిం రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి ప్రేమ్సింగ్ దమాంగ్ అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవించి 2018లో విడుదలయ్యారు. ఆరేళ్లు పోటీచేసేందుకు వీలులేదని చట్ట నిపుణులు ఆయనకు చెప్పినా 2019లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆరేళ్ల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన చేసుకున్న విన్నపాన్ని ఎన్నికల కమిషన్ అమోదించింది. ప్రజా ప్రతినిధుల చట్టం 1951 సెక్షన్ 11 ప్రకారం సడలింపుకు అవకాశం ఉందని అంటున్నారు. సిక్కిం సీఎంలా శశికళ కూడా సడలింపు పొందే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల కమిషన్ను కలుసుకోవాలని భావిస్తున్నారు. శశికళ న్యాయవాదులు చట్ట నిపుణులతో చర్చిస్తున్నారు. శశికళ చెన్నైకి చేరుకోగానే ఆమెతో నేరుగా మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శశికళకు మార్గం సుగమం అవుతుందని, ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తారని అనుచరులు ఢంకా భజాయించి చెబుతున్నారు. చదవండి: ఏఐఏడీఎంకేతో పొత్తు కొనసాగుతుంది ఒంటరి పోరుకైనా సిద్ధమే! : ప్రేమలత -
శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా..
సాక్షి, బెంగుళూరు: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి వద్ద అనుచరులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, శశికళ వాహనంపై అన్నాడీఎంకే పార్టీ జెండా ఉండటం హాట్ టాపిక్గా మారింది. ఆమెను ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి విధితమే. 2017లో అక్రమాస్తుల కేసులో అరెస్టయిన శశికళ.. బెంగుళూరు పరప్పన అగ్రహారం జైలుకెళ్లారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో బెంగుళూరులోని ఆసుపత్రికి తరలించారు. (చదవండి: ఏఐఏడీఎంకేతో పొత్తు కొనసాగుతుంది) కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షించగా, పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దాంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. మళ్లీ కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ చేశారు. అక్రమాస్తుల కేసులో ఈ నెల 27తో నాలుగేళ్ల శిక్షాకాలాన్ని ఆమె పూర్తి చేసుకున్నారు. 2016 వరకు అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా పనిచేసిన శశికళను అప్పటి పరిణామాలతో పదవి నుంచి తొలగించడంతో పాటు, పార్టీ నుంచి బహిష్కరించారు.(చదవండి: మోదీ మన్ కీ బాత్: ఆ ఘటన బాధాకరం) -
శశికళకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ బుధవారం అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వెంటనే ఆమెను బెంగళూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆప్తురాలు వీకే శశికళ ఈ నెల 27న జైలు నుంచి విడుదల కానున్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన శశికళ శిక్షాకాలం పూర్తి చేసుకుని బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల కానున్నారు. ఆమె బంధువు, సహచర నిందితురాలు ఇళవరసి ఇంకొంత కాలం జైలుశిక్ష అనుభవించాల్సి ఉంది. (చదవండి: ముందస్తు విడుదల విఫలమవడంతో శశికళలో ఆధ్యాత్మికత) శశికళ, ఇళవరసి, మరో బంధువు వీఎన్ సుధాకర్లు 2017, ఫిబ్రవరి నుంచి పరప్పన జైలు జీవితం గడుపుతున్నారు. ఈ కేసులో ఇళవరసి కంటే కొంత ముందే శశికళ అరెస్టయి జైల్లో గడపడంతో ముందే విడుదల కానున్నారు. ఇతరత్రా కస్టడీ రోజులను సైతం పరిగణనలోకి తీసుకుంటే ఈ నెల 27తో శశికళ శిక్షా కాలం ముగుస్తుందని జైలు వర్గాలు తెలిపాయి. శశికళ, ఇళవరసి జరిమానాల కింద చెరో రూ. 10 కోట్లను చెల్లించారు. సుధాకర్ ఇంకా కట్టలేదని తెలిసింది. (చదవండి: శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదు) -
శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదు
సాక్షి ప్రతినిధి, చెన్నై: శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి పళనిస్వామి స్పష్టం చేశారు. దీనిపై పార్టీ ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నాలుగేళ్ల జైలుశిక్షను పూర్తిచేసుకుని ఈనెల 27న బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలవుతున్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా జైలు వర్గాల నుంచి ఉత్తరం అందినట్లు శశికళ తరఫు న్యాయవాది మంగళవారం ప్రకటించారు. శశికళపై ఎడపాడి, పన్నీర్సెల్వం నాయకత్వంలోని అన్నాడీఎంకే బహిష్కరణ వేటువేసింది. జైలు నుంచి శశికళ బయటకు రాగానే అన్నాడీఎంకేపై ప్రతీకారణ ధోరణికి పాల్పడగలదని అంచనా వేస్తున్నారు. పారీ్టలో చేర్చుకోవడం ద్వారా సామరస్యంగా ముందుకెళ్లే అవకాశాలూ లేకపోలేదని కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాలను మంగళవారం ఢిల్లీలో కలిసిన అనంతరం సీఎం ఎడపాడి మీడియాతో మాట్లాడారు. శశికళ జైలు నుంచి విడుదల పారీ్టపై ఎలాంటి ప్రభావం చూపదు. శశికళ పారీ్టలో చేరే అవకాశాలు వందశాతం లేవు. శశికళను చేర్చుకోరాదని పారీ్టలో ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాంమని సీఎం అన్నారు. శశికళ జైలు నుంచి విడుదలకాగానే అన్నాడీఎంకేను స్వాదీనం చేసుకుంటారని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత సీఆర్ సరస్వతి వ్యాఖ్యానించారు. 22న క్యాబినెట్ సమావేశం : ముఖ్యమంత్రి పళనిస్వామి ఈనెల 22న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. చెన్నై సచివాలయంలో జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి తప్పనిసరిగా మంత్రులంతా హాజరుకావాలని మంగళవారం ఆయన ఆదేశాలు జారీచేసారు. చెన్నై మెరీనాబీచ్లో నిర్మాణం పూర్తిచేసుకున్న జయలలిత స్మారక మండపాన్ని ఈనెల 27న ప్రారంభిస్తున్నట్లు మంగళవారం అధికారిక ప్రకటన విడుదలైంది. ప్రధాని మోదీ ఈ మండపాన్ని ఆవిష్కరిస్తారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా మంత్రులతో చర్చిస్తారని తెలుస్తోంది. -
చిన్నమ్మకు కోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, చెన్నై: అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. తనను జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె నాలుగేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకుని 2021 జనవరి చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత సహాయకురాలు శశికళ నటరాజన్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తమిళనాడు చిన్నమ్మగా సుపరిచితరాలు. మంచి ప్రవర్తనను చూపుతూ ఆమె బెంగళూరు జైలు నుంచి ముందస్తు విడుదల కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ, కోర్టు పిటిషన్ను తిరస్కరించటంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముందస్తు విడుదలకు కోర్టు అంగీకరిస్తుందనే ఆశతో.. రూ.10 కోట్ల జరిమానాను చిన్నమ్మ వర్గీయులు కోర్టుకు డిపాజిట్ చేసినట్లు సమాచారం. -
దేవుడే దిక్కు.. నిత్యపూజలు, ప్రార్థనలు
సాక్షి, చెన్నై: జైలు జీవితం నుంచి ముందుగానే విముక్తి పొందాలని శశికళ చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ బెడిసికొట్టాయి. ససేమిరా అని కర్ణాటక జైళ్లశాఖ చెప్పేసింది. దీంతో మనుషులను నమ్మి ప్రయోజనం లేదు.. దేవుడే దిక్కు అని శశికళ భావించారో ఏమో ఆధ్యాత్మిక జీవనంలో మునిగిపోయారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరిలోని శశికళ విడుదలపై ఆసక్తి నెలకొంది. జయలలిత హయాంలోనే అన్నాడీఎంకేలో చక్రం తిప్పిన శశికళ ఆ తరువాత పార్టీని పూర్తిగా తన ఆధీనంలోకి తెచుకున్నారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడు అన్న చందంగా సీఎం కావాల్సింది జైలుపక్షిగా మారిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలు అనుభవిస్తున్న నాలుగేళ్ల జైలు శిక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంతో పూర్తయి విడుదల కావాల్సి ఉంది. చదవండి: (మళ్లీ గండం.. బంగాళాఖాతంలో ద్రోణి..) ముందస్తు విడుదలపై ముందుకూ, వెనక్కి... కర్ణాటక ప్రభుత్వ విధివిధానాలను అనసరించి నెలరోజుల జైలు జీవితానికి మూడు సెలవు రోజుల చొప్పున మొత్తం 129 రోజుల సెలవులను బేరీజు వేసుకుని నవంబరులోనే విడుదల చేయాలని శశికళ తరఫున్యాయవాది గతంలో బెంగళూరు జైలు సూపరింటెండెంట్కు వినతిపత్రం సమర్పించాడు. ఇక అప్పటి నుంచి శశికళ ముందుస్తు విడుదల వ్యవహారం నిత్యం చర్చనీయాంశంగా మారింది. ముందస్తు విడుదల అడ్డంకిగా ఉండిన రూ.10. కోట్ల జరిమానా కూడా కోర్టుకు చెల్లించి ఆశగా ఎదురుచూడడం ప్రారంభించారు. (శశికళ ఆశలు అడియాశలు..!) నరసింహమూర్తి అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద పంపిన ఉత్తరానికి 2021 జనవరిలో శశికళ విడుదలవుతారని జైలు సూపరింటెండెంట్ బదులిచ్చారు. అవినీతినిరోధక చట్టం కింద శిక్షకు గురైనవారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ అన్నారు. ఈనేరాలకు సత్ప్రవర్తన వర్తించదు. ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు జీవితం గడపాలి, ముందుగా విడుదలకు అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు. అయితే అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టయిన కొందరిని సత్ప్రవర్తన పరిధిలో చేర్చిన కర్ణాటక ప్రభుత్వం ముందుగానే విడుదల చేసిన దాఖలాలు ఉన్నందున శశికళను వెంటనే విడుదల చేయాలని న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిమానా చెల్లింపు, కోర్టు ఆమోదం పూర్తయినందున సత్ప్రవర్తన కింద ముందే విడుదల చేయాలని కోరుతూ జైళ్లశాఖకు ఈనెల 17న శశికళ న్యాయవాదులు మరోసారి వినతిపత్రం సమర్పించారు. శశికళ చెన్నై జైల్లో ఉన్న రోజులు, పెరోల్ రోజులు, సెలవు దినాలు పరిగణనలోకి తీసుకోవాలని అందులో కోరారు. అయితే ఈ వినతిని జైళ్లశాఖ నిరాకరించడంతో శశికళకు మళ్లీ నిరాశే మిగిలింది. చదవండి: (పవన్ కల్యాణ్పై తమిళ మీడియా సెటైర్లు) దైవ పూజల్లో నిమగ్నం.. ముందస్తు విడుదల వ్యవహారం మూడడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనకలా మారడంతో శశికళ దైవపూజల్లో గడుపుతున్నారు. జైల్లోని తనగదిలో దేవుళ్లు, దేవతల చిత్రపటాలు పెట్టుకుని రోజుకు నాలుగు గంటలపాటు పూజలు చేస్తున్నారు. తలపెట్టిన కార్యాలు నెరవేరాలని పార్థసారథి స్వామికి పదేపదే ప్రార్థనలు చేస్తున్నారు. జయలలితలా ఆంజనేయస్వామిని సైతం ప్రత్యేకంగా ఆరాధించడం ప్రారంభించారు. మాంసాహారం మానివేసి పూర్తిగా శాఖాహారాన్ని అలవాటు చేసుకున్నారు. ఆరునెలలుగా ఎవ్వరికీ ములాఖత్ ఇవ్వలేదు. శశికళ న్యాయవాదులు బెంగళూరులోనే తిష్టవేసి ముందస్తు విడుదలపై కృషి చేస్తున్నారు. -
ఎన్నికల ముందే ఈ సినిమా రిలీజ్ చేస్తా: ఆర్జీవీ
సంచలనాలకు మారుపేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, పవర్స్టార్, దిశ, నేక్డ్, క్లైమాక్స్, కరోనా వంటి వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించిన ఆయన పనిలో పనిగా తన ఆత్మకథను కూడా రాము పేరుతో మూడు భాగాలుగా తీసుకొస్తున్నారు. అయితే చేసిన సినిమాలు హిట్టు కొట్టకపోయినా సరే పెద్దగా లెక్క చేయకుండా ఎప్పుడూ ఏదో ఒక బయోపిక్తో సందడి చేస్తూనే ఉంటారు. కానీ బయోపిక్ చిత్రాల్లో డూపులను సెలక్ట్ చేసుకోవడంలో మాత్రం వర్మను మించినవారు లేరు. ఇప్పుడు వర్మ కన్ను తమిళనాడు మీద పడింది. అవినీతి కేసులో కటకటాల వెనక్కు వెళ్లిన చిన్నమ్మ శశికళ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఈ సినిమా చేస్తున్నానని వర్మ గతేడాదిలోనే ప్రకటించారు. 'లవ్ ఈజ్ డేంజరస్లీ పొలిటికల్' అన్న క్యాప్షన్తో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. (చదవండి: శశికళ ఆశలు అడియాశలు..!) ఏమైందో ఏమో కానీ తర్వాత ఆ సినిమాను అటకెక్కించారు. తాజాగా శనివారం నాడు మరోసారి శశికళ సినిమా గురించి ప్రస్తావిస్తూ " J, S, E, P, S మధ్య ఉన్న బంధాన్ని, వారి రాజకీయ తెరంగ్రేటాన్ని చూపించబోతున్నాం. తమిళనాడు ఎన్నికల కన్నా ముందు, నాయకురాలి(జయ లలిత) బయోపిక్ (తలైవి) రిలీజ్ అయ్యే రోజునే దీన్ని కూడా విడుదల చేస్తాం" అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సినిమాకు సంబంధించిన పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. ఇందులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళ కూడా ఉన్నారు. 'తన సినిమాలో నిజాలు ఉంటాయని, ఫిబ్రవరిలో వాటిని తెరపై చూపిస్తా'నని వర్మ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేశ్ రెడ్డి నిర్మిస్తున్నారు. మరి ఈ బయోపిక్ మీద ఎన్ని వివాదాలు ముసురుకుంటాయో చూడాలి. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో న్యాయస్థానం శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించింది. దీంతో ఆమె 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో కాలం వెళ్లదీస్తున్నారు. (చదవండి: ఊర్మిళపై కంగన ఘాటు వ్యాఖ్యలు.. ఆర్జీవీ ట్వీట్) Making a film called SASIKALA.. it’s about what a woman S and a man E did to a Leader ..Film will release before TN elections on the same day as the biopic of the Leader “it is easiest to kill , when you are the closest” -Ancient Tamil Saying pic.twitter.com/VVH61fxLL5 — Ram Gopal Varma (@RGVzoomin) November 21, 2020 -
చిన్నమ్మకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లు
సాక్షి,చెన్నై: చిన్నమ్మ శశికళ రాక కోసం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాల్లో ఎదురుచూపులు పెరిగాయి. ఆమెకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. కోర్టు విధించిన రూ.10 కోట్ల 10 లక్షల జరిమానాను చిన్నమ్మ తరఫు న్యాయవాదులు చెల్లించిన విషయం తెలిసిందే. ఈ చెల్లింపునకు తగ్గ రశీదులు, చిన్నమ్మ జైలు జీవితం, విడుదలకు తగ్గ విజ్ఞప్తితో కూడిన ఓ పిటిషన్ను ఆమె తరఫు న్యాయవాదులు గురువారం బెంగళూరు పరప్పన అగ్రహార జైలు వర్గాలకు సమర్పించారు. దీంతో చిన్నమ్మ ఒకటి రెండు రోజుల్లో జైలు నుంచి బయటకు రావచ్చన్న ఎదురుచూపుల్లో న్యాయవాదులు ఉన్నారు. ముందుగానే చిన్నమ్మ వచ్చేస్తున్నారని ఆమె న్యాయవాది రాజాచెందూర్ పాండియన్ చెబుతుండడంతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాల్లో ఎదురు చూపులు పెరిగాయి. చిన్నమ్మకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. కళగం ముఖ్యనేతలు మాత్రమే బెంగళూరుకు పయనం కావడం, మిగిలిన నేతలందరూ తమిళనాడు– కర్ణాటక సరిహద్దుల్లో ఉండి, చిన్నమ్మకు ఆహ్వానం పలికేందుకు తగ్గట్టుగా కార్యాచరణ సిద్ధం చేసి ఉండడం గమనార్హం. హొసూరు నుంచి చెన్నై వరకు జాతీయరహదారిలోని కొన్ని ఎంపిక చేసిన పట్టణ ప్రవేశ ద్వారాల వద్ద చిన్నమ్మకు ఆహ్వానం పలికేందుకు తగ్గట్టుగా పార్టీ వర్గాలు ఏకమయ్యేందుకు నిర్ణయించారు. 60 చోట్ల బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై అమ్మ శిబిరం పరుగులు తీస్తుండడం చూస్తే, మరికొద్ది రోజుల్లో చిన్నమ్మ బయటకు వచ్చేస్తారేమో అన్న ఎదురుచూపులు పెరిగాయి. (కొత్త పార్టీ స్థాపన దిశగా అళగిరి) -
రూ.10 కోట్లు.. చిక్కుల్లో చిన్నమ్మ
సాక్షి ప్రతినిధి, చెన్నై: శిక్షాకాలం ముగింపు దగ్గరపడింది. జరిమానా చెల్లింపే ఇంకా మిగిలింది. రూ.10 కోట్ల భారీ మొత్తం కర్ణాటక జైళ్ల ఖాతాలో జమైతే తరువాత పరిణామాలు చిన్నమ్మను చిక్కుల్లో పడేస్తాయని ఆమె వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్లకు బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, తలా రూ.10 కోట్ల జరిమానా విధించింది. 2017 ఫిబ్రవరి 14వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో వారంతా శిక్ష అనుభవిస్తున్నారు. వీరి శిక్షాకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీతో ముగుస్తుండగా, ఖైదీల స్రత్పవర్తన కింద శశికళ ముందే విడుదలవుతారని ఆమె న్యాయవాది పలుమార్లు ప్రకటించారు. బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త నరసింహన్ సమాచార హక్కు చట్టం కింద ఇదే విషయాన్ని స్పష్టం చేయాలని కోరినపుడు వచ్చే ఏడాది జనవరి 27న విడుదల కాగలరని జైళ్లశాఖ బదులిచ్చింది. పెరోల్పై బయటకు వచ్చిన రోజులను మినహాయించి స్రత్పవర్తన కింద 120 రోజుల మందే శశికళ విడుదల ఖాయమని ఆమె అభిమానులు ధీమాతో ఉన్నారు. జైలు అధికారులను మభ్యపెట్టి శశికళ బెంగళూరు నుంచి అనధికారికంగా బయటకు వచ్చి షాపింగ్లు చేసినట్లు గతంలో బెంగళూరు జైళ్లశాఖ డీఐజీ రూప ఆరోపించి నిరూపించినట్లు తెలుస్తోంది. స్రత్పవర్తన పరిధిలోకి శశికళ రారని కూడా అంటున్నారు. (చదవండి: ఎన్నికల్లో పోటీకి శశికళ వ్యూహరచన) జరిమానా చెల్లింపులో చిక్కులు.. స్రత్పవర్తన.. ముందస్తు విడుదల అంశాలు అటుంచితే రూ.10 కోట్ల జరిమానా చెల్లింపులో చిక్కులు తలెత్తాయి. ఇప్పటికే అనేకసార్లు ఐటీ దాడులను ఎదుర్కొన్న శశికళకు రూ.10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని మరోసారి అధికారులు ఆరాతీసే అవకాశం ఉంది. చిన్నమ్మ కోసం జరిమానా చెల్లించేందుకు ఆమె అనుచరులు కొందరు ఇప్పటికే బెంగళూరులో తిష్టవేసినట్లు తెలుస్తోంది. జరిమానా చెల్లింపు, ఆ మొత్తంపై ఐటీశాఖ నుంచి స్పష్టత, జైళ్ల శాఖ నుంచి కర్ణాటక ప్రభుత్వానికి సమాచారం. ప్రభుత్వ ఆదేశాలు...వీటన్నింటికీ మరింత జాప్యం అవకాశం ఉంది. అంతేగాక కోర్టుకు దశరా, మిలాడినబి సెలవులు ముగిసిన తరువాత వచ్చేనెల 2న శశికళ విడుదలపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆమె అభిమానులు ప్రచారం చేస్తున్నారు. అప్పుడే ఆనందోత్సాహాలు.. శశికళ విడుదల కాకుండానే ఆమె అభిమానులు ఆనందోత్సాహాలను మొదలుపెట్టారు. ‘చోళనాడు పేరాసి చిన్నమ్మ’ అనే నినాదంతో పోలీస్, రవాణాశాఖలో పనిచేసే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు శశికళ చిత్రంతో పోస్టర్లు వెలిసాయి. మదురైలోని పలు ప్రాంతాల్లో గోడలపై అంటించిన పోస్టర్లు కలకలానికి కారణమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులై ఉండి తమ ఫొటోలతో రాజకీయ ప్రచారాలకు దిగడాన్ని ఆయా శాఖలు సీరియస్గా తీసుకున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో శశికళ విడుదల రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నాడీఎంకేలో ముసలం పుట్టడం ఖాయమని ఒక వర్గం ప్రచారం సంతోషంగా ఉంది. -
పది రోజుల్లో చిన్నమ్మ విడుదల!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ పది రోజుల్లో జైలు నుంచి విడుదల య్యే అవకాశాలున్నట్టు ఆమె న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ ధీమా వ్యక్తం చేశారు. జరిమానా మొత్తం రూ.10 కోట్ల 10 వేలు సిద్ధం చేశామని తెలిపారు. అక్రమాస్తుల కేసులో శిక్ష ముగించుకుని జనవరిలో శశికళ జైలు నుంచి విడుదల అవుతారని ఇప్పటికే సంకేతాలు వెలుడిన విషయం తెలిసిందే. తన న్యాయవాది రాజాచెందూర్ పాండియన్కు శశికళ ఆదివారం ఓలేఖ కూడా రాశారు. (శశికళ వ్యూహం.. పది కోట్ల జరిమానాకు రెడీ) ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ న్యాయవాది గురువారం మీడియాతో మాట్లాడారు. పది రోజుల్లో చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చిన్నమ్మ తనకు రాసిన లేఖలోని అంశాల ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నట్టు పేర్కొన్నారు. చిన్నమ్మకు కోర్టు విధించిన రూ.10 కోట్ల 10 వేలు జరిమానాను సిద్ధం చేసినట్టు తెలిపారు. కర్ణాటక జైళ్ల నిబంధనల మేరకు శిక్ష అనుభవించే వారికి నెలలో 3 రోజులు సత్ప్రవర్తన పరిధిలో ఉంటుందని, చిన్నమ్మ కు 129 రోజుల శిక్షా కాలం తగ్గుతుందన్నారు. ఇప్పటికే చిన్నమ్మ 43 నెలలు జైల్లో ఉన్నారని, మరో పది రోజు ల్లో ఆమె విడుదలయ్యేందుకు అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో కోర్టులకు దసరా సెలవులని, ఈనెల 26న కోర్టులు పునః ప్రారంభం కానున్నా యని పేర్కొన్నారు. ఈ క్రమంలో మంగళ లేదా బుధవారం మంచి సమాచారం వెలువడే అవకాశం ఉందని చెప్పారు. చిన్నమ్మ జైలు నుంచి ముందు గానే విడుదల అవుతారని ఇప్పటికే తాను పేర్కొన్నానని, ఇది జరిగి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. (ఎన్నికల్లో పోటీకి శశికళ వ్యూహరచన) -
ఎన్నికల్లో పోటీకి శశికళ వ్యూహరచన
సాక్షి, చెన్నై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చిన్నమ్మ శశికళ వ్యూహ రచన చేశారు. న్యాయనిపుణులతో చర్చించి కేవియేట్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఆమె ప్రతినిధులు నిమగ్నమయ్యారు. అక్రమాస్తుల కేసులో జైలు నుంచి జనవరిలో చిన్నమ్మ శశికళ విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో సోమవారం తన న్యాయవాది రాజా చెందూర్ పాండియన్కు చిన్నమ్మ రాసిన లేఖ వెలుగు చూసింది. ఇందులో ఆమె ఇచ్చిన సూచన ఆధారంగా సుప్రీంకోర్టులో కేవియేట్ పిటిషన్ దాఖలుకు కసరత్తులు సాగుతుండడం గమనార్హం. నాలుగేళ్లు జైలు శిక్ష పడడంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆమెకు లేదు. దీంతో తనకు విధించిని శిక్షకు వ్యతిరేకంగా కేవియేట్ పిటిషన్ దాఖలుతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన వ్యూహాలకు చిన్నమ్మ వ్యూహం పన్నుతున్నట్టు తెలిసింది. ('10 కోట్ల చెల్లింపునకు సిద్ధంగా ఉండండి') అక్రమాస్తుల కేసు విచారణ ఒకే కోణంలో జరిగినట్టు, అన్ని కోణాల్లో పరిశీలించి విచారణ జరగాలని, అలాగే, శిక్ష విషయంగా పునస్సమీక్షించేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు వ్యూహరచన జరుగుతున్నట్టు సమాచారం. చిన్నమ్మ ప్రతినిధి దినకరన్, న్యాయవాది రాజాచెందూర్ పాండియన్ ఢిల్లీలోని న్యాయవాదులు, న్యాయప్రతినిధులతో సంప్రదింపులకు సిద్ధమవుతున్నారు. చిన్నమ్మ విడుదల తర్వాత ఈ పిటిషన్ కోర్టుకు వెళ్లొచ్చని, అనుకూలంగా తీర్పు వచ్చిన పక్షంలో ఎన్నికల్లో చిన్నమ్మ పోటీ ఖాయమని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు పేర్కొంటున్నాయి. చిన్నమ్మ కోర్టుకు చెల్లించాల్సిన జరిమానా రూ.10కోట్లు సిద్ధంగా ఉందని న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ తెలిపారు. దీప, దీపక్లకు నోటీసులు... దివంగత సీఎం జయలలితకు చెందిన వేదనిలయాన్ని అమ్మస్మారక మందిరంగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి వ్యతిరేకంగా జయలలిత మేనల్లు్లడు దీపక్, మేనకోడలు దీప కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే భవనం విలువ, జయలలిత చెల్లించాల్సిన ఆదాయపన్ను మొత్తం రూ.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెన్నై సిటీ సివిల్ కోర్టుకు చెల్లించింది. ఆ మొత్తాన్ని తీసుకోవాలని జయలలిత వారసులు దీప, దీపక్, ఆదాయపన్నుశాఖకు సిటీ సివిల్ కోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. నవంబర్ 5లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. -
'10 కోట్ల చెల్లింపునకు సిద్ధంగా ఉండండి'
సాక్షి, చెన్నై : చట్ట ప్రకారం కర్ణాటక జైళ్ల శాఖ మంచి నిర్ణయం తీసుకుంటుందని, జరిమానా చెల్లింపునకు సిద్ధంగా ఉండాలని న్యాయవాది రాజాచెందూర్ పాండియన్కు చిన్నమ్మ శశికళ లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. శిక్షాకాలం 2021 జనవరిలో ముగియనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆమెతో ములాఖత్ అయ్యేందుకు సన్నిహితులు, న్యాయవాదులకు కర్ణాటక అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో శశికళ తన న్యాయవాదికి రాసిన లేఖ సోమవారం వెలుగులోకి వచ్చింది. (సీఎంని పరామర్శించిన ఎంకే స్టాలిన్) లేఖలో ఏముందంటే.. భగవంతుడి దయతో తాను బాగానే ఉన్నానని చిన్నమ్మ పేర్కొన్నారు. తమిళనాడును కరోనా వణికిస్తోందని, దాని ప్రభావం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రం కరోనా నుంచి పూర్తిగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు వివరించారు. మార్చి నుంచి తనతో ములాఖత్లను కర్ణాటక జైళ్ల శాఖ నిలుపుదల చేసిందని, ఎప్పుడు పునరుద్ధరిస్తుందదో తెలియదన్నారు. తన విడుదల విషయాన్ని ప్రస్తావిస్తూ జైళ్ల శాఖ త్వరలో చట్ట ప్రకారం మంచి నిర్ణయం తీసుకుంటుందని, మంచే జరుగుతుందని భావిస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. 10 కోట్ల రూపాయల జరిమానా చెల్లింపునకు సిద్ధంగా ఉండాలని, అలాగే కోర్టులో పిటిషన్ దాఖలు, ఇతర న్యాయపరమైన వ్యవహారాలపై ఢిల్లీలోని సీనియర్ న్యాయవాదుల్ని సంప్రదించాలని ఆదేశించారు. దినకరన్(అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత)తో కలిసి ముందుకు సాగాలని కోరారు. -
‘చిన్నమ్మ’ బయటకు రాకుండా కుట్ర!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ జైలు నుంచి బయటకు రాకుండా జాప్యం చేయడంలో కుట్ర జరుగుతున్నట్టుగా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ఆరోపించే పనిలో పడ్డాయి. జప్తు నోటీసులు ఒకదాని తర్వాత మరొకటి జారీ చేస్తుండడంపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ పరప్పన అగ్రహార చెరలో ఉన్న విషయం తెలిసిందే. 2021 జనవరిలో ఆమె శిక్షాకాలం ముగియనుంది. జరిమానా రూ. 10 కోట్లు చెల్లింపు తర్వాత జైలు నుంచి చిన్నమ్మ బయటకు రావడం ఖాయమని అమ్మ శిబిరం వర్గాలు దీమా వ్యక్తం చేశాయి. ఇందుకు తగ్గ కసరత్తుల్లో దినకరన్ నిమగ్నమయ్యారు. (చిన్నమ్మకు చెక్ పెట్టినట్టేనా..) ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ అక్రమంగా ఆర్జించారంటూ ఆస్తుల అటాచ్, షోకాజ్ నోటీసులు ఒక దాని తర్వాత మరొకటి వెలువడుతుండడం అమ్మ శిబిరంలో కలవరాన్ని రేపింది. ఇప్పటికే ఐటీ రెండు విడతలుగా ఆస్తుల్ని జప్తు చేసింది, మూడో విడతగా రూ. రెండువేల కోట్ల ఆస్తులను బుధవారం అటాచ్ చేసింది. నోటీసులను సిరుదావూర్ బంగ్లా, కొడనాడు ఎస్టేట్లలో ఐటీ వర్గాలు గురువారం అంటించి వెళ్లాయి. అమ్మ వారసులుగా దీప, దీపక్లను కోర్టు ప్రకటించిన దృష్ట్యా, వారికి కూడా షోకాజ్ నోటీసులు పంపడం గమనార్హం. ఇప్పటివరకు రూ. 3,900 కోట్ల విలువగల ఆస్తులను ఐటీ జప్తు చేసింది. చిన్నమ్మ విడుదలను అడ్డుకోవడం లక్ష్యంగా కుట్ర జరుగుతోందని అమ్మ శిబిరం ఆరోపిస్తోంది. ఎన్నికల అనంతరం వచ్చేలా కుట్ర సాగుతోందని, అందుకే ఆస్తుల అటాచ్లు, జప్తులు, షోకాజ్ నోటీసులు సాగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుట్రల్ని చిన్నమ్మ భగ్నం చేస్తారని పేర్కొన్నా, తాజా పరిణామాలు అమ్మ శిబిరాన్ని కలవరంలో పడేసి ఉండడం గమనార్హం. (చిన్నమ్మకు షాక్ : రూ 2000 కోట్ల ఆస్తుల ఫ్రీజ్) -
చిన్నమ్మకు షాక్ : రూ 2000 కోట్ల ఆస్తుల ఫ్రీజ్
చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళకు బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయ పన్ను అధికారులు ఆమెకు చెందిన రూ 2000 కోట్ల విలువైన ఆస్తులను బినామీ నిరోధక చట్టం కింద స్తంభింపచేశారు. వీటిలో రూ 300 కోట్ల విలువైన రెండు ఆస్తులున్నాయి. సిరుతవుర్, కొడనాడు ప్రాంతాల్లోని ఈ ఆస్తులు జయలలిత సన్నిహితురాలు శశికళ, ఇలవరసి, సుధాకరన్ల పేరు మీద ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. స్తంభింపచేసిన ఆస్తులకు ఆదాయపన్ను శాఖకు చెందిన బినామీ నిరోధక విభాగం అధికారులు నోటీసులు అతికించారు. కాగా, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్రమాస్తుల కేసులో బెంగళూరు పర్పప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగిసి వచ్చే ఏడాది జనవరిలో ఆమె విడుదల కానున్నట్టు సమాచారం హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. చదవండి : చిన్నమ్మకు కొత్త చిక్కులు -
శశికళను ఎదుర్కొనేందుకు సిద్ధం
సాక్షి, చెన్నై: బెంగళూరు జైలు నుంచి శశికళ బయటకు వచ్చి సమస్యలు సృష్టించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మంత్రి కేసీ వీరమణి తెలిపారు. వేలూరు కలెక్టరేట్లో శనివారం మంత్రి గ్రామీణ ప్రాంతాలకు రేషన్ వస్తువుల పంపిణీ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు బ్యాటరీ బైకులను అందజేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ఇంటి వద్దకే వస్తువులు అందజేసేందుకు వాహన ఏర్పాట్లను ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు. (నా సమాచారం ఎవ్వరికీ ఇవ్వొద్దు: శశికళ) షోళింగర్లో ఈ విద్యా సంవత్సరంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రారంభించనున్నామని తెలిపారు. శశికళ బయటకు వస్తారని ఏదో అయిపోతుందని కొన్ని పత్రికలు ఇష్టానుసారంగా రాస్తున్నారని వీటిని వదిలి పెట్టి ప్రజల సమస్యలు, ప్రభుత్వ పథకాలపై వార్తలు రాయాలన్నారు. డీఆర్ఓ పారి్థబన్, అన్నాడీఎంకే కార్పొ రేషన్ కార్యదర్శి ఎస్ఆర్కే అప్పు, ఆవిన్ డెయిరీ చైర్మన్ వేలయగన్, అధికారులు పాల్గొన్నారు. -
నా సమాచారం ఎవ్వరికీ ఇవ్వొద్దు: శశికళ
సాక్షి, చెన్నై : తన గురించిన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వొద్దని కర్ణాటక జైళ్ల శాఖకు చిన్నమ్మ శశికళ లేఖాస్త్రం సంధించిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్రమాస్తుల కేసులో బెంగళూరు పర్పప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగిసి జనవరిలో ఆమె విడుదల కానున్నట్టు సమాచారం హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. శిక్షా కాలం ముగిసిన అనంతరం చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం దాదాపు ఖాయమైంది. జరిమానా రూ.10 కోట్లు ముందుగా చెల్లించాల్సి ఉంది. అందుకే ఆమె ప్రతినిధి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ బెంగళూరులో తిష్ట వేశారు. తన వివరాలను ఎవరుపడితే వారు సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటుండడంతో చిన్నమ్మ ఆగ్రహం చెందినట్టు సమాచారం. తన వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని జైళ్ల శాఖకు ఆమె లేఖ రాశారు. విడుదల వ్యవహారం గురించి సమాచారం సేకరించిన వారు, మున్ముందు తన విడుదలకు అడ్డు తగిలేలా కొత్త వివరాల కోసం సమాచార చట్టాన్ని అడ్డం పెట్టుకోవచ్చని భావించి చిన్నమ్మ లేఖ రాసినట్టు అమ్మ శిబిరంలో చర్చ జరుగుతోంది. జైలులో లగ్జరీగా ఉన్నారన్న విషయం ఒకటి ప్రచారం అవుతున్న దృష్ట్యా దీన్ని బూతద్దంలో పెట్టే దిశగా సమాచారం సేకరించే వారు ఉండవచ్చనే ఆమె భావించినట్టు తెలిసింది. (అమ్మ శిబిరంలో కమలం పంచాయితీ!) చిన్నమ్మ సోదరుడికి వారెంట్ చిన్నమ్మ కుటుంబ సభ్యులు, బంధువుల మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అలాగే కేసులు విచారణలో ఉన్నాయి. ఈ క్రమంలో చిన్నమ్మ సోదరుడు సుందరవదనన్కు తంజావూరు కోర్టు పీటీ వారెంట్ జారీ చేసింది. గతంలో తన ఆస్తులను కబ్జా చేశారని తంజావూరుకు చెందిన మనోహరన్ సతీమణి వలర్మతి ఫిర్యాదు చేశారు. దీంతో సుందర వదనన్, చిన్నమ్మ బంధువులు 10 మందిపై కేసులు నమోదయ్యాయి. కోర్టు విచారణకు వీరు డుమ్మా కొడుతున్నారు. అంతేగాక ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. వీరిని పట్టుకుని కోర్టులో హాజరుపరచాలని తంజావూరు కోర్టు పీటీ వారెంట్ను జారీ చేసింది. -
అమ్మ శిబిరంలో కమలం పంచాయితీ!
2021 ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా అన్నాడీఎంకే బలాన్ని పెంచేందుకు బీజేపీ పెద్దలు రంగంలోకి దిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఢిల్లీ వెళ్లిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ రహస్యంగా బీజేపీ నేతలను కలిసినట్టుగా వస్తున్న ప్రచారం కొత్త చర్చకు దారి తీసింది. సాక్షి, చెన్నై: దివంగత జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేలో చీలికలు వచ్చాయి. పన్నీరు, పళని నేతృత్వంలోని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఓ వైపు, జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ ప్రతినిధి దినకరన్ నేతృత్వంలోని అమ్మా మక్కల్ మునేట్ర కళగం మరో వైపు అన్నట్టుగా ఓటు బ్యాంక్, సభ్యత్వం ముక్కలైంది. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ శశికల జనవరిలో విడుదల కాగానే రాజకీయ పరిణామాలు తమిళనాట అనూహ్యంగా మారుతాయన్న చర్చ జోరందుకుంది. ఇదే జరిగిన పక్షంలో అన్నాడీఎంకేకు తీవ్ర నష్టం తప్పదన్న ప్రచారం ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ హఠాత్తుగా ప్రత్యేక విమానంలో మిత్రుడు, సహాయకుడితో కలిసి ఆదివారం ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. చిన్నమ్మ విడుదల విషయంగా ఢిల్లీలోని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకు దినకరన్ వెళ్లినట్టు ఆ కళగం వర్గాలు పేర్కొంటున్నాయి. (జనవరి 27న శశికళ విడుదల!) ఢిల్లీ పెద్దల పంచాయితీ.. 2021 ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించే అవకాశం ఉందని వచ్చిన సర్వేల నేపథ్యంలో బీజేపీ పెద్దలు వ్యూహాలకు పదును పెట్టారు. అందుకే దినకరన్ను ఢిల్లీకి పిలిపించినట్టు సమాచారం. ఇందుకు అనుగుణంగానే ఢిల్లీలో తిష్ట వేసిన దినకరన్ అక్కడి పెద్దలతో రహస్య భేటీల తదుపరి పరప్పన అగ్రహార చెరకు వెళ్లి ఢిల్లీ పెద్దల పంచాయితీ విషయాన్ని చిన్నమ్మ దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టే దినకరన్ పర్యటన ఉండబోతోందని అమ్మ శిబిరం వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం. (200 సీట్లే లక్ష్యం!: డీఎంకే మిత్రుల్లో కలవరం) అన్నాడీఎంకేతో కూటమి కొనసాగుతుందని, ఇది మరింత బలాన్ని పుంజుకోనున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ వ్యాఖ్యానించడం ఆలోచించ దగ్గ విషయమే. అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంద ని, దానిని భర్తీ చేయడానికి తగ్గట్టుగా ఆ పార్టీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో దిండుగల్కు చెందిన సూర్యమూర్తి పిటిష న్ వేయడంతో రాజకీయ ఆసక్తి పెరిగింది. -
జనవరి 27న శశికళ విడుదల!
సాక్షి, చెన్నై: అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో నాలుగేళ్ల శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె విడుదల విషయంగా కొంత కాలంగా రక రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ముందుగానే ఆమె విడుదల అవుతారన్న చర్చ జోరుగానే సాగినా, అందుకు తగ్గ దాఖలాలు కనిపించలేదు. అలాగే, శిక్షా కాలం ముగిసినా, జైలులో లగ్జరీ వ్యవహారం ఆమె మెడకు చుట్టుకోవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఇవన్నీ ఊహాజనితాలే అని పేర్కొనే రీతిలో శిక్షా కాలం ముగియగానే చిన్నమ్మ జయలలిత జైలు నుంచి బయటకు రావడం ఖాయం అవుతోంది. ఇందుకు తగ్గ వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చింది. (చదవండి : రూ.300 కోట్ల శశికళ ఆస్తుల జప్తు?) విడుదల ఖాయమేనా? బెంగళూరుకు చెందిన నరసింహమూర్తి చిన్నమ్మ శశికళ విడుదల సమాచారాన్ని సేకరించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఆయన చేసుకున్న విజ్ఞప్తికి బెంగళూరు జైళ్ల శాఖ వర్గాలు వివరాల్ని సమర్పించాయి. శశికళ జైలుకు వచ్చిన వివరాలు, ఆమె శిక్ష కాలం ముగింపు గురించి పేర్కొంటూ, జరిమాన రూ. పది కోట్లు చెల్లించిన పక్షంలో జనవరి 27న విడుదల అవుతారని ప్రకటించారు. ఒక వేళ జరిమానా చెల్లించని పక్షంలో 2022 ఫిబ్రవరి 27న విడుదల అవుతారని సూచించారు. ఈ సమాచారంతో చిన్నమ్మ సేనల్లో ఆనందం తాండవిస్తోంది. చిన్నమ్మ విడుదల కావడం ఖాయమని, ఇక, తమకు మంచి రోజులు వచ్చినట్టే అని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, చిన్నమ్మ న్యాయవాది రాజాచెందూర్ పాండియన్ పేర్కొంటూ, శిక్షా కాలం ముగిసినానంతరం జనవరి 27న ఆమె విడుదల అవుతారని ఇది వరకే తాను పేర్కొన్నట్టు గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం ఆమె ముందే విడుదలకు అవకాశం ఉందన్నారు. గతంలో జైలులో ఉన్న రోజుల లెక్కింపు, సత్ ప్రవర్తన విషయంగా పరిస్థితులు అనుకూలించిన పక్షంలో అక్టోబర్లోనే జైలు నుంచి విడుదల అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. -
శశికళకు షాక్ ఇచ్చిన ఐటీ?
సాక్షి, చెన్నై : తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు చెందిన రూ.300 కోట్ల ఆస్తులను ఆదాయ పన్ను శాఖ బినామి నిరోధక విభాగం జప్తు చేసినట్టు సమాచారం. అక్రమాస్తుల కేసులో శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆమె మీద అనేక కేసులు విచారణలో ఉన్నాయి. గతంలో శశికళ, కుటుంబం సభ్యుల మీద ఐటీ దాడులు సైతం హోరెత్తాయి. ఇందులో లభించిన ఆధారాల మేరకు 2003–2005లో ఓ సెల్ ఫోన్ సంస్థ ద్వారా బినామీ పేర్లతో అక్రమాస్తులను శశికళ గడించినట్టు ఆదాయ పన్ను విచారణలో తేలింది. ( శశికళ చేతిలోకే అన్నాడీఎంకే! ) చెన్నై శివార్లలో 200 ఎకరాల భూమితోపాటు 65 రకాల ఆస్తులను కొనుగోలు చేసినట్టు వెలుగు చూసినట్టుంది. వాటిని జప్తు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో జైలు జీవితం అనంతరం చిన్నమ్మ బస చేయడం కోసం పోయెస్ గార్డెన్ వేద నిలయంకు ఎదురుగా నిర్మిస్తున్న భవనం స్థలం కూడా ఉండడం గమనార్హం. ఈ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.300 కోట్లుగా తేల్చారు. ఈ జప్తుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
చిన్నమ్మకు కొత్త చిక్కులు
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళకు కొత్త చిక్కులు తప్పవేమో అన్న ఆందోళన బయలు దేరింది. ఆమె విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అమ్మ శిబిరాన్ని కలవరంలో పెట్టే సమాచారం తాజాగా వెలువడడమే ఇందుకు కారణం. గతంలో జైలులో చిన్నమ్మ లగ్జరీ జీవితం గుట్టును రట్టు చేసిన ఐపీఎస్ అధికారి రూప తాజాగా ఆ రాష్ట్ర హోంశాక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ పరిణామం చిన్నమ్మ విడుదల మీద పడేనా అన్న ఉత్కంఠ ఆమె శిబిరంలో కనిపిస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత సీఎం అమ్మ జయలలిత నెచ్చెలి శశికళ అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహారం జైలులో ఉన్న విషయం తెలిసిందే. 2017 ఫిబ్రవరిలో జైలుకు చిన్నమ్మ వెళ్లారు. ఇప్పటికి రెండుసార్లు పెరోల్పై ఆమె బయటకు వచ్చారు. ఆ తదుపరి జైలుకే పరిమితం అయ్యారు. (త్రిభాషా సూత్రాన్ని అంగీకరించం) ఈ పరిస్థితుల్లో గత కొంతకాలంగా చిన్నమ్మ ముందస్తుగా విడుదల కాబోతున్నట్టుగా సంకేతాలు వెలువడుతూ వస్తున్నాయి. చిన్నమ్మ కోసం పోయేస్ గార్డెన్లో ఓ బంగ్లా సైతం రూపుదిద్దుకుంటోంది. త్వరలో చిన్నమ్మ బయటకు రావడమే ఖాయం అన్న ధీమాతో ఉన్న ఆమెప్రతినిధి దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలకు తాజాగా పెద్ద షాకే తగిలింది. ముందస్తు విడుదల మాట పక్కన పెట్టి, అస్సలు ఇప్పట్లో ఆమె బయటకు వచ్చేనా అన్న చర్చ తెర మీదకు వచ్చింది. ఇందుకు కారణం గతంలో ఆమె మీద తీవ్ర ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారి రూప కర్ణాటక హోంశాఖ కార్యదర్శిగా నియమితులు కావడమే. (శశికళ చేతిలోకే అన్నాడీఎంకే!) తమిళనాడులోనే కాదు, ఎక్కడున్నా, తమ రూటే సపరేటు అన్నట్టుగా చిన్నమ్మ శశికళ లగ్జరీ వ్యవహారం పరప్పన అగ్రహార చెరలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళకు రాచమర్యాదలు అందుతున్నట్టుగా వచ్చిన సంకేతాలు కర్ణాటకలోనే, తమిళనాట కూడా రాజకీయంగా 2017 చివర్లో తీవ్రచర్చకు దారి తీసింది. కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీగా అప్పట్లో పనిచేసిన రూప స్వయంగా ఈ లగ్జరీ వివరాలను బయట పెట్టడం , ఆధారాలు ఉన్నట్టు ప్రకటించడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ లగ్జరీ వ్యవహారం మీద రిటైర్డ్ ఐఏఎస్ వినయ్కుమార్ నేతృత్వంలోని కమిషన్ విచారణ జరిపి నివేదికను కర్ణాటక ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో రూప తరపు అనేక ఆధారాలు సమర్పించి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో లగ్జరీ ఆరోపణల తదుపరి రూపకు బదిలీలు, శాఖల మార్పు అంటూ చిక్కులు తప్పలేదు. ప్రస్తుతం బెంగళూరు డివిజన్ రైల్వే ఐజీగా ఉన్న ఆమెను హోంశాఖ కార్యదర్శిగా కర్ణాటక ప్రభుత్వం నియమించింది. దీంతో చిన్నమ్మ లగ్జరీ వ్యవహారం తెర మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్నమ్మ విడుదలకు ముందుగా రూప కీలక పదవిలోకి వచ్చి ఉండటంతో తెర మరుగున పడి ఉన్న లగ్జరీ విచారణ నివేదికను తవ్వే అవకాశాలు ఉన్నాయని, ఈ దృష్ట్యా, చిన్నమ్మ విడుదలకు చిక్కులు తప్పదేమో అన్న చర్చ తెర మీకు వచ్చింది. ఈ వ్యవహారం అమ్మ శిబిరాన్ని కలవరంలో పడేసింది. అదే సమయంలో చిన్నమ్మ విడుదల విషయంగా ముందుగా న్యాయ నిపుణులతో చర్చించి, రూప రూపంలో చిక్కులు ఎదురు కాకుండా అమ్మ వర్గం ప్రయత్నాలు ప్రారంభించింది -
శశికళ చేతిలోకే అన్నాడీఎంకే!
సాక్షి, వేలూరు: జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే శశికళ చేతిలోకి అన్నాడీఎంకే పార్టీ వెళ్లడం కాయమని పార్లమెంట్ సభ్యులు కార్తీ చిదంబరం తెలిపారు. ఆయన బెంగళూరు నుంచి చెన్నైకి కారులో వచ్చారు. ఆ సమయంలో ఆంబూరు బస్టాండ్ ప్రాంతంలో తిరుపత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభు అధ్యక్షతన పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో కార్తీ చిదంబరం విలేకరులతో మాట్లాడారు. కందశష్టి కవశాన్ని అవమానం పరచడాన్ని మత నమ్మకం ఉన్న వారు ఎవరూ వదిలి పెట్టరన్నారు. మురుగుడి భక్తుడిగా ఉన్న తానే వాటిని అంగీకరించనన్నారు. ఒక మతానికి చెందిన దేవున్ని అవమాన పరిచడం సరికాదు. దేవుళ్లను అవమాన పరిచేందుకు పూనుకోకూడదన్నారు. (సీఎం నివాసంగా వేద నిలయం..) శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే అన్నాడీఎంకే పార్టీ పూర్తి అ«ధికారాలను ఆమె చేజిక్కించుకోవడం ఖాయమన్నారు. టీటీవీ దినగరన్ మరోసారి అన్నాడీఎంకే పార్టీలో చేరిపోతారన్నారు. వారి కుటుంబం అదుపులోనే ఉంటుందన్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి కాంగ్రెస్ ఇదివరకే తెలిపిన విధంగా ఒక్కొక్కరికీ రూ.10 వేలు అందజేసి ఉండాలన్నారు. అయితే రూ. 1000 మాత్రమే అందజేశారని చెప్పారు. బాధితులకు అదనంగా నివారణ సాయం అందజేయాలన్నారు. ప్రస్తుతం లాక్డౌన్ అమలులో ఉన్నందున నిబంధనలుకు విరుద్ధంగా కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరడంతో ఆంబూరు పోలీసులు కార్తీ చిదంబరంతో పాటు జిల్లా అధ్యక్షులు ప్రభుతో పాటు 50 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. (వేదనిలయంలోకి దీపక్) -
జైలులో చిన్నమ్మ జాగ్రత్తలు
సాక్షి, చెన్నై: బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళ అండ్ బృందం ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తున్నట్టు సమాచారం. కరోనా కలవరం రెట్టింపు కావడంతో జైలులో మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటిస్తున్నారు. కరోనా కలవరంతో దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న పెద్ద సంఖ్యలో ఖైదీలను బెయిల్, పెరోల్ మీద బయటకు పంపించిన విషయం తెలిసిందే. ఆ దిశగా బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో ఉన్న దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ, వదినమ్మ ఇలవరసి, అబ్బాయి సుధాకరన్కు పెరోల్ అ వకాశం లభించినా, ఉపయోగించుకోలేదు. బయట కన్నా, జైల్లోనే ఉండడం మంచిదని వారు భావించారేమో. (కరోనా ; యమలోకం హౌస్ఫుల్!) పెరోల్ ప్రయత్నాలను అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు చేపట్టినా, వారు తిరస్కరించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఆ జైలు నుంచి 1,112 మంది ఖైదీలు తాత్కాలిక బెయిల్, పెరోల్ మీద వెళ్లడంతో జైలులో దాదాపుగా అనేక గదులు, పరిసరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయని సమాచారం. చిన్నమ్మ శశికళ, ఇలవరసి, సుధాకరన్ జైలులో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మాస్క్లు ధరించడమే కాదు, భౌతిక దూరాన్ని పాటి స్తూ జైలులో కాలం నెట్టుకొస్తున్నారు. భోజనం కోసం బారులు తీరాల్సిన పరిస్థితి లేని దృష్ట్యా, తమకు కావాల్సింది తెచ్చుకుని ఆరగిస్తున్నారట. అలాగే, చిన్నమ్మ ఉన్న గదిలో అయితే ఇదివరకు ముగ్గురు ఉన్నట్టు తెలిసింది. ఒకరు పెరోల్ మీద బయటకు వెళ్లడంతో ప్రస్తు తం శశికళ, ఇలవరసి మాత్రమే ఉన్నట్టు భోగట్టా.(తమిళనాడును కబళిస్తున్న కరోనా) -
సంస్కృతికి కళ
సంస్కృతిని మనం బతికిస్తున్నాం అనుకుంటాం. కానీ సంస్కృతే మనిషికి బతుకునిస్తుంది. మానవ జీవితంలో కొరవడిన ఉల్లాసాన్ని కళల ద్వారా తిరిగి తీసుకొచ్చి, జీవితేచ్ఛను కలిగించేందుకు ‘గుడి సంబరాల’ పేరుతో సంగీత నాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు శశికళ, ఆమె స్నేహితురాలు శ్రీనగి. రోష్నీ కౌన్సెలింగ్ సెంటర్ వ్యవస్థాపక సభ్యురాలు శశికళ. జీవితం ఏ పట్టాలెక్కాలో నిర్ణయించేది ఇరవైలలో ఉండే ఉత్సాహమే. ఆ వయసులోనే సోషల్ లైఫ్లోకొచ్చారు శశికళ. ‘సహాయ్’ అనే స్వచ్ఛంద సంస్థలో వాలంటీర్గా పని చేశారు. అదే సంస్థలో పూనమ్ సింగ్ కూడా ఉండేవారు. కొన్నాళ్లకు సహాయ్ సంస్థ... కార్యకలాపాలను ఆపి వేసింది. అప్పుడు శశికళ, పూనమ్.. మరో సేవా సంస్థలో చేరడం కంటే సొంతంగా ఒక సంస్థను స్థాపించడమే కరెక్ట్ అనుకున్నారు. అలా ఏర్పాటైనదే ‘రోష్నీ’. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడే వారికి జీవితేచ్ఛను కలిగించడమే రోష్నీ ప్రధాన లక్ష్యం. ఆ సర్వీస్లో పాతికేళ్లు గడిచాయి. ఏడెనిమిదేళ్ల కిందట శశికళకు మరో ఆలోచన వచ్చింది. మనిషి మానసిక ఉల్లాసం కోసం కూడా ఏదైనా చేయాలనిపించింది. అలా రూపొందిన మరో ఫౌండేషన్ ‘పరంపర’. ఈ సంస్థ యేటా రెండు తెలుగు రాష్ట్రాల్లోని చారిత్రక ప్రదేశాలలో ‘గుడి సంబరాలు’ నిర్వహిస్తుంటుంది. గ్రామీణుల కోసమే ‘‘మనిషి ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటే జీవితం మీద నిరాసక్తతలు తలెత్తవు. నాగరక జీవితం కోసం ఎవరైనా పట్టణాల పట్టాల్సిందే. యువత ఉద్యోగాల కోసం గ్రామాలను వదిలి నగరాలకు వలసపోకా తప్పడం లేదు. దాంతో మానసిక ఉల్లాసాన్నిచ్చే కళాప్రదర్శనలూ నగరాలకే పరిమితం అవుతున్నాయి. కళాకారులు కూడా అవకాశాల కోసం నగరాలను ఆశ్రయిస్తున్నారు. కళాప్రదర్శనలన్నీ నగరాల్లోని ఏసీ ఆడిటోరియాల్లోనే జరగుతుంటే.. గ్రామాలనే నమ్ముకుని, దుక్కి దున్ని, భూమిని సాగు చేసి పంట పండించే రైతులు, ఆ వ్యవసాయరంగంలో పని చేస్తున్న వాళ్లు... ఒక కూచిపూడి నాట్యాన్ని కానీ ఒడిస్సీ నృత్యాన్ని కానీ చూడాలంటే కుదిరే పని కాదు. అందుకే మన సంప్రదాయ కళలను వాళ్ల దగ్గరకు తీసుకెళ్లడమే మా ప్రయత్నం. కథక్, మణిపురి, మయూర్ భంజ్, చావ్ వంటి ఒరిస్సా జానపద నృత్యాలను కూడా మన గ్రామాల్లో ప్రదర్శిస్తున్నాం’’ అని చెప్పారు శశికళ, పరంపర కో ఫౌండర్ డాక్టర్ శ్రీనగి. ‘సంబరాలకు’ ప్రేరణ శశికళది నిజామాబాద్, శ్రీనగిది వరంగల్. ఇద్దరివీ వ్యవసాయ కుటుంబాలే. ఆడపిల్లలు ఇంటికే పరిమితం కాకూడదు, సమాజం కోసం కూడా పని చేయాల్సిన అవసరం ఉందని నమ్మే కుటుంబాలే ఇద్దరివీ. వృత్తిరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. శ్రీనగి మెడ్విన్ హాస్పిటల్ డైరెక్టర్. శశికళ సెంట్రల్ కోర్ట్ హోటల్ నిర్వహణతోపాటు ఇతర కుటుంబ వ్యాపారాలనూ చూసుకుంటారు. ‘‘ఓసారి హంపి ఉత్సవాలు చూడడానికి వెళ్లినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఉత్సవాలు జరగడం లేదనిపించింది. కర్నాటకలో హంపి ఉత్సవాలే కాదు, హొయసల మహోత్సవాలు కూడా ఉంటాయి. ఖరజురహో ఉత్సవాలు, కోణార్క్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ అయితే దేశవిదేశాల్లో కూడా ప్రసిద్ధి. ఇక కేరళ, తమిళనాడు కూడా ఏ మాత్రం తీసిపోవు. మన దగ్గర కళలు లేవని కాదు, ఆదరణ తక్కువని చెబుతున్నాను. ఎవరైనా ముందుకు వచ్చి కళల కోసం ఏదైనా చేస్తే బావుణ్నని అనిపించింది. హైదరాబాద్ వచ్చాక నా ఫ్రెండ్స్, బంధువులు... అందరితో షేర్ చేసుకున్నాను. వాళ్లను ప్రభావితం చేయాలన్నంత పట్టుదలతో చెప్పాను. వాళ్లందరిలో ముందుకు వచ్చింది ఒక్క శ్రీనగి మాత్రమే. తను డాక్టర్ కాబట్టి పూర్తి సమయాన్ని కేటాయించడం కష్టం. దాంతో ‘ఇద్దరం కలిసి చేద్దాం’ అన్నది శ్రీనగి. అలా 2015, ఆగస్టు 15వ తేదీన పరంపర ఫౌండేషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి’’ అని వివరించారు శశికళ. ప్రదేశాల ఎంపిక గుడి సంబరాలు ఏటా సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు జరిగేవి. ఏడాదికి ఎనిమిది నుంచి పన్నెండు ప్రదర్శనలే ఉండేవి. ఈ ఏడాది పదిహేడు ప్రదర్శనలు ఉండడంతో సంక్రాంతికి ముందే మొదలు పెట్టి శ్రీరామనవమితో పూర్తి చేస్తున్నాం. ఇవి పూర్తి అయిన తర్వాత పూర్తి సమయం రోష్నీ సేవలకే. మిగిలిన టైమ్లో వచ్చే ఏడాది గుడి సంబరాల కోసం ప్రదేశాల ఎంపిక కోసం ఫీల్డ్ టూర్లుంటాయి. ఏడాదంతా పనిలోనే ఉంటాను. ఏదో ఒక పనిలో నిమగ్నం కాకపోతే రోజును వృథా చేశామనిపిస్తుంది’’.– శశికళ,రోష్నీ, పరంపర సంస్థల వ్యవస్థాపక సభ్యురాలు సంబరాల వేదికలు నలభై ఏళ్లకే పన్నెండు జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు, మానస సరోవరం, అమర్నాథ్ యాత్రలు పూర్తి చేశాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి జిల్లాలోనూ చిన్న చిన్న గుళ్లు కూడా చూసేశాను. ఆ యాత్రల అనుభవం ఇప్పుడు గుడి సంబరాల వేదికల ఏర్పాటులో బాగా ఉపయోగపడుతోంది. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పురాతన కట్టడాలే మాకు వేదికలు.– శ్రీనగి, గుడి సంబరాలు నిర్వహకురాలు పేరు కోసం పరిశోధన ‘‘మేము చేపట్టినది తెరమరుగవుతున్న మన సంప్రదాయాన్ని పునరుద్ధరించడం. అందుకోసం సంస్కృతం నుంచి తెలుగు నుడికారాల వరకు మాకు తెలిసిన ఎన్నో పేర్లు అనుకున్నాం. చివరికి ‘పరంపర – గుడి సంబరాలు’ అని నిర్ధారించుకున్నాం. నిజానికి గుడి పెద్ద సామాజిక క్షేత్రం. ఆలయాల ప్రాంగణంలో సామూహిక కార్యక్రమాల కోసం వేదిక ఉంటుంది. ఊరంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు సమావేశాలకు వేదిక కూడా ఆలయ మండపమే. నగరాల్లోని ఆడిటోరియాలకు పరిమితమవుతున్న కళలను గ్రామాలకు తీసుకెళ్లగలుగుతున్నాం. ఇవి టిక్కెట్ల ప్రదర్శనలు కావు, పూర్తిగా ఉచితం. పూర్వం కళలను పోషించడానికి రాజులుండేవాళ్లు. ఇప్పుడు కళల ఆదరణకు పూనుకోవాల్సిన బాధ్యత అందరిదీ. అందుకే ఇష్టంగా మొదలు పెట్టాం. మాకు చేతనైనట్లు, చేయగలిగినంత చేయగలుగుతున్నాం. శంషాబాద్ దగ్గర అమ్మపల్లిలో ఉన్న స్టెప్వెల్లో నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా మన దగ్గర అలాంటి బావులున్నాయనే సంగతిని తెలియచేయగలిగాం. కొండపల్లి కోటలో నాట్య ప్రదర్శనను పదిహేను వందల మంది చూశారు. అంటే అంతమందికీ మన చారిత్రక కట్టడాన్ని కూడా దగ్గర చేయగలిగామనే అర్థం. ఇలాంటివి ఇంకా చేస్తాం’’ అన్నారు శశికళ, శ్రీనగి.– వాకా మంజులారెడ్డిఫొటోలు: జి. అమర్ -
చెరసాలేనా చిన్నమ్మ?
నాలుగేళ్ల శిక్ష ముగింపు దశకు చేరుకుంది. జైలు నుంచి విముక్తిపై శశికళ చుట్టూ కారుమేఘాలు కమ్ముకుంటున్నాయి. జరిమానా రూపంలో చిన్నమ్మ చిక్కుల్లో పడ్డారు. జరిమానా చెల్లించనట్లయితే అదనంగా ఏడాది పాటు జైలు జీవితం తప్పదని నిపుణులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ 2014 సెప్టెంబర్లో ప్రత్యేక న్యాయస్థానం తీర్పుచెప్పింది. ఇదే కేసులో సహ నిందితులైన జయ నెచ్చెలి శశికళతోపాటు ఇళవరసి, సుధాకరన్కు కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో ఏడాదిపాటు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పుపై రెండేళ్ల పాటు అప్పీళ్లపై అప్పీళ్లతో శిక్ష అమలులో జాప్యం చోటుచేసుకుంది. 2016 డిసెంబర్లో జయలలిత కన్నుమూయగా 2017 ఫిబ్రవరి నుంచి శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. పెద్ద మొత్తంలో జరిమానాకు గురైన వారు శిక్ష ముగిసే సమయంలోనే చెల్లిస్తారు. శశికళ వ్యవహారంలో చెక్ లేదా డీడీ రూపంలో జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియబరుస్తూ ఆదాయపు పన్నుశాఖకు ఆదారాలు చూపి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను జతచేసి చెల్లించాలి. ఖైదీగా ఉన్న కాలంలో జైలు నిబంధనలకు అనుగుణంగా, క్రమశిక్షణతో వ్యవహరించినవారు శిక్షా కాలం నుంచి మినహాయింపు పొంది ముందుగానే విడుదలయ్యే వెసులుబాటు ఉంది. ఈ కేటగిరి కింద శశికళ నాలుగేళ్లు ముగిసేలోపే విడుదలవుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే దోపిడీ, హత్య, అత్యాచారం కేసుల్లో 14 జైలుశిక్ష పడిన వారికి మాత్రమే ముందస్తు విడుదల వెసులుబాటు వర్తిస్తుంది. అవినీతి కేసులో శిక్ష పడినవారు అందుకు అనర్హులని అంటున్నారు. శశికళ రూ.10 కోట్ల జరిమానా చెల్లించిన పక్షంలో 2021 జనవరి 25వ తేదీన జైలు నుంచి విడుదల అవుతారు. జరిమానా చెల్లించని పక్షంలో 2022 ఫిబ్రవరి 15వ తేదీ వరకు జీవితం గడపక తప్పదని జైళ్లశాఖ అధికారి ఒకరు చెప్పారు. ఆదాయపు పన్నుశాఖ అధికారులు రెండేళ్ల కిత్రం శశికళ సొంత వ్యాపారాలు, బంధువుల వ్యాపార సంస్థలు, ఇళ్లపై దాడులు చేసి రూ.5వేల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కనుగొన్నారు. ఈ పరిస్థితిలో రూ.10 కోట్ల జరిమానాను కరెన్సీ రూపంలో శశికళ చెల్లించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒకవేళ శశికళ బంధువులు, స్నేహితులు చెల్లించినా వారికి సైతం ఐటీ అధికారుల బెడద ఉంటుంది. శశికళ తరఫున అంతపెద్ద మొత్తాన్ని కట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారా అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. శశికళ రూ.10 కోట్లు జరిమానా చెల్లించి వచ్చే ఏడాది విడుదల అవుతారా..? లేక మరో ఏడాది పాటు జైల్లోనే ఉండిపోతారా..? అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. -
చిన్నమ్మకు పెరోల్!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ మరో నెల రోజుల్లో పెరోల్ మీద బయటకు రానున్నారు. ఇందకు తగ్గ కసరత్తుల్లో కుటుంబీకులు నిమగ్నమయ్యారు. అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం, అమ్మ జయలలిత నెచ్చెలి శశికళ జైలు జీవితాన్ని అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక రాష్ట్రం పరప్పన అగ్రహార చెరలో ఆమె ఉన్నారు. ఆమెకు విధించిన నాలుగు సంవత్సరాల శిక్షలో, ఇప్పటి వరకు మూడు సంవత్సరాలు ముగిశాయి. ఇక ఏడాది పాటు ఆమె శిక్ష అనుభవించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో గత ఏడాది భర్త నటరాజన్ అనారోగ్య పరిస్థితి, మరణం తదుపరి పరిణామాలతో రెండు సార్లు జైలు నుంచి పెరోల్ మీద చిన్నమ్మ బయటకు వచ్చారు. రెండో సారి అయితే పదిహేను రోజులు సమయం ఇచ్చినా, ఆమె తొమ్మిది రోజుల్లోనే మళ్లీ జైలుకు వెళ్లి పోయారు. ఈ నేపథ్యంలో మార్చిలో మళ్లీ ఆమె పెరోల్ మీద బయటకు రానున్నట్టు తెలుస్తోంది. ఇందుకు తగ్గ కసరత్తుల్ని కుటుంబీకులు చేపట్టారు. గత వారం కుటుంబీకులు పరప్పన అగ్రహార చెరలో శశికళను కలిసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. కుటుంబ కార్యక్రమం నిమిత్తం జైలు నుంచి బయటకు వచ్చేందుకు చిన్నమ్మ అంగీకరించడంతో పెరోల్ ప్రయత్నాల మీద దృష్టి పెట్టారు. తమ్ముడి కుమారుడి వివాహం చిన్నమ్మ శశికళ సోదరుడు, అన్నా ద్రావిడర్ కళగం ప్రధాన కార్యదర్శి దివాకరన్ కుమారుడు జై ఆనంద్కు వివాహ ఏర్పాట్లు చేసి ఉన్నారు. మార్చి ఐదో తేదీన ఈ వివాహం తిరువారూర్ జిల్లా మన్నార్కుడిలో జరగనుంది. కుటుంబంలో జరిగిన ప్రతి వివాహ వేడుకకు చిన్నమ్మ హాజరై ఉన్న దృష్ట్యా, ఈ కార్యక్రమానికి సైతం రప్పించేందుకు నిర్ణయించారు. అందుకే ఆమె అనుమతితో పెరోల్ ప్రయత్నాల మీద దృష్టి పెట్టినట్టు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు పేర్కొంటున్నాయి. స్టాలిన్ ఓ శక్తి తంజావూరులో గురువారం ఓ వివాహ వేడుకకు చిన్నమ్మ సోదరుడు దివాకరన్ హాజరయ్యారు. ఇదే వేడుకకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా వచ్చారు. ఈ సమయంలో దివాకరన్ వేదిక మీద ప్రసంగిస్తూ స్టాలిన్ను పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన వ్యక్తి, ఇక్కడ ఏలేద్దామనుకుంటున్నాడని పరోక్షంగా రజనీకాంత్నుద్దేశించి విమర్శలు గుప్పించారు. తమిళుడే ఈ రాష్ట్రానికి పాలించాలని, తమిళుల సంక్షేమం, అభివృద్ధి, ప్రగతి కోసం ఆర్మీ దళపతి వలే డీఎంకేను నడిపిస్తున్న స్టాలిన్కు ఆ అర్హతలు ఉన్నాయన్నారు. అందుకే స్టాలిన్ వెంట నిలబడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. -
చిన్నమ్మను బయటకు తీసుకొస్తాం
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళను జైలు నుంచి బయటకు తీసుకొస్తామని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. జైళ్ల శాఖకు విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికలో చిన్నమ్మ పేరు లేదని, దీన్ని బట్టి చూస్తే ఆమెకు క్లీన్చిట్ ఇచ్చినట్టు స్పష్టం అవుతోందన్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళ సత్ప్రవర్తన కారణంగా ఈ ఏడాది చివరి నాటికి జైలు నుంచి బయటకు రాబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ఆనందంతో ఉన్న సమయంలో సత్ ప్రవర్తన జాబితాలో చిన్నమ్మ పేరు లేదన్నట్టుగా రెండు రోజుల క్రితం సమాచారాలు వెలువడ్డాయి. దీంతో వారి ఆశలు అడియాశలయ్యారు. శశికళ విడుదల ఇక, ఇప్పట్లో లేనట్టేనని, శిక్షా కాలం పూర్తిగా ఆమె జైలుకు పరిమితం కావాల్సిందేనా అన్న చర్చ జోరందుకుంది. అయితే, ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని న్యాయవాది రాజచెందూర్ పాండియన్ వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం దినకరన్ మీడియాతో మాట్లాడుతూ చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం తథ్యం అని ధీమా వ్యక్తంచేశారు. దీపావళి రోజున ఆమె బయటకు వస్తారని ఎవ్వరూ చెప్పలేదే అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆమెపై ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేదని స్పష్టం చేశారు. జైలులో అందరి ఖైదీలకు వర్తిసున్న నిబంధనలు చిన్నమ్మ కూడా పాటిస్తున్నారని, వస్త్రధారణలోనూ సమానమేనని పేర్కొన్నారు. ఆమె జైలు నుంచి బయటకు వెళ్లి వచ్చినట్టుగా ఆరోపణలు వచ్చాయని, అయితే, విచారణ కమిషన్ నివేదికలో ఆమె పేరు అన్నది అసలు లేదని వ్యాఖ్యానించారు. ఈ దృష్ట్యా, చిన్నమ్మ ఏ తప్పూ చేయలేదని క్లీన్చిట్ ఇచ్చనట్టేగా అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. చిన్నమ్మను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తగ్గ చర్యలు చేపట్టి ఉన్నామని, ఆమె తప్పకుండా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆమె బయటకు రాకుండా రాజకీయాలు చేసే వాళ్లుచేస్తుంటారని, వాటన్నింటినీ అధిగమించి బయటకు చిన్నమ్మ వచ్చి తీరుతారని పేర్కొన్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు రాజకీయ పార్టీ గుర్తింపు వ్యవహారం మీద విచారణ ముగిసి ఉన్నదని, త్వరలో ఈసీ అధికారిక ప్రకటన చేయ వచ్చని చెప్పారు. ఉప ఎన్నికల్లో ధనబలం, డీఎంకే చేత గాని తనం వెరసి అన్నాడీఎంకేను గెలిపించాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే గెలిచినంత మాత్రాన అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు లేదని , పేర్కొన్నారు. ఇది ఎన్నికలకు రెఫరెండం మాత్రం కాదన్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తుందని, తమకు అంతలోపు ఎన్నికల కమిషన్ గుర్తింపు వస్తుందన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నామన్నారు. -
వారి గుండెల్లో బాంబులాంటి వార్తను పేల్చారు..
సాక్షి ప్రతినిది, చెన్నై: నాలుగేళ్ల శిక్షాకాలం ముగిసేలోపే విడుదలవ్వాలని శశికళ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. సత్ప్రవర్తన పరిధిలో ఆమె లేనందున ముందస్తు విడుదల సాధ్యం కాదని, శిక్షాకాలాన్ని పూర్తిగా అనుభవించాల్సి ఉంటుందని కర్ణాటక జైళ్లశాఖ డైరక్టర్ ఎన్ఎస్ మెక్రిక్ సోమవారం స్పష్టం చేశారు.అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో నాలుగేళ్ల శిక్షను అనుభవిస్తున్నారు. ఇదే కేసులో ఆమె సమీప బంధువులు ఇళవరసి, సుధాకర్ కూడా అదే జైల్లో నాలుగేళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్నారు. వీరి శిక్షాకాలం ప్రారంభం కాగా ప్రస్తుతానికి రెండున్నరేళ్లు పూర్తయిన దశలో సత్ప్రవర్తన కింద ముందుగానే జైలు నుంచి విడుదల అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. శశికళ, ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్ సైతం విడుదల కోసం ఎదురుచూశారు.ఈ స్థితిలో కర్ణాటక జైళ్లశాఖ డైరక్టర్ ఎన్ఎస్ మెక్రిక్ వారి గుండెల్లో బాంబులాంటి వార్తను పేల్చారు. శశికళ తన శిక్షాకాలాన్ని పూర్తి చేసిన తరువాతనే విడుదల అవుతారని, జైలులో సత్ప్రవర్తన కింద ఆమెను పరిగణించలేమని తేల్చేశారు. ఈ సమాచారంతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం శ్రేణులు దిగాలులో పడిపోయారు. పూర్తిస్థాయి శిక్షాకాలం అంటే 2021 ఫిబ్రవరి వరకు శశికళ విడుదల కోసం వేచి ఉండక తప్పదని వాపోతున్నారు. -
లగ్జరీగానే చిన్నమ్మ
సాక్షి, చెన్నై : పరప్పన అగ్రహార చెరలో చిన్నమ్మ శశికళకు నేటికీ లగ్జరీ సేవలు, పలు రకాల రాయితీలు అందుతున్నట్టుగా మళ్లీ ఆరోపణలు బయలు దేరాయి. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు సామాజిక కార్యకర్త ఒకరు చేసిన వ్యాఖ్యలు అమ్మ శిబిరంలో ఆగ్రహాన్ని రేపుతున్నాయి.అక్రమాస్తుల కేసులో అమ్మ జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ పరప్పన అగ్రహార చెరలో జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఓ మారు ఆమెకు అందుతున్న లగ్జరీ సేవల వ్యవహారం దుమారానికి దారి తీసింది. జైళ్ల శాఖ అధికారి రూప స్వయంగా ఆరోపణలు గుప్పించడంతో విచారణకు పరిస్థితులు దారి తీశాయి. ఆ తదుపరి పరిణామాలతో చిన్నమ్మ సత్ ప్రవర్తనతో ముందస్తుగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకుతగ్గ ప్రయత్నాల మీద అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ సైతం ఉన్నారు. చిన్నమ్మ ఈఏడాది చివర్లో జైలు నుంచి బయటకు రావడం ఖాయం అన్న ధీమాను ఆ శిబిరం వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో శశికళకు గతంలో వలే ఇప్పుడు కూడా రాయితీలు, లగ్జరీ సేవలు జైలులో అందుతున్నట్టుగా కర్ణాటకకు చెందిన సామాజిక కార్యకర్త నరసింహ ఆఆరోపణలు గుప్పించడం గమనార్హం. ఇందుకు తగ్గట్టుగాకొన్ని ఆధారాలను ఆయన బయట పెట్టారు. నిబంధనలకు తిలోదకాలు... చిన్నమ్మ శశికళ జైలులో వ్యవహరిస్తున్న విధానం, ఆమెతో సాగి ఉన్న ములాఖత్ల మీద సమాచార హక్కు చట్టం నరసింహ వివరాలను సేకరించి ఉన్నారు. అందులో లభించిన వివరాల మేరకు ఆమెకు నేటికి జైల్లో లగ్జరీగానే సేవలు రాజమార్గంలోనే అందుతున్నట్టుగా ఉందని ఆరోపించారు. జైలు నిబంధనల మేరకు శిక్ష అనుభవిస్తున్న ఒకరితో ములాఖత్కు నలుగుర్ని మాత్రమే అనుమతించాల్సి ఉందని, అయితే, శశికళను చూడటానికి ఏకంగా ఆరుగుర్ని పంపిస్తున్నట్టు పేర్కొన్నారు. గత నెల శశికళను మాజీ ఐఎఎస్ అధికారి చంద్ర లేఖ , దినకరన్, ఆయన భార్య అనురాధా, కుమార్తె జయహరినిలతో పాటుగా రాజన్, పుగలేందిలు ములాఖత్ అయ్యారని వివరించారు. దీనిని బట్టి చూస్తే, రాజమా«ర్గంలోనే ఆమెకు కర్ణాటక జైళ్ల శాఖ వర్గాలు సేవల్ని అందిస్తున్నట్టుందని ఆరోపించారు. తప్పని సరి పరిస్థితి అన్నది ఉంటే ఏడుగుర్ని అనుమతించ వచ్చు అని, అయితే, ఆ పరిస్థితి ఇక్కడ లేని దృష్ట్యా, నిబంధనల్ని ఉల్లంఘించి ఆరుగుర్ని అనుమతించడమే కాదు, 45 నిమిషాల పాటుగా ములాఖత్కు అనుమతించి ఉన్నారని వివరించారు. అయితే, నరసింహ వ్యాఖ్యలను అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. చిన్నమ్మ విడుదలను అడ్డుకునేందుకు ఇలాంటి శక్తులు తెర మీదకు ఇక రావడం సహజమేనని పేర్కొంటున్నాయి. జైలు నిబంధనలకు అనుగుణంగానే చిన్నమ్మ అక్కడ ఉన్నారని, ములాఖత్కు ఇద్దరు ముగ్గుర్ని తప్పా, ఎక్కువ మందిని ఆమే అనుమతించడం లేదని ఆ శిబిరానికి చెందిన ఓ నేత పేర్కొన్నారు. -
చిన్నమ్మతో ములాఖత్
సాక్షి, చెన్నై : బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో చిన్నమ్మ శశికళతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ములాఖత్ అయ్యారు. జరిమానా చెల్లింపు వ్యవహారంగా చర్చ సాగినట్టు సమాచారం.అక్రమాస్తుల కేసులో అమ్మ జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ పరప్పన అగ్రహార చెరలో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. సత్ప్రవర్తన కారణంగా చిన్నమ్మను ముందస్తుగానే విడుదల చేయడానికి అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ప్రయత్నాల్లో అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ కూడా ఉన్నారని చెప్పవచ్చు. అయితే, జైలు శిక్ష సమయంలో వి«ధించిన జరిమానాను ఇంకా చెల్లించనట్టు, ఇది కాస్త విడుదలకు అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారాలు గత వారం వెలువడ్డాయి. దీంతో జరిమానా చెల్లింపు వ్యవహారంతో పాటుగా, రాజకీయ పరంగా చిన్నమ్మను సంప్రదించి, సలహాలు, సూచనలకు దినకరన్ బెంగళూరు వెళ్లారు. సోమవారం శశికళతో ములాఖత్ అయ్యారు. ఆమె ఇచ్చిన సలహాల్ని అమలు చేయడానికి తగ్గట్టుగా సిద్ధం అయ్యారు. ఈ సందర్భంగా దినకరన్ మీడియాతో మాట్లాడుతూ, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం బలహీన పడలేదన్నారు. తాము బలంగానే ఉన్నామని, తమ వాళ్లు తమ వెన్నంటే ఉన్నారని పేర్కొన్నారు. అన్నాడీఎంకే, డీఎంకేలతో సంబంధాల్ని ఏర్పరచుకోవద్దని కేడర్కు హెచ్చరికలు పంపారు. -
చిన్నమ్మ విడుదల వీలుకాదు
టీ.నగర్: సత్ప్రవర్తన కింద శశికళ (చిన్నమ్మ)ను ముందస్తుగా విడుదల చేయడం వీలుకాదని ఐజీ రూప మంగళవారం వెల్లడిం చారు. అన్నాడీఎంకే హయాం (1991–96)లో జయలలిత, శశికళ, ఇళవరసి, వీఎన్ సుధాకరన్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు కేసు దాఖలైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు గత 2017 ఫిబ్రవరి 14న తీర్పు నిచ్చింది. జయ మృతిచెందిన స్థితిలో శశికళ, ఇళవరసి, సుధారన్ అనే ముగ్గురిని నిందితులుగా సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. విచారణ కోర్టు అందజేసిన నాలుగు ఏళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసి శశికళ, ఇళవరసి, సుధాకరన్ అనే ముగ్గురు 2017 ఫిబ్రవరి 15న బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో నిర్బంధించారు. ఇలావుండగా ఈ ముగ్గురు జైలు నిర్బంధానికి గురై రెండున్నర ఏళ్లు కావస్తున్నది. సత్ప్రవర్తన కారణంగా శశికళ ముందస్తుగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పబడింది. దీనిగురించి కర్ణాటక జైళ్లశాఖ అధికారి రూప మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ నేరస్తులను సత్ప్రవర్తన కారణంగా ముందస్తుగా విడుదల చేసే అవకాశం ఉందని, అయితే శశికళ విషయంలో ఇది వీలుకాదన్నారు. -
వర్మ నుంచి మరో సెన్సేషనల్ బయోపిక్
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో వేడి పుట్టించిన రామ్ గోపాల్ వర్మ.. చాలాకాలం తరువాత విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్ సాధించడంతో ఆర్జీవీ అభిమానులు కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ హిట్ కొట్టడంతో ఫామ్లోకి వచ్చిన ఆర్జీవీ.. మరో బయోపిక్ను టేకప్ చేశారు. తమిళ నాట సంచలనం సృష్టించిన జయలలిత మరణం, అటుపై శశికళ ఉదంతాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. శశికళ పేరుతో రాబోతోన్న ఈ చిత్రంలో .. శశికళకు జైలు శిక్ష, మన్నార్గుడి మాఫియాలను హైలెట్ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కబోతోన్నట్లు సమాచారం. కాసేపటి క్రితమే అధికారికంగా పోస్టర్ను రిలీజ్ చేసిన ఆర్జీవీ.. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సోషల్ మీడియాలో తెలిపారు. HAPPY TO ANNOUNCE! 💐💐💐COMING VERY SOON! 💪💪💪 pic.twitter.com/ZccF4mufNN — Ram Gopal Varma (@RGVzoomin) March 31, 2019 -
ఏడాది ముందే శశికళ విడుదల?
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళకు ముందుగానే జైలు జీవితం నుంచి మోక్షం లభించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక జైళ్లశాఖ చట్టాన్ని అనుసరించి ఏడాది ముందుగానే ఆమె విడుదల ఖాయమని అంచనావేస్తున్నారు. అన్నాడీఎంకే 1991–96 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లుగా డీఎంకే హయాంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై 18 ఏళ్లపాటు వాదోపవాదాలు సాగగా 2014లో నలుగురికీ తలా నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. అంతేగాక జయలలిత రూ.100 కోట్లు, మిగతా ముగ్గురు తలా రూ.10 కోట్ల జరిమానా చెల్లించాలని కోర్టు తీర్చు చెప్పింది. ఈ తీర్పుపై నలుగురు సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లినా అదే శిక్షను ఖరారు చేస్తూ 2017 ఫిబ్రవరి 14వ తేదీన తీర్పువెలువడింది. అయితే అప్పటికే జయలలిత కన్నుమూయగా మిగిలిన ముగ్గురు బెంగళూరు పరప్పన అగ్రహారంలోని జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. రెండేళ్లు పూర్తి: ఇదిలా ఉండగా ఈనెల 15వ తేదీతో వారి జైలు జీవితం రెండేళ్లు పూర్తిచేసుకుంటుంది. శిక్షను అనుభవిస్తున్నా ఈ ముగ్గురూ రూ.10 కోట్ల జరిమానా ఇంతవరకు చెల్లించలేదు. జరిమానా చెల్లించకుంటే వారి ఆస్తులు జప్తు చేయాల్సిందిగా ఆనాడే కోర్టు ఆదేశించింది. అయితే రెండేళ్లు పూర్తికావస్తున్నా ఆస్తుల జప్తు జరగలేదని తెలుస్తోంది. శశికళ ఆస్తులను జప్తు చేయాలని కొన్ని నెలల క్రితం తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నించినా అది నెరవేరలేదు. ఆస్తుల జప్తు విషయంలో ఆదాయపు పన్నుశాఖ సైతం ఎందుచేతనో మౌనం పాటిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో శశికళ ముందుగానే విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కర్ణాటక రాష్ట్ర జైళ్లశాఖ నిబంధనల ప్రకారం...సుదీర్ఘ, స్వల్పపరిమిత కాలశిక్షకు గురైన వారు మూడోవంతు జైలుజీవితాన్ని పూర్తిచేస్తే ముందుగానే విడుదల చేయవచ్చని అంటున్నారు. ఈ చట్టాన్ని అనుసరించి శశికళ నాలుగేళ్లు పూర్తికాకుండానే విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నాలుగేళ్ల జైలుశిక్ష ప్రకారం 2021 వరకు ఆమె జైల్లోనే ఉండాలి. అయితే కర్ణాటక చట్టాన్ని అనుసరించి మూడేళ్లు పూర్తికాగానే బాహ్యప్రపంచంలోకి అడుగిడవచ్చని తెలుస్తోంది. -
చిన్నమ్మగా సాయిపల్లవి
సినిమా: అమ్మ(జయలలిత) బయోపిక్ అంటే ఆ చిత్రంలో చిన్నమ్మ (శశికళ) పాత్ర కచ్చితంగా ఉంటుంది. జయ రాజకీయ జీవితంలో ఆమె స్నేహితురాలిగా శశికళను ప్రధాన భూమిక పోషించారు. జయలలిత ఆనందంలోనూ, విషాదంలోనూ చిన్నమ్మ భాగం ఎంతో. జయలలిత అంతిమ దశలోనూ శశికళది చర్చనీయాంశ భూమిక అన్నది తెలిసిందే. ఇదిలాఉండగా ప్రస్తుతం జయలలిత బయోపిక్ను తెరకెక్కించడానికి కోలీవుడ్లో పోటీ పెరిగింది. దర్శకుడు విజయ్, నవ దర్శకురాలు ప్రియదర్శిని ఇందుకు సన్నాహాలు చేస్తున్నారు. ది ఐరన్ లేడీ పేరుతో ప్రియదర్శిని తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని జయలలిత పుట్టిన రోజు సందర్భంగా పిబ్రవరి 24న ప్రారంభించనున్నారు. ఇందులో అమ్మగా నటి నిత్యామీనన్ నటించనున్నారు. ఈ పాత్ర కోసం ఆమె ఇప్పటికే తనను తాను తయారు చేసుకునే పనిలో ఉంది. ఇక జయలలిత నెచ్చలి శశికళగా నటి వరలక్ష్మీశరత్కుమార్ను నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.దర్శకుడు విజయ్ కూడా జయలలిత పుట్టిన రోజునే ఆమె బయోపిక్ను ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నారు.ఇందులో అమ్మ పాత్రలో నటి విద్యాబాలన్ను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. శశికళ పాత్రలో నటి సాయిపల్లవిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తాజా సామాచారం. సాయిపల్లవిని కోలీవుడ్కు దియా చిత్రం ద్వారా పరిచయం చేసిన దర్శకుడు ఈయనే. తాజాగా ధనుశ్కు జంటగా నటించిన మారి–2 చిత్రం ఇటీవల విడుదలై సాయిపల్లవికి మంచి పేరు తెచ్చి పెట్టింది. విజయ్ కోసం సాయిపల్లవి శశికళగా నటించే అవకాశం ఉంటుందని భావించవచ్చు. -
అంతసొమ్ము ఎక్కడిదమ్మా?
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో నాలుగేళ్ల శిక్షను అనుభిస్తున్న శశికళను ఆదాయపు పన్నుశాఖ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరిబిక్కిరి చేశారు. అంత సొమ్ము ఎక్కడిదమ్మా అంటూ ఆరాతీశారు. ఐదుగురితో కూడిన చెన్నై ఐటీ బృందం గురువారం ఉదయం బెంగళూరు జైలులో శశికళను విచారించడం ప్రారంభించింది.శుక్రవారం సైతం విచారణకొనసాగనుంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత హయాంలో అన్నీ తానై చక్రం తిప్పిన శశికళ తెరవెనుక సీఎంగా పేరు గడించారు. జయ వెన్నంటి ఉంటూ ఆమె బంధు, మిత్రగణానికి ‘సర్వం’ సమకూర్చారు. ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు న్యాయస్థానంలో రుజువుకావడంతో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ప్రస్తుతం శిక్షను అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా, చెన్నైలో శశికళకు సొంత ఇల్లు, ఆమె భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఆనేక కంపెనీలు, అక్క కుమారుడు టీటీవీ దినకరన్, సోదరుని కుమారుడు వివేక్, బంధువులు, బినామీలకు సంబంధించి 187 చోట్ల ఐటీ అధికారులు గత ఏడాది ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులు, తనిఖీల్లో 60కిపైగా బినామీ సంస్థలు బయటపడ్డాయి. అంతేగాక 150కి పైగా బ్యాంకు ఖాతాల ద్వారా రూ.3వేల కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు కనుగొన్నారు. ఈ సొమ్ముకు సంబంధించి శశికళ రక్తసంబంధీకులు, బంధువులు, భాగస్వాములు, స్నేహితులను ఐటీ అధికారులు తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. అంతేగాక బినామీల సొత్తును జప్తు చేశారు. జప్తుచేసిన ఆస్తులపై విచారణ కొనసాగుతోంది. అయితే అన్ని ఆస్తులను కూడబెట్టడంలో సూత్రధారి, పాత్ర«ధారి అయిన శశికళను మాత్రం ఇన్నాళ్లూ విచారించలేదు. విచారణకు జైలు అధికారుల అనుమతి శశికళను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ బెంగళూరు జైలు అ«ధికారులకు ఐటీ అధికారులు ఇటీవల ఉత్తరం రాశారు. ఈ ఉత్తరాన్ని పరిశీలించిన జైలు అధికారులు విచారణకు అనుమతించారు. ఈ అనుమతిని అనుసరించి డిసెంబర్ 13, 14 తేదీలను విచారణకు నిర్ణయించుకుని జైలు అధికారులకు కబురంపారు. ఈ మేరకు చెన్నై ఐటీ కార్యాలయం నుంచి ఐదుగురితో కూడిన అధికారుల బృందం గురువారం ఉదయం 10.30 గంటలకు జైలుకు చేరుకుంది. గత ఏడాది నిర్వహించిన ఐటీ దాడుల్లో బయటపడిన రూ.3వేల కోట్లకు పైగా ఆస్తులపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. అంత సొమ్ము ఎక్కడిది అనే కోణంలో గురు, శుక్రవారాల్లో సుమారు 500 పైగా ప్రశ్నలను సంధించనున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ పూర్తికాగానే శశికళపై మరో కేసు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
నెచ్చెలి.. నిజం చెప్పాలి!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ముసురుకున్న అనుమానపు మేఘాలను తొలగించేందుకు ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ వేగం పెంచింది. జయ నెచ్చెలి శశికళ నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టాలని ఆశిస్తోంది. డెప్యూటీ సీఎం పన్నీర్సెల్వం, ఇతర మంత్రుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించాలని కమిషన్ నిర్ణయించింది. రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిషన్ గత ఏడాది సెప్టెంబర్ నుంచి రంగంలోకి దిగింది. ఈ ఏడాది అక్టోబర్ 24వ తేదీతో కమిషన్ పదవీకాలం ముగుస్తుంది. ఇప్పటి వరకు జయలలిత బంధువులు, శశికళ బంధువులు, వారి సహాయకులు, ప్రభుత్వ విధుల్లో జయకు సహకరించిన అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, జయకు చికిత్స చేసిన అపోలో, ఎయిమ్స్ వైద్యులు, ప్రభుత్వ డాక్టర్లు ఇలా సుమారు వందమందికి పైగా సాక్షులను విచారించినా ఇంకా విచారణ ముగియలేదని అంటున్నారు. ముఖ్యంగా శశికళ బంధువులు, వైద్యులు చెప్పిన వివరాలు పొంతనలేనివిగా ఉండడంతో కమిషన్ అనుమానిస్తోంది. జయ మరణంపై సందేహాన్ని వ్యక్తం చేస్తోంది. జయలలితకు అందరికంటే అత్యంత సన్నిహితురాలైన శశికళ పాత్ర, శశికళ సలహాలు, సూచనల ప్రకారమే జయలలితకు చికిత్స అందడం, అపోలోలో చేర్చిన నాటి నుంచి అంతిమ సంస్కారం ముగిసే వరకు అన్నీ తానై చూసుకోవడాన్ని కమిషన్శితంగా పరిశీలిస్తోంది. జయ మరణంపై శశికళను ముఖ్యమైన సాక్షిగా భావిస్తోంది. శశికళ చెప్పే విషయాలు కీలకంగా మారగలవని అంచనావేస్తోంది. ఈ కారణంగా శశికళను విచారించాలని కమిషన్ నిర్ణయించింది. అయితే శశికళ ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. విచారణ నిమిత్తం అమెను చెన్నైకి పిలిపించుకుంటే అనేక చట్టపరమైన చిక్కులను అధిగమించాల్సి వస్తుందని కమిషన్ అభిప్రాయపడుతోంది. ఈ కారణంగా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. అలాగే జయకు చికిత్స చేసిన సింగపూర్ డాక్టర్లను సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టనున్నారు. శశికళను విచారించిన తరువాత ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం, వైద్యమంత్రి విజయభాస్కర్లను సైతం విచారించాలని కమిషన్ నిర్ణయించింది. ఇందుకోసం వారిద్దరికీ సమన్లు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిద్దరితోపాటు మంత్రులు తంగమణి, వేలుమణి, లోక్సభ ఉపసభాపతి తంబిదురైలను కూడా విచారించనుంది. అవసరమైతే అపోలో ఆసుపత్రి వైద్యులను మరోసారి పిలిపించుకోవాలని భావిస్తోంది. అనేక ముఖ్యులను విచారించాల్సి ఉన్నందున కమిషన్ గడువు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
చిన్నమ్మకు అస్వస్థత
బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షాఖైదీగా ఉన్న చిన్నమ్మ శశికళ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. బ్లడ్ప్రెషర్, షుగర్ శాతం ఎక్కువ కావడంతో జైల్లోనే ఉన్న ఆసుపత్రిలో గురువారం రాత్రి ఆమెను అడ్మిట్ చేశారు. ఆరోగ్యం కుదుట పడకుంటే బెంగళూరులోని విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకర్లకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అయితే తుది తీర్పు వెలువడే నాటికే జయలలిత మరణించడంతో మిగిలిన ముగ్గురు బెంగళూరు జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. మధుమేహ వ్యాధి తీవ్ర స్థాయికి చేరుకోవడం వల్లనే అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను వెంటనే జైల్లోని ఆసుపత్రిలో చేర్చారు. జైలు డాక్టర్లు ఆమెకు తీవ్ర చికిత్స అందిస్తున్నారు. అలాగే బ్లడ్ప్రెషర్తో సైతం ఆమె బాధ పడుతున్నట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. జైలులోని ఆసుపత్రిలో చేస్తున్న చికిత్స వల్ల ఆమె కోలుకోని పక్షంలో బెంగళూరు సిటీలోని విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని అధికారులు భావిస్తున్నారు. సుమారు ఆరునెలల క్రితం కూడా శశికళకు మధుమేహం, రక్తపోటు ఎక్కువ కావడంతో విక్టోరియా ఆసుపత్రిలోనే చికిత్స చేశారు. కొన్నిరోజుల్లో ఆరోగ్యం కుదుటపడడంతో మరలా జైలుకు చేర్చారు. భర్త నటరాజన్ చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నపుడు పెరోల్పై చెన్నైకి వచ్చి పరామర్శించి, వెళ్లారు. కొన్నిరోజుల్లోనే నటరాజన్ మృతిచెందగా మరలా పెరోల్పై వచ్చి అంత్యక్రియల్లో పాల్గొని వెళ్లారు. శశికళ మరలా అనారోగ్యానికి గురికావడంతో విక్టోరియా ఆసుపత్రికి తరలించడం, ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంపై కర్ణాటక ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. -
వామ్మో చిన్నమ్మా.. నాకొద్దు ఈ పిటిషన్
చిన్నమ్మ శశికళ దాఖలు చేసుకున్న పిటిషన్ను విచారించేందుకు న్యాయమూర్తినిరాకరించారు. తనకు ఈ కేసు వద్దు అని, మరో బెంచ్కు అప్పగించాలని ప్రధాన న్యాయమూర్తికి బుధవారం సిఫారసు చేశారు. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే వర్గాల అమ్మ, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ అండ్ కుటుంబీకుల మీదున్న కేసుల గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది. అనేక కేసులో విచారణలో ఉన్నాయి. హైకోర్టులో కొన్ని, ఎగ్మూర్ కోర్టులో మరికొన్ని, ప్రత్యేక కోర్టులో ఇంకొన్ని ఇలా కేసుల విచారణ ఏళ్ల తరబడి వాయిదాల పర్వంతో సాగుతూ వస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం చిన్నమ్మ శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో శిక్షను అనుభవిస్తున్నారు. ఆమె జైలుకు వెళ్లడంతో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పెండింగ్లో ఉన్న కేసుల విచారణల వేగం పెరిగింది. దీంతో చిన్నమ్మ అండ్ కుటుంబాన్ని ఈ కేసులు ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ దాఖలు చేసిన కేసును వ్యతిరేకిస్తూ చిన్నమ్మ దాఖలు చేసుకున్న పిటిషన్ను విచారించేందుకు హైకోర్టు న్యాయమూర్తి నిరాకరించడం గమనార్హం. నాకొద్దు ఈ పిటిషన్ : 1996–97 కాలంలో రూ. నాలుగు కోట్ల 97 లక్షలు విలువైన ఆస్తులకు గాను చెల్లించాల్సిన రూ. పది లక్షల 13 వేలు పన్నును శశికళ ఎగ్గొట్టినట్టుగా ఆదాయ పన్ను శాఖ కేసు నమోదు చేసింది. ఏళ్ల తరబడి సాగుతూ వస్తున్న ఈ కేసును వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టును చిన్నమ్మ ఆశ్రయించారు. ఆదాయ పన్ను శాఖ తన మీద దాఖలు చేసిన కేసు విచారణకు స్టే విధించాలని అందులో కోరారు. ఈ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. బుధవారం పిటిషన్ విచారణ న్యాయమూర్తులు మణికుమార్, సుబ్రమణ్య ప్రశాంత్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. పిటిషన్ను పరిశీలించిన న్యాయమూర్తి ప్రశాంత్ తాను విచారించ దలచుకోలేదని వ్యాఖ్యానించారు. గతంలో తాను శశికళకు సంబంధించిన కేసులకు హాజరు అయ్యానని, ఈ దృష్ట్యా, తాను ఈ కేసును విచారించే లేనని స్పష్టం చేశారు. దీంతో మరో న్యాయమూర్తి సైతం పిటిషన్ను విచారించేందుకు నిరాకరిస్తూ, దీనిని మరో బెంచ్కు మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. దీంతో తమ బెంచ్ ముందు ఉన్న ఈ పిటిషన్ను మరో బెంచ్కు అప్పగించాలని కోరుతూ న్యాయమూర్తి సుబ్రమణ్య ప్రశాంత్ ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జి్జకి విజ్ఞప్తితో కూడి సిఫారసు చేశారు. ఈ దృష్ట్యా, కేసు విచారణ మరి కొంత కాలం జాప్యంతో సాగే అవకాశాలు ఎక్కువే. -
జయ మరణం; ‘అమ్మ’ డ్రైవర్ కీలక సమాచారం
చెన్నై : దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న ఆర్ముగస్వామి కమిషన్ ఆసక్తికర అంశాలను బయటపెట్టింది. దర్యాప్తులో భాగంగా కమిషన్ జయలలిత నెచ్చలి శశికళ, ఆమె వ్యక్తిగత వైద్యుడు శివకుమార్తో పాటు జయలలిత దగ్గర చాలాకాలంగా డ్రైవర్గా పనిచేస్తున్న కన్నన్ని వేర్వేరుగా విచారించింది. శశికళ, వైద్యుడు, కన్నన్ చెప్పిన అంశాలకు పొంతన లేదని తెలిపింది. శశికళ, శివకుమార్ల వర్షన్... ‘ఆ రోజు అనగా 2016, సెప్టెంబర్ 22న అమ్మ(జయలలిత) బెడ్పై కూర్చుని ఉంది. అకస్మాత్తుగా పడిపోయింది. దాంతో డ్రైవర్ కన్నన్, జయ వ్యక్తిగత భద్రతా అధికారి ‘అమ్మ’ను బెడ్ మీద నుంచి వీల్ చైర్లోకి మార్చడానికి ప్రయత్నించారు. కానీ వారికి అది సాధ్యపడలేదు. దాంతో రాత్రి 9.30 గంటలకు అంబులెన్స్కు ఫోన్ చేసామని’ చెప్పారు. కన్నన్ చెప్పిన వివరాలు... ‘అమ్మ’ డ్రైవర్ కన్నన్ మాత్రం శశికళ, శివకుమార్లు చెప్పిన దానికి విరుద్ధమైన విషయాలు చెప్పాడని కమిషన్ వెల్లడించింది. కన్నన్ 1991 నుంచి జయలలిత దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కన్నన్ జయలలితను ఆస్పత్రిలో చేర్చిన రోజు జరిగిన సంఘటన గురించి కమిషన్తో చెప్పిన వివరాలు... ‘నేను ‘అమ్మ’ గదిలోకి వెళ్లేసరికి ఆమె చైర్లో కూర్చుని ఉన్నారు. అప్పటికే ‘అమ్మ’ స్పృహ కోల్పోయి ఉన్నారు. ఆ సమయంలో అక్కడ కొన్ని ఫైల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. పెన్ను కాప్ కూడా తీసి ఉంది. ‘చిన్నమ్మ’ నాతో వెంటనే వెళ్లి ఒక వీల్ చైర్ తీసుకు రా, అమ్మని ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పింది. కొంతసేపటి తరువాత నేను, పీఎస్ఓ వీరపెరుమాల్ చైర్ తీసుకువచ్చి, అమ్మను ఆ చైర్లో కూర్చొపెట్టాము. రెండడుగులు వేసామో, లేదో అమ్మ చైర్ నుంచి కింద పడింది. వెంటనే నేను, వీరపెరుమాల్ ‘అమ్మ’ను లేపడానికి ప్రయత్నించాము. కానీ మా వల్ల కాలేదు. దాంతో స్ట్రెచర్ తీసుకువస్తే బాగుంటుందని భావించామ’ని తెలిపాడు. గంట సేపు డాక్టర్ అదృశ్యం... అంతేకాక కన్నన్ చెప్పిన మరో ఆసక్తికర అంశమేంటంటే.. ‘నేను రాత్రి 8.30 గంటల సమయంలో డాక్టర్ శివకుమార్ను పోయెస్ గార్డెన్లో చూశాను. కానీ కొంతసేపటి తరువాత ఆయన బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ ఆయన తిరిగి ఎప్పుడు పోయెస్ గార్డెన్కి వచ్చాడో నాకు తెలియదు. కానీ నేను అమ్మ గదిలోకి వెళ్లినప్పుడు శివకుమార్ అక్కడే ఉన్నాడు. అంటే దాదాపు గంట తర్వాత అంటే 9.30 గంటలకు అతను తిరిగి వచ్చుంటాడని తెలిపాడు. అంతేకాక ‘ఆ రోజు(సెప్టెంబర్ 22) రాత్రి 10 గంటల ప్రాంతంలో కారును సిద్ధంగా ఉంచమని పీఎస్వో పెరుమాళ్కు చెప్పాను. అయితే లక్ష్మి (జయ ఇంట్లో పనిమనిషి) పెద్ద కారు అయితే బాగుంటుందని తనతో చెప్పింద’ని తెలిపాడు. అయితే కన్నన్ చెప్పిన ఈ రెండు విషయాలను శశికళ, శివకుమార్లు చెప్పలేదని కమిషన్ పేర్కొంది. అంతేకాక పోయెస్ గార్డెన్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, అయితే సెప్టెంబర్ 22 నాటి దృశ్యాలు అందులో రికార్డయ్యాయో, లేదో తనకు తెలియదని కన్నన్ కమిషన్తో చెప్పాడు. -
ఇక.. అక్క కాదు!
సాక్షి, చెన్నై : ‘‘ఇక శశికళను అక్కా అని పిలవను.. ఆమె మాజీ సహోదరి మాత్రమే.. అమ్మ జయలలిత హత్యకు మూడుసార్లు ప్రయత్నాలు జరిగాయి. ఆమెను రక్షించింది నేనే.. ఆ ఇద్దరి వల్లే మా కుటుంబానికి మన్నార్ కుడి మాఫియా అనే పేరు వచ్చింది’’ అంటూ అమ్మ శిబిరం నేత దివాకరన్ సోమవారం తీవ్రంగా స్పందించారు. ఎవరికీ తాను భయపడను అని, రాజకీయంగా తగ్గే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. చిన్నాభిన్నంగా ఉన్న అన్నాడీఎంకేని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే దిశగా రాజకీయ పయనం సాగించబోతున్నట్టు ప్రకటించారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశి కళ కుటుంబంలో బయలుదేరిన సమరం ముదిరి పాకాన పడింది. తన సోదరుడు దివాకరన్, అక్క వనితామణి కుమారుడు దినకరన్ మధ్య సాగుతున్న సమరంలో చిన్నమ్మ తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని రెండుగా చీల్చేసింది. తనకు వ్యతిరేకంగా శశికళ తీసుకున్న నిర్ణయంతో సోదరుడు దివాకరన్ షాక్కు గురయ్యారు. ఇక, ఆ కుటుంబం వేరు, తన కుటుంబం వేరు అని ప్రకటిస్తూ, శశికళను అక్క అని పిలవబోనని వ్యాఖ్యల తూటాల్ని పేల్చే పనిలో నిమగ్నం అయ్యారు. ఇక, తెగ తెంపులు మన్నార్కుడిలో తన మద్దతుదారులతో సమావేశం అనంతరం దివాకరన్ సోమవారం మీడియా ముందుకు వచ్చారు. న్యాయవాది ద్వారా నోటీసు పంపించి దినకరన్ బ్లాక్ మెయిల్ రాజకీయాల్లో నిమగ్నం అయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుటుంబ వివాదంలోకి మూడో వ్యక్తిని పంపించి ఆట మొదలెట్టారని, ఈ ఆటను రక్తికట్టించేందుకు తాను సిద్ధంగానే ఉన్నట్టు సవాల్ విసిరారు. శశికళ, దినకరన్లతో ఇక, తనకు ఎలాంటి సంబంధం లేదని, వారితో తెగదెపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. శశికళ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని, అందుకే ఇక, ఆమెను అక్క అని పిలవకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. దివంగత ఎంజీఆర్, అమ్మ జయలలితల మార్గదర్శకంలో తన రాజకీయ పయనం సాగుతుందన్నారు. దీనిని అడ్డుకునే రీతిలో ఎవరు వ్యవహరించినా.. అది శశికళ అయినా సరే, తిప్పి కొడుతానని హెచ్చరించారు. శశికళ ఫొటోలతో ఫ్లెక్సీలు వద్దని తాను ఎప్పుడో మద్దతుదారులకు తెలియజేశానని, అయితే, అత్యుత్సాహంతో కొందరుమాజీ సహోదరి ఫొటోలను వాడేశారని వ్యాఖ్యానించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా దినకరన్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తొలుత ఓపీఎస్ను(డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం), ఆ తదుపరి ఈపీఎస్(సీఎం పళని స్వామి)ని శశికళకు దూరం చేశాడని, ఇప్పుడు తనను కూడా దూరం చేయించాడని శివాలెత్తారు. రోగం ముదిరింది సీఎం కావాలన్న ఆశతో దినకరన్ పగటి కలలు కంటూ, చివరకు మానసిక రోగి అయ్యాడని ఎద్దేవాచేశారు. నోటీసు అందుకున్న తాను, ఆగ్రహం తో శశికళకు వ్యతిరేకంగా తీవ్ర పదాల్ని, తీవ్ర ఆరోపణల్ని గుప్పిస్తానని దినకరన్ అనుకుని ఉంటాడని మండిపడ్డారు. అయితే, తాను అలాం టి పదాల్ని, ఆరోపణల్ని గుప్పించదలచుకోలేదని స్పష్టంచేశారు. అయితే, ఎన్నికల సమయంలో శశికళ పార్టీకి దినకరన్ ఉప ప్రధాన కార్యదర్శిగా ఉన్న పక్షంలో తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించి తీరుతానని తెలిపారు. తానేదో కేంద్రం ఆడిస్తున్నట్టుగా ఆడుతున్నట్టు దినకరన్ ఆరోపిస్తున్నాడని, వాస్తవానికి కేంద్రం అడుగులకు మడుగులొత్తుతున్నది అతడే అని ధ్వజమెత్తారు. ఆ పేరుతో మనోవేదన జయలలితకు దత్తపుత్రుడిగా తెరమీదకు వచ్చిన సుధాకరన్, దినకరన్ రూపంలో మన్నార్ కుడి మాఫియా అన్న పేరును తమ కుటుంబం మూటగట్టుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఆ పేరును తలచుకున్నప్పుడల్లా తాను తీవ్ర మనోవేదనకు లోనయ్యే వాడినని వ్యాఖ్యానించారు. శశికళకు తమ్ముడిగా ఉన్న ఒకే ఒక కారణంతో తానే కాదు, తన సన్నిహితులూ పలుమార్లు ఐటీ దాడుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. 33 సంవత్సరాలుగా మన్నార్కుడి మాఫియాకు తానేదో నేతృత్వం వహిస్తున్నట్టుగా అపవాదును భరించాల్సి వచ్చిందని ఉద్వేగానికి లోనయ్యారు. మన్నార్కుడిలో తానుక్కొడే ఉన్నానని, ఇతర కుటుంబీకులు ఎవరూ లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సైదైతోనే విత్తనం అన్నాడీఎంకే అన్న పేరుకు విత్తనం వేసిన వ్యక్తి సైదై దురై స్వామి అని వ్యాఖ్యానించారు. సత్య స్టూడియోలో ఎంజీఆర్ను కలిసి ఆ పేరును విత్తింది ఆయనే అని ఈసందర్భంగా పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే, జయలలితను హతమార్చేందుకు మూడుసార్లు ప్రయత్నాలు జరిగా యని ఆరోపించారు. ఆ ప్రయత్నాల్ని తిప్పికొట్టి జయలలితను రక్షించింది తానేనని పేర్కొన్నారు. హతమార్చేందుకు ప్రయత్నించిందెవరో ..? అని ప్రశ్నించగా, దాటవేస్తూ, శశికళ కుటుంబం నుంచి తనను దూరం పెట్టినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇక, రక్త సంబంధీకులు మాత్రమే తనతో ఉన్నారని, ఉంటారని వ్యాఖ్యానించారు. శశికళకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశామని, ఆమె తమకు చుట్టం మాత్రమేనని, దినకరన్ అక్క కుమారుడైనా, తనకు సంబంధం లేని కుటుంబా నికి చెందిన వ్యక్తి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను మరణించినా, వారికి అంటు అనేది లేదని వ్యాఖ్యానించారు. తనను మానసిక రోగిగా దినకరన్ వ్యాఖ్యానించాడని, అలాంటప్పుడు తనకు ఎందుకు నోటీసు పంపినట్టు అని ప్రశ్నించారు. చిన్నాభిన్నంగా ఉన్న అన్నాడీఎంకేని, కేడర్ను ఒకే గొడుగు నీడలోకి తీసుకొచ్చే దిశగా రాజకీయ పయనం సాగుతుందని, ఎవరికీ తాను భయపడనని, రాజకీయ పయనం ఆగదని స్పష్టం చేశారు. భేష్ తమిళనాడు ప్రభుత్వ పనితీరు అభినందనీయమని దివాకరన్ ప్రశంసించారు. డెల్టాలో జల వనరుల పరిరక్షణకు వెయ్యి కోట్లు కేటాయించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. కావేరి వ్యవహారం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వ కోర్టు ధిక్కార కేసు సాహసోపేత నిర్ణయంగా కొనియాడారు. జయలలిత ప్రగతి పథకాలను సీఎం పళనిస్వామి చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ను తమిళనాట సక్రమంగా అమలు చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. డీఎంకే నేత స్టాలిన్ తన వ్యక్తిగత శ్రమతో ఎదిగారని కితాబు ఇవ్వడం గమనార్హం. -
మీవల్లే జైల్లో శశికళ.. రూప సెల్ఫీపై చర్చ
సాక్షి, బెంగళూరు : శశికళ పరప్పన అగ్రహార జైల్లో శశికళ వీఐపీ సదుపాయాలపై నివేదికతో ఐపీఎస్ అధికారిణి రూప వార్తల్లోకెక్కారు. అప్పటి నుంచి తరచూ ఆమె వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ విమర్శలకు దారితీసింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని పొగుడుతూ ఆయనతో దిగిన ఓ సెల్ఫీని ఆమె ట్వీట్ చేయగా.. అది చర్చనీయాంశమైంది. ‘మీరు(సుబ్రహ్మణ్య స్వామి) చాలా గొప్ప వ్యక్తి సార్. మీరే గనుక ఫిర్యాదు చేయకుంటే మాత్రం ఆ వ్యక్తి అసలు జైలుకి వెళ్లే వారు కాదేమో. మీ స్ఫూర్తితోనే ఆమె జైల్లో చేసిన అక్రమాలు నేను బయటపెట్టా’ అని రూప ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఆ ట్వీట్పై పలువురు విమర్శలు మొదలుపెట్టారు. ‘మీరు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఓ వ్యక్తి రీట్వీట్ చేయగా... రూప దానికి స్పందించారు. ‘నేను జైలు రిపోర్టు అందజేయగానే నన్ను బదిలీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక పోలీస్ శాఖ ప్రవర్తించింది. అప్పుడు ఎవరూ ప్రశ్నించరు. కానీ, ఇప్పుడు ఓ స్పూర్తిదాయాక వ్యక్తితో ఫోటో దిగితే రాజకీయాలు చేస్తున్నారు. ఇది సరికాదు’ అని ఆమె పేర్కొన్నారు. కాగా, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదుతో తేనెతుట్టే కదిలింది. సుమారు రెండు దశాబ్దాలపాటు జరిగిన విచారణ అనంతరం బెంగళూరు కోర్టు గతేడాది ఫిబ్రవరిలో జయలలిత ఆమె సన్నిహితురాలు శశికళను కోర్టు దోషులుగా తేల్చింది. అయితే అప్పటికే జయలలిత మరణించగా, శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇదిలా ఉంటే శశికళకు జైల్లో వీఐపీ ట్రీట్ మెంట్ అందిందని.. అందుకోసం అధికారులు రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారంటూ జైల్లో డీఐజీగా ఉన్న రూప సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కర్ణాటక హోం శాఖ.. ఆపై రూపను వేరే విభాగానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
4నే ‘అమ్మ’ కన్నుమూశారు!
అమ్మ జయలలిత 2016 డిసెంబర్ నాలుగో తేదీనేమరణించినట్టు తనకు సమాచారం వచ్చిందని అమ్మ శిబిరం నేత, చిన్నమ్మ శశికళసోదరుడు దివాకరన్ వ్యాఖ్యానించారు. రెండుసార్లు మాత్రమే తాను అపోలోకువెళ్లానని వివరించారు. అమ్మ మరణంతదుపరి సీఎం పదవి కోసం గట్టి పోటీనే సాగిందని, చివరకు పన్నీరుకే పగ్గాలుఅప్పగించారన్నారు. సాక్షి, చెన్నై : జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. జయలలితకు సన్నిహితంగా ఉన్న ఏ ఒక్కరినీ వదలి పెట్టకుండా విచారణ సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఈ విచారణకు జయలలిత నెచ్చలి శశికళ సోదరుడు దివాకరన్ హాజరయ్యారు. న్యాయమూర్తి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తన వద్ద ఉన్న వివరాలను కమిషన్ ముందు ఉంచారు. అప్పటికే అమ్మ లేరని సమాచారం విచారణ అనంతరం మీడియాతో దివాకరన్ మాట్లాడారు. విచారణ కమిషన్ ముందు తాను ఉంచిన వివరాలనుపేర్కొన్నారు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తర్వాత తాను రెండుసార్లు మాత్రమే అపోలోకు వెళ్లానన్నారు. ఓ సారి తాను రాత్రి 11 గంటల సమయంలో వెళ్లానని, అప్పటికే అమ్మ నిద్ర పోవడంతో చూడలేదని వ్యాఖ్యానించారు. మరో మారు డిసెంబరు నాలుగో తేదీ తనకు అందిన సమాచారంతో విమానంలో చెన్నైకి చేరుకున్నానన్నారు. ఆరోజునే అమ్మ మరణించినట్టుగా సమాచారం తనకు వచ్చిందన్నారు. అయితే, ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎక్మో చికిత్స అంటూ పరికారాల్ని అమర్చి ఉన్నారన్నారు. ఆ రోజున తాను పది గంటలకు అపోలకు వచ్చానన్నారు. దాదాపు అమ్మ ఇక లేరన్నది ఆ రోజునే స్పష్టమైనట్టు, అనేక టీవీ చానళ్లు సైతం ఫ్లాస్ న్యూస్లు వేసి, ఆ తదుపరి వెనక్కు తీసుకున్నాయన్నారు. సీఎం పదవికోసం గట్టి పోటీ అమ్మ మరణంతో సీఎం పదవి కోసం మంత్రుల మధ్య గట్టి పోటీనే సాగిందన్నారు. తమ కంటే తమకు ఆ పదవి కావాలని పట్టుబట్టిన వాళ్లూ ఉన్నారని, చివరకు పన్నీరు సెల్వంను ఆ కుర్చీలో కూర్చోబెట్టారన్నారు. వాళ్లు ఎవరో అన్న విషయాన్ని పన్నీరునే అడగాలని, చికిత్సకు సంబం«ధించి, ఇతర వివరాలను ఆయన్నే అడగండి అంటూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. -
చిన్నమ్మ ఫైర్
సాక్షి, చెన్నై: సోదరుడు దివాకరన్ చర్యలపై చిన్నమ్మ శశికళ తీవ్ర ఆగ్రహానికి లోనైనట్టు తెలిసింది. ఆమెతో ములాఖత్ అయిన న్యాయవాదులు, ముఖ్యుల వద్ద ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అందరూ దినకరన్కు అండగా ఉండాలని ఆమె సూచించినట్టు, త్వరలో కేడర్కు ఓ లేఖాస్త్రం సంధించపోతున్నట్టుగా సమాచారం. చిన్నమ్మ శశికళ కుటుంబ విభేదాలు రచ్చకెక్కి ఉన్నవిషయం తెలిసిందే. ఆమె సోదరుడు దివాకరన్, అక్క వనితామణి కుమారుడు దినకరన్ల మధ్య సాగుతున్న ఈ సమరంలో కుటుంబ పరువు గంగలో కలిసే రీతిలో ఉన్నట్టుగా చిన్నమ్మ పరిగణించారు. అలాగే, రాజకీయంగా మున్ముందు పెనుముప్పు తప్పదన్న విషయాన్ని గ్రహించి ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో దివాకరన్ను పక్కన పెట్టి, దినకరన్కు అండగా నిలబడేందుకు చిన్నమ్మ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. గతంలో ఎన్ని అడ్డంకులు అవాంతరాలు వచ్చినా, దినకరన్కు మద్దతుగానే శశికళ వ్యవహరించారని చెప్పవచ్చు. అన్నాడీఎంకేలో అనేక సమస్యలు ఉన్నా, తాను జైలుకు వెళ్తూ దినకరన్ భుజం మీద బాధ్యతల్ని ఉంచి వెళ్లారని చెప్పవచ్చు. ఈ దృష్ట్యా, కుటుంబం పరువు మరింత రచ్చకెక్కకుండా ఉండే రీతిలో, దివాకరన్కు చెక్ పెట్టేందుకు తగ్గట్టుగా చిన్నమ్మ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఆమెతో ములాఖత్ అయిన ముఖ్యులు, న్యాయవాదుల వద్ద దివాకరన్ చర్యల్ని తీవ్రంగా ఖండించినట్టు చర్చ ఊపందుకుంది. అమ్మ శిబిరం పేరిట దివాకరన్ ముందుకు సాగుతుండడంతో, ఆయన వెంట కేడర్ గానీ, మద్దతు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలుగానీ వెళ్లకుండా జాగ్రత్లకు సిద్ధం అవుతున్నారు. అందరూ దినకరన్కు అండగానే ఉండాలని సూచించడంతోపాటు, త్వరలో కేడర్ను ఉద్దేశించి జైలు నుంచి శశికళ ఓ లేఖ విడుదలచేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. దివాకరన్ రూపంలో ఎలాంటి నష్టం వాటిళ్లకుండా ఉండే విధంగా, దినకరన్కు మద్దతుగా ఆమె స్పందించేందుకు సిద్ధం అవుతున్న సమాచారంతో మద్దతుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు చెప్పవచ్చు. అందుకే కాబోలు దివాకరన్కు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు అమ్మ శిబిరం ఆవిర్భావ కార్యక్రమానికి దూరంగా ఉండడం గమనించి దగ్గ విషయం. తంగతమిళ్ సెల్వన్ దివాకరన్కు అత్యంత సన్నిహితుడైనా, చిన్నమ్మ గతంలో అప్పగించిన బాధ్యత మేరకు తాను మాత్రం దినకరన్ వెన్నంటే ఉంటానని ప్రకటిం చడం విశేషం.తనతో పాటు అనర్హత వేటు పడ్డ వాళ్లు, ముఖ్యులు, కేడర్ దినకరన్కు అండగా ఉంటారని వ్యాఖ్యానించే పనిలో తంగతమిళ్ సెల్వన్ ఉన్నారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం దర్శకత్వంలోనే దివాకరన్ అడుగుల వేగా న్ని పెంచనున్నట్టు ఆరోపణల నేపథ్యంలో, ఆ వేగానికి కళ్లె్లం వేయడం లక్ష్యంగా చిన్న మ్మ స్పందన కోసం కేడర్ ఎ దురుచూపుల్లో ఉంది. దివాకరన్ తీరుపై దినకరన్ తీవ్రంగానే విరుచుకుపడే పనిలో పడ్డా రు.ఆయన మానసిక రోగి అని నిన్నటి రో జున వ్యాఖ్యానించారు.తాజాగా దివాకర న్కు పిచ్చి పట్టినట్టుందని మండిపడ్డారు. -
రచ్చ కెక్కిన ఫ్యామిలీ
సాక్షి, చెన్నై: మేనమామ దివాకరన్ను ఢీకొట్టే రీతిలో పరోక్షంగా మంగళవారం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ వ్యాఖ్యలు సంధించారు. కేడర్కు లేఖాస్త్రం సందిస్తూ, దివాకరన్ కుట్రల్ని భగ్నం చేద్దామన్నట్టుగా పిలుపు నివ్వడం గమనార్హం. దినకరన్ పరోక్షంగా స్పందిస్తే, దివాకరన్ బహిరంగంగానే ఎదురుదాడికి దిగడంతో చిన్నమ్మ కుటుంబ విబేధాలు రచ్చకెక్కాయి. చిన్నమ్మ శశికళ ఫ్యామిలీ వార్ మరింతగా ముదురుతోంది. ఆమె సోదరుడు దివాకరన్, అక్క కుమారుడు దినకరన్ల మ«ధ్య ఈ సమరం మరింతగా రాజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన మద్దతుదారుడు వెట్రివేల్ ద్వారా దివాకరన్కు చెంపపెట్టు తగిలే రీతిలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన దినకరన్, తాజాగా తానే రంగంలోకి దిగి కేడర్కు లేఖాస్త్రం సంధించడమే కాదు, పరోక్షంగా మేనమామకు చురకలు అంటించే పనిలో పడడం గమనార్హం. ఐక్యతతో తిప్పి కొడదాం :అమ్మ జయలలిత మరణం తదుపరి పార్టీని రక్షించుకునేందుకు చిన్నమ్మ శశికళ రంగంలోకి దిగాల్సి రావడానికి గల పరిస్థితులను ఆ లేఖాస్త్రంలో గుర్తు చేశారు. చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో అధికారంలో ఉన్న ద్రోహులు పార్టీని ౖకైవసం తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారని వివరించారు. ద్రోహుల వైపుగా వెళ్లకుండా అమ్మ ఆశయ సాధన నినాదంతో చిన్నమ్మకు మద్దతుగా లక్షలాదిగా కేడర్ తన వెంట కదిలిందని గుర్తు చేశారు. ప్రజా మద్దతు ఈ కళగంకు హోరెత్తుతుండడంతో నిర్వీర్యం చేయడానికి కొన్ని శక్తులు బయలు దేరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మధ్యమాల ద్వారా కళగంలో గందరగోళ పరిస్థితులు సృష్టించే కుట్రలు సాగుతున్నాయని పరోక్షంగా మేనమామ దివాకరన్ను ఉద్దేశించి వ్యాఖ్యల తూటాల్ని పేల్చారు. ద్రోహులతో కలిసి ఈ గందరగోళ ప్రయత్నాలకు దిగారని, ఈ కుట్రల్ని భగ్నం చేద్దామని కేడర్కు పిలుపునిచ్చారు. దొడ్డి దారిలో కొత్త కుట్రలకు సాగుతున్న ప్రయత్నాల్ని ఐక్యతతో తిప్పి కొడదామని కేడర్కు పిలుపునిచ్చారు. చిన్నమ్మే మార్గదర్శి అని పరోక్షంగా దివాకరన్ను ఎలాంటి సంబంధాలు లేదన్న వ్యాఖ్యల్ని ఆ లేఖలో దినకరన్ స్పందించడం గమనార్హం. తగ్గని మేనమామ.. దినకరన్ వ్యాఖ్యల తూటాలకు మేనమామ దివాకరన్ ఏమాత్రం తగ్గలేదు. ఢీకి సై అన్నట్టు ఎదురుదాడికి దిగారు. మన్నార్కుడిలో మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ దినకరన్పై విరుచుకుపడడంతో చిన్నమ్మ ఫ్యామిలీ వార్ రచ్చకెక్కింది. అన్నా, ద్రవిడం అన్న పదాలు లేని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. దినకరన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఇక దినకరన్తో కలిసి పయనం సాగించే ప్రసక్తే లేదని తేల్చారు. దినకరన్ వెన్నంటి ఉన్న కొం దరు ఎమ్మెల్యేలు మధ్యలో వచ్చిన వారేనని వారికి అంతా తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. జయలలితతో కలిసి అన్నాడీఎంకేకు దశాబ్దాల తరబడి తాను సేవల్ని అందించానని, ఆ సేవలు ఇక, మరింత విస్తృతం అవుతా యని వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఫ్యామిలీ ‘వార్’
చిన్నమ్మ శశికళ కుటుంబంలోఅంతర్యుద్ధం తెర మీదకు వచ్చింది.మేనమామ దివాకరన్ను ఢీకొనేందుకు మేనల్లుడు దినకరన్ సిద్ధం అయ్యారు.ఈ ఇద్దరి మధ్య చాపకింద నీరులా సాగుతూ వచ్చిన ఇంటిపోరు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే వెట్రివేల్ ట్వీట్ రూపంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ కుటుంబం నుంచి వార్తల్లో వ్యక్తులుగా శశికళ సోదరుడు దివాకరన్, అన్న జయరామన్ పిల్లలు వివేక్, కృష్ణప్రియ, అక్క వనితామణి కుమారుడు దినకరన్ ఉంటున్నారు. చిన్నమ్మ జైలు జీవితం తదుపరి కుటుంబానికి పెద్ద దిక్కుగా దివాకరన్, రాజకీయ ప్రతినిధిగా దినకరన్ అడుగులు వేస్తున్నారు. ఆస్తుల పంపకాల వ్యవహారం కుటుంబంలో అంతర్యుద్ధానికి దారితీసినట్టు కొంత కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శిగా, చిన్నమ్మ ప్రతినిధిగా దినకరన్ రాజకీయ బలోపేతం కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. అదే సమయంలో కుటుంబం వ్యక్తుల నిర్వహణలో ఉన్న సంస్థల్లో దినకరన్ జోక్యం వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నట్టు సమాచారం. దీంతో ఎవరికి వారు అన్నట్టు ముందుకు సాగుతుండడం జైల్లో ఉన్న చిన్నమ్మను కుంగదీస్తున్నట్టు తెలిసింది. భర్తమరణంతో పెరోల్ మీద వచ్చిన సమయంలో ఈ విభేదాలు చిన్నమ్మను ఉక్కిరిబిక్కిరి చేయడంతోనే ముందస్తుగానే ఆమె జైలుకు వెళ్లినట్టుగా మద్దతుదారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరెన్ని వివాదాలు సృష్టించినా, ఒత్తిడి తెచ్చినా చిన్నమ్మ మాత్రం దినకరన్కు అండగా నిలబడ్డట్టు చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఫేస్బుక్లో చిన్నమ్మ విశ్వాసపాత్రుడు, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే వెట్రివేల్ పోస్టుచేసిన ఓ ట్వీట్ ఫ్యామిలీ వార్ను తెర మీదకు తీసుకొచ్చింది. వెట్రివేల్ ట్వీట్ దివాకరన్ ఎవరికో వత్తాసు పలికే రీతిలో స్పందించడం మొదలెట్టినట్టుందని వెట్రివేల్ ట్విట్టర్లో విమర్శించారు. స్వలాభం కోసం పాకులాడవద్దని పరోక్షంగా దివాకరన్కు హెచ్చరించారు. తమలో గందరగోళ పరిస్థితుల్ని సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని చురకలంటించారు. సీఎం ఎడపాడి పళనిస్వామి మద్దతుదారుడు ఛత్రపతి శివగిరి ద్వారా అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా స్పందించడం మొదలెట్టినట్టుందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా చిన్నమ్మ బలాన్ని, దినకరన్ ఎదుగుదలను అడ్డుకోలేరని హెచ్చరించారు. దినకరన్ బలాన్ని నీరుగార్చేందుకు కొత్త ప్రయత్నాల్లో పడ్డట్టు స్పష్టం అవుతోందన్నారు. రాజకీయ తెరపైకి జయ ఆనందన్ దినకరన్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్న దివాకరన్ చిన్నమ్మ ప్రతినిధిగా తన కుమారుడు జయ ఆనందన్ను రాజకీయ తెరపైకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. దినకరన్ను దెబ్బతీయడానికి ఆయన అధికార పక్షంతో చాపకింద నీరులా ఒప్పందాలు చేసుకున్నట్టు చర్చ సాగుతోంది. అలాగే, దినకరన్ వెన్నంటి నడిచేందుకు సిద్ధంగా ఉన్న మరో ఐదుగురు ఎమ్మెల్యేల గురించి వివరాలను దివాకరన్ శిబిరం సీఎంకు లీక్ చేసినట్టు ప్రచారం ఊపందుకుంది. ఈ సమయంలో రెండు రోజుల క్రితం ఆయన సీఎం పళనిస్వామికి అనుకూలంగా ఉన్న వారితో సంప్రదింపులు సాగించినట్టు సమాచారం. చిన్నమ్మను త్వరితగతిన జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తానని, అనర్హత వేటు పడ్డ వారితో పాటు 21 మంది ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నట్టు వ్యాఖ్యానించినట్టు ప్రచారం ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబంలో సాగుతున్న వివాదాలను తేటతెల్లంచేస్తూ, దివాకరన్కు చురకలు అంటించే విధంగా వెట్రివేల్ ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది. మేనమామను ఢీకొట్టేందుకు దినకరన్ రెడీ అన్నట్టుగా స్పందించడమే కాదు.. తామెప్పుడు చిన్నమ్మ మద్దతుదారులే గానీ, దివాకరన్కు కాదు అని స్పష్టం చేయడం గమనార్హం. మేమంతా వారివెంటే.. అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు అందరూ ఒకే నినాదంతో చిన్నమ్మే ప్రధాన కార్యదర్శిగా, దినకరన్ ఉప ప్రధాన కార్యదర్శిగా ముందుకు సాగుతామని వెట్రివేల్ స్పష్టంచేశారు. తమ పయనం శశికళ, దినకరన్ల వెంటే అని, మరెవరి వెనుక నడవాల్సిన అవసరం తమకు లేదని దివాకరన్ను ఉద్దేశించి తీవ్రంగా స్పందించడం గమనార్హం. రాజకీయంగా దినకరన్ బలపడుతుండడంతోనే, తన కుమారుడి భవిష్యత్తు దృష్ట్యా, దివాకరన్ కొత్త ప్రయత్నాలకు సిద్ధపడ్డ విషయం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాల దృష్టికి చేరినట్టు తెలిసింది. తాజా పరిస్థితులతో ఢీకి రెడీ అన్నట్టుగా వ్యూహంతో వెట్రివేల్ ద్వారా మేనమామకు దినకరన్ చెంపపెట్టు సమాధానం ఇచ్చినట్టు చర్చ ఊపందుకుంది. -
శశికళ వద్ద ఏమైనా దొరికాయా..
పరప్పన అగ్రహారచెరలోని చిన్నమ్మ శశికళ గదిలో కేంద్ర నేరపరిశోధనా సంస్థ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సమాచారం అమ్మ మక్కల్ మున్నేట్ర వర్గాల్లో ఉత్కంఠను రేపింది. సాక్షి, చెన్నై: అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళ, బంధువులు ఇలవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. వీరికి జైల్లో లగ్జరీ సౌకర్యాలు అందుతున్నట్టు ఇటీవల ఆరోపణలు బయలుదేరాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో వీడియో టేపులు బయటపడడంతో చర్చ బయలు దేరింది. కర్ణాటక జైళ్ల శాఖకు చిన్నమ్మ కుటుంబంద్వారా బాగానే ముట్టడంతోనే ఈ లగ్జరీ జీవితం అన్నట్టుగా బయలు దేరిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సైతం ఆదేశించింది. ఆ తదుపరి చిన్నమ్మ అండ్ ఫ్యామిలీకి జైల్లో సౌకర్యాలు తగ్గాయని చెప్పవచ్చు. అయినా, చాపకింద నీరులా వారికి కావాల్సినవన్నీ జైళ్ల శాఖ వర్గాల ద్వారా చేరుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఆమెతో ములాఖత్ అయ్యే వారు ఇటీవల కాలంగా పెరగడం, వారి ద్వారా ఆమెకు కావాల్సిన వన్నీ జైల్లో సమకూరుతున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి చిన్నమ్మ గదిలో తనిఖీలు సాగడం చర్చనీయాశంగా మారింది శశికళ గదిలో తనిఖీలు: పరప్పన అగ్రహార చెరలో చిన్నమ్మకు ప్రత్యేక గది కేటాయించారు. బుధవారం రాత్రి కేంద్ర నేరపరిశోధన సంస్థ విభాగం అధికారులు, కర్ణాటక పోలీసుల సమన్వయంతో రెండు వందల మందితో కూడిన ప్రత్యేక బృందం తనిఖీలకు రంగంలోకి దిగింది. ఆ జైల్లోని అన్ని గదుల్ని ఆ బృంద తనిఖీలు చేసింది. అలాగే, చిన్నమ్మ శశికళ గదిలోనూ తనిఖీలు సాగాయి. ఆమెకు ఏదేని ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయా, అన్న కోణంలో పరిశీలన సాగడంతో పాటు ఆ జైలు నుంచి ఏకంగా 11 సెల్ఫోన్లు, సిమ్ కార్డులు బయట పడడం గమనార్హం. శశికళకు వద్ద ఏమైనా దొరికాయా అన్న ఉత్కంఠ అన్నాడీఎంకే అమ్మ వర్గాల్లో బయలుదేరింది. భర్త నటరాజన్ మరణం తదుపరి పెరోల్ను ముందుగా రద్దు చేసుకుని శశికళ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆమె గదిలో తనిఖీలు జరిగి ఉండడంతో ఆ శిబిరం వర్గాల్లో ఉత్కంఠ తప్పలేదు. ఆమె గదిలో ఏమైనా లభించాయా అన్న వివరాలు మాత్రం బయటకు రాలేదని చెప్పవచ్చు. -
‘అమ్మ’ను చూడనే లేదు
ఆస్పత్రిలో ఉన్నప్పుడు అమ్మ జయలలితను తాను చూడనే లేదుఅని డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. కాగా, విచారణలో మంత్రుల పేర్లు బయటకు రావడం, దాన్ని ఖండించే రీతిలోమంత్రులు తమలో భయాన్ని వ్యక్తం చేయడం అనుమానాలకుదారితీస్తున్నట్టు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్వ్యాఖ్యానించారు. విచారణ కమిషన్ ఎదుట మంగళవారంజయలలిత ప్రత్యేక కార్యదర్శి రామలింగం హాజరయ్యారు. సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అమ్మ జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. జయలలితతో సన్నిహితంగా ఉన్న అధికారులు, ఆమె కార్యదర్శులు, భద్రతా అధికారులు, డ్రైవర్లు, వంట వాళ్లు, ఇలా ఏ ఒక్కరినీ వదలి పెట్టకుండా ఆ కమిషన్ విచారణ సాగిస్తోంది. అలాగే, జయలలిత నెచ్చెలి శశికళ తన వాంగ్మూలాన్ని లిఖిత పూర్వకంగా సమర్పించారు. ఆమె బంధువులు వివేక్, కృష్ణప్రియ పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణల్లో జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమెను చూసిందెవరు..? అన్న విషయంగా తీవ్రంగానే చర్చ సాగుతోంది. మంత్రులు చూసినట్టుగా కొందరుతమ వాంగ్మూలం ద్వారా స్పందించారు. అయితే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ప్రభుత్వ, అధికారిక వ్యవహారాల్ని ఆర్థిక మంత్రిగా పన్నీరు సెల్వం తన భుజాన వేసుకున్న విషయం తెలిసిందే. ఆయన సైతం జయలలిత మరణం విషయంగా అనుమానాల్ని లేవదీశారు. ఈ పరిస్థితుల్లో జయలితను తాను చూడలేదన్న విషయానికి కట్టుబడి పన్నీరు సెల్వం వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మళ్లీ మళ్లీ అదే చెబుతున్నా మంగళవారం మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, జయలలితను తాను చూడనే లేదని స్పష్టంచేశారు. గతంలోనూ ఇదే చెప్పానని, మళ్లీ మళ్లీ ఇదే చెబుతున్నానన్నారు. ఆమె ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఏ ఒక్క రోజూ తనకు చూడడానికి అవకాశాన్ని ఇవ్వలేదని, అలాంటప్పుడు తాను ఎలా చూస్తానని వ్యాఖ్యానించారు. కాగా, జయలలిత మరణం కేసు విచారిస్తున్న విచారణ కమిషన్ ముందు ఉంచుతున్న వాంగ్మూలాలు మంత్రుల్లో గుబులు రేకెత్తిస్తున్నట్టుందని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ విమర్శించారు. మంత్రులు జయలలితను చూసినట్టు కమిషన్ ముందుకు వాదనలు చేరుతుండడంతో వారిలో ఆందోళన బయలుదేరి ఇష్టానుసారంగా స్పందిస్తున్నట్టుందని మండిపడ్డారు. విచారణకు రామలింగం జయలలిత మరణం కేసు విచారణకు హాజరవుతున్న వారిని శశికళ తరఫు న్యాయవాది రాజ చెందూర్ పాండియన్ క్రాస్ ఎగ్జామిన్ చేసే పనిలో పడ్డారు. జయలలిత ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రామలింగం సైతం మంగళవారం విచారణకు హాజరయ్యారు. జయలలితను కలవాలంటే రామలింగం అనుమతి గతంలో తప్పనిసరి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దృష్ట్యా, ఆయన్ను సైతం విచారణ వలయంలోకి తీసుకొచ్చారు. తనవద్ద ఉన్న సమాచారాలను కమిషన్ ముందు ఆయన ఉంచారు. ఈసందర్భంగా జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆమెను ఎవరెవరు పరామర్శించారు...? చూశారు..? అన్న వివరాల్ని రాబట్టే విధంగా ఆ కమిషన్ రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి ప్రశ్నల్ని సంధించినట్టు సమాచారం. -
బీజేపీతో దోస్తీ యత్నం
సాక్షి, చెన్నై : బీజేపీకి దగ్గరయ్యేందుకు అమ్మ మక్కల్మున్నేట్ర కళగంనేత దినకరన్ మళ్లీ ప్రయత్నాల్లో పడ్డారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత ఒకరి సాయం ద్వారా ఢిల్లీ పెద్దల మన్ననల్ని అందుకునేందుకు మంతనాల్లో ఉన్నట్టు సమాచారం. అయితే, ఢిల్లీ పెద్దలు స్పందించే పరిస్థితుల్లో లేనట్టు›తెలిసింది.అన్నాడీఎంకేని చీల్చి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో చిన్నమ్మ శశికళ ప్రతినిధి దినకరన్ రాజకీయంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఓ మారు బీజేపీకి దగ్గరయ్యేందుకు దినకరన్ ప్రయత్నాలు చేశారు. ఢిల్లీలో తిష్ట వేసి మరీ ఆయన మంతనాలు సాగించి నా ప్రయోజనం శూన్యం. దీంతో ఆ ప్రయత్నాల్ని పక్కన పెట్టి రాజకీయంగా ఎదిగేందుకు కుస్తీలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో విదేశీ మారక ద్రవ్యం కేసులు, ఐటీ దాడులు దినకరన్ అండ్ బృం దాన్ని సంకట పరిస్థితుల్లోకి నెడుతున్న విషయం తెలిసిందే. చిన్నమ్మ ఫ్యామిలీ ని గురి పెట్టి సాగిన, సాగుతున్న వ్యవహారాలు కొత్త చిక్కుల్ని సృష్టిస్తుండడంతో మళ్లీ దోస్తి ప్రయత్నాల్లో పడ్డారు. కేసులు తమను చుట్టుముట్టకుండా, ఉక్కిరి బిక్కిరి చేయకుండా ఉండే రీతి లో బీజేపీ ప్రసన్నం పొందేందుకు దినకరన్ తీవ్రంగానే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసింది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నల్ల జెండాల ప్రదర్శనకు ప్రతి పక్షాలు పిలుపునిచ్చినా ఆయన స్పందించ లేదన్నది జగమెరిగిన సత్యం. కావేరికి వ్యతిరేకంగా తాను సాగిస్తున్న పోరాటాల్లో రాష్ట్రంలోని పళని సర్కారు మీదే తీవ్ర విమర్శలు ఆరోపణలు గుప్పిస్తున్న దినకరన్, ఎక్కడ కేంద్రాన్ని గానీ, బీజేపీని గానీ పల్లెత్తి మాట అనకపోవడం గమనార్హం. తాజా గా, ఢిల్లీలో పలుకుబడి కల్గిన రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత ద్వారా రాయబారాలు సాగించి, దోస్తీ లేదా, శరణు కోరేందుకు తగ్గట్టుగా ముందుకు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ నేత ఢిల్లీ వెళ్లి మరీ తమ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా, స్పందన కరువైనట్టు సమాచారం. దీంతో దినకరన్ ఢీలాపడ్డా, తన ప్రయత్నాన్ని మాత్రం విరమించబోయే ది లేదన్నట్టు ముందుకు సాగుతున్నట్టు ఆయన మద్దతుదారులే పేర్కొంటుండ డం గమనార్హం. ఇందుకు కారణం కేసు ల విచారణలు ముగింపు దశకు వస్తుండడంతో ఎక్కడ కట కటాల పాలు కావా ల్సి ఉంటుందోనన్న బెంగ చిన్నమ్మ ఫ్యామిలీ సభ్యులు పలువుర్ని వెంటాడుతుండడమేనట. -
మళ్లీ ఐటీ కేసు!
అన్నాడీఎంకే అమ్మ దివంగత జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ మీదున్న కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1991–96 కాలంలో మూటగట్టుకున్న అవినీతి చిట్టా ఆ తదుపరి ఒక్కొక్కటిగా బయట పడుతూ వచ్చింది. చివరకు అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార చెరలో ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం చెన్నై ఎగ్మూర్ కోర్టులో విదేశీ మారక ద్రవ్యం కేసువిచారణ శరవేగంగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎప్పుడో తుంగలో తొక్కిన కేసు ఫైల్కు మళ్లీ అధికారులు బూజు దులిపి విచారణకు తీసుకు రావడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చిన్నమ్మ ప్రతినిధిదినకరన్ను ఓ వైపు పాత కేసుల రూపంలో ఇరకాటంలో పెట్టే విధంగా పాలకులు పావులు కదుపుతూ వస్తున్నారు. తాజాగా అదే దృష్టి చిన్నమ్మ మీదున్న పాత కేసుల్ని తవ్వే పనిలో పడ్డట్టుగా చర్చ ఊపందుకుంది. ఇందుకు అద్దం పట్టే విధంగా పదేళ్లక్రితం తుంగలో తొక్కిన ఐటీ కేసు మళ్లీ తెర మీదకు రావడంగమనించ దగ్గ విషయం. సాక్షి, చెన్నై : చిన్నమ్మ మెడకు ఐటీ కేసు బిగిసేనా అన్న చర్చ బయలు దేరింది. తుంగలో తొక్కిన ఈకేసు ఫైల్కు డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ వర్గాలు దుమ్ముదుళిపే పనిలో పడ్డాయి. శశికళ మీద గతంలో దాఖలైన ఐటీ కేసును పదేళ్ల అనంతరం మళ్లీ బయటకు తీశారు. విచారణ వేగం పెంచే పనిలో కోర్టు నిమగ్నం అయింది. 1991–96కాలంలో జయలలిత సీఎంగా ఉన్న సమయంలో చిన్నమ్మ శశికళ ఆగడాలకు హద్దే లేదని చెప్పవచ్చు. ఇందులో భాగంగా 1994–95లో ఐటీ రిటర్న్ దాఖలులోనూ తన పనితనాన్ని ఆమె ప్రయోగించారు. అధికారం దూరం అయ్యాక 1997లో డీఎంకే సర్కారు ఈ గుట్టును రట్టుచేస్తూ వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో ఉన్న కేసులకు తోడు మరో కేసుగా ఐటీ ఉచ్చు చిన్నమ్మ మెడకు బిగించింది. శిక్ష సైతం పడిందనుకున్నప్పుడు అప్పీలు వెళ్లి తప్పించుకోగలిగారు. ఐటీ అధికారుల లెక్కల్లో తేడాలు ఉన్నట్టు, ఆస్తుల పునః లెక్కింపు జరగాల్సిందేనన్న శశికళ విజ్ఞప్తికి కోర్టు స్పందించింది. శిక్ష నుంచి గట్టెక్కినా, లెక్కింపు ప్రక్రియను అధికారులు పూర్తిచేసి మళ్లీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సమయంలో అన్నాడీఎంకే సర్కారు మళ్లీ అధికారంలోకి రావడంతో కేసు కాస్త తుంగలో తొక్కినట్టుగా పరిస్థితి మారింది. ఆ తదుపరి డీఎంకే సర్కారు అధికారంలోకి రాగానే ఐటీ కేసు మళ్లీ తెర మీదకు వచ్చింది. చివరకు వాయిదా పడ్డ ఈ కేసును పదేళ్ల అనంతరం మళ్లీ దుమ్ము దులుపుతూ అధికారులు చర్యలు తీసుకోవడం గమనార్హం. మద్రాసు హైకోర్టులో గురువారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. న్యాయమూర్తులు పీఎస్ శివజ్ఞానం, శేషసాయి నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు రాగా, ఐటీ తరఫు న్యాయవాదులు శశికళ పరప్పన అగ్రహార చెరలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. అలాగే, శశికళ తరఫున న్యాయవాది జోక్యం చేసుకుని కేసు పూర్వాపరాలను పరిశీలించాల్సి ఉందని, అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలించేందుకు సమయం కేటాయించాలని కోరారు. ఇందుకు ఐటీ తరఫున సైతం అంగీకారం లభించడంతో న్యాయమూర్తులు స్పందించారు. తదుపరి విచారణ జూన్ ఆరో తేదీకి వాయిదా వేశారు. విచారణ వేగం పెంచి, కేసును త్వరితగతిన ముగించే రీతిలో కోర్టు చర్యలు చేపట్టి ఉండడంతో, చిన్నమ్మ మెడకు ఐటీ ఉచ్చు బిగిసేనా అన్న ప్రశ్న బయలుదేరింది. -
గర్భిణి అని కూడా చూడకుండా..
కంప్లి:అనుమానం అతన్ని దెయ్యంలా ఆవహించింది. పెళ్లి చేసుకున్నప్పుడు చేసిన బాసలను కాలదన్నాడు. గర్భిణి అని కూడా చూడకుండా భార్యను బండరాతితో దారుణంగా హతమార్చాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈఘటన రాంసాగర గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు రాంసాగర గ్రామానికి చెందిన రమేష్(23)కు మరిబిహాల్ గ్రామానికి చెందిన శశికళతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే రమేష్ ఇటీవల ర మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో కాపురం చేస్తున్నాడు. కొంతకాలంగా శశికళపై అనుమానం పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి. అయినప్పటికీ కనికరం లేకుండా ఆమెను అంతమొందించాలని పథకం రచించాడు. శనివారం రాత్రి రాంసాగ సమీపంలోని సొరంగం వద్దకు తీసుకెళ్లి అక్కడ ఆమెను బండరాతితో మోదాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని కాలువలో పడేసి అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. బిత్తరపోయిన పోలీసులు అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం నిందితుడే పోలీసులను వెంట పెట్టుకొని వెళ్లి ఘటనా స్థలాన్ని చూపించాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి నిందితుడు రమేష్ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. -
శశికళకు డెంగీ జ్వరం
సాక్షి,చెన్నై : అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. పెరోల్పై బయటకు వచ్చిన ఆమె డెంగీతోనే పరప్పన అగ్రహార జైలుకు తిరిగి వెళ్లినట్లు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత, ఆమె సోదరి వనితామణి కుమారుడు దినకరన్ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భర్త నటరాజన్ మృతితో శశికళ కుంగిపోయా రని తెలిపారు. అందుకే ఆమెకు పెరోల్పై బయటకు వచ్చిన సమయంలో వైద్య పరీక్షలు చేయించామన్నారు. వైద్యపరీక్షల్లో ఆమెకు డెంగీ జ్వరం ఉన్నట్లు తేలిందన్నారు. ఆమెకు పరీక్షలు నిర్వహించి వైద్యులు ఇచ్చిన సర్టిఫి కెట్ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు వర్గాలకు సమర్పించామన్నారు. ఆమెకు వైద్య పరీక్షలతోపాటు మందులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
వెళ్లొస్తా..
సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ శనివారం అందరి దగ్గర సెలవు తీసుకుని జైలు జీవితాన్ని గడిపేందుకు ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. తంజావూరు నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార చెరకు సాయంత్రం చేరుకున్నారు. భర్త నటరాజన్ మరణంతో చిన్నమ్మ శశికళ ఈనెల 20న పెరోల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అంత్యక్రియల తదుపరి ఆమె తంజావూరులోని పరిశుద్ధ నగర్లో ఉన్న నటరాజన్ స్వగృహం అరుణానంద ఇల్లంలోనే ఉన్నారు. ఇంటి నుంచి ఆమె అడుగు బయటకు తీసి పెట్టలేదు. రాజకీయ పార్టీ వర్గాలు, ఆప్తులు, బంధువులు నిత్యం తరలివచ్చి ఆమెకు సానుభూతి తెలియజేసి వెళ్లారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలు, అనర్హత వేటు పడ్డ పలువురు ఎమ్మెల్యేలతో పదే పదే చిన్నమ్మతో భేటీ అయ్యారు. కుటుంబ విభేదాలతో శిరోభారం కుటుంబ విభేదాలు చిన్నమ్మకు శిరోభారంగా మారాయని సంకేతాలు ఉన్నాయి. నటరాజన్ ఆస్తుల వ్యవహారంతో పాటు, కుటుంబంలో సాగుతున్న విభేదాల పంచాయతీ చిన్నమ్మను ఉక్కిరిబిక్కిరి చేసినట్టుగా ఆ కళగం వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా ఆస్తుల విషయంగా అక్క కుమారుడు దినకరన్, తన సోదరుడు దివాకరన్ మధ్య సాగుతున్న వివాదం పరిష్కరించడం ఆమెకు కష్టతరంగా మారినట్టు తెలిసింది. అలాగే, మేనల్లుడు వివేక్ రూపంలో దినకరన్కు ఎదురవుతున్న సమస్యలు మరో త లనొప్పిగా మారడంతోనే ముందస్తుగానే జైలు కు వెళ్లడానికి ఆమె నిర్ణయించారని తెలుస్తోంది. ఇక, జైలు జీవితం పదిహేను రోజుల పెరోల్ లభించినా, ఇక్కడ అన్ని కార్యక్రమాల్ని 12 రోజుల్లో ముగించుకుని జైలు జీవితాన్ని అనుభవించేందుకు చిన్నమ్మ సిద్ధం అయ్యారు. మూడురోజుల ముందుగానే శనివారం ఉదయాన్నే పయన ఏర్పాట్లు చేసుకున్నారు. శుక్రవారం జరిగిన కర్మక్రియల అనంతరం రాత్రంతా ఆమె ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్టు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఉదయాన్నే బెంగళూరుకు పయనం అయ్యారు. అక్కడున్న బంధువులు, ఆప్తులు, సన్నిహితులు, పార్టీ వర్గాల నుంచి సెలవు తీసుకుని కాస్త ఉద్వేగానికి లోనైనట్టుగా కారులో ఎక్కి కూర్చున్నారు. అందర్నీ నమస్కారంతో పలకరిస్తూ ముందుకు సాగారు. ఆమె వాహనం వెన్నంటి అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు సెంథిల్ బాలాజీ, పళనియప్పన్, తంగ తమిళ్ సెల్వన్ తదితరులు బయలుదేరి వెళ్లారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో తంజావూరులో బయలుదేరిన శశికళ వాహనం సాయంత్రం ఐదున్నర గంటలకు పరప్పన అగ్రహార జైలుకు చేరుకుంది. తంజావూరు నుంచి వెళ్లిన వాహనాలను, తన వెన్నంటి వచ్చిన వారందరినీ రాష్ట్ర సరిహద్దుల నుంచి వెనక్కు వెళ్లిపోవాలని శశికళ ఆదేశించడం గమనార్హం. అన్నింటినీ అధిగమిస్తారు శశికళ బయలుదేరి వెళ్లడంతో ఆమె సోదరుడు దివాకరన్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తన సోదరికి కష్ట కాలం అని, అన్నింటినీ అధిగమించి ఆమె తప్పకుండా బయటకు వస్తారన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు. కాగా, నటరాజన్తో ఉన్న స్నేహం మేరకు డీఎంకే ఎమ్మెల్యేలు కేఎన్ నెహ్రు, రామచంద్రన్ శశికళను ఉదయం పరామర్శించి వెళ్లారన్నారు. శశికళను అనేకమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫోన్ ద్వారా సంప్రదించారని, తమ సానుభూతి తెలియజేశారన్నారు. తాము స్వయంగా వస్తే, ఎక్కడ పదవులు పోతాయోనని వారికి భయం ఉండడం వల్ల అందుకే వారంతా ఫోన్ ద్వారా పరామర్శించినట్టు పేర్కొన్నారు. -
నన్ను కెలకొద్దు!
ఎల్ఎల్బీ విద్యార్హత విషయంలో తన పరువును బజారు కీడ్చే రీతిలో, తన కుటుంబాన్ని హేళన చేస్తూ వ్యాఖ్యలు చేయడం మానుకోకుంటే, కోర్టు మెట్లు ఎక్కిస్తా అనిమత్స్య శాఖ మంత్రి జయకుమార్కు చిన్నమ్మ మేనల్లుడు వివేక్ హెచ్చరికలు చేశారు. తనను దయచేసి కెలకొద్దు అని హితవు పలికారు. సాక్షి, చెన్నై : విదేశీ కోటాలో ఎల్ఎల్బీ సీటు పొంది.. దొడ్డి దారిలో చిన్నమ్మ శశికళ మేనల్లుడు, జయ టీవీ సీఈవో పట్టా పొందినట్టు ఏసీబీ గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను అరెస్టు చేయడానికి తగ్గ కసరత్తులు సాగుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ విషయంగా మత్స్య శాఖ మంత్రి జయకుమార్ నోరు జారారు. వివేక్ను ఉద్దేశించి, ఆయన కుటుంబాన్ని గురిపెట్టి విరుచుకుపడ్డారు. వివేక్ను అరెస్టుచేసి కటకటాల్లోకి నెట్టడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. ఆ కుటుంబమే మోసగాళ్ల కుటుంబంగా పేర్కొంటూ తీవ్రంగానే పదాలను ప్రయోగించారు. ఇది కాస్త వివేక్లో ఆగ్రహాన్ని రేపింది. జయకుమార్కు హెచ్చరికలు చేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో మంత్రి అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా జయకుమార్ మీద వివేక్ శివాలెత్తారు. నన్ను కెలకొద్దు : తన గురించి జయకుమార్కు ఏం తెలుసునని, ఇష్టారాజ్యంగా నోరు జారుతున్నారంటూ మండిపడ్డారు. తానూ యూజీ ఆస్ట్రేలియాలోనూ, పీజీ పూణెలో పూర్తి చేసినట్టు వివరించారు. ఎవరి సహకారం, సిఫారసు లేకుండా స్వశక్తితో తాను ఐటీసీ సంస్థలో ఉద్యోగాన్ని సంపాదించి విధులు నిర్వర్తించానన్నారు. న్యాయ శాస్త్రం చదవాలన్న ఆశతో ఎల్ఎల్బీ పూర్తి చేశానన్నారు. ఎన్నో కళాశాలలు ఉన్నా, డాక్టర్ అంబేడ్కర్ కళాశాలను తాను ఎంపిక చేసుకున్నానన్నారు. తనకు సింగపూర్ సిటిజన్ గుర్తింపు ఉందని, తన సోదరి అక్కడే ఉన్న దృష్ట్యా, తనకు కూడా అక్కడి పౌరుడిగా గుర్తింపు దక్కి ఉన్నట్టు వివరించారు. అందుకే తాను విదేశీ కోటాలతో సింగపూర్ పౌరసత్వం ఆధారంగా చేరానన్నారు. ఇందుకు తగ్గ ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు. తనను ఎవరైనా అధికారులు ప్రశ్నిస్తే చట్టపరంగా అన్ని వివరాలను వారి ముందు ఉంచేందుకు సిద్ధం అన్నారు. కేసులు పెడితే చట్టపరంగా ఎదుర్కొంటానన్నారు. అయితే, మంత్రి పదవిలో ఉన్న జయకుమార్ తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసి, అనాగరికంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు. తానేదో పెద్ద మోసాగాడినైనట్టు, పెద్ద నేరం చేసినట్టుగా అరెస్టు చేయిస్తా, కటకటాల్లో పెట్టిస్తా అని స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం మానుకుంటే మంచిదని మంత్రిని హెచ్చరించారు. తనను కెలక వద్దు అని, కెలికిన పక్షంలో కోర్టు మెట్లు ఎక్కించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అధికారం చేతిలో ఉంటే ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తారా..? బెదిరిస్తారా..? అని ధ్వజమెత్తారు. తనను గాని, తన కుటుంబాన్ని గాని అవమాన పరిచే విధంగా గానీ, హేళన చేసే విధంగా గానీ, వ్యాఖ్యలు చేయడం మానుకోకుంటే , తీవ్రంగా తానూ స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇంకాచెప్పాలంటే, జయకుమార్ పబ్లిసిటీ కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. తనకు ఏమీ తెలియకున్నా, అన్ని తెలిసిన వాడి వలే ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం బట్టి చూస్తే, ఆయన పబ్లిసిటీ వ్యామోహం స్పష్టం అవుతోందని విమర్శించారు. -
ముందస్తుగా..
ముందస్తుగానే పరప్పన అగ్రహార చెరకు వెళ్లేందుకు చిన్నమ్మ శశికళ నిర్ణయించారు. శనివారం సాయంత్రం ఆమె తంజావూరు నుంచి బెంగళూరుకు పయనం కానున్నా రు. శుక్రవారం నటరాజన్ మృతికి కర్మక్రియలు జరగనున్నాయి. సాక్షి, చెన్నై: భర్త నటరాజన్ మరణంతో చిన్నమ్మ శశికళ ఈనెల 20న పెరోల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అంత్యక్రియల తదుపరి ఆమె నటరాజన్ స్వగ్రామంలో కాకుండా తంజావూరులో ఉంటున్నారు. ఆమెను పరామర్శించేందుకు రాజకీయ పార్టీ వర్గాలు, ఆప్తులు, బంధువులు నిత్యం తరలివస్తున్నారు. గురువారం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలు, అనర్హత వేటు పడ్డ పలువురు ఎమ్మెల్యేలు చిన్నమ్మను పరామర్శించారు. గంటపాటు చిన్నమ్మతో వారు భేటీ అయ్యారు. ఈ సమయంలో కళగం ఉప ప్రధానక కార్యదర్శి దినకరన్ సైతం అక్కడే ఉన్నారు. ఈసందర్భంగా నాయకులు, మద్దతుదారుల్ని ఉద్దేశించి చిన్నమ్మ కొన్ని సూచనల్ని చేసినట్టు సమాచారం. దినకరన్కు మద్దతుగా అందరూ నిలవాలని, మరో ఏడాదిలో తాను జైలు నుంచి వచ్చేస్తాననని, ఆ తర్వాత పార్టీ తప్పకుండా చేతుల్లోకి వస్తాయని ఆందోళన చెందవద్దన్న భరోసా ఇచ్చినట్టు సమాచారం. తాను వచ్చాకా, అన్ని సక్రమంగా సాగుతాయని, అంతవరకు ధైర్యంగా ఉండాలని, ఈ కాలంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయని, వాటన్నింటినీ ఎదుర్కోవాలని సూచించినట్టు తెలిసింది. ఈ సమయంలో చిన్నమ్మ మేనల్లుడు వివేక్ అక్కడకు వచ్చినట్టు వచ్చి దినకరన్ ఉండడంతో క్షణాల్లో వెనుదిరగడం చర్చకు దారితీసింది. అలాగే, చిన్నమ్మ సోదరుడు దివాకరన్ సైతం మౌనంగాఅక్కడి నుంచి వెళ్లడంతో కుటుంబ విభేదాలు కొట్టచ్చినట్టు కనిపించడం గమనార్హం. పెరోల్ కాలం వినియోగించుకోకూడదని.. తనకు కర్ణాటక జైళ్ల శాఖ 15 రోజుల బెయిల్ మంజూరు చేసినా, పూర్తి కాలం ఆ రోజుల్ని వినియోగించుకునేందుకు శశికళ ఇష్ట పడలేదు. ముందుగానే ఆమె జైలుకు వెళ్లేందుకు నిర్ణయించడం గమనార్హం. శుక్రవారం విలార్ గ్రామంలో నటరాజన్ మృతికి కర్మకాండ జరగనుంది. ఇందుకోసం ఉదయాన్నే ఆగ్రామానికి శశికళ వెళ్లనున్నారు. ఆ తదుపరి తంజావూరు చేరుకుని నటరాజన్ చిత్ర పట ఆవిష్కరించనున్నారు. శనివారం సాయంత్రం అందరి వద్ద సెలవు తీసుకుని తంజావూరు నుంచి బెంగళూరుకు పయనం అయ్యేందుకు ఆమె నిర్ణయించి ఉన్నట్టు మద్దతుదారులు పేర్కొన్నారు. కాగా, తన కుటుంబంలో దివాకర్, వివేక్ల రూపంలోనే వివాదాలు తెరమీదకు వస్తున్నట్టు చిన్నమ్మ గుర్తించారని, అందుకే వివాదాలు మరింత పెద్దవి కాక ముందే జైలుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఓ నేత పేర్కొన్నారు. కాగా, చిన్నమ్మను ఎవరెవరు వచ్చి పరామర్శిస్తున్నారో అన్న వివరాలను కర్ణాటక జైళ్ల శాఖ సేకరించి ఉన్నట్టు సమాచారం. అలాగే, వచ్చి వెళ్లే వారితో పాటు, తంజావూరు ఇంటి వద్ద వీడియో చిత్రకరణ సాగడం గమనార్హం. -
తీగ లాగితే...డొంక కదిలింది
అన్నా వర్సిటీ వీసీగా రాజారాం, అంబేడ్కర్ న్యాయ వర్సిటీ వీసీగా వనంగా ముడిగతంలో సాగించిన అవినీతి బండారం రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి ఇళ్లల్లో సాగిన దాడుల మేరకు లభించిన సమాచారాలు ఏసీబీ వర్గాల్నే విస్మయంలో పడేశాయి. ఈ ఇద్దరి అవినీతికి హద్దే లేదన్నట్టుగా ఏసీబీకిఆధారాలు చిక్కి ఉండడం గమనార్హం. అలాగే, ప్రొఫెసర్ల నియామకం, విదేశీ కోటా సీట్ల కేటాయింపుల్లో సాగిన అక్రమాలుబయటపడ్డాయి. ఇందులో ఓ సెలబ్రెటీ సైతం తెరమీదకు వచ్చాడు. అమ్మ జయలలిత నెచ్చెలి, అమ్మ మున్నేట్ర కళగం ప్రధానకార్యదర్శి చిన్నమ్మ శశికళ సోదరుడు జయరామన్, వదిన ఇలవరసి పుత్రుడువివేక్ను ఏసీబీ తమ జాబితాలో చేర్చిఉండడం చర్చకు దారితీసింది. జయ టీవీ సీఈవోగా ఉన్న వివేక్ ఎల్ఎల్బీనిఅక్రమమార్గంలోనే పూర్తిచేసినట్టుగాఏసీబీ గుర్తించింది. సాక్షి, చెన్నై : ఓ కేసులో తీగ లాగితే.. డొంక కదిలినట్టు చిన్నమ్మ మేనల్లుడు వివేక్ ఎల్ఎల్బీ బండారం బయటపడింది. విదేశీ కోటాలో ఎల్ఎల్బీని చెన్నైలో ఆయన పూర్తిచేసి ఉండడం వెలుగులోకి వచ్చింది. దీంతో ఏసీబీ ఆయన మీదే కాదు, మరో 75మంది మీద గురిపెట్టింది. అలాగే, ఆరుగురు అన్నా వర్సిటీ ప్రొఫెసర్ల మీద సైతం కేసులు నమోదయ్యాయి. ఆరుగురు ప్రొఫెసర్లు అన్నా వర్సిటీలో రాజారాం పర్యవేక్షణలో 21 మంది ప్రొఫెసర్లు, 33 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మరో 54 సహాయ ప్రొఫెసర్ల నియమకాలు గతంలో జరిగి ఉన్నాయి. ఈ నియామకాల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ఏసీబీ తీవ్ర విచారణలో నిమగ్నం అయింది. ఇందులో మంగళవారం నాటికి ఆరుగురు అనర్హుల్ని అధికారులు గుర్తించారు. వారి మీద కేసు నమోదు చేశారు. ఇందులో నలుగురు అసిస్టెంట్, ఒక సహాయ, ఒక ప్రొఫెసర్ ఉండడం గమనార్హం. వీరంతాఆయా పదవులకు అనర్హులే అయినా, రాజా రాం చేతివాటం రూపంలో అర్హులుగా అవతరించారని తెలిసింది. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పుచ్చుకుని వీరికి రాజారాం అర్హత కల్పించినట్టు ఏసీబీ గుర్తించింది. ఆరుగురి మీద కేసు నమోదు చేశారు. వీరిలో బయోమెట్రికల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ జయ శ్రీ, కెమికల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ హెలన్, ఎలక్ట్రానిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ బాలమురుగన్, మెటీరియల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు మందాకిని, అరివానందన్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ప్రొఫెసర్ విజయలక్ష్మి ఉన్నారు. కేసు నమోదుతో వీరిని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, మరో 14 మంది పేర్లు సైతం ఏసీబీ పరిశీలనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివేక్ మెడకు ఎల్ఎల్బీ ఉచ్చు అంబేడ్కర్ న్యాయ కళాశాలలో సాగిన అక్రమాలపై ఏసీబీ తీవ్ర విచారణ సాగిస్తోంది. వనంగాముడితో పాటుగా అక్రమాల్లో భాగస్వాములుగా ఉన్న ప్రొఫెసర్ శర్వాణి, రిజిస్ట్రార్ బాలాజీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జయశంకర్, పరిపాలనాధికారి రమేష్ మీద ఏసీబీ కేసులు నమోదు చేసింది. వీరి అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఎల్ఎల్బీ ఉచ్చు చిన్నమ్మ మేనళ్లుడు వివేక్ మెడకు తగలడం గమనార్హం. అంబేడ్కర్ వర్సిటీలో ప్రతి ఏటా పదిహేను శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాకు కేటాయించేవారు. గతంలో సాగిన కేటాయింపుల్లో 75 మంది విద్యార్థులు అక్రమంగా విదేశీ కోటా సీట్లను చేజిక్కించుకున్నట్టు ఎసీబీ గుర్తించింది. వీరి జాబితా సిద్ధం చేయగా, అందులో వివేక్ పేరు తెర మీదకు వచ్చింది. విదేశీ కోటా సీట్లను అక్రమంగా పొంది వివేక్ ఎల్ఎల్బీ పూర్తి చేసినట్టు గుర్తించారు. దీంతో ఆ 75 మంది విద్యార్థులతో పాటు వివేక్ పేరును తమ జాబితాల్లోకి ఎక్కించి విచారణకు సిద్ధం అయ్యారు. ఇక, ఒక్కో విద్యార్థి ఎన్ఆర్ఐ కోటా నిమిత్తం రూ.20 లక్షల వరకు వనంగాముడి అండ్ బృందానికి చెల్లించినట్టు విచారణలో వెలుగు చూసి ఉండడం గమనార్హం. -
వారు అమ్మ ద్రోహులు..
సాక్షి, చెన్నై : భర్త నటరాజన్ మరణంతో చిన్నమ్మ శశికళ ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన మృతదేహం పక్కనే గంటల తరబడి కూర్చుండిపోయారు. బోరున విలపిస్తున్న ఆమెను ఓదర్చాడం ఎవరి తరం కాలేదు. ఇక, నటరాజన్ భౌతిక కాయానికి కన్నీటి వీడ్కోలు పలికారు. చిన్నమ్మ శశికళ భర్త నటరాజన్ అనారోగ్యంతో మంగళవారం మరణించిన విషయం తెలిసిందే. చెన్నై నుంచి తంజావూరుకు నటరాజన్ మృతదేహాన్ని తరలించారు. ఈ సమాచారంతో పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. పదిహేను రోజుల పెరోల్ లభించడంతో ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. ఆమెను కృష్ణగిరి వద్ద అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్తో పాటు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు పలువురు ఆహ్వానించారు. తమ వాహనంలో ఆమెను వెంట బెట్టుకుని తంజావూరుకు బయలుదేరారు. ముసిరి వద్దకు మంగళవారం అర్ధరాత్రి ఆమె చేరుకోవడతో సోదరుడు దివాకరన్ తోడయ్యారు. సోదరుడు దివాకరన్, అక్క కుమారుడు దినకరన్లతో కలిసి తంజావూరులోని నటరాజన్ స్వగ్రామం విలార్కు వెళ్లారు. అక్కడ భర్త మృతదేహాన్ని చూడగానే శశికళ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. భోరున విలపించడంతో ఆమెను ఓదార్చేందుకు కుటుంబీకులు తీవ్రంగా ప్రయత్నించారు. భర్త మృతదేహం పక్కనే విలపిస్తూ అలాగే ఆమె రాత్రంతా కూర్చున్నారు. ఉదయం సైతం ఎక్కువ సమయంలో మృతదేహం పక్కనే ఆమె కూర్చుని ఉన్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు పెద్దఎత్తున తరలిరావడంతో ఆ పరిసరాలు విషాదంలో మునిగాయి. చిన్నమ్మకు పలు పార్టీలకు చెందిన నేతలు తమ సానుభూతి తెలియజేశారు. సాయంత్రం విలార్ నుంచి తంజావూరులో గతంలో నటరాజన్ నిర్మించిన ముల్లైవాయికాల్ స్మారక ప్రదేశానికి ఊరేగింపుగా మృతదేహాన్ని తీసుకెళ్లారు. శ్రీలంకలో సాగిన మారణహోమంలో అమాయక తమిళులు వేలాది మంది అశువులు బాయడాన్ని స్మరిస్తూ ఈ స్తూపాన్ని ఆయన గతంలో నిర్మించారు. ఆ స్తూపం వద్దే ద్రవిడ సంప్రదాయ పద్ధతిలో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగాయి. అంతిమయాత్రలో వేలాదిగా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు తరలివచ్చాయి. సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. కాగా, చిన్నమ్మ శశికళను పరామర్శించి, సానుభూతి తెలియజేయడానికి పెద్ద సంఖ్య అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు తంజావూరుకు తరలి వస్తున్నాయి. అయితే, అన్నాడీఎంకేకు చెందిన ఏ ఒక్కరూ అటు వైపు వెళ్ల లేదు. ఈ విషయంగా మంత్రి జయకుమార్ పేర్కొంటూ, వారు అమ్మ ద్రోహులు అని, వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. ఇక, మక్కల్ మున్నేట్ర కళగం నేత తంగ తమిళ్ సెల్వన్ పేర్కొంటూ, అన్నాడీఎంకేకి చెందిన ఎంపీ చిన్నమ్మ పెరోల్కు సాక్షి సంతకం పెట్టారని వ్యాఖ్యానించడం గమనార్హం. -
వెలుగులోకి చిన్నమ్మ ప్రమాణ పత్రం
‘‘ఆస్పత్రి నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యి.. అక్క జయలలిత కారు ముందు సీట్లో.. నేను వెనుక కూర్చుని ఇంటికి వెళ్తామని నమ్మకం, ఆశతో ఉన్నాం. అయితే, ఆమె ఈ లోకం విడిచి మమ్మల్ని తీవ్ర మనో వేదనను మిగిల్చింది. జైలు జీవితం అక్కను తీవ్రంగా కుంగదీసింది. డిసెంబరు 4వ తేదీ అక్క టీవీలో జై హనుమాన్ సీరియల్ చూస్తున్న సమయంలో కాఫీ ఇచ్చాను. సీరియల్ ముగిసిన తర్వాత కాఫీ తాగుతానని ఆమె చెప్పారు. క్షణాల్లో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమె శరీరం వణుకుతోంది.. అక్కా.. అక్కా అంటూ నేను అరిచాను.. కళ్లు తెరిచినట్టు తెరిచి చివరకు మూతపడింది. అంతే నేను స్పృహ తప్పిపడిపోయా’’ అంటూ శశికళ విచారణ కమిషన్కు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. సాక్షి, చెన్నై : ఆస్పత్రి నుంచి సంపూర్ణ ఆరోగ్య వంతురాలుగా పోయెస్ గార్డెన్కు అక్క జయలలిత వచ్చేస్తారన్న ఆశతో ఉన్నామని ఆమె నెచ్చెలి శశికళ వ్యాఖ్యానించారు. హఠాత్తుగా ఆమె ఆరోగ్యం ఆస్పత్రిలో క్షీణించిందని ఆవేదన వ్యక్తంచేశారు. జైలు జీవితం అక్కను తీవ్రంగా కుంగదీసిందని పేర్కొన్నారు. ఈమేరకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్కు శశికళ వాంగ్మూలం ఇచ్చారు. తమిళ ప్రజల అమ్మ మరణం ఓ మిస్టరీగా మారిన విషయం తెలిసిందే. ఈ మిస్టరీని నిగ్గు తేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ తీవ్ర విచారణ సాగిస్తూ వస్తోంది. అన్ని కోణాల్లోనూ, జయలలితకు సన్నిహితంగా ఉన్న వాళ్లు, భద్రతాధికారులు, ప్రభుత్వ అధికారులు, ఇంటి పని మనుషుల్ని సైతం ఆ కమిషన్ విచారిస్తూ వస్తోంది. జయలలిత నెచ్చెలి శశికళ పరప్పన అగ్రహార చెరలో ఉండడంతో ఆమె వాంగ్ములాన్ని ప్రమాణ పత్రం రూపంలో సమర్పించేందుకు ఆదేశించారు. దీంతో ఆమె తరఫు న్యాయవాది రాజ చెందూర్ పాండియన్ 55 పేజీలతో కూడిన ప్రమాణ పత్రాన్ని కమిషన్కు గత వారం సమర్పించారు. అందులో ఏముందో అన్న ఉత్కంఠకు తెర పడుతూ ఆ వివరాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. అపోలోలో చికిత్స–పరామర్శ అపోలో ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి డిసెంబరు ఐదో తేదీ వరకు జయలలితకు అందించిన వైద్య చికిత్సలు, డాక్టర్ల గురించి ప్రమాణ పత్రంలో శశికళ వివరించారు. జ్వరంతోనే ఆస్పత్రికి వచ్చిన క్రమంలో ఆమెకు ఇతర వైద్య పరీక్షలు చేయాల్సి వచ్చింది. ఆస్పత్రిలో జయలలిత కోలుకున్నట్టు, ఆమె పోయెస్ గార్డెన్కు మళ్లీ వచ్చేస్తారన్న ఆశతో ఉన్నట్టు పేర్కొన్నారు. సెప్టెంబరు 27వ తేదీ కావేరి సమస్య విషయంగా ఆమె అధికారులతో సమావేశం కూడా అయ్యారని వివరించారు. ఈ సమయంలో అప్పటి ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం, ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్ జయలలితను కలిసినట్టు, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, కార్మిక శాఖ మంత్రి నిలోఫర్ కబిల్, భద్రతాధికారులు సైతం జయలలితను చూశారని పేర్కొన్నారు. వారి వద్ద తాను వచ్చేస్తానని, ఎవరూ ఇక రావద్దని జయలలిత స్వయంగా సూచించారని తెలిపారు. గవర్నర్ విద్యాసాగర్ రావు సైతం జయలలితను చూసిన వారిలో ఉన్నట్టు తెలిపారు. ఆమె స్పృహలో లేని దృష్ట్యా, ఆస్పత్రికి తీసుకురాగలిగామని, స్పృహలో ఉండి ఉంటే అంగీకరించే వారు కారని తెలిపారు. జైలు జీవితంతో.. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చాక, అక్క జయలలిత మనో వేదనలో పడ్డారని, తాను పదే పదే దాని గురించి ఆలోచించ వద్దు అని సూచించినట్టు తెలిపారు. జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం ఆమెకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన 20 మంది వైద్య నిపుణుల ద్వారా పోయెస్ గార్డెన్లోనే వైద్య పరీక్షలు చేశామని పేర్కొంటూ, అందుకు తగ్గ వీడియో క్లిప్పింగ్లు, అపోలోలో తీసిన వీడియోలను కమిషన్కు సమర్పించడం గమనార్హం. అలాగే, బీ ఫామ్లో సంతకం పెట్టే సమయంలో స్పృహలోనే ఉన్నట్టు పేర్కొన్నారు. జ్వరంతో.. సెప్టెంబరు 19న జయ జ్వరం బారినపడ్డారు. ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ శివకుమార్ శబరిమలైకి వెళ్లారు. ఆయన్ను ఫోన్ ద్వారా సంప్రదించి, అందుకు తగ్గ మందుల్ని అందించారు. జ్వరం కాస్త తగ్గడంతో 21వ తేదీ మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జయలలిత వెళ్లారు. అక్కడి నుంచి రాగానే, జ్వరం మరింతగా పెరిగింది. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో 22వ తేదీ ఆమె బయటకు రాలేదు. అదేరోజు రాత్రి 9.30 గంటలకు మొదటి అంతస్తు నుంచి వచ్చిన జయ కేకతో శశికళ పరుగులు తీశారు. బాత్రూం వద్ద పడి ఉన్న జయలలిత మంచం మీదకు తీసుకొచ్చారు. జ్వరం తీవ్రతకు తోడుగా ఆమె స్పృహ తప్పడంతో డాక్టర్ శివకుమార్ను పిలిపించి హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్లో శశికళ, శివకుమార్ ఉన్నారు. మార్గం మధ్యలో జయలలిత çస్పృహలోకి వచ్చి ఆస్పత్రికి వద్దు అని మారం చేశారు. అప్పటికే అంబులెన్స్ ఆస్పత్రికి చేరింది. అక్కా...అక్కా.. వైద్య పరీక్షలు, చికిత్సలు, పరామర్శలు, వీడియో చిత్రీకరణ తదితర అంశాల గురించి సమగ్రంగా వివరించిన శశికళ, జయలలిత ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించిన సందర్భాన్ని ప్రమాణ పత్రం ద్వారా కమిషన్ ముందు పూసగుచ్చినట్టు తెలియజేశారు. డిసెంబరు 4వ తేదీ జయలలిత టీవీలో జై హనుమాన్ సీరియల్ చూస్తున్న సమయంలో కాఫీ ఇచ్చామని, సీరియల్ ముగిసినానంతరం కాఫీ తాగుతానని చెప్పిన అక్క ఆరోగ్యం క్షణాల్లో క్షీణించినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె శరీరం వణుకుతుండడంతో అక్కా..అక్కా అంటూ అరిచానని, అంతలోపు వైద్యులు పరుగున వచ్చారని తెలిపారు. వారి సూచన మేరకు తాను పదే పదే అక్కా.. అక్కా అని అరవగా, నెమ్మదిగా కళ్లు తెరిచినట్టు తెరచి చివరకు మూత పడిందన్నారు. అదే సమయలో తాను çస్పృహ తప్పానని వివరించారు. అక్క కారు ముందు సీట్లో, తాను వెనుక కూర్చుని ఇంటికి వెళ్తామన్న నమ్మకం, ఆశతో ఉన్నామని, అయితే, ఆమె మరణించడం తనకు తీవ్ర మనో వేదనను మిగిల్చిందని పేర్కొన్నారు. -
జయ ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించారా?
-
జయ ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించారా?
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం విషయమై ఆమె నెచ్చెలి శశికళ పలు కీలకమైన విషయాలు వెల్లడించారు. 2016 సెప్టెంబర్ 22న జయలలిత వాష్రూమ్లో కుప్పకూలారని, అయినా, ఆస్పత్రికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారని శశికళ తెలిపారు. అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతుండగా.. నాలుగుసార్లు వీడియో చిత్రీకరించారని, ఆస్పత్రిలో ఆమెను పన్నీర్ సెల్వం, తంబిదురై వంటి అన్నాడీఎంకే సీనియర్ నేతలు కలిశారని చెప్పారు. జయలలిత అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరుపుతున్న రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని విచారణ కమిషన్కు ఆమె ఈ మేరకు వివరాలు తెలిపారు. అయితే, ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను తాము కలువలేదని, చూడలేదని పన్నీర్ సెల్వం, తంబిదురైతోపాటు అన్నాడీఎంకే సీనియర్ నేతలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. జయలలిత మృతికి దారితీసిన పరిస్థితులు, ఆమెకు అందజేసిన చికిత్స తదితర అంశాల్లో అనుమానాల నివృత్తి కోసం హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏ అరుముఘస్వామి నేతృత్వంలో దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అవినీతి కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ.. జయ మృతికి దారితీసిన పరిస్థితులను రిటైర్డ్ జడ్జికి వివరించారు. 2016 సెప్టెంబర్ 22న జయలలిత అనారోగ్యానికి గురయ్యారని, అదే రోజున ఆమెను ఆస్పత్రిలో చేర్చామని శశికళ చెప్పారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళుతుండగా.. జయలలిత స్పృహలోకి వచ్చారని, తనను ఎక్కడికి తీసుకెళుతున్నారని ఆమె ప్రశ్నించారని తెలిపారు. పోయెస్ గార్డెన్లో ఉన్న తన నివాసంలోని మొదటి అంతస్తు వాష్రూమ్లో జయలలిత సృహకోల్పోయి పడిపోయారని చెప్పారు. ‘ఆమె వెంటనే నన్ను సాయానికి పిలిచారు. నేను వెళ్లి ఆస్పత్రికి వెళ్దామని సూచించాను. కానీ ఆమె వద్దన్నారు. అంతలో ఆమె స్పృహ కోల్పోవడంతో నేనే అంబులెన్స్ కోసం ఫోన్ చేశాను’ అని శశికళ వివరించారు. -
శశికళ భర్త నటరాజన్ మృతి
-
శశికళ భర్త నటరాజన్ మృతి
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే మాజీ నేత శశికళ భర్త నటరాజన్(73) కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 1.30కి ఆయన తుదిశ్వాస విడిచారు. చెన్నై బీసెంట్ నగర్లోని నివాసానికి నటరాజన్ భౌతికకాయంను తరలించారు. అయితే జైలులో ఉన్న శశికళకు పెరోల్ మంజూరు కానుంది. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మూడు రోజుల కింద నటరాజన్ గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే నటరాజన్ గతంలో కూడా లివర్ సంబంధిత వ్యాధితో అస్వస్థతకు గురయ్యారు. గతంలో నటరాజన్ ప్రజా సంబంధాల అధికారిగా పనిచేశారు. విద్యార్థి దశ నుంచే డీఎంకేలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. 1975లో నటరాజన్ శశికళను వివాహం చేసుకున్నారు. -
చిన్నమ్మ చిరాకు
సాక్షి, చెన్నై: టీటీవీ దినకరన్ కొత్తగా స్థాపించిన ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’పై శశికళ చిరాకు పడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్బావ సభలో దినకరన్ తనను తాను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా శశికళను ప్రస్తావించడం, అడయారులోని దినకరన్ ఇంటినే పార్టీ చిరునామాగా చూపడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెట్టే ఆలోచన లేదని ఈ ఏడాది జనవరి 17వ తేదీన నీలగిరిలో ప్రకటించిన దినకరన్ అకస్మాత్తుగా పార్టీని ప్రకటించడం వెనుక అంతరార్థం ఏమిటని చిన్నమ్మ సన్నిహితుల వద్ద ప్రశ్నించినట్టు సమాచారం. పార్టీ పెట్టడంతో ఎంజీఆర్ సినిమాల్లో విలన్లా అన్నాడీఎంకేను, పార్టీ చిహ్నాన్ని ఎడపాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గానికి దినకరన్ అప్పగించినట్లయిందని శశికళ కోపగించుకున్నట్టు తెలుస్తోంది. దినకరన్ పార్టీ పెట్టడం శశికళ కుటుంబంలోని పలువురు సభ్యులకు కూడా ఇష్టం లేదన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు దినకరన్ పార్టీలో అప్పుడే అసంతృప్తి చెలరేగింది. ద్రవిడ సిద్ధాంతాలను, అన్నాదురైకి తగిన స్థానం కల్పించలేదని ఆరోపిస్తూ సీనియర్ నేత నాంజిల్ సంపత్ శనివారం పార్టీ నుంచి తప్పుకున్నారు. -
శశికళపై ఆగ్రహం
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మరణం వెనుక నెచ్చెలి శశికళ ప్రమేయం ఉన్నట్లు నెలకొన్న అనుమానాలను బలపరిచే విధంగా ఆమె వ్యవహరించడంపై విచారణ కమిషన్ అగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దిగొచ్చిన శశికళ సోమవారం ఎట్టకేలకు కమిషన్కు తన న్యాయవాది ద్వారా వాంగ్మూలాన్ని సమర్పించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రజల మధ్యనే తిరుగుతుండిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2015 సెప్టెంబరు 22వ తేదీన అకస్మాత్తుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, డీహైడ్రేషన్తో ఆమె స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని ఆసుపత్రి ప్రకటించింది. అయితే 78 రోజులపాటూ ఆసుపత్రిలోనే చికిత్స పొందిన జయలలిత అదే ఏడాది డిసెంబరు 5వ తేదీన కన్నుమూశారు. ఆసుపత్రిలో ఉండగా జయ ఫొటోలు విడుదల చేయకపోవడం, చూసేందుకు ఎవ్వరినీ అనుమతించకపోవడం, స్వల్ప అనారోగ్యంతో మరణించడం తదితర కారణాలతో అందరూ శశికళను అనుమానంగా చూశారు. న్యాయవిచారణ లేదా సీబీఐ విచారణకు విపక్షాలు పట్టుబట్టాయి. జయ మరణంపై నెలకొన్న అనుమానాల నివృత్తి కోసం తమిళనాడు ప్రభుత్వం గత ఏడాది విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి ఆరుముగస్వామిని కమిషన్ చైర్మన్గా నియమించింది. కమిషన్ ముందు ఇప్పటి వరకు సుమారు 30 మంది తమ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. వీరిలో అధికశాతం జయ నెచ్చెలి శశికళకు వ్యతిరేకంగా తమ వాంగ్మూలాలను సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబరు 21వ తేదీన శశికళకు సమన్లు జారీ అయ్యాయి. శశికళకు వ్యతిరేకంగా వాంగ్మూలాన్ని సమర్పించినవారిని క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు అనుమతించాల్సిందిగా ఈ పిటిషన్లో ఆయన కోరుతూ జనవరి 5, 12 తేదీల్లో శశికళ తరఫు న్యాయవాది రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఉత్తర్వులు జారీ అయిన నాటి నుంచి వారం రోజుల్లోగా వాంగ్మూలాన్ని దాఖలు చేయాలని జనవరి 30వ తేదీన కమిషన్ చైర్మన్ ఆరుముగస్వామి శశికళకు ఉత్తర్వులు జారీ చేశారు. అదే రోజు నుంచి 15 రోజుల్లోగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయవచ్చని అనుమతించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6వ తేదీన శశికళ తరఫు న్యాయవాది కొత్త పిటిషన్ దాఖలు చేశారు. అందులో... సాక్ష్యం చెప్పిన 22 మంది వివరాలు మాత్రమే సరిపోదు, వారు సమర్పించిన వాంగ్మూలాలు సైతం తమకు అందజేయాలని, వాటిని సమర్పించిన పది రోజుల్లోగా తమ వాంగ్మూలాన్ని అందజేస్తామని కోరాడు. అందరినీ విచారణ జరిపిన తరువాత ఏడు రోజులు అవకాశం ఇస్తే ఆ తరువాత క్రాస్ ఎగ్జామిన్ చేస్తామని కోరారు. శశికళ పిటిషన్పై ఫిబ్రవరి 12వ తేదీన విచారణ జరిపిన అనంతరం 18 మంది సాకు‡్ష్యలు సమర్పించిన 2,956 పేజీల 450 వాంగ్మూలాలను అందజేస్తామని కమిషన్ చైర్మన్ తెలిపారు. ఈ నేపథ్యంలో శశికళ వాంగ్మూలం సమర్పణకు 15 రోజులు అవకాశం ఇవ్వాలని ఫిబ్రవరి 26న కమిషన్ చైర్మన్ కార్యదర్శి కోమలకు వినతిపత్రం సమర్పించాడు. దీనిపై ఈ నెల 6వ తేదీన విచారణ జరిపిన చైర్మన్ ఆరుముగస్వామి శశికళ న్యాయవాది సమర్పించిన పిటిషన్ను కొట్టివేశారు. బెంగళూరు జైలుకెళ్లి శశికళను విచారించాల్సి వస్తుంది లేదా వాంగ్మూలం దాఖలుకు శశికళ సహకరించడం లేదనే నిర్ణయానికి రావాల్సి ఉంటుందని చైర్మన్ హెచ్చరించారు. దీంతో దిగివచ్చిన శశికళ న్యాయవాది అరవిందన్ సోమవారం ఆమె వాంగ్మూలాన్ని కమిషన్కు సమర్పించారు. ఇకపై ఎవరెవరి వద్ద నుంచి వాంగ్మూలాలు సేకరిస్తారు తమకు తెలియజేయాల్సిందిగా శశికళ న్యాయవాదులు కమిషన్ను కోరినట్లు సమాచారం. -
శశికళకు పరుపు, దిండు.. సిద్దూకు చిక్కులు!
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విమర్శల దాడి చేసేందుకు బీజేపీకి మరో ఆయుధం దొరికింది. సిద్ధరామయ్య జోక్యంతోనే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ అక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ హెచ్ఎన్ సత్యనారాయణ రావు అనే మాజీ పోలీసు ఉన్నతాధికారి దర్యాప్తు కమిటీకి చెప్పారు. దీంతో ఇదే అంశాన్ని తమ ఆయుధంగా బీజేపీ ఉపయోగించుకొని ఎన్నికల ప్రచారంలో దాడి చేయాలని భావిస్తోంది. శశికళకు ఖరీదైన పరుపు, దిండ్లు, ఇతర అన్నిరకాల సదుపాయాలు అందేలాగా జైలు అధికారులు ఏర్పాట్లు చేశారని, ఇది కూడా సిద్దరామయ్య జోక్యంతోనే సాధ్యమైందంటూ ఆ అధికారి చెప్పారు. జైలులో శశికళకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ, ఆ మేరకు ముందే పోలీసు ఉన్నతాధికారులకు రూ.2కోట్లు అందాయంటూ డీ రూపా అనే పోలీసు అధికారి ఆధారాలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆ సమయంలో జైళ్ల శాఖకు హెడ్గా ఉన్న హెచ్ఎన్ సత్యనారాయణ రావు అనే పోలీసు అధికారిని విధుల్లో నుంచి తొలగించారు. ఈ సంఘటపై ప్రత్యేక విచారణకు ఆదేశించారు. దీంతో, దర్యాప్తు కమిటీకి కొన్ని వివరాలు చెప్పిన ఆయన సీఎం సిద్దరామయ్యకు సంబంధించి బాంబు పేల్చారు. -
శశికళ జైలు జీవితం ఏడాది పూర్తి..
ఇప్పటికే అనేక చిక్కుల్లో పీకల్లోతుల్లో మునిగి ఉన్న చిన్నమ్మ మెడకు బినామీ ఉచ్చుబిగుసుకుంటోంది. నకిలీ సంస్థలు, అక్రమంగా విదేశీ మారకద్రవ్యాల వ్యవహారం బైటపడింది. అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ బంధువులకు సంబంధించిన రూ.380 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ జప్తు చేసిన సంగతి బుధవారం వెలుగుచూసింది. జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు కదలడంతో విషయంబైటపడింది. ఐటీ అధికారి ఒకరు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళ బంధువులు, మిత్రులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై గత ఏడాది ఐటీ శాఖ భారీ ఎత్తున ఆకస్మికదాడులు నిర్వహించింది. జయ, శశికళ పేర్లతో అనేక బినామీ సంస్థలు పనిచేస్తున్నట్లు అధికారుల దాడులతో వెలుగుచూసింది. వీటిల్లో అనేక సంస్థలను చెన్నై టీనగర్లోని ఒక అపార్టుమెంటును చిరునామాగా చూపి ప్రారంభించారు. పైగా వీటిల్లో కొన్ని కంపెనీలు పేరుకు మాత్రమే పరిమితమై ఆస్తులను కొనుగోలు చేయడం వంటి కార్యకలాపాలకు మాత్రమే పాల్పడ్డారు. ఇతర వ్యాపార లావాదేవీలు, ఐటీ రిటరŠన్స్ చేసిన దాఖలు లేవు. నల్లధనం లెక్కలు చూపేందుకే ఇలాంటి సంస్థలను స్థాపించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సదరు ఆస్తులను, బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు గతంలోనే జప్తు చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు కొనసాగింపుగా చెన్నై ఎంఏఆర్సీ నగర్లోని ఆది ఎంటర్ప్రైజెస్కు సొంతమైన రూ.380 కోట్ల విలువైన 4.3 ఎకరాల ఫిర్హెవెన్ ఎస్టేట్ను ఇటీవల జప్తు చేశారు. ప్రస్తుత మార్కెట్ «ధర కాకుండా 2015లో ఆ ఎస్టేట్ కొనుగోలు విలువనే అధికారులు జప్తులో లెక్క చూపారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా పడిపోయి ఉన్న సమయంలోనే ఇంతపెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేయడంపై అధికారులు విస్తుపోయారు. గుజరాత్కు చెందిన సునీల్ కెట్పాలియా, మనీష్ బార్మర్ అనే వ్యక్తుల నుంచి ఆ ఎస్టేట్ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. గత ఏడాది ఐటీ దాడుల తరువాత నుంచి ఇప్పటి వరకు జరిపిన విచారణలో ఇదే ఎస్టేట్కు సంబంధించి రూ.70 కోట్లు జప్తు చేసి ఉన్నారు. ఆది సంస్థ పెద్ద ఎత్తున వ్యాపారం ఏమీ చేయకుండానే కోట్లాది రూపాయల లావాదేవీలు నిర్వహించింది. మారిషస్ దేశంలోని పసిట్టోలోస్ ఇన్వెస్టిమెంట్ లిమిటెడ్ నుంచి రూ.250 కోట్లు విదేశీమారక ద్రవ్యంగా ఆది సంస్థకు ముట్టింది. ఈ నిధులను వెచ్చించే ఆది సంస్థ చెన్నైలో ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేసింది. అలాగే సునీల్ కెట్పాలియా డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఎడిసన్ ఎనర్జీ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ఆది సంస్థలో రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు అధికారులు కనుగొన్నారు. ఎడిసన్ ఎనర్జి సంస్థలో మరో డైరెక్టర్గా వ్యక్తి అన్నాడీఎంకేలోని ఒక ప్రముఖ నేత సన్నిహితుడిని పరోక్షంగా శశికళను ఉద్దేశించి ఐటీ అధికారులు తెలిపారు. సునీల్, మనీష్ కలిసి 2015లో పెరంబూరు బేరక్స్ రోడ్డులో లాండ్మార్క్స్ గ్రూపునకు చెందిన ఒక భారీ అపార్టుమెంటు నిర్మాణాన్ని చేపట్టారు. ఇలా మనీష్ సుమారు 12 బినామీ సంస్థలను నిర్వహించి భారీ ఎత్తున నల్లధనం కూడగట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. అలాగే సునీల్ కెట్పాలియాకు ఎందరో అన్నాడీఎంకే నేతలు, మాజీ మంత్రులతో సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్నారు. అంతేగాక అన్నాడీఎంకే నేతలకు అనేక పనులు చేసిపెట్టే బ్రోకర్గా కూడా సునీల్ పనిచేసినట్లు తెలుసుకున్నారు. 2011లో అన్నాడీఎంకే అధికారంలోకి వరకు సదరు సునీల్ చిన్నపాటి వడ్డీ వ్యాపారం, శశికళ బినామీ కంపెనీల్లో ఉద్యోగిగా ఉండేవాడు. ఈవిధంగా ఏర్పడిన పరిచయాలతో తానే ఒక బినామీ సంస్థ యజమానిగా ఎదిగినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. శశికళ బంధువులు, బినామీలను గుర్తిస్తూ ఆస్తుల జప్తునకు పూనుకోవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. జైలు జీవితం ఏడాది పూర్తి: ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్న శశికళ బుధవారంతో ఏడాది జైలు జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన తుదితీర్పు వెలువడగా 15వ తేదీన శిక్ష ఖైదీగా ఆమె బెంగళూరు జైల్లోకి వెళ్లారు. చిన్నమ్మతోపాటు ఆమె వదిన ఇళవరసి, అక్క కుమారుడు సుధాకరన్ సైతం అదే రోజున జైలు జీవితాన్ని ప్రారంభించారు. జయలలిత తొలి వర్ధంతి గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన మౌనవ్రతాన్ని ప్రారంభించిన శశికళ మంగళవారం శివరాత్రి పర్వదినం సందర్భంగా విరమించినట్లు తెలుస్తోంది. -
కుటుంబీకులపై శశికళ అసహనం
సాక్షి, చెన్నై: బంధుగణానికి చిన్నమ్మ శశికళ క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తున్నది. న్యాయవాదుల ద్వారా తన సందేశాన్ని పంపించారు. అన్నాడీఎంకే అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ ప్రతినిధి, అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్కు వ్యతిరేకంగా ఆ కుటుంబంలోనే విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. చిన్నమ్మ సోదరుడు దివాకరన్ ఓ వైపు, వదిన ఇలవరసి కుమార్తె కృష్ణ ప్రియ మరో వైపు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దినకరన్కు వ్యతిరేకంగా కృష్ణప్రియ రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. కుటుంబంలో ఆస్తుల వ్యవహారంలో చాపకింద నీరులా సాగుతూ వచ్చిన విభేదాలు, తాజాగా రాజకీయ వేదికగా తలబడ్డేందుకు సిద్ధం అవుతుండడం చర్చకు దారి తీసింది. ఈ సమాచారాలు ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ దృష్టికి చేరింది. తనను కలిసేందుకు వచ్చిన న్యాయవాదులతో కుటుంబంలో సాగుతున్న పరిణామలపై చిన్నమ్మ అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష రాజకీయాలంటూ వాదులాటలు వద్దని, సంయమనంతో వ్యవహరించాలని, దూకుడును పక్కన పెట్టి శాంతియుతంగా ముందుకు సాగాలని కుటుంబీకులకు న్యాయవాదులు ద్వారా ఆమె సందేశాన్ని పంపించినట్టు అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో చర్చసాగుతోంది. -
‘ సినిమాలో మాదిరి.. ఒక్క రోజులో సీఎం కాలేరు’
సాక్షి, టీ. నగర్: సినిమాల్లో జరిగినట్లు ఎవరూ ఒక్క రోజులో ముఖ్యమంత్రి కాలేరని పేరవై ప్రధాన కార్యదర్శి జె.దీప అన్నారు. తనపై రూ. 1.12 కోట్లు మోసగించినట్లు ఆరోపణలు రావడం శశికళ కుటుంబీకులు చేసిన కుట్రగా జె. దీప పేర్కొన్నారు. కడలూరులో ఎంజీఆర్ అమ్మ దీప పేరవై తూర్పు జిల్లా ఆధ్వర్యంలో ఎంజీఆర్, జయలలిత బహిరంగ సభ, సంక్షేమ సహాయకాల పంపిణీ కార్యక్రమం తేరడి మైదానంలో సోమవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దీప మాట్లాడుతూ.. జయలలిత జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆమె పుట్టిన రోజు నుంచి రాయడం ప్రారంభించారని తెలిపారు. అన్నాడీఎంకేను, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. జయలలిత మృతిపై విచారణ కమిషన్ ఏర్పాటైందని, ఈ కమిషన్ ద్వారా వాస్తవాలు బయటపడుతాయని తెలిపారు. అంతేకాక ఆమె తనపై వచ్చిన రూ. 1.12 కోట్ల వ్యవహారం ప్రస్తావించారు. దీనిపై మోసం చేసినట్లు ఫిర్యాదులందాయని వాపోయారు. తనపై ఇది వరకే అనేక ఫిర్యాదులు చేయడమే కాకుండా అసత్యాలను వెల్లడిస్తున్నారని ఆమె అన్నారు. ప్రస్తుతం రూ. 1.12 కోట్లు మోసం చేసినట్లు వచ్చిన ఫిర్యాదు శశికళ కుటంబీకులు చేసిన కుట్రగా జె. దీప తెలిపారు. -
చిన్నమ్మ మౌనవ్రతం.. అందుకేనా..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: గుట్కా అక్రమ అమ్మకాల గుట్టును రట్టు చేసేందుకు ఐటీ అధికారులు తహతహలాడుతుండగా, శశికళ మౌనవ్రతం విచారణకు అడ్డంకిగా మారింది. వచ్చేనెల 10వ తేదీ తరువాత విచారణకు సిద్ధమని చిన్నమ్మ చెప్పడంతో బెంగళూరు జైలుకు చెన్నై ఐటీ అధికారులు సమాయత్తంఅవుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ, ఆమె సమీప బంధువులు ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్లు జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి విదితమే. ఇదిలా ఉండగా శశికళ బంధువులు బోగస్ కంపెనీలు నడుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు గత ఏడాది నవంబర్లో బంధువులు, మిత్రుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు వెయ్యిమందికి పైగా అధికారులు ఏకకాలంలో 187 చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో.. సుమారు 50కి పైగా బోగస్ కంపెనీలు నడుపుతున్నట్లుగా రుజువు చేసే అనేక డాక్యుమెంట్లు అధికారులకు దొరికినట్లు సమాచారం. ఈ డాక్యుమెంట్ల పరిశీలనలో రూ.1,430 కోట్ల పన్ను ఎగవేసినట్లు లెక్కకట్టారు. ఇంత పెద్ద ఎత్తున బోగస్ కంపెనీల నిర్వహణ వెనుక శశికళ హస్తం ఉందని అనుమానించిన ఐటీ అధికారులు తనిఖీలు పూర్తికాగానే ఆమె బంధువులకు సమన్లు పంపి వేర్వేరుగా విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, బోగస్ కంపెనీల్లో శశికళ పేరు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆదాయపు పన్ను ఎగవేసిన బంధుమిత్రుల జాబితాలో శశికళ పేరును చేర్చినట్లు సమాచారం. పోయెస్ గార్డెన్లోని జయలలిత ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించినపుడు ఒక పెన్డ్రైవ్, కంప్యూటర్లలోని సమాచారం, డిస్కులను, గుట్కా వ్యవహారంలో ఐటీశాఖ ప్రభుత్వానికి అందజేసిన ఉత్తరం దొరికాయి. ఐటీ శాఖ ఉత్తరం శశికళ గదిలోకి ఎలా చేరిందనేది అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. వీటన్నింటినీ శశికళకు నేరుగా చూసి సమాచారం సేకరించాలని, స్వయంగా విచారిస్తేగానీ ఇంకా అనేక నిజాలు వెలుగుచూడవని భావిస్తున్నారు. అయితే ఆమె బెంగళూరులో ఖైదీగా ఉండడం అధికారులను ఆలోచనలో పడేసింది. విచారణ కోసం చెన్నైకి పిలిపించడం ఎంతో శ్రమతో కూడుకున్నదని కావడంతో తామే బెంగళూరుకు జైలుకు వెళ్లడం ఉత్తమమని భావిస్తున్నారు. ఈ మేరకు అనుమతి కోరుతూ బెంగళూరు జైలు అధికారులకు ఇటీవల ఉత్తరం కూడా రాశారు. గత ఏడాది డిసెంబర్ నుంచి శశికళ మౌనవ్రతం పాటిస్తున్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. మౌనవ్రతం వల్ల విచారణలో జాప్యం నెలకొనే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని ఐటీ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారుల అభ్యంతరాన్ని తెలుసుకున్న శశికళ... విచారణకు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిపై ఐటీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఐటీ దాడులు, గుట్కా వ్యవహారంలో శశికళను నేరుగా విచారించక తప్పని పరిస్థితులు నెలకొన్న విషయాన్ని ఉత్తరం ద్వారా తెలిపామన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ తరువాత విచారణకు ఆమె సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు. విచారణ తేదీ ఖరారు కాగానే చెన్నై నుంచి అధికారుల బృందం బెంగళూరుకు వెళ్లి ఒక ప్రత్యేక గదిలో శశికళను విచారిస్తారు. శశికళను విచారించిన తరువాత ఈ వ్యవహారంలో తర్వాత అడుగు పడనుంది. -
మరో బాంబు పేల్చిన శశికళ సోదరుడు
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించి ఏడాది పూర్తైనా అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘అమ్మ’ ఎలా చనిపోయారన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా శశికళ సోదరుడు దివాకరన్ మరో బాంబు పేల్చారు. జయలలిత ఒకరోజు ముందుగానే కన్నుమూశారని వెల్లడించారు. 2016 డిసెంబర్ 4నే ‘అమ్మ’ చనిపోయిందని, అయితే 5న మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారని తెలిపారు. జయలలిత మద్దతుదారులు హింసాత్మక చర్యలకు దిగుతారన్న భయంతో ఆమె మరణవార్తను ఆలస్యంగా ప్రకటించాలని అన్నాడీఎంకే పార్టీ సూచించడంతో ఈవిధంగా చేశారని వివరించారు. ‘జయలలిత డిసెంబర్ 4న సాయంత్రం 5.15 గంటలకు మరణించారు. శాంతిభద్రతల సమస్య వస్తుందన్న కారణంతో అన్నాడీఎంకే పార్టీ ‘అమ్మ’ మరణవార్తను ఆలస్యంగా ప్రకటించింది. ఈలోపు రాష్ట్రంలోని అన్ని అపోలో ఆస్పత్రుల దగ్గర భద్రతను పెంచార’ని వెల్లడించారు. జయలలిత తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబర్ 5న అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. ‘అమ్మ’ మృతి వెనుక ఆమె నెచ్చెలి శశికళ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. జయ మృతిపై అపోలో ఆస్పత్రి ఇప్పటికే వివరణ ఇచ్చింది. అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయవిచారణ జరపాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేయడంతో పళనిస్వామి ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. -
వదినామరదళ్లు! కన్నడం పరవళ్లు
జైలు జీవితం ఎందుకని అడిగితే... చేసిన తప్పుకు శిక్షను అనుభవించడానికి అని చెప్తాం. నిజానికి నేరం చేసిన వారిని జైల్లో ఉంచడం వెనుక ఉన్న పరమార్థం వారిలో పరివర్తన తీసుకురావడమే. అలాంటి పరివర్తన అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు మొదలైనట్లే ఉంది. నాలుగేళ్ల శిక్షలో భాగంగా శశికళ కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో ఉంటున్నారు. అక్కడ ఆమె ‘అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్’ (వయోజన అక్షరాస్యత కార్యక్రమం)లో చేరి కన్నడ అక్షరాలు దిద్దుతున్నారు. కన్నడలో పదాలు చదవడం, రాయడం నేర్చుకుంటున్నారు. అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషన్ క్లాస్లకూ హాజరవుతున్నారు. లైబ్రరీలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. మౌనమే సమాధానం శశికళ కన్నడ భాషను ఏ మేరకు నేర్చుకున్నారనేది నిర్ధారించడానికి అధికారులు ఇప్పటికే ఒక మౌఖిక కూడా నిర్వహించారు. అయితే ఆ రోజు శశికళ మౌనవ్రతంలో ఉండటంతో ఏ ప్రశ్నలకూ నోరు తెరిచి సమాధానం ఇవ్వలేదు. మౌఖికంగా సమాధానాలివ్వకపోయినా ఆమె కన్నడ అక్షరాలు, పదాలను చక్కగా రాస్తున్నారని, సిలబస్ను చక్కగా పూర్తి చేశారనే ఒక అంచనాకు రావడానికి అది సరిపోతుందని జైలు వర్గాలు అంటున్నాయి. అంటే.. ‘లిటరసీ ప్రోగ్రామ్’లో విజయవంతంగా పాల్గొన్నట్లు శశికళ చేతికి త్వరలోనే ఒక సర్టిఫికెట్ రాబోతోంది. శశికళతోపాటు అదే కేసులో శిక్షను అనుభవిస్తున్న ఆమె మరదలు ఇళవరసి కూడా కన్నడం నేర్చుకుంటున్నారు. మహిళలకు లైబ్రరీ! ఇప్పటి వరకు పరప్పన సెంట్రల్ జైలులో మహిళల విభాగంలో లైబ్రరీ లేదు. ఇప్పుడు శశికళ చొరవతో లైబ్రరీని విస్తరించి మరో రెండు విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒకటి విచారణ ఖైదీలకు, మరొకటి మహిళా ఖైదీల కోసం. మహిళల లైబ్రరీ కోసం ముప్పై వేలు పెట్టి వార్తాపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు అన్నీ కలిపి 91 పత్రికలు తెప్పించడానికి రంగం సిద్ధమైంది. ర్యాక్లు రెడీ అవుతున్నాయి! – మంజీర -
చిన్నమ్మ గదిలో ‘గుట్కా’
సాక్షి, చెన్నై : అత్యంత రహస్యంగా పంపిణీ గుట్కా లేఖలు చిన్నమ్మ శశికళ గదిలో బయట పడడం ఆదాయ పన్ను శాఖ వర్గాల్ని విస్మయంలో పడేసింది. తమ దాడుల్లో బయట పడ్డ ఆ లేఖల్ని కోర్టుకు సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో గుట్కా, హాన్స్ తదితర మత్తు పదార్థాల విక్రయాలకు నిషేధం విధించిన చాప కింద నీరులా మార్కెట్లో లభిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది రెడ్హిల్స్ సమీపంలో మాదక ద్రవ్యాల నిరోధక విభాగం జరిపిన దాడులు చర్చకు దారి తీశాయి. మాధవరావు అనే వ్యక్తి వద్ద లభించిన డైరీ ఆధారంగా ఈ గుట్టుకు సహకరిస్తున్న వారి జాబితా బయట పడడం కలకలం రేపింది. ఇందులో ప్రభుత్వ అధికారులు, ఓ మంత్రి, ఐపీఎస్ బాసులు ఉండడంతో ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలోపడ్డాయి. అలాగే గుట్కా గుట్టు వ్యవహారం నిగ్గు తేల్చాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని బెంచ్ ముందు సాగుతూ వస్తున్నది. పిటిషన్ విచారణలో భాగంగా సెంట్రల్ ఎక్సైజ్ వర్గాలు తమ తరఫు నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ పరిస్థితుల్లో ఆదాయపన్ను శాఖ తరఫున సైతం కోర్టుకు ఓ నివేదిక సమర్పించేందుకు తగ్గ కసరత్తులు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకుతగ్గ కొత్త సమాచారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ అధికారులు, పోలీసు బాసుల్లో ఆందోళన బయలుదేరి ఉండడం గమనార్హం. ఇందుకు నిదర్శనం, గతంలో రహస్యంగా ఆదాయపన్ను శాఖ పంపిన లేఖలు పోయెస్గార్డెన్లోని చిన్నమ్మ శశికళ గదిలో లభించి ఉండడమే. ఆ లేఖలు ఇక్కడికి ఎలా వచ్చాయో..? 2016 ప్రారంభంలో తాము పంపిన లేఖలు, కొన్ని నెలల అనంతరం మాయం కావడాన్ని ఆదాయ పన్ను శాఖ తీవ్రంగానే పరిగణించింది. ప్రభుత్వ అధికారులు ఈ లేఖలు అప్పట్లో సీఎంగా ఉన్న జయలలిత దృష్టిలో పడకుండా జాగ్రత్తలే తీసుకున్నట్టున్నాయి. ఇందుకు తగ్గ పరిణామాలు తాజాగా వెలుగులోకి రావడం చర్చకు దారి తీసింది. ఆదాయ పన్ను శాఖ వర్గాలు తరచూ పోయెస్ గార్డెన్లోని జయలలిత నివాసంలో తనిఖీలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ వేదా నిలయంలోనే చిన్నమ్మ శశికళకు ప్రత్యేక గది ఉంది. ఇందులో తాము పంపిన రహస్య లేఖలు బయట పడడంఆదాయ పన్ను శాఖ వర్గాల్ని విస్మయంలో పడేసినట్టు సమాచారం. ఈ లేఖలు ఇక్కడకు ఎలా వచ్చాయో, గుట్కా గుట్టు పూర్తిగా రట్టు చేయడానికి ఆ విభాగం వర్గాలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈనెల 17వ తేదీన హైకోర్టులో గుట్కా కేసు విచారణకు రానున్న సమయంలో తమ తరఫున ఓ నివేదికను కోర్టు ముందు ఉంచేందుకు ఐటీ వర్గాలు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో పలువురు పోలీసు బాసులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో ఆందోళన బయలు దేరింది. గుట్కాపై లేఖలు గుట్కా వ్యవహారం చిలికి చిలికి అతి పెద్ద స్కాంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాది రూ. 250 కోట్ల మేరకు టర్నోవర్ రహస్యంగా సాగి ఉండడం ఇందుకు నిదర్శనం. ఆదాయ పన్ను శాఖ వర్గాలు ఈ గుట్కా గుట్టును 2016 ప్రారంభంలోనే తేల్చి ఉన్నారు. ఇందులో ఉన్న అధికారులు ఎవ్వరెవ్వరో వివరిస్తూ, అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని రహస్య లేఖల్ని పంపారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్మెహన్ రావు, అప్పటి డీజీపీలకు ఈ రహస్య లేఖలు పంపినట్టు సమాచారం. ఈ లేఖల్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదాయ పన్ను శాఖ సూచించింది. ఢిల్లీలోని ఉన్నతాధికారుల నుంచి సైతం కొన్ని రహస్య సమాచారాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్టు సంకేతాలు ఉన్నాయి. అయితే, ఈ లేఖలపై ఎలాంటి చర్యలు లేవని చెప్పవచ్చు. ఈ సమయంలో అమ్మ అనారోగ్యం బారిన పడడంతో ఆ లేఖ వ్యవహారం కాస్త తెర మరుగు అయిందని చెప్పవచ్చు. ఈ కాలంలో పలుమార్లు ఆదాయ పన్ను శాఖ నుంచి ప్రభుత్వ అధికారులకు సంకేతాలు వచ్చినా, లేఖలు కన్పించడం లేదన్నట్టు సమాధానాలు వెళ్లి ఉన్నాయి. ఆ తదుపరి పరిణామాలతో ఈలేఖలు పూర్తిగా తెర మరుగు అయినా, 2017లో రెడ్ హిల్స్లో సాగిన తనిఖీల పర్వంతో గుట్కా బండారం వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే, ప్రభుత్వ అధికారులకు పంపిణీ లేఖలు అప్పట్లో మాయమైనా, ప్రస్తుతం అవి మళ్లీ ఆదాయ పన్ను శాఖకు చేరడం గమనార్హం. -
శశికళ గదిలో జయకు రాసిన సీక్రెట్ లెటర్
సాక్షి, చెన్నై : తమిళనాడులో కలకలం సృష్టించిన గుట్కా స్కాంకు సంబంధించిన రహస్య లేఖ ఒకటి మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత నిచ్చెలి శశికళ గదిలో లభించింది. గత నవంబర్(2017)లో ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో ఇది బయటపడింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టుకు ఐటీ వారు ఇచ్చిన అఫిడవిట్ ఐటీ ప్రిన్సిపల్ డైరెక్టర్ సుసీ బాబు వర్గీస్ పేర్కొన్నారు. గుట్కా స్కాంపై వెంటనే సీబీఐ దర్యాప్తు నిర్వహించాలని డీఎంకే ఎమ్మెల్యే అంబజగన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఐటీ అధికారులు పోయెస్ గార్డెన్లోని వేద నిలయంలో సోదాలు నిర్వహించగా శశికళ గదిలో ఓ లేఖ లభించింది. వర్గీస్ తెలిపిన ప్రకారం.. ఆ లేఖ ఆగస్టు 11న 2016న నాటి ఐటీ ప్రిన్సిపల్ డైరెక్టర్ ముఖ్యమంత్రి జయలలితకు, నాటి డీజీపీకి లేఖ రాశారు. ఈ కుంభకోణంలో ఓ రాష్ట్ర మంత్రితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు సంబంధాలు కలిగి ఉన్నారని, పోలీసులకు కూడా సంబంధం ఉందని పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వంతో సంబంధం కలిగి ఉన్న పార్టీలన్నింటికి కూడా ముడుపులు పోయినట్లు వెల్లడించారు. వెంటనే దీనిపై స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. -
పోయెస్ గార్డెన్ వద్ద టెన్షన్ : జయ గదులు తెరవొద్దు!
సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్ద సంఖ్యలో ఐటీ, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయమే వేదనిలయానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న శశికళ వర్గీయులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పోయెస్ గార్డెన్ పరిసర ప్రాంతాలను స్వాధీనంలోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా 5 బెటాలియన్ల అదనపు బలగాలను మోహరింపజేశారు. ఆ రెండు గదులే కీలకం : విశాలమైన వేదనిలయం భవంతిని జయ స్మారక కేంద్రంగా మార్చాలని తమిళనాడు ప్రభుత్వం ఇదివరకే తీర్మానించింది. పొంగల్(సంక్రాంతి)లోపే ఆ కేంద్రాన్ని ప్రారంభించాలనుకున్న సీఎం పళని.. ఆ మేరకు చేయవలసిన పనుల బాధ్యతను చెన్నై కలెక్టర్కు అప్పగించారు. అయితే, జయ పర్సనల్ గదులు రెండింటి విషయంలో కొంత అయోమయం నెలకొంది. ఎందుకంటే.. గతంలో ఐటీ శాఖ వేదనిలయంలో సోదాలు నిర్వహించినప్పుడు ఆ రెండు గదులను సీజ్ చేశారు. వాటిని అలాగే వదిలేసి స్మారక కేంద్రంగా మార్చడం దాదాపు అసాధ్యం. కాబట్టే ఆ గదులను తెరిచే విషయమై ఐటీ, రాష్ట్ర రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ వారు వేదనిలయానికి వచ్చారు. జయ గదుల్ని తెరవొద్దు : సీజ్ చేసిన రెండు గదుల్ని తెరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలియగానే శశికళ వర్గంలో కలకలం మొదలైంది. పెద్ద సంఖ్యలో పోయెస్ గార్డెన్ వద్దకు చేరుకున్న శశి వర్గీయులు.. ‘అమ్మ గదులను తెరవొద్దు’ అంటూ నినాదాలు చేశారు. ప్రజల దృష్టిలో జయ ఇమేజ్ను దెబ్బతీసేందుకే పళని-పన్నీర్లు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. వేదనిలయాన్ని అమ్మ స్మారకంగా మార్చినా, అమ్మ నివసించిన గదులను మాత్రం తెరవకుండా అలానే వదిలేయాలని శశికళ వర్గం మొదటి నుంచీ వాదిస్తోంది. ఇంతకీ ఏమున్నాయక్కడ?: జయలలిత బతికున్నప్పుడు వినియోగించిన ఆ రెండు గదుల్లో పలు కీలక డాక్యుమెంట్లు, పెన్డ్రైవ్లు, ల్యాప్టాప్లు, ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు సమాచారం. గతంలో ఐటీ దాడుల అనంతరం ఆ రెండు గదులను సీజ్ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఆ గదుల్లోని అన్ని వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికే స్వాధీనం చేయాలని ఐటీ శాఖ భావిస్తోంది. కానీ శశి వర్గం మాత్రం అసలు గదులను తెరవనే తెరవొద్దని ఆందోళన చేస్తోంది. -
46 మంది అన్నాడీఎంకే నేతలపై వేటు
సాక్షి ప్రతినిధి, చెన్నై: దినకరన్కు మద్దతుగా నిలిచారనే ఆరోపణల కారణంగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల సహా 46 మంది పార్టీ జిల్లా కార్యదర్శులపై సీఎం ఎడపాటి పళనిస్వామి గురువారం బహిష్కరణ వేటు వేశారు. వారందరినీ పార్టీ పదవులు, అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వేటు పడిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఆర్ సామితో పాటు మదురై, విల్లుపురం, ధర్మపురి, తిరుచ్చిరాపల్లి, పెరంబులూరు జిల్లాలకు చెందిన నాయకులు ఉన్నారు. కాగా, జయలలిత మరణంపై విచారణ జరుపుతున్న రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అర్ముగస్వామి నేతృత్వంలోని కమిషన్ జయలలిత స్నేహితురాలు శశికళకు సమన్లు జారీ చేసినట్లు ఈ నెల 22న కమిషన్ కార్యాలయం వెల్లడించింది. శశికళ బెంగళూరు జైల్లో ఉన్నందున లిఖితపూర్వకంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలం నమోదు చేసుకుంటామని, తప్పనిసరైన పక్షంలో నేరుగా విచారణ జరుపుతామని తెలిపింది. కాగా, జయ చికిత్సపై ఆధారాలు అందజేయాల్సిందిగా ఈనెల 22వ తేదీన ఈ మెయిల్ ద్వారా కమిషన్ నుంచి వచ్చిన సమన్లను జైలు అధికారులు శశికళ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మెయిల్ ద్వారా వచ్చిన సమన్లను ఆమె నిరాకరించినట్లు, నేరుగా వచ్చి సమన్లు అందజేస్తేనే స్వీకరిస్తానని ఆమె వివరణ ఇచ్చినట్లు జైలు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, ఈ మెయిల్ ద్వారా శశికళకు సమన్లు పంపలేదని విచారణ కమిషన్ వివరణ ఇచ్చింది. -
శశికళ కుటుంబంలో ‘ఆర్కేనగర్’ చిచ్చు!
ఆర్కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్ గెలుపు శశికళ కుటుంబంలో ఆధిపత్య పోరుకు దారితీసింది. శశికళ సోదరి కుమారుడైన దినకరన్, ఆయన సోదరుడు భాస్కరన్.. శశికళ మేనకోడలు కృష్ణప్రియల మధ్య రాజకీయ వారసత్వం కోసం అంతర్గత కుమ్ములాట మొదలైనట్టు తెలిసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలనే కాదు, శశికళ కుటుంబంలో సైతం కలకలం రేపాయి. రాజకీయ వారసులు ఎవరనే అంశంలో కలతలు సృష్టించాయి. కుటుంబసభ్యులతో శశికళ భర్త నటరాజన్ ఇటీవల నిర్వహించిన వారసత్వ పంచాయితీ... పార్టీ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు దినకరన్ సిద్ధపడేవరకు వెళ్లింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో భారీ అధిక్యతతో దినకరన్ గెలుపొందిన సమయంలో జయలలిత, శశికళకు తానే అసలైన రాజకీయ వారసుడినని దినకరన్ ప్రకటించడం వారి కుటుంబంలో చిచ్చు రేపింది. ఆర్కేనగర్లో దినకరన్ను గెలిపించడం ద్వారా ప్రజలు, ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకేకు తామే వారసులమని రుజువైందని దినకరన్ తమ్ముడు భాస్కరన్ ప్రచారం మొదలుపెట్టారు. పార్టీ నడిపించే హక్కు తమకు మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం వద్ద రెండాకుల చిహ్నం మాత్రమే ఉంది, అది వారికి ఎలా వచ్చిందో అందరికీ తెలుసు, అయితే పార్టీ, కార్యకర్తలు తమవైపు ఉన్నారని భాస్కరన్ చేసిన వ్యాఖ్యలు దినకరన్కు ఆగ్రహం తెప్పిం చాయి. తమ ఇద్దరి మధ్య గత కొంతకాలంగా మాటలు లేవు, నేడు ఈ వాఖ్యానాలు ఏమిటని దినకరన్ ప్రశ్నించారు. పార్టీ, ప్రభుత్వం ఏదైనా నా మాటే చెల్లుబాటని దినకరన్ చేసిన ప్రకటనను శశికళ కుటుంబ సభ్యులు స్వాగతించడం లేదు. జయలలిత మరణానికి శశికళే కారణమని ప్రజలు ఆరోపించినా ఆమె మౌనంగా భరించారని, అయితే ఎన్నికల కోసం అపోలో దృశ్యాలను విడుదల చేసి జయలలితను దినకరన్ అవమానపరిచారని ఫేస్బుక్, మీడియా వద్ద కృష్ణప్రియ విరుచుకుపడ్డారు. దినకరన్ అనుచరుడు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. తానే శశికళ వారసురాలినని కృష్ణప్రియ ప్రకటించుకోవడం దినకరన్ అనుచరుల్లో ఆగ్రహం తెప్పించింది. దినకరన్, దివాకరన్, భాస్కరన్, వివేక్, కృష్ణప్రియల మధ్య చోటుచేసుకున్న విభేదాలు విశ్వరూపం దాల్చడంతో చెన్నై అడయారులోని శశికళ భర్త నటరాజన్ ఇంట రెండురోజుల క్రితం పంచాయితీ పెట్టారు. ఈ సమయంలో దినకరన్ మాట్లాడుతూ శశికళనో, మన కుటుంబాన్నో చూసి ఆర్కేనగర్ ప్రజలు ఓటువేయలేదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, తటస్థ ఓట్లే తనను గెలిపించాయని దినకరన్ వారి ముందు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మీరంతా ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండానే మేమే వారసులమని మీడియా ముందు ప్రకటించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. కృష్ణప్రియ సీమంతం నాటి ఫొటోలు (ఫైల్) కృష్ణప్రియకు రాజకీయాల గురించి ఏమి తెలుసు, జయలలిత సమక్షంలో పోయెస్గార్డెన్లో ఏనాడో జరిగిన తన సీమంతం ఫొటోను కృష్ణప్రియ ఇప్పుడు విడుదల చేయాల్సిన అవసరం ఏమిటని దినకరన్ రెట్టించి ప్రశ్నించారు. సీమంతం ఫొటో ద్వారా జయలలిత రాజకీయ, కుటుంబ వారసురాలిగా ప్రయత్నిస్తున్నారా అని కృష్ణప్రియను నిలదీశారు. మీడియాతో మాటలు, ఫేస్బుక్లో పోస్టింగులు ఇకనైనా నిలిపివేయాలని వారిని దినకరన్ హెచ్చరించినంత పనిచేశారు. అందరం ఇలా వ్యవహరిస్తే మళ్లీ చిక్కుల్లో ఇరుక్కుంటామని హితవు పలికారు. శశికళ చెబితేనే పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా, ఆమె ఆదేశిస్తే పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమని దినకరన్ కుటుంబ సభ్యులతో స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ ఈ దినకరన్ ఎక్కడున్నారు, ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడని కృష్ణప్రియ వ్యాఖ్యానించడంతో వారసత్వపోరు తారాస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. -
స్వామి మరో సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పటికీ ఆమె నామమాత్రంగానే ఉండేవారని, మొత్తం వ్యవహారాలు శశికళ చూసుకునేవారని అన్నారు. ఎక్కడ ? ఎవరు? ఎలా పనిచేస్తున్నారనే విషయాలు శశికళకే ఎక్కువగా తెలుసని అన్నారు. మంత్రుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిపై శశికళ పరిశీలన ఉండేదని అన్నారు. ఆర్కే నగర్ ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపు సాధిస్తాడని తాను ముందే ఊహించానని అన్నారు. అయినా తనకు ముందు నుంచే దినకరన్పై సానుభూతి ఉండేదని అన్నారు. శశికళకు అవకాశం ఇస్తే పరిపాలన కూడా చేయగలదనే దోరణిలో స్వామి వ్యాఖ్యలు చేశారు. -
అన్నాడీఎంకే అసలు సారథి శశికళే
-
నేనూ రాజకీయాల్లోకి వస్తా..!
‘నేనూ రాజకీయాల్లోకి వస్తా.. ఎలా వస్తాను.. ఏ మార్గంలో వస్తానో వచ్చే ఏడాది వరకు వేచి చూడండి’ అంటున్నారు శశికళ వదిన ఇళవరసి కుమార్తె డాక్టర్ కృష్ణప్రియ. జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను దినకరన్ విడుదల చేయడం బాహ్యప్రపంచంలోనే కాక శశికళ కుటుంబంలో సైతం వివాదాస్పదమైంది. మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కృష్ణప్రియ ఓ వారపత్రిక ఇంటర్వ్యూలో సంచలన ప్రకటన చేశారు. సాక్షి, చెన్నై: శశికళ కుటుంబం నుంచి ఏకైక నేతగా చక్రం తిప్పుతున్న టీటీవీ దినకరన్కు చెక్పెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ్రçకమంలో ఇళవరసి కుమార్తె డాక్టర్ కృష్ణప్రియ రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలు కెళ్లేముందు తన ప్రతినిధిగా అక్క కుమారుడైన టీటీవీ దినకరన్ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించింది. జయలలిత రాజకీయాలకు పరోక్ష వారసులుగా శశికళ కుటుంబం నుంచి దినకరన్ మాత్రమే రంగంలో ఉన్నారు. ఆర్కేనగర్ నుంచి పోటీ చేయడం ద్వారా చురుకైన రాజకీయ పాత్ర పోషిస్తున్నారు. అయితే జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను దినకరన్ విడుదల చేయడం వల్ల శశికళ కుటుంబంలో మనస్పర్థలు తలెత్తాయి. ఎవరికీ తెలియకుండా, శశికళ అనుమతి తీసుకోకుండా తన స్వార్థం కోసం విడుదల చేయడంపై శశికళ వదిన ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ బహిరంగంగా మీడియా వద్దనే ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపధ్యంలో కృష్ణప్రియ ఒక తమిళ వారపత్రికకు ఇచ్చిన ఇంటరŠూయ్వ శనివారం మాలైమురసు సాయంకాల దినపత్రికలో ప్రచురితమైంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్నపుడు సెల్ఫోన్ ద్వారా శశికళ చిత్రీకరించిన దృశ్యాలను పెరోల్పై వచ్చినపుడు మాకు అందజేశారు. అవసరమైన పక్షంలో ఆ దృశ్యాలను జయ విచారణ కమిషన్కు చూపాలని ఆమె కోరారు. ఆ వీడియోను కాపీ చేసి దినకరన్, వివేక్లకు అప్పగించాం. ఆ దృశ్యాలనే వెట్రివేల్ ద్వారా దినకరన్ ఇటీవల విడుదల చేయించారు. ఒరిజినల్ వీడియో ఇంకా చాలా సమయం చిత్రీకరించి ఉంది. జయలలిత, శశికళ మాట్లాడుకుంటున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. అయితే జయలలిత, శశికళ మాట్లాడుకునే దృశ్యాలను కత్తిరించి కొన్ని సెకన్లు వీడియోను మాత్రమే దినకరన్ విడుదల చేశారు. జయ వీడియో విడుదలైన సంగతి శశికిళకే తెలియదు. ఆమెపై హత్యానేరం ఆరోపణలు వచ్చినపుడు సైతం విడుదల చేయడం ఇష్టంలేని వీడియోను దినకరన్ కోసం విడుదల చేయడాన్ని శశికళ అంగీకరించి ఉండరు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎన్నికయినపుడు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆమె అనుకునే ఉంటే ఆనాడే విడుదల చేసేవారు. అయితే ఒకే ఒక నియోజకవర్గంలో గెలుపుకోసం, పార్టీ చిహ్నం తమవద్ద లేని సమయంలో వీడియో విడుదల చేయడానికి దినకరన్కు ఎలా బుద్ధిపుట్టిందో. తమ వద్ద వేలకొలదీ వీడియోలు ఉన్నాయని దివాకరన్ కుమారుడు జయంత్ చేసిన ప్రకటననే ఆనాడు శశికళ ఖండించారు. ఆ వీడియోను ప్రజల ముందు ఉంచడానికి తీయలేదని శశికళ స్పష్టంగా చెప్పారు. ఆమె ఆదేశాలను కాదని విడుదల చేయడం, దానిపై అభిప్రాయాలను వెలిబుచ్చడం ధర్మసమ్మతం కాదు. రాజకీయాల్లోకి కొందరు ఎంతో ఆసక్తిగా వస్తారు. దాన్ని తప్పు అని చెప్పలేం. నాకు రాజకీయాలపై ఆసక్తి ఉందా అంటే లేదనే చెబుతాను. అయితే రావాలనే ఆలోచన రాగానే కచ్చితంగా వచ్చి తీరుతాను. ఎలా వస్తాను, ఏ మార్గంలో వస్తాను అనేదానికి వచ్చే ఏడాది వరకు ఓపిగ్గా వేచి చూడండి. రాజకీయాల్లోకి వచ్చేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయకుండా లేను. నాకు పదేళ్ల వయసున్నపుడు కుటుంబంతో సహా పోయెస్ గార్డెన్లోని జయ ఇంటికి చేరుకున్నాం. మా అమ్మ ఇళవరసి, అత్త శశికళ రాజకీయ క్రీడల్లో చిక్కుకుని పడిన అవస్థలు, వారు ఎదుర్కొన్న ఒత్తిడులను చూస్తూనే ఎదిగాం. అలాంటి పరిస్థితులు నా పిల్లలకు రాకూడదనే కొంతకాలం మౌనంగా ఉన్నాను’’ అని కృష్ణప్రియ అన్నారు. వెట్రివేల్ అరెస్ట్కు లైన్క్లియర్ అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న వీడియో దృశ్యాలను విడుదల చేసిన నేరంపై బహష్కృత ఎమ్మెల్యే వెట్రివేల్ అరెస్ట్కు లైన్క్లియర్ అయింది. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేస్తున్న పిటిషన్ను చెన్నై జిల్లా మేజిస్ట్రేటు శనివారం కొట్టివేసింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల పోలింగ్కు మరో 24 గంటలు ఉండగా వీడియో విడుదల చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఈసీ పోలీసుకేసు పెట్టింది. అలాగే, జయ మరణంపై కమిషన్ విచారణ జరుగుతున్న సమయంలో వీడియో విడుదల చేయడాన్ని తప్పుపడుతూ కమిషన్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులతో వెట్రివేల్పై నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. ముందస్తు బెయిల్ను కోర్టు తిరస్కరించడంతో వెట్రివేల్ అరెస్ట్కు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, శశికళ అనుమతితోనే వీడియో విడుదల చేశానని దినకరన్ వాదిస్తున్నారు. వీడియో విడుదల బాహ్యప్రపంచలోనే కాక శశికళ కుటుంబలో సైతం వివాదాస్పదమైంది. దీంతో జనవరి మొదటి వారంలో దినకరన్ బెంగళూరుకు వెళ్లి శశికళను కలుసుకుంటున్నారు. అలాగే కృష్ణప్రియ సైతం శశికళను, తల్లి ఇళవరసిని బెంగళూరు జైల్లో కలిసి దినకరన్పై ఫిర్యాదు చేసేం దుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
దినకరన్పై శశికళ మేనకోడలు ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ మేనకోడలు డాక్టర్ కృష్ణప్రియ తాను వచ్చేఏడాది రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఆర్కేనగర్లో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ జయ వీడియో దృశ్యాలను విడుదల చేయడం వారి కుటుంబాల్లో మనస్పర్ధలకు దారితీసింది. శశికళ వదిన ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ దీనిపై తీవ్రంగా స్పందించారు. ఒక తమిళ వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘జయలలిత, శశికళ మాట్లాడుకునే దృశ్యాలను కత్తిరించి కొన్ని సెకన్ల వీడియోనే విడుదల చేశారు. జయ వీడియో విడుదలైన సంగతి శశికళకే తెలియదు. ఆమెపై హత్యానేరం ఆరోపణలు వచ్చినపుడు విడుదల చేయడం ఇష్టంలేని వీడియోను దినకరన్ కోసం విడుదల చేయడాన్ని శశికళ అంగీకరించి ఉండదు. ఒకే ఒక నియోజకవర్గంలో గెలుపుకోసం, పార్టీ చిహ్నం తమవద్ద లేనప్పుడు వీడియో విడుదల చేయడానికి దినకరన్కు ఎలా బుద్ధిపుట్టిందో..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జయ మృతిపై శశికళ, అపోలో చైర్మన్కు సమన్లు
చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలను నివృత్తి చేయడానికి ఏర్పాటు అయిన విచారణ కమిషన్ శుక్రవారం ముగ్గురికి సమన్లు జారీ చేసింది. జయలలిత నిచ్చెలి శశికళ, అపోలో గ్రూప్ ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డికి కమిషన్ సమన్లు ఇచ్చింది. 15 రోజుల్లోగా నేరుగా విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. కాగా అన్నాడీఎంకే అధినేత్రి అయిన జయలలిత 75రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలొదిలిన సంగతి తెలిసిందే. జయలలితన శ్వాస తీసుకోలేని స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఆమె కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందించామని ప్రీతారెడ్డి ఢిల్లీలో ఓ తమిళ చానెల్కు గతంలో వెల్లడించారు. మరోవైపు జయను ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని, రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఆమె జ్వరంతో బాధపడుతున్నారనే ప్రకటనను ఇచ్చినట్లు అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి కూడా పేర్కొన్న విషయం విదితమే. అంతేకాకుండా జయలలితకు చికిత్స జరుగుతున్న సమయంలో శశికళ... ఎవరినీ లోనికి అనుమతించలేదని, జయను చూడనివ్వలేదనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. జయలలిత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గత ఏడాది డిసెంబర్ 5 న అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. ఆమె మృతి వెనుక ఆమె నెచ్చెలి శశికళ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. జయ మృతిపై అపోలో ఆస్పత్రి ఇప్పటికే వివరణ ఇచ్చింది. అయినా, జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయవిచారణ జరపాల్సిందేనని ఆమె వీరవిధేయుడు పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం అమ్మ జయలలిత మృతిపై న్యాయవిచారణకు ఆదేశించింది. దీంతో విచారణ కమిషన్... ఇందుకు సంబంధించి ఒక్కొక్కరినీ విచారణ చేస్తోంది. తాజాగా శశికళతో పాటుగా ప్రతాప్ రెడ్డి, ప్రీతారెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఇక జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి వీడియో అనూహ్యంగా బుధవారం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. చెన్నైలోని ఆర్కే నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగడానికి ఒక్కరోజు ముందు ఈ వీడియో విడుదల కావడం గమనార్హం. అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ వర్గానికి చెందిన, శాసనసభలో అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యే వెట్రివేల్ ఈ వీడియో విడుదల చేశారు. -
శశికళ మాజీ సీఎం?.. ఇదేంది ఇమ్రాన్ ఖాన్!?
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ దారుణంగా పొరపడ్డారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరును శశికళగా పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ మధ్యే చనిపోయిన శశికళ.. ప్రజల మనసుల్లో బతికే ఉన్నారంటూ.. ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇమ్రాన్ ఖాన్.. వాస్తవాలు తెలుసుకుని ట్వీట్ చేస్తే మంచిది. లేకపోతే పరువు పోతుంది అంటూ విమర్శకులు వరుస ట్వీట్లు గుప్పించారు. అవినీతి గురంచి ఇమ్రాన్ మాట్లాడుతూ... ‘దక్షిణ భారత ప్రముఖ నటి, తమిళనాడు ముఖ్యమంత్రి శశికళ ఈ మధ్యే మరణించారు. ఆమె ఇంట్లో భారీ స్థాయిలో బంగారు, వెండి, కోట్ల రూపాయల అక్రమ సొమ్మును గుర్తించారు. ఇదంతా అవినీతి సొమ్మే. పేద ప్రజల నుంచి దోచుకున్నదే’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. వెంటనే ఇమ్రాన్ ఖాన్ వెంటనే తొలగించారు. ఇమ్రాన్ తప్పుడు ట్వీట్పై గల్ఫ్ న్యూస్లో సీనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తున్న సాదిక్ ఎస్ భట్ గుర్తించారు. వెంటనే ఆయన డియర్ ఇమ్రాన్ ఖాన్, మీరు తప్పుడు ట్వీట్ చేశారు. దానిని దిద్దుకోండి అంటూ రిప్లయి ట్వీట్ చేశారు. అంతేకాక చనిపోయింది జయలలిత అని, అవినీతి ఆరోపణలపై ఇప్పుడు జైల్లో ఉన్నది శశికళ అని ఆయన చెప్పారు. జయలలితకు శశికళ స్నేహితురాలు అని చెప్పారు. ఇదిలాఉండగా.. గతంలోనూ ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి తప్పుడు ట్వీట్లు చాలనే చేశారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గురించి కూడా ఇటువంటి పొరపాటునే ట్విటర్లో చేశారు. Dear @ImranKhanPTI you got it completely wrong. Sasikala is in jail. Her friend Jayalalitha, ex-CM of Tamil Nadu, died late last year and those pictures are obviously fake. One expects better from a senior politician like you. pic.twitter.com/6arkmZBYVD — Sadiq S Bhat (@sadiquiz) December 19, 2017 -
జయ, శశికళల కథతో ‘శశిలలిత’
దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మరో వివాదాస్పద చిత్రాన్ని ప్రకటించారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న శశికళ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. శశిలలిత పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా విశేషాలను మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టుగా వెల్లడించారు. శశికళ.. జయలలితకు సేవకురాలిగా ఆమె జీవితంలోకి ప్రవేశించి రాజ్యాంగేతర శక్తిగా ఎలా ఎదిగారన్న ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందించనున్నట్టుగా తెలిపారు. యాదార్ధ సంఘటనల ఆధారాలతో నిర్మిస్తున్న ఈ సినిమాలో శశికళ, జయలలిత జీవితంలో ప్రవేశించిన దగ్గర నుంచి జయలలిత హాస్పిటల్ లో జరిగిన ప్రతి సంఘటనను ముఖ్యంగా సెప్టెంబర్ 22 నుంచి డిసెంబర్ 5 వరకు జరిగిన ప్రతి సంఘటన ఈ చిత్రం లో తెరకెక్కిస్తానని చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. అయితే కొందరు అనుకున్నట్టు శశికళ జీవితం ఆధారంగా సినిమా తీస్తే తమిళనాడుకు చెందిన శశికళ వర్గం అయిన మన్నర్ కుడి మాఫియా నా అంతుచూస్తారని బెదిరిస్తున్నారు అన్నారు. గతంలో జయలలిత బ్రతికుండగానే జయలలిత ను తెలుగు భాష కు తమిళనాడు లో జరుగుతున్న అన్నాయం పై ఎదిరించటం జరిగిందని, అప్పుడే తనను ఏ శక్తి ఏమీ చేయలేక పోయిందన్నారు. జయలలిత మరణం వెనుక కుట్ర ఉందని శశికళ పై సుప్రీంకోర్టు లో కేసు వేసిన నాడే తనను ఏమీ చేయలేదని , ఒక లక్ష్యం తో పనిచేసే వారిని ఏ శక్తి అడ్డుకోలేదని కేతిరెడ్డి తెలిపారు . త్వరలోనే శశికళ, జయలలిత పాత్రలకు నటీమణుల ఎంపిక చేసి ప్రకటిస్తానని తెలిపారు. -
శశికళ, ఇళవరసిల బోగస్ సంస్థల బాగోతం
-
అవసరమైతే వారిద్దరు అరెస్ట్
అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ, ఆమె బంధుమిత్రులపై ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) అధికారులు మెరుపుదాడులు నిర్వహించిన సంగతి పాఠకులకు విదితమే. ఈనెల 9వ తేదీ నుంచి ఆరురోజులు పాటు జరిగిన దాడుల సందర్భంగా రూ.1500 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు రూ.7 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణలో రూ.1012 కోటి అవకతవకలు సాగినట్లుగా అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. కొద్దిరోజుల విరామం తరువాత చెన్నై పోయెస్గార్డెన్లోని జయలలిత నివాసంలో జరిపి రెండు కంప్యూటర్లు, లాప్ట్యాప్లు, నాలుగు పెన్డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటూ అనేక కొరియర్ రశీదులు దొరికిన సమాచారం సోమవారం వెలుగులోకి వచ్చింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఐటీ దాడులతో ఇప్పటికే ఊపిరి సలపలేనంత ఉత్కంఠ ఎదుర్కొంటున్న శశికళ, ఇళవరసిల మెడకు మరో ఉచ్చు బిగుసుకోనుంది. పది బోగస్ సంస్థల ద్వారా భారీ మోసానికి పాల్పడిన అభియోగంపై సీబీఐ త్వరలో కేసు బనాయించనుంది. అవసరమైతే వారిద్దరిని మరోసారి అరెస్ట్ చేస్తామని సీబీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. బోగస్ సంస్థల బాగోతం ఐటీ దాడుల సమయంలో శశికళ, ఇళవరసి డైరెక్టర్లుగా, వారి బినామీ పేర్లతో పలు బోగస్ సంస్థలు ఉన్న విషయం బయటపడింది. గత ఏడాది నవంబరులో రూ.1000, రూ.500ల పెద్ద నోట్లు రద్దయిన తరువాత దేశంలో అనేక బోగస్ సంస్థలు మూతపడ్డాయి. మూతపడ్డ వాటిల్లో శశికళ, ఇళవరసి వారి బంధువులకు చెందిన పది బోగస్ సంస్థలున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థల ద్వారా కొన్ని కోట్లరూపాయల గోల్మాల్ సాగినట్లుగా సమాచారం ఉన్నందున విచారణ చేపట్టాల్సిందిగా ఐటీ శాఖను కేంద్రం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు చెన్నై ఐటీశాఖ ప్రధాన సంచాలకులు మురళీకుమార్, ఫస్ట్క్లాస్ ప్రధాన సంచాలకులు తిరుమలకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఈ ప్రత్యేక బృందం తీవ్రస్థాయిలో రహస్య విచారణ చేపట్టింది. ఈ బోగస్ సంస్థల ద్వారా అనేక కొత్త సంస్థలకు నగదు రవాణా జరిగింది. ఈ కొత్త సంస్థలకు ఇళవరసి కుమారుడు వివేక్, కుమార్తెలు కృష్ణప్రియ, షకీలల, మిత్రులు బినామీలుగా వ్యవహరిస్తున్న సంగతి బయటకు వచ్చింది. ఈ బోగస్ సంస్థల ద్వారా విదేశీమారక ద్రవ్యాన్ని సైతం చలామణి చేసినట్టు తేలింది. బోగస్ కంపెనీల్లో పేర్కొన్న చిరునామాల్లో ఆయా సంస్థలు కాకుండా నివాస గృహాలు, ఒకే చిరునామా కింద అనేక సంస్థలు ఉండడాన్ని కనుగొన్నారు. ఈ సమాచారం మేరకే ఇటీవల శశికళ బంధుమిత్రుల ఇళ్లపై ఐటీదాడులు చేపట్టడా, రూ.1500 కోట్ల విలువైన ఆస్తిపత్రాలు రూ.7 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే జయ నివాసంలో జరిగిన సోదాల్లో అనేక కొరియర్ రశీదులు దొరికాయి. దీంతో విలువైన ఆస్తిపత్రాలను విదేశాలకు చేరవేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తూ రశీదులను విశ్లేషిస్తున్నారు. సీబీఐకి నివేదిక మొత్తం ఈ వ్యవహారంపై ఒకటి రెండు రోజుల్లో నివేదికను తయారు చేసి సీబీఐకి అప్పగించాలని ఐటీ అధికారులు నిర్ణయించారు. నివేదిక అందగానే శశికళ అండ్ కో పై కేసులు నమోదకు సీబీఐ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంతేగాక సీబీఐ అధికారులు ఇప్పటికే రహస్య విచారణ ప్రారంభించారని తెలుస్తోంది. సీబీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ, తమ దృష్టికి వచ్చిన కొన్ని బోగస్ సంస్థలకు శశికళ, ఇళవరసి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఐటీ నుంచి నివేదిక అందగానే దాన్ని ఫిర్యాదుగా పరిగణించి కేసులు పెడతామని తెలిపారు. అవసరమైతే వారిద్దరినీ అరెస్ట్ చేస్తామని చెప్పారు. -
పెన్ డ్రైవ్లో రహస్యమా?
ఆదాయ పన్ను శాఖ మరింతగా దూకుడు పెంచనుంది. చిన్నమ్మ కుటుంబీకులకు చెందిన 85 బ్యాంకుల్లోని 240 లాకర్ల తాళాల్ని తెరిచేందుకు చర్యలు వేగవంతం అయ్యాయి. ఢిల్లీ నుంచి అనుమతి రాగానే, పోయెస్ గార్డెన్ వేద నిలయంలోని అమ్మ గదిలో సోదాలకు ప్రత్యేక బృందం సిద్ధం అవుతోంది. మరికొన్ని చోట్ల దాడులు లక్ష్యంగా మరికొన్ని బృందాలు రంగంలోకి దిగబోతున్నాయి. అలాగే, పరప్పన అగ్రహార చెరలోని ఆ ఇద్దర్నీ విచారించేందుకు అనుమతి కోరుతూ బెంగళూరు కోర్టును ఆశ్రయించేందుకు తగ్గ చర్యల్లో మరో బృందం నిగమ్నమైనట్టు సమాచారం. సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ అండ్ ఫ్యామిలీని గురిపెట్టి సాగిన ఐటీ సోదాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. ప్రస్తుతం విచారణ వేగం పెరిగింది. ఇందులో భాగంగా అమ్మ జయలలిత సహాయకుడు పూంగుండ్రన్ ఇచ్చిన సమాచారం మేరకు పోయెస్ గార్డెన్లోని వేద నిలయంలో తనిఖీలు సాగాయని సమాచారం. అక్కడ అన్ని గదుల్లో తనిఖీలు సాగినా, అమ్మ జయలలిత గది దగ్గరకు మాత్రం వెళ్ల లేదు. ఆ ఇంటి నుంచి కంప్యూటర్, పెన్ డ్రైవర్తో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఐటీ అధికారులు తీసుకెళ్లారు. అందులో లభించిన సమాచారం, ఐదారు రోజుల పాటు సాగిన సోదాల్లో దొరికిన ఆధారాల మేరకు ఇక, చిన్నమ్మ శశికళతో పాటు పరప్పన అగ్రహార చెరలో ఉన్న ఇళవరసిని కూడా విచారణ వలయంలోకి తెచ్చేందుకు కసరత్తులు సాగుతున్నాయి. మనో వేదనలో చిన్నమ్మ పరప్పనఅగ్రహార చెరలో ఉన్న శశికళ, ఇళవరసిలను విచారించడం లక్ష్యంగా ప్రత్యేక బృందం ఒకటి రెండు రోజుల్లో బెంగళూరుకు పయనం అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. బెంగళూరు కోర్టును ఆశ్రయించి అనుమతుల్ని కోరబోతున్నట్టు చెబుతున్నారు. ఇక్కడకు చిన్నమ్మను గానీ, ఇళవరసిని గానీ తీసుకొచ్చే ప్రసక్తే లేదని, అంతా బెంగళూరు జైలు వేదిగానే విచారణలు సాగుతాయని ఓ అధికారి పేర్కొన్నారు. ఇక, ఈ విచారణ గురించి పరప్పన అగ్రహార చెర అధికారి రమేష్ కుమార్ను ఓ మీడియా కదిలించగా, ఆ ఇద్దర్ని విచారించేందుకు తగ్గ సమాచారం తమకు ఇంతవరకు రాలేదన్నారు. కోర్టు అనుమతితో వస్తే అంగీకరిస్తామని పేర్కొన్నారు. ఇదివరకు కోర్టు అనుమతితో ఇక్కడ విచారణలో సాగాయని గుర్తుచేశారు. కాగా, ఇప్పటికే ఐటీ దాడులు, భర్త నటరాజన్కు జైలు శిక్ష, ప్రస్తుతం తమ వద్ద విచారణకు రంగం సిద్ధం అవుతుండడంతో చిన్నమ్మకు కంటి మీద కనుకు కరువైనట్టు సమాచారం. బ్యాంకు లాకర్లపై గురి ఐటీ సోదాల్లో లభించిన సమాచారాల మేరకు చిన్నమ్మ అండ్ ఫ్యామిలీకి ప్రైవేటు, సహకార పరిధిలోని 85 బ్యాంకుల్లో ప్రత్యేకంగా 240 లాకర్లు ఉన్నట్టు ఐటీ వర్గాలు గుర్తించాయి. ఆ లాకర్లను తెరిచేందుకు చర్యలు చేపట్టి ఉన్నారు. ఆయా బ్యాంకులకు ఇప్పటికే తనిఖీలకు సంబంధించి లేఖలు వెళ్లినట్టు, ఒకటి రెండు రోజుల్లో లాకర్లలో ఉన్న మరింత అక్రమార్జన గుట్టును బయటపెట్టడంతో పాటు, మరికొన్ని ఐటీ సోదాలకు అవకాశాలు ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే, ఢిల్లీ నుంచి అనుమతి రాగానే, అమ్మ జయలలిత గది తాళం తెరవడం ఖాయం అని చెబుతున్నారు. మిడాస్ మద్యం బంద్ శశికళ కుటుంబానికి చెందిన మిడాస్ స్పిరిట్, లిక్కర్స్ ద్వారా అనేక మద్యం బ్రాండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. కాంచీపురం జిల్లా పడప్పై సమీపంలోని వేల ఎకరాల విస్తీరణంలో ఉన్న పరిశ్రమ నుంచి ఉత్పత్తి అయ్యే బ్రాండ్లన్నీ టాస్మాక్ మద్యం దుకాణాల్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇక్కడి బ్రాండ్లకే ఇదివరకు ప్రాధాన్యత ఉండేది. అయితే, ప్రస్తుతం ఐటీ దాడుల నేపథ్యంలో మిడాస్ మద్యం కొనుగోలును టాస్మాక్ వర్గాలు నిలుపుదల చేశాయి. ఐటీ దాడులు, విచారణల నేపథ్యంలో ఎక్కడ తమ మీద ఐటీ కన్ను పడుతుందో అనే బెంగో లేదా, మరేదేని కారణాలో ఏమోగానీ మిడాస్ బ్రాండ్ల కొనుగోలును నిలుపుదల చేస్తూ మార్కెటింగ్ శాఖ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పెన్ డ్రైవ్లో రహస్యమా? దినకరన్ ఆదివారం తంజావూరులో మీడియాతో మాట్లాడుతూ, అబ్బో పెన్డ్రైవ్లో రహస్యాలు ఉన్నాయా..? అని వ్యంగ్యాస్త్రం సంధించారు. పెన్ డ్రైవ్ అంటే అందులో వ్యక్తిగత విషయాలు ఉండవచ్చు, రహస్యాలూ ఉండ వచ్చని వ్యాఖ్యానించారు. అంత మాత్రాన అభూత కల్పనలతో వ్యాఖ్యలు చేయ వద్దు అని సూచించారు. శశికళ భద్రతకు అమ్మ చర్యలు తీసుకోలేదని దివాకరన్ వ్యాఖ్యానించడంలో తప్పు లేదని పేర్కొన్నారు. జయలలిత కష్ట సుఖాల్లో శశికళ పాలు పంచుకున్నారని, అమ్మ ఇప్పుడు లేని దృష్ట్యా, చిన్నమ్మకు ఎదురు అవుతున్న కష్టాల్ని చూసి, ఆమె సోదరు దివాకరన్ అలా చెప్పి ఉంటారని, దీనిన భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. సింహం లేదు కాబట్టే .. ఐటీ సోదాల గురించి పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, మత్స్య శాఖ మంత్రి జయకుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సింహం జీవించి ఉన్నప్పుడు గుంట నక్కలు గుహలోకి చొరబడ్డాయని, ఆ నక్కల పుణ్యమా ఇప్పుడు గుహలో సోదాలు తప్పలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పోయెస్ గార్డెన్లోని వేద నిలయం కోటిన్నర మందితో కూడిన అన్నాడీఎంకే కేడర్కు ఆలయం అని, ఆ గుంట నక్కల రూపంలో ఇప్పుడు ఆలయానికి సంక్లిష్ట పరిస్థితులు తప్పడం లేదని వ్యాఖ్యానించారు. సింహం గుహలో ఉండి ఉంటే, దర్జాగా చొరబడి తనిఖీలు చేసి ఉంటారా..? అని ఐటీ వర్గాలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఇక, పీఎంకే అధినేత రాందాసు ఓ ప్రకటనలో పేర్కొంటూ, జయలలిత ఏదో అవినీతికి దూరం అన్నట్టుగా అనేక మంది వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. అవినీతిలో జయలలిత మహారాణి అయితే, శశికళ యువ రాణి అని ఎద్దేవా చేశారు. కాగా, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఐటీ దాడుల గురించి తూత్తుకుడిలో పేర్కొంటూ, ఇక్కడ వ్యక్తిగత దాడులు జరగలేదని, ఐటీ వర్గాలు సేకరించిన సమగ్ర సమాచారం మేరకు సోదాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం. సీఎం పళని స్వామి మరో మారు మీడియా ముందు స్పందిస్తూ పోయెస్ గార్డెన్లో సోదాలు తీవ్ర మనోవేదనకు గురి చేసినట్టు వ్యాఖ్యలు గుప్పించారు. టీఎన్సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ స్పందిస్తూ, ఐటీ దాడులు చిన్నమ్మ కుటుంబానికే పరిమితం చేయకుండా, అన్నాడీఎంకే వర్గాలందర్నీ గురి పెట్టాలని, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, మాజీలు, అందర్నీ వలయంలోకి తీసుకొస్తే బండారాలన్నీ బయటకు వచ్చి తీరుతాయని వ్యాఖ్యానించారు. వీడియోను అమ్మే చిత్రీకరించమన్నారు ఆసుపత్రిలో అందుతున్న వైద్య చికిత్సల గురించి అమ్మ జయలలిత వీడియో చిత్రీకరించమన్నట్టు శశికళ సోదరుడు దివాకరన్ వ్యాఖ్యానించారు. ఓ మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడుతూ, అమ్మకు అందుతున్న వైద్యంలో అనుమానాలు అంటూ, డీఎంకే ఆరోపణలు గుప్పించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో అమ్మ జయలలిత వైద్య చికిత్సల గురించి వీడియో చిత్రీకరణ చేయాలని సూచించినట్టు పేర్కొన్నారు.తనకు ఏదేని జరిగిన పక్షంలో, మరేదేని జరగవచ్చు అని, ద్రోహులు మన వద్దే ఉన్నట్టు శశికళ వద్ద అమ్మే స్వయంగా వ్యాఖ్యానించినట్టు వివరించారు. అయితే, శశికళకు భద్రతగా ప్రత్యేక వలయం ఏర్పాటు చేయక పోవడం ప్రశ్నార్థకం అని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి జయకుమార్ లాంటి వాళ్లు తమను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ, వ్యక్తిగత పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఐటీ దాడులు ఎక్కడైనా జరగనీయండి, జరగవచ్చు అని వ్యాఖ్యానిస్తూ, పోయెస్ గార్డెన్లో జరగడం మనో వేదనకు గురిచేసిందన్నారు. పోయెస్ గార్డెన్లో పెన్ డ్రైవ్, కంప్యూటర్లు సీజ్ చేసినట్టుగా తనకు తెలియదన్నారు. అయితే, విచారణ అన్నది వచ్చాక, ఆ వలయంలోకి అందరూ తప్పకుండా వచ్చి తీరుతారని, ఇది జరుగుతుందని ముగించారు. -
‘అలా చేయడం అమ్మను అవమానించడమే’
సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసంలో ఐటీ సోదాలు చేయడం అమ్మను అవమానించడమే అని అన్నాడీఎంకే బహిష్కృత నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు.. పోయెస్ గార్డెన్, వేద నిలయంలో ఐటీ దాడులు నిర్వహించడంపై ఆయన మండిపడ్డారు. ఈపీఎస్, ఓపీఎస్ కలిసే ఈ డ్రామా ఆడుతున్నారని దినకరన్ మండిపడ్డారు. డీఎంకే హయాంలో జయలలిత నివాసంలో సోదాలు జరిగాయని, అయితే ఇప్పుడు అన్నాడీఎంకే పాలనలోనే పోయెస్ గార్డెన్లో తనిఖీలు జరగడంతో జయలలిత ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఇటీవల శశికళ, దినకరన్, జయ టీవీ కార్యాలయంతో పాటు దేశంలోనే 187 ప్రాంతాలలో రికార్డు స్థాయిలోదాడులు జరిగిన విషయం విదితమే. అయితే ఇప్పటి వరకు జరిగిన దాడులపై గుంభనంగానే ఉన్నా జయలలిత నివాసంలో తనిఖీలపై తీవ్ర నిరసన ఎదురవుతోంది. ముందస్తుగానే న్యాయస్థానం అనుమతి తో జయటీవీ ఎండి వివేక్ నుండి తాళాలు తీసుకున్న అధికారులు జయ నివాసంలో సుమారు మూడు గంటలపాటు ఈ తనిఖీలు నిర్వహించారు. ఇక్కడి జయ అంతరంగిక గదితోపాటు ఆమె సహాయకుడైన పూకుండ్రన్ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు అక్కడి నుండి ఓ ల్యాప్ టాప్, నాలుగు పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి జయ నివాసంలో ఐటీ దాడులు సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటుంది. -
ఇక ఆ ఇద్దరి వంతు
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని శశికళ బంధుమి్రత్రులను జల్లెడపట్టిన ఐటీ అధికారులు ఇకబెంగళూరు బాటపట్టనున్నారు.అక్రమార్జనకు సూత్రధారి,కీలకపాత్రధారిగా భావిస్తున్నశశికళను బెంగళూరు జైల్లోనేవిచారించనున్నారు. అదే జైల్లోశిక్ష అనుభవిస్తున్న శశిబంధువులు ఇళవరసి,సుధాకరన్లను కూడావిచారణ పరిధిలోకితీసుకొస్తున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘మన్నారుగుడి మాఫియా’గా ముద్రపడిన శశికళ బంధుమిత్రుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈనెల 9 నుంచి 14వరకు ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ పేరుతో జరిపిన ఐటీ దాడుల్లో రూ.30వేల కోట్ల ఆస్తులు బయటపడడంతో అధికారుల కళ్లు బైర్లుకమ్మాయి. శశికళ అండ్ కోను హడలెత్తించారు. ఐటీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తమ వాహనాలకు పెళ్లి వేడుక స్టిక్కర్లు వేసుకుని 187చోట్ల ఏక కాలంలో మెరుపుదాడులు నిర్వహించి కంగారు పుట్టించారు. ప్రజల్లో పెద్ద మనుషులుగా చలామణి అయ్యేందుకు ఉపయోగపడుతున్న జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రికపై కూడా ఐటీ కొరడా ఝుళిపించింది. ఈ సందర్భంగా ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకోగా మరికొన్ని ముఖ్యమైన పత్రాలను శశికళ బంధువర్గం మాయం చేసిందని అనుమానిస్తూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన దాడులకు సంబంధించి శశికళ బంధువులతో విచారణ çపూర్తికావడానికి పదిరోజులపాటూ పట్టే అవకాశం ఉంది. కొడనాడు ఎస్టేట్లోని కొంతభాగాన్ని తనిఖీ చేయడం పూర్తికాగా, జయలలిత, శశికళల ప్రయివేటు గదుల తనిఖీలు ఇంకా మిగిలి ఉన్నాయి. అక్రమార్జనలో శశికళనే కీలకపాత్రధారిగా ఐటీ స్వాధీనం చేసుకున్న పత్రాలు రుజువు చేస్తున్నాయి. పెరోల్లోనూ పెద్దనేరం చెన్నైలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్ను పరామర్శించేందుకు శశికళ ఇటీవల ఐదురోజుల పెరోల్పై చెన్నైకి వచ్చారు. పెరోల్ రోజుల్లో బసచేసిన ఇల్లు, భర్త ఉన్న ఆస్పత్రి మినహా ఎక్కడికీ వెళ్లరాదని, ముఖ్యంగా పార్టీ నేతలను కలుసుకోరాదని జైళ్లశాఖ కఠినమైన నిబంధనలు విధించింది. ఆ నిబంధనలకు అనుగుణంగానే శశికళ ఐదు రోజులు పూర్తిచేసుకుని తిరిగి జైలుకు చేరుకున్నారు. అయితే ఈ ఐదు రోజుల కాలంలో 622 ఆస్తుల్లోనే పేర్లను తారుమారు చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఆరు రోజులపాటూ జరిపిన ఐటీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా అధికారులు ఈమేరకు నిర్ధారించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఒక అధికారి మాట్లాడుతూ, తనిఖీల సమయంలో బయటపడిన అనేక సంస్థలకు శశికళతో సంబంధాలున్నట్లు తేలిందని తెలిపారు. ఈ కారణంగా శశికళను తప్పనిసరిగా విచారించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. 622 ఆస్తుల మార్పిడి శశికళ బసచేసిన ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ ఇంటిలోనే జరిగిందని భావిస్తున్నారు. శశికళను, ఆమె అన్న భార్య ఇళవరసి, సుధాకరన్లను విచారించేందుకు చట్టపరంగా అనుమతి పొందుతామని, అలాగే బెంగళూరు పరప్పన అగ్రహార జైళ్ల శాఖకు ఉత్తరం రాస్తున్నామని తెలిపారు. రెండు లేదా మూడువారాల్లో అనుమతి లభిస్తుంది, విచారణ ప్రారంభిస్తామని అన్నారు. ఆర్కే నగర్లా అసెంబ్లీ ఎన్నికలు జయ ప్రాతినిథ్యం వహించిన చెన్నై ఆర్కేనగర్లో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి టీటీవీ దినకరన్ విచ్చలవిడిగా రూ.89 కోట్లు ఖర్చుచేసి ఐటీకి దొరికిపోవడంతో ఎన్నికలు రద్దయ్యాయి. అప్పట్లో అదో సంచలనం. కాగా, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కొడనాడు ఎస్టేట్ కేంద్రంగా చేసుకుని ఓటర్లకు భారీ ఎత్తున నగదు బట్వాడా జరిగినట్లుగా తాజా ఐటీ దాడుల్లో ఆధారాలు లభ్యం కావడం కలకలం రేపింది. అయితే ఆనాటి ఎన్నికలకు సార«థ్యం వహించిన జయలలిత జీవించి లేరు. అమ్మ వెనకాల అన్నీ తానై ఉండిన శశికళ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఐటీ దాడుల్లో దొరికిన ఆధారాలతో అసెంబ్లీ ఎన్నికల వ్యవహారాన్ని కూడా శశికళ నుంచి రాబట్టే అవకాశం ఉంది. ఐటీ దాడులు విఫలం : దివాకరన్ అట్టహాసంగా చేసిన ఐటీ దాడులు పూర్తిగా విఫలమని శశికళ సోదరుడు దివాకరన్ గురువారం మీడియా ముందు వ్యాఖ్యానించారు. ఆరు రోజులుపాటు తనిఖీలు చేసినా అధికారులు తమ నుంచి ఏమీ స్వాధీనం చేసుకోలేక పోయారని అన్నారు. -
ఐటీ అల్టిమేటం
ఐటీ దాడుల్లో ఆధారాలు లభించినా, కొన్ని కీలకరికార్డులు, దస్తావేజుల ఒరిజినల్స్ తమ చేతికి చిక్కని దృష్ట్యా, వాటన్నింటిని రెండ్రోజుల్లోపు సమర్పించాల్సిందే అని చిన్నమ్మ కుటుంబం, సన్నిహితులకు ఐటీ వర్గాలు అల్టిమేటం ఇచ్చాయి ఆరుగురికి సమన్లు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇక, విచారణ నిమిత్తం చిన్నమ్మ శశికళ అన్న జయరామన్ కుమార్తెలు కృష్ణప్రియ, షకీల బుధవారం ఆదాయ పన్ను శాఖ కార్యాలయం మెట్లను ఎక్కారు. ఐటీ దాడులు సహజమేఅని, ఇందులో రాజకీయం లేనే లేదంటూ కృష్ణప్రియ వ్యాఖ్యానించడం గమనించ దగ్గ విషయం. సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ కుటుంబాన్ని గురిపెట్టి సాగిన ఐటీ దాడులు, సోదాలు ముగియడంతో విచారణల వేగం పెరిగింది. అధికారుల పరిశీలనలో అక్రమార్జన బండారం బయటపడుతోంది. అదే సమయంలో కొన్ని సంస్థల్లో పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల వివరాలు లభించినా, ఒరిజినళ్లు దాడుల్లో తమకు చిక్కకపోవడంతో అధికారులు సందిగ్ధంలో పడ్డట్టు సమాచారం. ప్రధానంగా కీలక ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన ఒరిజినల్స్ ఎక్కడ దాచారన్న చర్చ బయలుదేరింది. దాచి పెట్టిన వాళ్లే వాటిని బయటకు తీసి, తమకు అప్పగించే రీతిలో ఐటీ వర్గాలు గడువును నిర్ణయిస్తూ అల్టిమేటం ఇవ్వడం గమనార్హం. వివేక్ చుట్టూ ఉచ్చు చిన్నమ్మ శశికళ అన్నయ్య జయరామన్, ఇళవరసి దంపతుల కుమారుడు వివేక్ చుట్టూ ఐటీ ఉచ్చు బిగుస్తున్న విషయం తెలిసిందే. వివేక్ పేరిట అత్యధికంగా ఆస్తులు, పెట్టుబడులు ఉన్నట్టు గుర్తించి, ఆ దిశలో విచారణ వేగం పెరిగింది. తమకు లభించిన ఆధారాలను పరిశీలించే క్రమంలో కొన్ని ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు లభించని దృష్ట్యా, వాటన్నింటిని రెండు రోజుల్లో తమకు స్వయంగా సమర్పిస్తే సరి..! అన్న హెచ్చరికతో వివేక్కు సమన్లు వెళ్లినట్టు సమాచారం. ఇక, వివేక్ సన్నిహితులుగా భావిస్తున్న సురానా ఫైనాన్స్, శ్రీలక్ష్మి జువలరీస్ తెన్నరసు, సునీల్, సెంథిల్, విండ్ ఎనర్జీ సుబ్రమణ్యంలకు సైతం ఒరిజినల్స్ సమర్పించే విధంగా హెచ్చరికతో కూడిన సమన్లు వెళ్లినట్టు సమాచారం. జాస్ సినిమాస్ కొనుగోలు వ్యవహారంతో పాటు, అనేక డాక్యుమెంట్లు జిరాక్స్లుగా తేల్చిన అధికారులు , దాచిపెట్టిన వాటిని బయటకు తీస్తారా..? లేదా, రిజిష్ట్రేషన్ల శాఖను ఆశ్రయించి, వివరాల్ని రాబట్టి, కఠినంగా వ్యవహరించమంటారా.? అన్న హెచ్చరికతో ఈ సమన్లు జారీ చేసినట్టు ఐటీ కార్యాలయంలో చర్చ. మనో వేదనలో చిన్నమ్మ, ఇళవరసి ఈ దాడులు, విచారణల పుణ్యమా అని పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశి కళ, ఇళవరసిలకు మనశ్శాంతి కరువైనట్టు సమాచారం. ఈ ఇద్దరు తీవ్ర మనోవేదనలో ఉన్నట్టు సమాచారం. అలాగే, దినకరన్కు చిన్నమ్మ లేఖ రాసినట్టు సమాచారం. ఆ లేఖలో ఐటీ దాడులు, వాటిని ఎదుర్కొనేందుకు తగ్గ వ్యూహాలు, ప్రశ్నలకు ఇవ్వాల్సిన సమాధానాల గురించి వివరించిన ట్టు తెలిసింది. ఈ లేఖ బుధవారం దినకరన్కు అందించినట్టుంది. అందుకే కాబోలు, ఆయన తరఫున ప్రతినిధులు ఓ ప్రకటన వెలువరించడం గమనార్హం. గత రెండు రోజులుగా మౌనంగా ఉన్న దినకరన్, తాజాగా జారీచేసిన ప్రకటనలో చిన్నమ్మ కుటుంబంలో ఉన్న వాళ్లంతా చదువుకున్న వాళ్లేనని, బాధ్యత గల సంస్థల్ని నిర్వర్తిస్తున్నారని, మోసాలతో, పన్ను ఎగవేతతో కాలం నెట్టుకు రావాల్సినంత దిగజారే పరిస్థితిలో లేదన్నట్గుగా ఆ ప్రకటన ఉండడం గమనార్హం. జీవనానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి నుంచి రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికి ఉన్నారు. విచారణకు కృష్ణ ప్రియ, షకీల చిన్నమ్మ శశికళకు తోడుగా పరప్పన అగ్రహార చెరలో ఇళవరసి కూడా శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈమె కుమారుడు వివేక్ను ఐటీ గురిపెట్టింది. ఇక, ఆమె కుమార్తెలు కృష్ణప్రియ, షకీలలను కూడా ఐటీ వర్గాలు విచారణకు పిలిచాయి. బుధవారం ఆ ఇద్దరు తమ భర్తలతో కలిసి నుంగంబాక్కంలోని ఐటీ కార్యాలయానికి వచ్చారు. ఈ ఇద్దర్ని వేర్వేరుగా కూర్చోబెట్టి ఐటీ వర్గాలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం. ప్రధానంగా కృష్ణప్రియ ఆధీనంలోని సంస్థలతో పాటు ఆమె నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున నగదు బదిలీలు సాగి ఉండడాన్ని పరిగణించి, అందుకు తగ్గ ప్రశ్నల్ని సంధించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అనేక ప్రశ్నలకు ఆమె దాటవేత ధోరణి అనుసరించగా, షకీల అయితే, సమాధానాలు ఇవ్వకుండా మౌనం వహించినట్టు సమాచారం. ఈ విచారణ అనంతరం మీడియాతో కృష్ణప్రియ మాట్లాడుతూ, ఐటీ విచారణకు పూర్తి సహకారం అందించామన్నారు. తన ఇంట్లో నుంచి ఎలాంటి రికార్డులు పట్టుకు వెళ్ల లేదని స్పష్టం చేశారు. ఐటీ దాడులు సహజమేనని, దీనిని వ్యతిరేకించడం, ఖండించడం అనవసరంగా పేర్కొన్నారు. ఈ దాడులు, విచారణల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారని, ఎప్పుడు పిలిచినా సంపూర్ణ సహకారం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే, జయ టీవీ మేనేజర్ నటరాజన్ సైతం విచారణకు హాజరు అయ్యారు. కొడనాడు చుట్టూ ఐటీ విచారణ చిన్నమ్మ కుటుంబంతో పాటు నీలగిరి జిల్లాలోని కొడనాడు ఎస్టేట్, గ్రీన్ టీ ఎస్టేట్ల చుట్టూ సాగుతోంది. ఇక్కడ సోదాలు ముగిసినా, ఐటీ అధికారులు విచారణ మాత్రం ముగించలేదు. తమ విచారణను ముమ్మరం చేశారు. కొడనాడు ఎస్టేట్ మేనేజర్ నటరాజన్, పక్కనే ఉన్న గ్రీన్ టీ ఎస్టేట్ మేనేజర్ పళనికుమార్లతో పాటు 20 మందిని ఒకరి తర్వాత మరొకరు చొప్పున విచారించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ పాత నోట్లు బయటపడడమే కాకుండా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నోట్ల కట్టలు ఓట్ల కొనుగోలుకు పంపించినట్టు ఓ జాబితా అధికారులకు చిక్కినట్టు సమాచారం. అందుకే ఆ జాబితా ఆధారంగా విచారణ ముమ్మరంగా సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ములాఖత్కు వివేక్ మేనత్త శశికళ, తల్లి ఇళవరసిలతో ములాఖత్కు వివేక్ కసరత్తుల్లో ఉన్నారు. ఇందుకు తగ్గట్టు న్యాయవాదులు పరప్పన అగ్రహార చెరలో వినతి పత్రాన్ని సమర్పించారు. పరప్పన అగ్రహార చెరలో శశికళ, ఇళవరసిలతో న్యాయవాదులు మూర్తి రావు, కృష్ణప్ప సమావేశం కావడం వెలుగు చూసింది. తాజా, పరిణామాల నేపథ్యంలోనే ఈ భేటీ సాగి ఉంటుందని, చట్టపరంగా ఎదుర్కొనేందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఆ న్యాయవాదుల్ని మీడియా ప్రశ్నించగా, తల్లి ఇళవరసిని కలిసేందుకు వివేక్ సమయం కోరి ఉన్నారని, అందుకు తగ్గ వినతి పత్రం, వివేక్ రాసిన లేఖ జైలు వర్గాలకు సమర్పించామని పేర్కొన్నారు. కాగా పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ దీనిపై మాట్లాడుతూ ఐటీ దాడుల్లో వెలుగుచూసిన అన్ని వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. శశికళ కుటుంబానికి సంబంధించిన కేసులన్నీ ప్రత్యేక న్యాయమూర్తిని నియమించి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
అత్యధిక ఆస్తులు ఆ ముగ్గురి పేర్లలోనే..
చిన్నమ్మ శశికళ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఐటీ వర్గాలకు కీలకం అయ్యారు. ఆ ముగ్గురి చుట్టే వేల కోట్ల ఆస్తుల రికార్డులు తిరుగుతున్నట్టు సమాచారం. ఆ ముగ్గురు ఎవరో కాదు.. చిన్నమ్మ తమ్ముడు దివాకరన్, అన్న జయరామన్ కుమారుడు వివేక్, కుమార్తె కృష్ణప్రియ కావడం గమనార్హం. రూ.30 వేల కోట్ల మేరకు చిన్నమ్మ ఫ్యామిలీకి ఆస్తులు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో వెలుగుచూసినట్టుగా ఓ నివేదిక ఢిల్లీకి పంపించడం చర్చకు దారితీసింది. ఇక, వివేక్ ఇంట మూడు తుపాకులు బయటపడ్డట్టు తెలిసింది. కొడనాడులో మంగళవారం ఆరో రోజు కూడా సోదాలు జరిగాయి. అక్కడున్న అమ్మ, చిన్నమ్మ గదుల్ని తనిఖీ చేయడం లక్ష్యంగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలకోసం ప్రత్యేక బృందం వేచి చూస్తుండడంతో అక్కడ మరెన్ని రికార్డులు వెలుగులోకి వస్తాయో అని ఉత్కంఠమొదలైంది. సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ కుటుంబాన్ని గురిపెట్టి సాగిన ఐటీ దాడుల్లో బయటపడ్డ రికార్డుల్ని పరిశీలించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఆ మేరకు ముఫ్పై వేల కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు సమాచారం. అలాగే, ఏడు కోట్ల మేరకు నగదు, ఐదు కోట్ల మేరకు బంగారం ఉన్నట్టు తేల్చారు. వజ్రాల విలువను తేల్చేందుకు ఐటీ వర్గాలు ప్రత్యేక నిపుణుల్ని రంగంలోకి దించే పనిలో ఉన్నాయి. 1,400 కోట్ల మేరకు పన్ను ఎగవేతతో పాటుగా 16 బ్యాంక్ లాకర్లను సీజ్ చేసినట్టు, అందులో ఉన్న తనిఖీలు జరపాల్సి ఉన్నట్టుగా పేర్కొంటూ, సమగ్ర వివరాలతో ఓ ప్రాథమిక నివేదిక ఢిల్లీకి చెన్నై నుంచి పంపించి ఉండడం గమనార్హం. అలాగే, వివేక్ ఇంట మూడు తుపాకులు బయటపడ్డట్టు, ఇందులో రెండింటికి మాత్రమే లైసెన్స్ ఉన్నట్టుగా, విదేశీ వాచ్లు, ఇతర వస్తువులు తదితర వివరాల్ని సైతం పొందుపరిచి ఉన్నట్టు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా త్వరలో సీబీఐ, ఈడీ వర్గాలు రంగంలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. వారే కీలకం చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి దినకరన్ మీద కన్నా ఆ కుటుంబంలోని ముగ్గురి మీద ఐటీ వర్గాల గురి కీలకంగా పడి ఉంది. వారి పేర్ల మీదే అత్యధికంగా ఆస్తులు ఉన్నట్టు, పెట్టుబడులు, సంస్థలు ఉన్నట్టు విచారణలో తేల్చి ఉన్నారు. ఆ ముగ్గురిలో ఒకరు చిన్నమ్మ తమ్ముడు దివాకరన్ కాగా, మరో ఇద్దరు అన్నయ్య జయరామన్ కుమారుడు వివేక్, కుమా ర్తె కృష్ణ ప్రియ కావడం గమనార్హం. ఇందులో వివేక్ తొలి టార్గెట్లో ఉంచిన ట్టు సమాచారం. తదుపరి బంధువులు డాక్టర్ శివకుమార్, విక్రమ్, జయ ఆనందన్, షకీలా, కార్తికేయన్ పేరిట ఆస్తులు అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. వీరందరూ విదేశాలకు చెక్కేయకుండా ముందస్తుగా విమానాశ్రయాలకు సమాచారం పంపించి ఉన్నారు. అలాగే, ఆ ముగ్గురు కీలక వ్యక్తులు పాస్ట్ పోర్టుల్ని సీజ్చేసినట్టు తెలిసింది. వివేక్, జాస్ ప్రతినిధుల విచారణ వివేక్ వద్ద కొన్ని గంటల పాటుగా ఐటీ వర్గాలు విచారించాయి. పట్టుబడ్డ రికార్డులు, నగలు, నగదు, పెట్టుబడుల గురించి ప్రశ్నల వర్షం కురిపించారు. ఐటీ వర్గాలు అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను సమాధానాలు ఇచ్చినట్టు మీడియాకు వివేక్ వివరించారు. నుంగంబాక్కంలోని ఇంటి వద్ద వర్షంలో తడుస్తూ మరీ మీడియాతో ఆయన మాట్లాడారు. అనేక ప్రశ్నలకు సమాధానం దాటవేయగా, కొన్నింటికి మాత్రం సమాధానం ఇచ్చారు. సంస్థల్లో పెట్టుబడులు, రికార్డుల గురించి ప్రశ్నించారని, అలాగే, వివాహ సమయంలో తన భార్యకు ఇచ్చిన నగల గురించి అడిగినట్టు వివరించారు. తమ సంస్థ తర్వాత సినిమా పంపిణీల వ్వవహారం గురించి ప్రశ్నించారని పేర్కొన్నారు. తమ సంస్థల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని, ఆదాయ పన్ను సక్రమంగానే చెల్లించామన్నారు. ఆదాయ పన్ను తనిఖీల్లో లోగుట్టు ఉన్నట్టు తాను భావించడం లేదన్నారు. తాను అన్ని సక్రమంగానే చెల్లించానని, తప్పుచేస్తే తానైనా, మంత్రి అయినా, మీరైనా శిక్షించబడుతారని, తనవైపు ఎలాంటి తప్పు లేదని ధీమా వ్యక్తంచేశారు. దయచేసి తప్పుడు ప్రచారం మాత్రం చేయవద్దని, ఐటీ ఎప్పుడు పిలిచినా విచారణకు వెళ్లి సంపూర్ణ సహకారం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇక, జాస్ సినిమాస్కు చెందిన ముగ్గురు ప్రతినిధుల వద్ద ఐటీ వర్గాలు కొన్ని గంటల పాటుగా విచారించారు. బుధవారం దివాకరన్ను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొడనాడులో ఆరో రోజు తనిఖీలు అన్నిచోట్లా ఐటీ దాడులు ముగిసినా కొడనాడులో మాత్రం ఆరో రోజు మంగళవారం కూడా కొనసాగింది. గ్రీన్ టీ ఎస్టేట్ ఎలా చిన్నమ్మ గుప్పెట్లోకి వచ్చిందో అన్న విషయంగా తాజా పరిశీలన, తనిఖీలు సాగాయి. ఆరుగురు అధికారుల బృందం అక్కడే తిష్ట వేశారు. తేయాకు పతనం సమయంలో గ్రీన్టీ ఎస్టేట్ వేలంకు వచ్చినట్టు, దానిని బలవంతంగా చిన్నమ్మ తన గుప్పెట్లోకి తీసుకున్నట్టు విచారణలో తేలినట్టు సమాచారం. ఇక, కొడనాడు ఎస్టేట్లో అమ్మ జయలలిత, చిన్నమ్మ శశికళకు ప్రత్యేక గదులున్నాయి. ఈ రెండింటిలో తనిఖీలకు ఐటీ వర్గాలు నిర్ణయించాయి. అయితే, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన అనంతరం ఇక్కడ తనిఖీలు సాగనున్నాయి. ఈ దృష్ట్యా, ఈ రెండు గదుల్లో ఎలాంటి రికార్డులు బయటకు వస్తాయోనన్న ఉత్కంఠ బయలుదేరింది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు తప్పుచేసి, అక్రమ మార్గంలో ఆస్తుల్ని గడించిన వారికి శిక్ష తప్పదని కేంద్ర సహాయ మంత్రి పొన్ రా«ధాకృష్ణన్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకేను వాళ్లే సర్వనాశనం చేసుకుంటున్నారని, ఇందులో తలదూర్చాల్ని అవసరం కేంద్రానికి లేదన్నారు. చిన్నమ్మ ఆస్తులు గడించడం వెనుక అమ్మ ప్రమేయం ఉండవచ్చా..? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, వెనుక ఎవరు ఉన్నారు.. ముందు ఎవరు నడిపిస్తున్నారు..! అన్న విషయాలన్నీ విచారణలో నిగ్గుతేలుతాయని సమాధానం ఇచ్చారు. ఇక, తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకే ఎస్ ఇళంగోవన్ పేర్కొంటూ, పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళను బయటకు తీసుకు వచ్చి ఐటీ దాడులపై విచారణ చెన్నైలో జరగాలని, అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్ పేర్కొంటూ, అన్నాడీఎంకేను తమ గుప్పెట్లోకి తీసుకోవడం, ఓ శిబిరాన్ని పూర్తిగా తమలో కలుపుకోవడం లక్ష్యంగానే ఐటీని కేంద్రం ఉసిగొల్పిందని ఆరోపించారు. -
చిక్కుల్లో ‘చిన్నమ్మ’ ఫ్యామిలీ
చిన్నమ్మ శశికళ కుటుంబీకులు చిక్కుల్లో పడ్డారు. వారి మెడకు ఐటీ ఉచ్చు బిగియనుంది. సోదాల్లో లభించిన ఆధారాల మేరకు ఒక్కొక్కర్ని వేర్వేరుగా విచారించేందుకు అధికారులు నిర్ణయించారు. ఆ కుటుంబానికి చెందిన వారందరికీ సమన్లు జారీచేస్తున్నారు. జయ టీవీ, జాస్ సినిమాస్ సీఈవో వివేక్ను తమ కార్యాలయంలో ఉంచి ఐటీ వర్గాలు విచారించే పనిలో పడ్డాయి. దివాకరన్ను విచారించేందుకు రంగం సిద్ధం అయింది. ఇక, ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న పుహలేంది, డాక్టర్ శివకుమార్, పూంగుండ్రన్ల వద్ద విచారణ సాగుతోంది. ఐటీ అధికారులకు లభించిన రికార్డులు, బ్యాంక్ లావాదేవీల వివరాల మేరకు చిన్నమ్మ కుటుంబీకులు, సన్నిహితులు పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.250 కోట్ల మేరకు పాత కరెన్సీని కొత్తవిగా మార్చినట్టుగా పరిశీలనలో తేలింది. కొన్నిచోట్ల పాత నోట్లను మార్చ లేక అలాగే, వదిలి పెట్టి ఉండటాన్ని గుర్తించారు. తన కుటుంబాన్ని ఐటీ చుట్టుముట్టడంతో పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ కలవరంలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ దాడులపై మాట్లాడితే ఎక్కడ తమను టార్గెట్ చేస్తారో అనే భయంతో చిన్నమ్మ ప్రతినిధి దినకరన్ మద్దతు అన్నాడీఎంకే వర్గాలు ఐటీ దాడుల గురించి నోరు మెదపడం లేదు. సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ కుటుంబాన్ని గురిపెట్టి ఐటీ అధికారులు గురువారం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఐదో రోజుగా సోమవారం కూడా సోదాలు సాగాయి. జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక కార్యాలయాలు, జాస్ సినిమాస్, ఈ సంస్థల సీఈఓ వివేక్ నివాసం, ఆయన సోదరి కృష్ణ ప్రియ నివాసం మిడాస్ స్పిరిట్స్ అండ్ లిక్కర్లతో పాటు ఎనిమిది చోట్ల తాజాగా తనిఖీలు సాగాయి. అలాగే, రాయపేటలోని ఓ ప్రైవేటు భవన నిర్మాణ సంస్థలో హఠాత్తుగా తనిఖీలు చేసి, కొన్ని రికార్డులను ఐటీ వర్గాలు స్వాధీనం చేసుకు న్నాయి. సాయంత్రానికి అన్ని చోట్ల తనిఖీలు ముగియడంతో చిన్నమ్మ కుటుంబీకుల్ని, సన్నిహితుల్ని విచారణ వలయంలోకి తీసుకొ చ్చే పనిలో ఐటీ వర్గాలు నిమగ్నం అయ్యాయి. పరిశీలనలో 500మంది అధికారులు 1800మంది అ«ధికారులు ఏకకాలంలో ఐటీ దాడులకు దిగి స్వాధీనం చేసుకున్న రికార్డులు, దస్తావేజులు, నగదు, నగలు, ఇతర ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన వివరాల డాక్యుమెంట్లు, ఇలా అన్నింటినీ చెన్నైలోని ఐటీ కార్యాలయానికి తరలించారు. నుంగంబాక్కంలో ఉన్న ఐటీ కార్యాలయంలో సూట్ కేసుల్లో, బాక్సుల్లో, గోనె సంచుల్లో ఉన్న వాటన్నింటిని సమగ్రంగా పరిశీలించేందుకు అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఐదు వందల మందితో కూడిన అధికారుల బృందాలు క్షుణ్ణంగా డాక్యుమెంట్లను పరిశీలించే పనిలో నిమగ్నం అయ్యాయి. ఆ మేరకు చిన్నమ్మ శశికళ పెరోల్ మీద బయటకు వచ్చిన సమయంలో ఆస్తులను బంధువులు, సన్నిహితులు, నమ్మిన బంటుల వలే ఉన్న పనివాళ్లు, కారు డ్రైవర్లు తదితరుల బినామీల పేరిట డాక్యుమెంట్లను మార్చి ఉండడం పరిశీలనలో వెలుగు చూసినట్టు సమాచారం. కొడనాడులో పాత నోట్లు తమకు లభించిన రికార్డులు, బ్యాంక్ లావాదేవీల వివరాల మేరకు చిన్నమ్మ కుటుంబీకులు, సన్నిహితులు పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.250 కోట్ల మేరకు పాత కరెన్సీని కొత్తవిగా మార్చినట్టుగా పరిశీలనలో తేలింది. అలాగే, కొన్ని చోట్ల ఆ నోట్లను మార్చ లేక అలాగే, వదిలి పెట్టి ఉండడాన్ని గుర్తించారు. ప్రధానంగా కొడనాడు ఎస్టేట్లో పెద్ద ఎత్తున పాత నోట్లు, మూడు కేజీల బంగారం బయటపడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. అక్కడి మేనేజర్ చంద్రశేఖర్ను రహస్య ప్రదేశంలో ఉంచి ఐటీ వర్గాలు విచారిస్తున్నాయి. ఇక, ఈ ఎస్టేట్ను తన తండ్రి వద్ద నుంచి బలవంతంగా లాక్కున్నట్టు ఇంగ్లాండ్కు చెందిన గ్రేక్ జాన్స్ కుమారుడు పీటర్ గ్రేక్ జాన్స్ అమ్మ జయలలిత మరణం తదుపరి ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఐటీ దాడుల నేపథ్యంలో చట్టవిరుద్ధంగా తమ ఆస్తిని శశికళ కుటుంబం దోచుకుందని, ఇక చట్టపరంగా తాను మళ్లీ స్వాధీనం చేసుకుంటానన్న పీటర్ ధీమా వ్యక్తం చేశారు. 355 మంది విచారణకు రంగం సిద్ధం సోదాలు ముగియడంతో చిన్నమ్మ కుటుంబీకులు ఒక్కొక్కర్ని విచారించేందుకు రంగం సిద్ధం అయింది. మొత్తంగా 355 మందికి సమన్లు రెడీ అయ్యాయి. వీటిలో తొలి సమన్ను దినకరన్ మద్దతుదారుడు పుహలేంది, అమ్మ జయలలిత వైద్యుడు డాక్టర్ శివకుమార్, అమ్మ సహాయకుడు పూంగుండ్రం అందుకున్నారు. ఈ ముగ్గురు సోమవారం ఐటీ కార్యాలయం మెట్లు ఎక్కారు. వీరి వద్ద ప్రత్యేక బృందం అధికారులు గుచ్చి గుచ్చి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే యత్నం చేసినట్టు తెలిసింది. పుహలేందిని మరోమారు బుధవారం విచారణకు రావాలని ఆదేశించడం గమనార్హం. ఇక, చిన్నమ్మ సోదరుడు దివాకరన్ సమన్లు అందుకున్నారు. మన్నార్గుడి నుంచి చెన్నైకి పయనం అయ్యారు. ముందుగా తన రూపంలో ఐటీ దాడుల్ని ఎదుర్కొని తనయుడి వివాహ సమయంలో కష్టాలు పడ్డ మిత్రుడు కృష్ణమీనన్ను దివాకరన్ కలిశారు. ఆయన కుమారుడ్ని, కోడల్ని ఆశీర్వదించిన అనంతరం చెన్నైకి బయలుదేరారు. ప్రధానంగా దివాకరన్ చుట్టూ డొనేషన్ల పేరిట నగదు మార్పిడి, తన కళాశాల ద్వారా పెద్ద నోట్ల రద్దు సమయంలో సాగిన వ్యవహారాలు, ఇతర ఆస్తులతో పాటుచిన్నమ్మను గురి పెట్టి ప్రశ్నల వర్షం కురిపించేందుకు ఐటీ సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. తదుపరి ఒక్కొక్కర్ని వేర్వేరు సమయాల్లో తమ ముందు హాజరయ్యే విధంగా సమన్ల జారీలో మరో బృందం నిమగ్నం అయింది. ఇక, కాంచీపురం జిల్లా పడప్పైలోని ఆ కుటుంబానికి చెందిన మిడాస్ లిక్కర్స్ను తాత్కాలికంగా సీజ్ వేయడానికి తగ్గ ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో వివేక్ను ఐటీ వర్గాలు తమ వాహనంలో ఎక్కించుకుని వెళ్లడంతో చిన్నమ్మ కుటుంబీకుల మెడకు ఉచ్చు బలంగానే బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయ టీవీ వద్ద హాడావుడి (ఇన్సెట్) విచారణకు హాజరై వస్తున్న పుహలేంది వివేక్ వద్ద విచారణ శశికళ అన్న జయరామన్, ఇలవరసి దంపతుల కుమారుడు వివేక్(27) అమ్మ జయలలిత ఇంట పెరిగిన వివేక్ ఆమె రేషన్ కార్డులోనూ చోటు దక్కించుకుని ఉండడం గమనార్హం. ఆర్థిక శాస్త్రం అభ్యసించిన వివేక్ కొంత కాలం ఓ జాతీయ సంస్థలో పనిచేశారు. తదుపరి పరిణామాల నేపథ్యంలో జాస్ సినిమాస్కు డైరెక్టర్ అయ్యారని చెప్పవచ్చు. గత ఏడాది కీర్తనను వివాహం చేసుకున్న వివేక్, అమ్మ మరణం తదుపరి ఆ కుటుంబంలోనే ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షిస్తూ కీలక వ్యక్తిగా మారాడని చెప్పవచ్చు. పది సంస్థలకు డైరెక్టర్గా, జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక, జాస్ సినిమాస్లకు సీఈఓగా అవతరించారు. అందుకే కాబోలు ఆయన ఇంట ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మరీ సోదాలు సాగించారు. అన్నిచోట్లా విచారణ ముగించిన ఐటీ వర్గాలు చిట్టచివరగా, సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో వివేక్ను తమ వాహనంలో ఎక్కించుకుని ఐటీ కార్యాలయానికి తీసుకెళ్లడంతో చిన్నమ్మ కుటుంబంలో ఆందోళన రెట్టింపు అయింది. కీర్తన, ఆమె సోదరుడు ప్రభుల్ని సైతం అధికారులు ప్రశ్నించడం గమనార్హం. ఓ సినీ నటుడికి వాటా పుదుచ్చేరిలో దినకరన్ సన్నిహితుడిగా ఉన్న తెన్నరసుకు చెందిన శ్రీలక్ష్మి జ్యెవెలరీస్లో లభించిన ఆధారాల మేరకు రూ.160కోట్ల నగదును కొత్త నోట్లుగా మార్చి ఉండడాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. అలాగే, ఈ జ్యువెలరీస్లో లెక్కలోకి రాని బంగారం బయటపడడమే కాకుండా, ఇందులో ఓ సినీ నటుడికి వాటా కూడా ఉన్నట్టు విచారణలో తేలినట్టు తెలిసింది. దీంతో ఆ నటుడి కోసం ఆరా తీస్తున్నారు. అలాగే, అంబత్తూరు సమీపంలో ఆదివారం రాత్రి సాగిన సినిమా తరహా చేజింగ్లో ఓ ఇన్నోవాను గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు వదిలి పెట్టి ఉడాయించారు. అందులో ఐదు బాక్స్లు ఉన్నట్టు, వాటిని ఐటీ అధికారులు తమ గుప్పెట్లోకి తీసుకుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. చిన్నమ్మ కుటుంబం అమ్మ జయలిత గొడుగు నీడలో బాగానే అక్రమార్జన సాగించినట్టు రికార్డుల పరిశీలనలో వెలుగులోకి వస్తున్నట్టుగా ఐటీ కార్యాలయ పరిసరాల్లో చర్చ ఊపందుకుంది. దినకరన్ శిబిరం గప్చుప్ చిన్నమ్మ ప్రతినిధి దినకరన్ మద్దతు అన్నాడీఎంకే వర్గాలు ఐటీ దాడుల గురించి నోరు మెదపడం లేదు. ఇందుకు కారణం, నోరు తెరిస్తే, ఎక్కడ తమను టార్గెట్ చేస్తారనో అని వారిలో ఆందోళన నెలకొనడమే. ఇప్పటికే దినకరన్కు సన్నిహితంగా ఉన్న ముఖ్య నాయకుల్ని గురిపెట్టి ఉన్న దృష్ట్యా, మౌనంగా ఉంటే మంచిదనే నిర్ణయంతో అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలతో పాటు, ఆ శిబిరం జిల్లాల కార్యదర్శులు అనేకమంది ఉన్నారు. దినకరన్కు మద్దతుగా వ్యాఖ్యల తూటాల్ని పేల్చుతూ వచ్చిన పుహలేంది ఐటీ కార్యాలయం మెట్లు ఎక్కడం గమనార్హం. ఇక, దినకరన్ సన్నిహితుడు , అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే తంగతమిళ్ సెల్వన్ ఒక్కరే స్పందిస్తుండగా, మిగిలిన వారెవరూ నోరు మెదపడం లేదు. ఇక, సోమవారం దినకరన్ సైతం గప్చుప్ అన్నట్టుగా వ్యవహరించడం గమనార్హం. కాగా, చిన్నమ్మ ఫ్యామిలీ ఆస్తులన్నీ ప్రజల నుంచి కొల్లగొట్టినవేనని, వాటన్నింటినీ స్వాధీనం చేసుకోవాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ డిమాండ్ చేశారు. కలవరంలో చిన్నమ్మ పరప్పన అగ్రహార చెరలో శశికళ, ఇలవరసి శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. తన కుటుంబాన్ని టార్గెట్ చేసి ఐటీ సోదాలు సాగడంతో చిన్నమ్మ కలవరంలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. అర్ధరాత్రి వరకు ఆమె జైల్లోని టీవీ వద్ద వార్తల్ని చూస్తున్నట్టు, ఉదయాన్నే పత్రికల్ని తెప్పించుకుని సమాచారాల్ని తెలుసుకుంటున్నట్టు తెలిసింది. తనయుడు వివేక్ను ఐటీ వర్గాలు వాహనంలో ఎక్కించుకు వెళ్లిన సమాచారంతో ఇళవరసి తీవ్ర మనో వేదనలో పడ్డట్టు సమాచారం. -
తమిళనాడులో ముగిసిన ఐటీ సోదాలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళతో పాటు ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులే లక్ష్యంగా ఈ నెల 9న ప్రారంభమైన ఐటీ దాడులు సోమవారం సాయంత్రం ముగిశాయి. వరుసగా ఐదో రోజూ ఐటీ అధికారులు శశికళ అన్న కుమారుడు వివేక్, ఆయన సోదరి కృష్ణప్రియ నివాసాలతో పాటు జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక, జాస్ సినిమాస్, మిడాస్ స్పిరిట్స్ అండ్ లిక్కర్స్ తదితర సంస్థల కార్యాలయాలతో పాటు మరో 8 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో శశికళ కుటుంబీకులు, వ్యాపార భాగస్వాములు దాదాపు రూ. 1,403 కోట్ల మేర పన్నును ఎగవేసినట్లు గుర్తించామని ఐటీ ఉన్నతాధికారి తెలిపారు. సోదాలు పూర్తవడంతో 355 మందికి సమన్లు జారీచేసేందుకు ఐటీ వర్గాలు సిద్ధమయ్యాయి. -
‘ఐటీ దాడులు ముగిసినట్టే’
సాక్షి,చెన్నై: జైలు శిక్ష అనుభవిస్తున్న ఏఐఏడీఎంకే నేత వీకే శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ సహా కుటుంబ సభ్యుల నివాసాలు, కార్యాలయాలు, ఆస్తులపై జరుగుతున్న ఐటీ దాడులు దాదాపు ముగిశాయని ఐటీ వర్గాలు వెల్లడించాయి. సోదాల్లో ఎంత మేర నగదు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారనే వివరాలను తెలిపేందుకు ఐటీ అధికారులు నిరాకరించారు. సోదాలు పూర్తయ్యాయని, సోదాల్లో లభించిన పత్రాలు, ఆధారాల ఆధారంగా స్టేట్మెంట్లను నమోదు చేసుకోవడం, సంబంధితులను ప్రశ్నించడం మిగిలిఉందని ఐటీ అధికారి ఒకరు తెలిపారు. ఆపరేషన్ క్లీన్ మనీ కింద చేపట్టిన ఈ సోదాలు మొత్తం 187 ప్రాంతాల్లో పూర్తయిందని చెప్పారు. నవంబర్ 9న ప్రారంభించిన ఐటీ సోదాలు ఏకకాలంలో బెంగుళూర్, హైదరాబాద్, ఢిల్లీల్లో కొనసాగాయి. వేయి మంది అధికారులు 12 బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి అందించిన సమాచారం సహా పలు కోణాల్లో లభించిన సమాచారం ఆధారంగా సోదాలు సాగాయని ఐటీ వర్గాలు వెల్లడించాయి. తమిళ చానెల్ జయ టీవీ, దినకరన్ పార్మ్హౌస్ సహా శశికళ బంధువులకు చెందిన ఆస్తులపై పలు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. కాగా రాజకీయాల నుంచి తనను, శశికళను బయటకు పంపేందుకే ఐటీ సోదాల పేరుతో కుట్రకు పాల్పడుతున్నారని దినకరన్ ఆరోపించారు. -
ఊహించని ప్రాంతాల్లో విలువైన వస్తువులు
చెన్నై: చిన్నమ్మ శశికళ సన్నిహితులు, వ్యాపారవేత్తల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ దాడులు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో కొన్ని ఊహించని ప్రాంతాల్లో కూడా విలువైన వస్తువులు, బంగారం గుర్తించినట్టు రిపోర్టులు వస్తున్నాయి. సోదాలు జరుగుతున్న ప్రాంతాల్లో నగదు, డాక్యుమెంట్లను ఐటీ అధికారులు సీజ్ చేసినట్టు తెలిసింది. చెన్నైలోని 40 ప్రాంతాల్లో అధికారులు సోదా చేస్తున్నారు. శశికళ మేనకోడలు కృష్ణప్రియ నివాసంలోనూ అధారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భారీగా శశికళ అక్రమాస్తులు బయటపడుతున్నట్టు తెలిసింది. శశికళ పేరిట 10 బోగస్ కంపెనీలు ఉన్నాయని సమాచారం. నోట్ల రద్దు సమయంలో ఈ బోగస్ కంపెనీల ద్వారా భారీగా లావాదేవీలు జరిగాయని ఐటీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. శశికళ, ఆమె బంధువులకు చెందిన 317 బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూ ఉందని... మొత్తం ఆపరేషన్ అయిన తర్వాత ఎంత మొత్తంలో నగదు, డాక్యుమెంట్లను సీజ్ చేశామో తెలుపుతామని ఓ ఐటీ అధికారి చెప్పారు. చాలా ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ ముగిసిందని, ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో శిక్షను అనుభవిస్తున్న శశికళ, ఆమె భర్త నటరాజన్, సోదరుడు దినకరన్, మేనల్లుడు దినకరన్లతో పాటు సన్నిహితులు, వారి సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది, వారి బంధువులు, వారి వంట, పనిమనుషులు, జ్యోతిష్కుడు, వైద్యుడు, ఆడిటర్, ఇలా ఆ కుటుంబంతో సంబంధమున్న వారి ఇళ్లలో, కార్యాలయాల్లో మూడు రోజుల నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. -
భారీగా పన్ను ఎగవేత.. 327 ఖాతాలు !
సాక్షి, చెన్నై: ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ నినాదంతో తమిళనాట ఆదాయ పన్ను శాఖ అధికారుల మెరుపుదాడులు రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. గురువారం ఉదయం తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలోని 187 చోట్ల ఈ దాడులు జరగటం చర్చనీయాంశమైంది. శశికళ అండ్ ఫ్యామిలీ రూ. వెయ్యి కోట్ల మేరకు పన్ను ఎగ వేసినట్టుగా ప్రాథమిక విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. ఈ తనిఖీల్లో ఎద్ద ఎత్తున నగదు, నగలు, వెండి, వజ్రాలు సైతం బయట పడినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దాడుల్ని శశకళ, దినకరన్ మద్దతు దారులు తీవ్రంగా వ్యతిరేకించి, పలుచోట్ల ఆందోళలనకు దిగారు. శశికళ స్వగ్రామం మన్నార్గుడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సన్నిహితుల ఇళ్లలో దాడులు.. ఆపరేషన్ క్లీన్ మనీలో భాగంగా తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితులైన నెచ్చెలి శశికళ, ఆమె భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, భాస్కరన్, వెంకటేషన్, వివేక్, కృష్ణప్రియ తదితరులతోపాటు సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో గురువారం మొదలైన ఐటీ దాడులు శుక్రవారం కూడా కొనసాగాయి. తొలి రోజు 187 చోట్ల తనిఖీలు జరిగితే, 40 చోట్ల ముగించారు. రెండు రోజు 147 చోట్ల మరింత కట్టుదిట్టమైన భద్రత నడుమ తనిఖీల్లో ఐటీ వర్గాలు నిమగ్నం అయ్యారు. పెద్దమొత్తంలో నగదు, నగలు.. ఇందుకు కారణం, వివిధ ప్రాంతాల్లో శశికళ, దినకరన్, దివాకరన్ మద్దతు దారులు దాడులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగడమే. శశికళ స్వగ్రామం మన్నార్గుడిలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో మద్దతుదారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో శశికళ కుటుంబం, వారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వారి ఇళ్లు, కార్యాలయాల నుంచి పెద్ద ఎత్తున నగలు, నగదు, వెండి, వజ్రాలు బయటపడ్డట్టు ఆదాయ పన్ను శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. భారీగా పన్ను ఎగవేత.. 327 ఖాతాలు అయితే, రూ 1000 కోట్ల మేరకు పన్ను ఎగవేతకు సంబంధించిన రికార్డులు, కొన్ని నకిలీ సంస్థల పేరిట సృష్టించిన బ్యాంక్ పాసు పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల మేరకు 317 మంది పేర్లతో వివిధ బ్యాంకుల్లో 327 ఉన్నట్టు గుర్తించారు. ఆయా బ్యాంకుల్లోని ఈ ఖాతాల్ని సీజ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అందుకే కాబోలు దినకరన్కు మద్దతుగా ఉన్న అన్నాడీఎంకే కార్యదర్శులు తమ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారంటూ గగ్గోలు పెడుతుండటం గమనార్హం. రూ. వెయ్యి కోట్ల మేరకు.. కీలక ఆధారాలు ఈ తనిఖీల్లో వెయ్యి కోట్ల మేరకు పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు చిక్కిన్నట్టు ఓ అధికారి పేర్కొన్నారు. అలాగే, మన్నార్ గుడిలోని దివాకరన్ కళాశాలలో రూ. 25 లక్షల విలువగల నగలు, వెండి, బయటపడ్డాయనే సంకేతాలు వెలువడ్డాయి. ప్రధానంగా పది బినామి సంస్థల వివరాలతో పాటుగా, విదేశాల్లోని అనేక సంస్థల్లో చిన్నమ్మ కుటుంబం పెట్టుబడులకు సంబంధించిన రికార్డులు, దస్తావేజుల్ని ఐటీ వర్గాలు తమ గుప్పెట్లోకి తీసుకుని ఉన్నట్లు తెలిసింది. సమగ్ర పరిశీలనానంతరం ఈడీకి అనేక డాక్యుమెంట్లను అందించేందుకు తగ్గ కసరత్తులు చేస్తున్నట్టు మరో ఐటీ అధికారి పేర్కొన్నారు. జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక కార్యాలయాల్లో తనిఖీలు.. కాగా, పట్టుబడ్డ దస్తావేజుల్లో అత్యధికం జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక కార్యలయాల నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. దీంతో ఆ ఛానల్, పత్రికలో పనిచేస్తున్న ముఖ్యుల్ని విచారించేందుకు రంగం సిద్ధం అవుతోండటం గమనార్హం. జయ టీవీ కార్యాలయంలో తనిఖీల పుణ్యమా రెండో రోజు కూడా ప్రసారాలకు ఆటంకాలు తప్పలేదు. జయం టీవీ అభిమానులంటూ, దినకరన్ మద్దతుదారులు ఆందోళనకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత తప్పలేదు. మీడియా స్వేచ్ఛకు భంగం కల్గిస్తున్నారని జర్నలిస్టుల సంఘాలు ఐటీ వర్గాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. -
శశికళకు భారీ షాక్!
నకిలీ, బోగస్ పేర్లతో ఉన్న సంస్థల జప్తులో భాగంగా శశికళ, ఆమె కుటుంబ ఆస్తులపై కేంద్రం గురిపెట్టినట్టు సమాచారం. ఇందుకు తగ్గ కసరత్తుల్లో సీఎం పళనిస్వామి ప్రభుత్వం నిమగ్నమైనట్టు తెలిసింది. నల్లధనం నిర్మూలన లక్ష్యంగా చర్యలు చేపట్టిన కేంద్రం, నకిలీ, బోగస్ సంస్థలను గుర్తించి, వాటి భరతం పట్టే విధంగా ముందుకు సాగుతోంది. ఆయా సంస్థల ఆస్తుల్ని జప్తుచేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ, కుటుంబీకుల సంస్థలు కూడా ఉన్నట్టు సమాచారం. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో అమ్మ జయలలిత గొడుగు నీడలో గతంలో చిన్నమ్మ శశికళ కుటుంబం సాగించిన అవినీతి భాగోతాలకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిని పసిగట్టిన జయలలిత 2011లో శశికళ కుటుంబీకుల్ని సాగనంపిన విషయం తెలిసిందే. జయలలితకు తెలియకుండా కోట్లాది రూపాయాల్ని ఆర్జించి, విదేశీ బ్యాంకుల ద్వారా కొన్ని సంస్థలకు నగదు బదిలీలు సాగినట్టు ఆధారాలు సైతం వెలుగులోకి వచ్చి ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్యం కేసు శశికళతో పాటు ఆమె కుటుంబానికి చెందిన పలువురి మీద ఉండడం ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన జాబితాలో పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళ, ఆమె కుటుంబానికి చెందిన పలు సంస్థల పేర్లు ఉన్నట్టు తెలిసింది. నకిలీ కంపెనీలుగా గుర్తింపు శశికళ, ఆమె కుటుంబీకుల పేర్లతో ఉన్న ఆరేడు కంపెనీలు నకిలీవిగా గుర్తించి, వాటి ఆస్తుల జప్తు మీద దృష్టి పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఎప్పుడెప్పుడు చిన్నమ్మ కుటుంబం భరతంపడుదామా..? అని ఎదురుచూస్తున్న సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే పాలకులు ఇందుకు తగ్గ పనుల్ని చాప కింద నీరులా వేగవంతం చేసినట్టు తెలిసింది. చిన్నమ్మ కుటుంబీకుల ఆస్తుల్ని, సంస్థల్ని గుర్తించడం పాలకులకు పెద్ద కష్టం ఉండదని చెప్పవచ్చు. ఇందుకు కారణం, ఇదివరకు చిన్నమ్మ గొడుగు నీడలో అమ్మకు పాదపూజ చేసిన వాళ్లే ప్రస్తుతం అధికారంలో ఉండటమే. -
శశికళకు కోపమొచ్చింది...
అన్నాడీఎంకే సామ్రాజ్ఞిగా, తమిళనాడు ప్రభుత్వాధినేతగా వెలుగొందాల్సిన శశికళ జైలు గోడల మధ్య చీకటి జీవితం గడుపుతోంది. అయ్యోపాపం అని జాలిచూపాల్సిన అన్నాడీఎంకే నేతలంతా ముఖం చాటేయడం వల్ల కలిగిన బాధను లోలోన అణచుకుంటూ వస్తున్న ఆమె కోపాన్ని వెళ్లగక్కారు. తానే సీఎం చేసిన ఎడపాడిపై తొలిసారిగా నోరు తెరిచారు. పనిలోపనిగా పన్నీర్సెల్వంను కూడా కలుపుకుని ఇద్దరిపైనా ఈసీకి ఫిర్యాదు చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: చిన్నమ్మ శశికళకు కోపమొచ్చింది. జైలు కెళ్లిన తర్వాత అన్నాడీఎంకే నేతలపై ప్రత్యక్షంగా తొలిసారి స్పందించారు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అమ్మ జయలలిత మరణం, సీఎంగా పన్నీర్సెల్వం బలవంతపు రాజీనామా, శశికళపై తిరుగుబాటుతో అన్నాడీఎంకే రెండు ముక్కలైంది. శశికళ, పన్నీర్సెల్వం వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుపాలు కావడంతో ఆ స్థానంలో ఎడపాడి వర్గం ఆవిర్భవించింది. ఎడపాడి, పన్నీర్ వర్గాల మధ్య పోరు మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా టీటీవీ దినకరన్ పోటీచేయగా సీఎం ఎడపాడి, మంత్రి వర్గం ప్రచార భారాన్ని భుజానవేసుకుంది. అదే ఎన్నికల్లో పన్నీర్వర్గ అభ్యర్థిగా పోటీకి దిగిన మధుసూదనన్, జయలలిత మేనకోడలు దీప రెండాకుల గుర్తుకోసం పోటీపడడంతో మధ్యే మార్గంగా ఎన్నికల కమిషన్ గుర్తుపై తాత్కాలిక నిషేధం విధించింది. అంతేగాక ఎన్నికలను రద్దు చేసింది. రెండాకుల గుర్తును అధికార పార్టీకి దక్కేలా చేయాలని దొడ్డిదారి ప్రయత్నాలు చేసిన దినకరన్ జైలు పాలయ్యాడు. పన్నీర్సెల్వం సైతం ఈసీ వద్ద పోటీపడ్డాడు. కాలక్రమంలో ఎడపాడి, పన్నీర్ వర్గాలు ఏకం కాగా, రెండాకుల గుర్తు కోసం ఎడపాడి, దినకరన్ వర్గాల మధ్య పోటీ పెరిగింది. అత్యధిక సభ్యుల బలం కలిగిన వారికే రెండాకుల చిహ్నంను కేటాయించాలనే వాదనతో ఇరువర్గాలు సంతకాల సేకరణ ప్రారంభించి ఈసీకి సమర్పించడం ప్రారంభించారు. ఎడపాడి, దినకరన్ వర్గాల పత్రాలను స్వీకరించిన ఈసీ రెండాకుల చిహ్నం ఎవరికనే అంశంపై నాన్చుతూ వచ్చింది. అయితే ఇంతలో ఒక పిటిషన్ వల్ల మదురై హైకోర్టు కలుగజేసుకుని ఈనెల 30వ తేదీలోగా రెండాకుల చిహ్నం ఎవరిదో తేల్చాలని ఆదేశించింది. దీంతో విచారణలో వేగం పెంచిన ఈసీ ఎట్టకేలకూ ఈనెల 30వ తేదీన తుది తీర్పునకు సిద్ధమైంది. ఈసీ వద్ద అడ్డుచక్రం ఎడపాడి, పన్నీర్ వర్గాలు ఏకమై దినకరన్ను ఒంటరివాడిని చేయడంపై గత కొంతకాలంగా మండిపడుతున్న శశికళ అదనుకోసం వేచి ఉన్నారు. రెండాకుల చిహ్నం ఎడపాడి వైపు జారిపోయిన పక్షంలో ఇక తమకు రాజకీయ మనుగడ ఉండదనే ఆలోచనకు వచ్చి ఈసీ వద్ద అడ్డుచక్రం వేసింది. రెండాకుల చిహ్నం కోసం మంత్రులు, సర్వసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పేరున ఎడపాడి, పన్నీర్ కలసి దాఖలు చేసిన 1877 ప్రమాణ పత్రాల్లో 329 నకిలీవని శశికళ ఆరోపిస్తూ మంగళవారం ఈసీకి లేఖ రాశారు. నకిలీ పత్రాలు సమర్పించిన వారిద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సదరు వ్యక్తుల పేర్ల వద్దనున్న సంతకాలు ఫోర్జరీవని తెలిపింది. ఈనెల 30 వ తేదీన నాల్గవ దశ విచారణలో రెండాకుల చిహ్నం ఎవరికో తేలనున్న సమయంలో శశికళ రాసిన లేఖ ఏమాత్రం పనిచేసేనో వేచి చూడాల్సిందే. హైకోర్టులో నలపెరుమాళ్ పిటిషన్ ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని, పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవినే రద్దు చేస్తూ ఇటీవల సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై పొల్లాచ్చికి చెందిన పార్టీ సభ్యుడు నలపెరుమాళ్ మద్రాసు హైకోర్టులో మంగళవారం పిటిషన్ వేశారు. పార్టీ ఎన్నికలను ఈసీనే నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. -
చిన్నమ్మకు జేజేలు
రెండు రోజులు అభిమానులు, మద్దతుదారులు కాస్త సంయమనం పాటించినా, నాలుగో రోజు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. చిన్నమ్మ శశికళకు జేజేలు పలుకుతూ, మేళ తాళాల నడుమ ఆహ్వానం పలకడం గమనార్హం.నాలుగో రోజుగా భర్త నటరాజన్ను పరామర్శించిన శశికళ, అభిమానుల పిల్లలకు జయలలిత, జయకుమార్ అనే నామకరణం చేశారు. సాక్షి, చెన్నై : పెరుంబాక్కంలోని గ్లోబల్ హెల్త్ సిటీలో అవయ మార్పిడి శస్త్ర చికిత్సతో ఐసీయూలో ఉన్న భర్త నటరాజన్ను పరామర్శించేందుకు పెరోల్ మీద చిన్నమ్మ శశికళ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బెంగళూరు పరప్పన అగ్రహార చెర నుంచి బయటకు వచ్చిన చిన్నమ్మకు మద్దతుదారులు తొలిరోజు బ్రహ్మరథం పట్టారు. పెరోల్ మీద బయటకు వచ్చిన వారికి ఇంతటి ఆహ్వానమా..? అని పెదవి విప్పిన వాళ్లూ ఉన్నారు. మరుసటి రోజు అభిమానోత్సాం సద్దుమణిగింది. మద్దతుదారుల జాడ కాన రాలేదు. అయితే, ఆస్పత్రికి ప్రతిరోజూ చిన్నమ్మ వచ్చి పరామర్శించి తిరిగి టీ నగర్లోని ఇంటికి వెళుతున్నారు. ఈ సమయంలో బంధువులు, కుటుంబీకులతో మంతనాల్లో చిన్నమ్మ బిజీబిజీ అయ్యారని సమాచారం. రెండు రోజుల పాటుగా మద్దతుదారులు, అభిమానుల ఉత్సాహం సద్దుమణిగిన నేపథ్యంలో హంగామా ముగిసినట్టుందంటూ ఎద్దేవా చేసే వాళ్లూ పెరిగారని చెప్పవచ్చు. అందుకే కాబోలు నాలుగో రోజు మంగళవారం పెద్దఎత్తున మద్దతుదారులు తరలి వచ్చి మరీ చిన్నమ్మకు జేజేలు పలకడం గమనార్హం. అభిమానుల హడావుడి టీ.నగర్లోని నివాసం నుంచి ఉదయాన్నే ఆస్పత్రికి చిన్నమ్మ బయలుదేరారు. ఈ సమయంలో ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో మహిళా మద్దతుదారులు చేరుకుని చిన్నమ్మకు జేజేలు కొట్టడమే కాకుండా. ఆమెకు ఉన్న దిష్టి అంతా తొలగి పోవాలంటూ దిష్టి గుమ్మిడి కాయల్ని కొట్టి మరీ అభిమానాన్ని చాటుకున్నారు. పెరుంబాక్కంకు వెళ్లే మార్గంలో అక్కడక్కడ మద్దతుదారులు చేతులు ఊపుతూ, జిందాబాద్లు కొడుతూ ఆహ్వానం పలికారు. ఇక, ఆస్పత్రి ఆవరణలో పండుగ వాతావరణం తలపించే రీతిలో మేళ తాళాలు హోరెత్తాయి. డప్పు వాయిదాల జోరు నడుమ బ్రహ్మరథం పట్టారు. ఆస్పత్రిలో భర్త నటరాజన్ను పరామర్శించిన అనంతరం వెలుపలకు వచ్చిన చిన్నమ్మను మద్దతుదారులు చుట్టుముట్టారు. అభిమానుల పిల్లలకు నామకరణం కన్నగి నగర్కు చెందిన ఇలవరసన్, అన్నపూర్ణ దంపతులు తమ పాపకు పేరు పెట్టాలని విన్నవించారు. ఆ పాపకు జయలలిత అని నామకరణం చేశారు. అలాగే, భారతీ నగర్కు చెందిన ఎలుమలై, లక్ష్మి దంపతుల మగ బిడ్డకు జయకుమార్ అని పేరు పెట్టారు. మద్దతుదారుల్ని పలకరిస్తూ చిన్నమ్మ కాన్వాయ్ టీ.నగర్ వైపు సాగింది. నేటితో ముగియనున్న పెరోల్ బుధవారంతో పెరోల్ ముగియనుండడంతో చిన్నమ్మకు వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున మద్దతుదారులు తరలి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, చిన్నమ్మ రాకతో అన్నాడీఎంకే కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఆశతో ఉన్న దినకరన్కు మిగిలనుంది ఏమిటో..! అని దినకరన్ను ప్రశ్నించగా, మంత్రులు జోకర్ల వలే మాట్లాడుతున్నారని విమర్శించే పనిలో పడ్డారు. పళనిస్వామిపై ఆగ్రహం సోమవారం రాత్రి, మంగళవారం రాత్రి చిన్నమ్మ దృష్టి అంతా పార్టీ వ్యవహారాల మీదు సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సీఎం పళని స్వామికి సన్నిహితులుగా ఉన్న వారితో శశికళ తన మద్దతుదారుల ఫోన్ ద్వారా మాట్లాడినట్టు ప్రచారం. పళనిస్వామి తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటు, పలువురు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై అసహనాన్ని వ్యక్తంచేసినట్టు సమాచారం. పార్టీని రక్షించుకునే విధంగా ముందుకు సాగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ నిర్వీర్యం కావడానికి వీలు లేదని మద్దతుదారులకు సూచించినట్టు తెలిసింది. -
అమ్మ కారు ఆమెకేనట!
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో జయలలితది ఒక బ్రాండ్. వేష, భాషలే కాదు రాజకీయ చతురతలో సైతం ఆమెది ప్రత్యేక శైలి. సుమారు ఏడాది క్రితం అమ్మ మరణంతో అవన్నీ కాలగర్భంలో కలిసిపోగా, ప్రస్తుతం శశికళ సంచారంతో జయ వినియోగించిన కారు ఒక కథగా మారింది. అన్నాడీఎంకేలో అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను ‘టీఎన్ 09–బీఇ 6167’ ఈ నంబరు ఏ వాహనానిది అని అడిగితే అమ్మ కారుదని ఠక్కున చెప్పేస్తారు. డ్రైవర్ పక్కన ఆశీనులైన అమ్మ అందరికీ ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ రోడ్డున సాగిపోతుంటే అభిమానులు ఆనందపరవశులై జయ జయ ధ్వానాలు చేసేవారు. ఆ వాహనం, రిజిస్ట్రేషన్ నెంబరు అన్నాడీఎంకే శ్రేణుల హృదయాల్లో అంతగా ముద్రపడిపోయింది. జయలలిత మరణం తరువాత పార్టీ బాధ్యతలు చేపట్టన శశికళ తన చీరకట్టు, పాపిడిబొట్టు సైతం జయలలితలాగనే మార్చుకుని అదే కారుల్లో పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చేవారు. మంత్రి పదవులను కాపాడుకోదలుచుకున్న నేతలు అమ్మకు పెట్టినట్లే చిన్నమ్మకు సైతం వంగివంగి దండాలు పెట్టారు. అయితే కార్యకర్తలు మాత్రం శశికళను ఖాతరు చేయలేదు. ఇదిలా ఉండగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత చిక్కినపుడు రెండు టయోటా బ్రాడా కార్లు, ఒక టెంపో ట్రావలర్, ఒక టెంపో ట్రాక్స్, మహీంద్రా జీప్, అంబాసిడర్ కారు, మహేంద్ర బొలెరో, స్వరాజ్ మజ్దా మేక్సీ, 1990 మాడల్ కాంటెసా కారు తదితర 9 వాహనాలను కేసులో చేర్చారు. 1996 నాటి ధరల ప్రకారం ఈ వాహనాల విలువ రూ..42.25 లక్షలుగా లెక్క కట్టారు. జామీనులో బైటకు వచ్చిన అనంతరం 6167 కారును జయ వాడటం ప్రారంభించారు. ఈ కారులోనే సచివాలయం, పార్టీ ప్రధాన కార్యాలయం సహా అన్ని కార్యక్రమాలకు జయ వినియోగించేవారు. కాగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్ను పరామర్శించేందుకు పెరోల్పై ఐదు రోజుల చెన్నైలో ఉన్న శశికళ ప్రస్తుతం 6167 కారునే వినియోగిస్తున్నారు. శశికళ జైలుకు వెళ్లిన తరువాత పోయస్గార్డెన్లో ఉన్న ఈ కారు ఎలా, ఎప్పుడు బైటకు వెళ్లింది, ఇన్నాళ్లు ఎవరి స్వాధీనంలో ఉంది, ఒక ముఖ్యమంత్రి వినియోగించిన కారు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి నేడు శశికళ వినియోగంలోకి ఎలా వచ్చిందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేగాక పలు అనుమానాలకు తావిచ్చింది. దీనిపై దినకర్ వర్గంలోని ఒక నేత మాట్లాడుతూ, కార్లన్నీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరుకున్నందున తనపేరుపై కార్లు ఉంటే అచ్చిరాదని భావించిన జయలలిత దినకరన్ పేరున ఒకటి, అతని భార్య అనూరాధ పేరున మరో కారును కొన్నట్లు తెలిపారు. మరణించే వరకు జయలలిత ఈ రెండు కార్లనే వినియోగించగా, ఆ తరువాత దినకరన్ స్వాధీనంలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. సదరు కారుపై శశికళ మోజుపడటంతో మరెవ్వరూ వినియోగించ కుండా జాగ్రత్త చేయగా ఆమె కోర్కె మేరకు పెరోల్ ఐదురోజుల వినియోగానికి 6167 కారును బైట పెట్టినట్లు ఆయన వివరించారు. జయ సమాధి వద్దకు నో పెరోల్పై బెంగళూరు జైలు నుంచి బయటకు వచ్చి ఆసుపత్రి, ఇంటి మధ్య తిరుగుతున్న శశికళ పనిలో పనిగా జయలలిత సమాధి వద్దకు వెళ్లాలనే ప్రయత్నాలను పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. జైలు కెళ్లే ముందు అమ్మ సమాధిని శశికళ దర్శించకున్న సమయంలో సమాధిపై అరచేత్తో మూడుసార్లు గట్టిగా చరచడాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. సుమారు 7 నెలల తరువాత జైలు నుండి వచ్చిన శశికళను మరలాఅమ్మ సమాధి వద్దకు అనుమతిస్తే ఎటువంటి పోకడలకు పోతారోనని పోలీసు అనుమానిస్తోంది. పెరోల్ సమయంలో రాజకీయ జోక్యం ఎంతమాత్రం ఉండరాదని షరతు విధించగా, అమ్మ సమాధిని దర్శించుకోవడం కూడా రాజకీయాల కిందకు వస్తుందని భావించి ఆమె కోర్కెను పోలీసుశాఖ నిరాకరించింది. కాగా, శశికళ సోమవారం ఉదయం ఆసుపత్రికి వెళ్లి భర్త నటరాజన్ను మూడో రోజు పరామర్శించారు. -
మంత్రి వ్యాఖ్యలతో కలకలం
సాక్షి,చెన్నై:తమిళనాడు మంత్రి సెల్లూర్ రాజు చేసిన వ్యాఖ్యలు పాలక ఏఐఏడీఎంకేలోని ఓపీఎస్, ఈపీఎస్ గ్రూపుల్లో కలకలం రేపాయి. అమ్మ(జయలలిత) ప్రభుత్వం మెరుగైన పాలన అందించేందుకు చిన్నమ్మ(శశికళ) కష్టపడి పనిచేశారని వ్యాఖ్యానించారు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం అన్నారు. ఆయన వ్యాఖ్యలతో తమిళనాడు సర్కార్కు సారథ్యం వహిస్తున్న ఏఐఏడీఎంకేలోని ఇరు వర్గాలూ షాక్కు గురయ్యాయి. సీఎం పళనిస్వామికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మంత్రి రాజు చిన్నమ్మను పొగడటం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అవినీతి కేసులో జైలు పాలయిన శశికళతో విభేదిస్తూ అత్యధిక ఎంఎల్ఏలను తమవైపు తిప్పుకోవడంలో పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు విజయం సాధించారు.అయితే మంత్రి వ్యాఖ్యలపై పళని, పన్నీర్ వర్గాలు ఇప్పటివరకూ నోరుమెదపలేదు. చెన్నైలో చికిత్స పొందుతున్న తన భర్తను పరామర్శించేందుకు పెరోల్పై శశికళ బయటకు వచ్చిన నేపథ్యంలో ఏఐఏడీఎంకేలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. మరోవైపు పెరోల్ సమయంలో చిన్నమ్మను కలిసేందుకు వెనుకాడబోనని మరో మంత్రి ఓఎస్ మణియన్ ఇటీవల పేర్కొన్నారు. -
నా భర్తను కాపాడండి
సాక్షి ప్రతినిధి, చెన్నై: భర్త నటరాజన్ను చూసిన సమయంలో శశికళ కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిసింది. భర్త దగ్గరుండి పర్యవేక్షించుకునే పరిస్థితిలేనందున మీరే కాపాడాలని వైద్యులను శశికళ వేడుకున్నారు. చెన్నై గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్ను పరామర్శించేందుకు అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళకు ఐదు రోజుల పెరోల్ లభించింది. బెంగళూరు జైలు నుంచి శుక్రవారం రాత్రి ఆమె చెన్నైకి చేరుకున్నారు. సుదీర్ఘ విరామం తరువాత భర్తను కలవనుండడంతో కొందరు పెద్దల సూచన మేరకు శనివారం ఉదయం 9–10.30 గంటల రాహుకాలం ముగిసిన తరువాత 11 గంటలకు ఇంటి నుంచి బయలుదేరారు. జయలలిత సెంటిమెంట్ ఆలయమైన కొట్టూరుపురంలోని వినాయకుని గుడి వద్ద కారులో నుంచే దణ్ణం పెట్టుకున్నారు. 11.50 గంటలకు గ్లోబల్ ఆస్పత్రికి చేరుకున్నారు. బందోబస్తులో ఉన్న పోలీసులు ఆమెను అనుసరించారు. పరిమిత సంఖ్యలో బంధువులు ఆమె వెంటవచ్చినా ఐసీయూలో ఉన్న నటరాజన్ వద్దకు శశికళను మాత్రమే వైద్యులు అనుమతించారు. ఉద్వేగానికి గురైన శశికళ శశికళ కొద్దిసేపు ఆస్పత్రి ఐసీయూలో గడిపిన తరువాత విజిటర్స్ గ్యాలరీలో ఉండిపోయారు. బంధువులు, వైద్యులతో ఆమె మాట్లాడారు. నటరాజన్ను చూసిన సమయంలో ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. భర్త ఆరోగ్యంపై తీవ్ర ఆవేదన చెందుతున్న శశికళకు వైద్యులు ధైర్యం చెప్పారు. ఇటీవల నిర్వహించిన కాలేయం, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స సఫలీకృతమైందని, ఈ రెండు బాగా పనిచేస్తున్నాయని తెలిపారు. మరో పదిరోజుల్లో ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలిస్తామని చెప్పారు. ఆ తరువాత డిశ్చార్జయి మూడు నెలలపాటూ ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటే ఆ తరువాత సాధారణ జీవితంలోకి అడుగుపెట్టవచ్చని శశికళకు వైద్యులు వివరించారు. భర్త ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించుకునే పరిస్థితి లేనందున మీరే కాపాడాలని వైద్యులను శశికళ వేడుకున్నారు. ఇదిలా ఉండగా, నటరాజన్ కొన్నాళ్లపాటూ ప్రమాదకరమైన పరిస్థితిలోనే ఉంటారని, నెమ్మదిగా కోలుకునే అవకాశం ఉందని పేర్కొంటూ గ్లోబల్ ఆస్పత్రి శనివారం ఒక బులెటిన్ను విడుదల చేసింది. నటరాజన్కు శుక్రవారం ట్రాక్యోస్టమీ శస్త్రచికిత్స చేశారు. నిఘా నీడ.. నిబంధనలతో నిరాశ పెరోల్ మంజూరులో తమిళనాడు, కర్ణాటక పోలీసులు పెట్టిన నిబంధనలతో శశికళ బసచేసిన నివాసంపై తీవ్రస్థాయిలో నిఘా అమలుచేస్తున్నారు. వీరుగాక కొందరు పోలీసులు మఫ్టీలో నిలబడి శశికళ ఇంటికి ఎవరెవరు వచ్చిపోతున్నారో గమనిస్తున్నారు. జైలుకు వెళ్లకముందు అన్నాడీఎంకేలో హైడ్రామా నడిపి ఎడపాడిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. తన విశ్వాసపాత్రులకు మంత్రి పదవులు ఇప్పించారు. గడిచిన ఎన్నికల్లో పోటీచేసేందుకు పెద్ద సంఖ్యలో సీట్లు ఇప్పించగా వారంతా ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. వారిలో కొందరైనా పెరోల్పై వచ్చిన తనను కలుసుకునేందుకు వస్తారని శశికళ విశ్వసించారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు బంధువులతో మాట్లాడిన శశికళ పార్టీ నేతలు, ఇతర వీఐపీలతో మాట్లాడేందుకు శనివారం తెల్లవారుజామునే లేచి సిద్ధంగా కూర్చున్నారు. అయితే పెరోల్ నిబంధనలకు భయపడి ఎవరూ ఆమె కోసం రాలేదు. కేంద్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర పోలీసుల కంటపడితే ఎటువంటి చిక్కులు వచ్చిపడతాయోనని దినకరన్ వర్గానికి చెందిన అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలు సైతం సాహసించలేదు. ఎంపీ నవనీతకృష్ణన్, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి తదితరులు శశికళ వచ్చే సమయానికి గ్లోబల్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నా లోపలకు వెళ్లలేక గేటు వద్దనే నిలబడిపోయారు. పెరోల్ మంజూరులో విధించిన నిబంధనలపై టీటీవీ దినకరన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెరోల్ ఐదు రోజులను హౌస్ అరెస్ట్గా మార్చేశారని విమర్శించారు. జయ కారులో జల్సా బెంగళూరు జైలు నుంచి పెరోల్పై బయటకు వచ్చినప్పటి నుంచి దివంగత జయలలిత కారునే శశికళ వినియోగిస్తున్నారు. సచివాలయానికి, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు జయలలిత ఇదే కారు (నంబరు టీఎన్ 09–6167) ను వినియోగించేవారు. జయ కాలంనాటి డ్రైవరునే పెట్టారు. జయలలిత వినియోగించే కార్లన్నీ ప్రస్తుతం ఇళవరసి ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. శశికళ బసచేసిన సాధారణ కుటుంబాల ఇళ్ల మధ్య జయ కారు తిరుగాడడంతో ప్రజలు వింతగా చూస్తున్నారు. -
శశికళకు పెరోల్పై మాకు నో ప్రాబ్లమ్
-
'శశికళకు పెరోల్పై మాకు నో ప్రాబ్లమ్'
-
'శశికళకు పెరోల్పై మాకు నో ప్రాబ్లమ్'
సాక్షి, చెన్నై : అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఆమెకు పెరోల్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కర్ణాటక ప్రభుత్వం కోర్టుకు వివరించింది. దీంతో ఆమెకు పెరోల్ లభించేందుకు అవకాశం లభించినట్లయింది. గత కొంతకాలంగా తన భర్త నటరాజన్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శశికళ భర్త ఎం నటరాజన్ చికిత్స పొందుతున్నారు. లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న నటరాజన్కు ప్రస్తుతం డయాలసిస్, ఇతర ఇంటెన్సివ్ కేర్ థెరఫీస్ను వైద్యులు అందిస్తున్నారు. దీంతో ఆయనను చూసేందుకు తనకు అనుమతించాలని, పదిహేను రోజులపాటు తనకు పెరోల్ మంజూరు చేయాలంటూ జైలు శాఖకు విజ్ఞప్తి చేసుకోగా నిరాకరించింది. అయితే, జైలుశాఖ నిరాకరించగా ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వ వైఖరి ఏమిటని కోర్టు ప్రశ్నించింది. దీంతో ఆమెకు పెరోల్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో బహుశా ఆమెకు పెరోల్ లభించే అవకాశం ఏర్పడింది. -
శశికళకు ఎదురుదెబ్బ
-
శశికళకు ఎదురుదెబ్బ
బెంగళూరు : శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెకు పెరోల్ ఇచ్చేందుకు జైలు శాఖ నిరాకరించింది. అనారోగ్యంతో ఉన్న తన భర్తను చూసేందుకు తనకు పదిహేను రోజులు పెరోల్ ఇవ్వాలని శశికళ దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం ఏఐఏడీఎంకే నేత టీటీవీ దినకరన్ చెప్పారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శశికళ భర్త ఎం నటరాజన్ చికిత్స పొందుతున్న విషయం విదితమే. లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న నటరాజన్కు ప్రస్తుతం డయాలసిస్, ఇతర ఇంటెన్సివ్ కేర్ థెరఫీస్ను వైద్యులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శశికళ పెరోల్కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అయితే, ఆమెకు పెరోల్ కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అటు శశికళకు, దినకరన్కు నిరాశ ఎదురైంది. -
నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమం
చెన్నై : శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్లోబల్ ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. నటరాజన్ గత తొమ్మిది నెలలుగా గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయనకు మూత్రపిండాలు, కాలేయం ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం నటరాజన్ను వెంటీలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. శరీర అవయవాలు పూర్తిగా పాడవటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. నటరాజన్ ఆరోగ్య పరిస్థితిపై శశికళ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రిలో నటరాజన్ను కలిసేందుకు శశికళ పేరోల్కు దరఖాస్తు చేసుకున్నారు. -
నా భర్తను చూడాలి.. పంపించండి ప్లీజ్..
సాక్షి,చెన్నై: అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తన భర్తను చూసేందుకు 15 రోజుల పెరోల్కు దరఖాస్తు చేసుకున్నారని ఏఐఏడీఎంకే నేత టీటీవీ దినకరన్ చెప్పారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శశికళ భర్త ఎం నటరాజన్ చికిత్స పొందుతున్న విషయం విదితమే. లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న నటరాజన్కు ప్రస్తుతం డయాలసిస్, ఇతర ఇంటెన్సివ్ కేర్ థెరఫీస్ను వైద్యులు అందిస్తున్నారు. కాగా, శశికళకు పెరోల్ మంజూరవుతుందని దినకరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్పై వ్యాఖ్యానించేందుకు దినకరన్ నిరాకరించారు. దీనిపై తాము సీబీఐ విచారణను కోరుతున్నామని చెప్పారు. పళనిస్వామి ప్రభుత్వం త్వరలోనే ఇంటిదారి పడుతుందని వ్యాఖ్యానించారు. -
'శశికళకు భయపడే అందరం అబద్దం చెప్పాం'
సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆస్పత్రిలో జయలలితను కలుసుకునే అవకాశం కలిగి ఉంటే తాను ఎలా చంపబడుతున్నానో ఆమె తమకు చెప్పి ఉండేవారని తమిళనాడు మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అమ్మ కోలుకుంటోంది అంటూ శశికళకు భయపడి అందరం అబద్ధాలు చెప్పాం. దయచేసి క్షమించండి’ అని ప్రజలను వేడుకున్నారు. అన్నాదురై జయంతి సందర్భంగా మదురై పళంగానత్తంలో శుక్రవారం రాత్రి జరిగిన సభలో మంత్రి ప్రసంగిస్తూ... అనారోగ్యానికి గురైన జయలలితకు మందులు ఇవ్వకుండా ఆస్పత్రిలో పడవేశారని వెల్లడించారు. ‘‘ప్రజలారా నన్ను క్షమించండి.. చికిత్స సమయంలో జయలలిత ఇడ్లీ, చట్నీ తిన్నట్లుగా మేం చెప్పినదంతా అబద్ధం, పార్టీ రహస్యాలు బహిరంగ పరచకూడదనే ఉద్దేశంతో కలిసికట్టుగా అబద్ధాలు ఆడాం. కావాలంటే రాసిపెట్టుకోండి, ఈరోజు నేను చెప్పేది నిజం’’ అని చెప్పారు. శశికళకు భయపడి జయలలితకు చికిత్స విషయంలో అన్నీ అబద్ధాలాడమని తెలిపారు. జయలలిత ఉన్న రూంలోకి శశికళ, ఆమె కుటుంబీకులు మాత్రమే వెళ్లేవారని తెలిపారు. కేంద్ర మంత్రులు అరుణ్జైట్లీ, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్షా, తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్రావు, కాంగ్రెస్ ఉపా«ధ్యక్షులు రాహూల్గాంధీ, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ ఆస్పత్రికి వచ్చినపుడు అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, శశికళ కుటుంబీకులను మాత్రమే కలుసుకున్నార, జయలలితను చూసేందుకు వారికి అవకాశం ఇవ్వకుండా ఇన్ఫెక్షన్ సాకు చూపి అడ్డుకున్నారని వెల్లడించారు. సాధారణ వార్డు బాయ్ కూడా జయలలితను చూశాడనీ, మంత్రులుగా తాము చూడలేకపోయామని ఆయన వాపోయారు. జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో ఏర్పడిన అసాధారణ పరిస్థితుల్లో శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నామని చెప్పారు. అయితే అపోలో ఆసుపత్రిలో జయలలితకు అందిన చికిత్స వీడియోను విచారణ కమిషన్ ముందు విడుదల చేస్తామని టీటీవీ దినకరన్ శనివారం చెన్నైలో తెలిపారు. -
చిన్నమ్మకు నేను వీరవిధేయుడిని- పన్నీర్ సెల్వం
సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ కల్లోలం నేపథ్యంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ ప్రకటన ఇచ్చాడంటే నమ్మటం కాస్త కష్టమే. అయితే అమ్మ నిష్క్రమణ తర్వాత అన్నాడీఎంకే పార్టీపై పట్టు సాధించి ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని ఏకఛత్రాధిపత్యంతో ఏలుదామనుకున్న శశికళకు పన్నీర్ అండ్ కో ఇచ్చిన ఝలక్ ఏపాటితో తెలిసిందే. జయ సమాధి దగ్గర మొదలైన డ్రామా చివరకు చిన్నమ్మను జైలుకు పంపాక కూడా కొనసాగుతూనే వస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో పన్నీర్ సెల్వం ఆమె గురించి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జయలలిత మరణానంతరం ప్రధాన కార్యదర్శిగా వీ శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకుంది పార్టీ. కొద్దిరోజులకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు కూడా. ఈ సందర్భంలో సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా... పన్నీర్ సెల్వం మాట్లాడిన మాటలు... ‘కోటి యాభై లక్షల పార్టీ కార్యకర్తల్లో నేను ఒకడినే. పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ(శశికళ) అన్నా.. ఆమె నిర్ణయాలు అన్నా.. ఎంతో గౌరవం ఉంది’ . మరి అదే ఓపీఎస్ తర్వాత ధర్మయుద్ధం అంటూ భారీ డైలాగులతో తిరుగుబాటును ఎగరవేశారు. ఈయనతోపాటు విద్యాశాఖ మంత్రి సెంగోట్టైయాన్, మంత్రులు సెల్లూర్ రాజు, ఆర్ బీ ఉదయ్కుమార్, వెలమంది నటరాజన్, మరో కీలక నేత జయకుమార్... వీరంతా శశిళ, దినకరన్లపై పొగడ్తలు గుప్పించి.. ఇప్పుడు ఓ రేంజ్లో విమర్శలు చేస్తున్న వారే. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ఏమేర విమర్శలు కొనసాగుతున్నాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో వీడియో వైరల్ అవుతుండగా.. చూసిన వాళ్లంతా... అరవ రాజకీయాల్లో అతి తెలియందా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు... ఏదైనా అధికారం కోసమే కదా! -
జైల్లో శశికళ రాజభోగాలపై హోంమంత్రి వివరణ
సాక్షి,బెంగళూర్: ఏఐఏడీఎంకే నేత వికే శశికళ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారనే వార్తలను కర్నాటక ప్రభుత్వం తోసిపుచ్చింది. జైలు అధికారులు ఆమెను సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నారని, ప్రత్యేకంగా ట్రీట్ చేయడం లేదని స్పష్టం చేసింది. ‘ శశికళకు, ఆమె బంధువు ఇళవరసికి జైలులో ప్రత్యేక మర్యాదలు చేస్తున్నారని వస్తున్న వార్తలు సత్యదూరం...వారిని సాధారణ ఖైదీలుగానే పరిగణిస్తున్నారు..దీన్ని స్వయంగా తన కళ్లతో చూశా’ నని హోంమంత్రి రామలింగారెడ్డి బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అవినీతి కేసులో సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వారిద్దరినీ ఇతర సాధారణ ఖైదీలుగానే జైలు సిబ్బంది పరిగణిస్తున్నారని చెప్పారు. జైలులో శశికళకు ఎలాంటి పని అప్పగించారన్నది తనకు తెలియదని కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఆమెకు పనులు కేటాయిస్తారని చెప్పారు. చెన్నయ్లో సోమవారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడంతో పాటు ఆమె చేపట్టిన నియామకాలను రద్దు చేసిన విషయం విదితమే.